Wednesday, August 5, 2026
26.2 C
Hyderabad

ఈవీలేవీ? ఈవీలపై క్లారిటీలేవీ?|EV|TELANGANA|CM|GOVERNMENT

మొన్న సీఎం|CM|REVANTH REDDY, నిన్న డిప్యూటీ సీఎం|DEPUTY CM|BHATTI VIKRAMARKA MALLU
ప్రకటనల సారాంశమేంటి?|SUMMARY
ప్రస్తుత వాహనాలనేం చేస్తారు?|OLD VEHICLES
కొత్తవి సరే, పాతవాటి పరిస్థితేంటి?
ఇప్పటికే తుప్పుపట్టిన వాహనాల సంగతేంటి?
ఇం‘ధన’ ఖర్చు తగ్గించడానికి వేల కోట్ల వ్యయమా?
ఉన్న నాలుకకు మందేస్తే కొండనాలుక ఊడినట్లేనా?
రాజకీయ ప్రకటనా? విధాన నిర్ణయమా?|POLITICAL|GOVERNMENT
ప్రకటనలకే పరిమితమా? ప్రణాళికలేమైనా ఉన్నాయా?
ఇది సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణేనా?
ఈ ఆర్థిక భారం యథాలాప వృథా ప్రయాసా?

అధికారులు ఎలక్ట్రిక్ వాహనాలనే వినియోగించాలని, దశల వారీగా అమలు చేస్తామని, మొన్నామధ్య ఒక శాఖ సమీక్షలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిన్న బడ్జెట్ సన్నాహక సమీక్షలో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క కూడా ఇదే ప్రకటన చేశారు. ప్రస్తుత పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన పెట్రో, డీజిల్ కొరత కారణంగా ఇం‘ధన’ వ్యయాన్ని తగ్గించుకోవడానికి, ఆదా చేయడానికి, పర్యావరణ హితానికి అనుగుణంగా వారీ ప్రకటన చేసి ఉంటారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే, దశలవారీగా నైనా సరే, కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఖర్చు ఎంతవుతుంది? అన్ని ఈవీలు అందుబాటులో ఉన్నాయా? ఇప్పటికే సర్కారు వారి ఆయా కార్యాలయాల్లో తుప్పుపట్టి పోతున్న వాహనాలకే దిక్కులేదు. మరి, ప్రస్తుతం ఉన్న పాత వాహనాల పరిస్థితేంటి? ఉన్న నాలుకకు మందేస్తే, కొండనాలుక ఊడినట్లేనా? ఇది రాజకీయ ప్రకటనా? విధాన నిర్ణయమా? కేవలం ప్రకటనలకే పరిమితమా? నిజంగానే ప్రభుత్వం దగ్గర ప్రణాళికలేమైనా ఉన్నాయా? ఇదే నిజమైతే, ఈవీల కొనుగోలు సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణేనా? ఈ ఆర్థిక భారం యథాలాప వ్రుథా ప్రయాస కానుందా? అసలు ప్రభుత్వ వాహనాలెన్ని? వాటిలోనూ అవుట్ సోర్సింగ్, హైరింగ్ వాహనాలెన్ని? ఆర్టీసీవెన్ని? ఈ మొత్తంలో అసలు ఈవీలపై క్లారిటీలేవీ? అనే అనేకానే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ప్రభుత్వ పెట్రో, డీజిల్ వాహనాలకు బదులు దశల వారీగా ఎలక్ట్రిక్ వాహనాలనే వాడాలని వేర్వేరుగా జరిగిన శాఖల సమీక్షల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇం‘ధన’ వ్యయం తగ్గింపు, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ అనే కోణంలో ఇది ముందుచూపుతో కూడిన నిర్ణయంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కూడా ఇదే దిశగా అడుగులు వేస్తున్నాయి. సరే, ఈవీలతో ప్రభుత్వంపై పడే పెను భారం పెను సమస్యగా పరిణమించనుంది. ఈవీలపై ప్రభుత్వ దగ్గర స్పష్టమైన లెక్కలు, ప్రణాళికలేమైనా ఉన్నాయా? లేక ఇది మరో ఆకర్షణీయమైన అనాలోచిత ప్రభుత్వ నిర్ణయంగా మారుతుందా? ప్రకటనకే పరిమితమవుతుందా? అసలే ఆదాయ, ఆర్థిక లేమి, అప్పులు, అప్పులకు వడ్డీలు, సంక్షేమ పథకాలు, ఉచితాలు, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీలు, ప్రభుత్వ, అధికారుల నిర్వహణా ఖర్చులు.. వీటన్నింటనీ చూస్తే, ఈ ప్రకటన ప్రభుత్వాన్ని మరింత అప్పుల్లోకి నెట్టే ఆనాలోచిత నిర్ణయంగానే మిగులుతుందన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ప్రపంచం సహా, తెలంగాణలో వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రతి రోజు వేల సంఖ్యలో కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఫలితంగా పట్టణాల్లో వాయు కాలుష్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులు ఇచ్చి వాటిని ప్రోత్సాహిస్తోంది.

రాష్ట్రంలో వాహనాలు
2025, ఆగస్టు నాటికి తెలంగాణలో మొత్తం వాహనాల సంఖ్య 1.77 కోట్లు. 15 ఏళ్ల పైన వయస్సు ఉన్న పాత వాహనాలు 41.86 లక్షలు.

రాష్ట్రంలో ప్రభుత్వ వాహనాలు ఎన్ని?
ప్రభుత్వం వాహనాలు, అవుట్సోర్సింగ్, హైర్ పద్ధతిలో ఉపయోగించే వాహనాలు. పోలీస్, రెవెన్యూ, ఆరోగ్య శాఖ, అటవీ, మున్సిపల్, విద్యుత్ వంటి శాఖలు, వాటి అనుబంధ విభాగాలు పెద్ద సంఖ్యలో వాహనాలను వినియోగిస్తున్నాయి. కానీ ప్రభుత్వం దగ్గర ఈ సమగ్ర లెక్కలు ఇప్పటికీ లేవు. అయితే అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పోలీస్ శాఖలోనే పట్రోలింగ్, జీపులు, బైక్‌లు 10వేలకు పైగా ఉన్నాయి. ఆర్టీసీలో 9,400లకు పైగా బస్సులు ఉన్నాయి.3 వేల నుండి 4వేల వరకు హైర్ బస్సులు ఉన్నాయి. 300ల ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా, కొత్తగా వెయ్యికి పైగా ఈవీ బస్సులను ప్రవేశపెట్టే ప్రక్రియ కొనసాగుతోంది. మున్సిపల్ శాఖ 6వేలకు పైగా వాహనాలను వినియోగిస్తోంది. రెవిన్యూ, ఆరోగ్య, పంచాయతీరాజ్, టూరిజం.. ఇలా అన్నిశాఖలు కలిపి అదనంగా మరో 40వేల నుంచి 50 వేల వాహనాలను వాడుతున్నాయి. సీఎం కాన్వాయ్, సిబ్బంది వగైరాలు వందకు పైగా వాహనాలను వినియోగిస్తున్నారు. మంత్రులు ఒక్కొక్కరు 5 నుంచి 10 వాహనాలు, వారి సిబ్బందీ ఎఎస్డీలు, పీఎస్ లు, కలిపి ఒక్కోశాఖలో మరో 10 వాహనాలు వాడుతున్నారు. ఇవీ గాక, సెక్రటేరియట్ అధికారులు 600 నుంచి వెయ్యి వాహనాలను వినియోగిస్తున్నారు. ఐఎఎస్ లు, వారి సిబ్బంది, కార్యదర్శులు, ఇతర అధికారులు కలిపి మరో వెయ్యి వాహనాలను వినియోగిస్తున్నారు. ఇక మంత్రులు, ఉన్నతాధికారుల మౌఖికంగా ఇచ్చే ఆదేశాలతో నడిచే వాహనాలతో ఇలా లెక్కలు వేస్తూ పోతే, తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం వాహనాల్లో ఐదు పదివేలు తక్కువ సగం వాహనాలు ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో ప్రభుత్వానివే ఉన్నట్లుగా లెక్కలు తేలుస్తున్నాయి. ఇంత భారీ మొత్తంలో వాహనాలు వినియోగిస్తున్న ప్రభుత్వం అన్ని వాహనాలను దశల వారీగా ఏ మేరకు ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చగలదు?

వేల కోట్ల ప్రాజెక్టుగా..
సాధారణంగా ప్రభుత్వ విభాగాలు ఉపయోగించే ఒక ఎస్ యూవీ లేదా యుటిలిటీ వాహనం ధర రూ.10 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఉంటుంది. తమ జేబులోంచి పెట్టే డబ్బు కాకపోవడంతో అధికారులు సాధారణంగా హై ఎండ్ వాహనాలనే కొంటారు. సగటు ధరను ₹12 లక్షలుగా తీసుకుంటే, రాష్ట్రంలో కనీసం 50వేల ప్రభుత్వ వాహనాలు ఉన్నాయని అనుకుంటే వాటి మొత్తం విలువ సుమారు రూ. 6వేల కోట్లు అవుతుంది.

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఒక మంచి ఎలక్ట్రిక్ కార్ ధర రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది. సగటు ధరను రూ.18 లక్షలుగా తీసుకుంటే, 50,000 వాహనాలకు రూ.9 వేలకోట్లు అవుతుంది.

నిర్వహణా ఖర్చులు అదనం
ఇది కేవలం వాహనాల కొనుగోలు ఖర్చు మాత్రమే. దీనికి తోడు చార్జింగ్ మౌలిక సదుపాయాలు, నిర్వహణ వ్యవస్థలు, బ్యాటరీ మార్పిడి ఖర్చులు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కేంద్రాలు, పోలీస్ స్టేషన్లు వంటి అనేక చోట్ల చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ఖర్చులను కలిపితే మొత్తం ప్రాజెక్ట్ రూ.10వేల కోట్లయినా ఆశ్చర్యం లేదు.

పాత వాహనాల పరిస్థితేంటి?
ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న పాత ప్రభుత్వ వాహనాల పరిస్థితి ఏమిటి? సాధారణంగా ప్రభుత్వ వాహనాల జీవితకాలం 10 నుంచి 15 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత వాటిని ప్రభుత్వ వేలం ద్వారా విక్రయించడం లేదా స్క్రాప్ చేయడం జరుగుతుంది. కానీ వాస్తవ పరిస్థితుల్లో అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో పాత వాహనాలు సంవత్సరాల తరబడి ఉపయోగించకుండా గ్యారేజీలలో నిల్వ ఉండటం కూడా సాధారణమే. తుప్పు పట్టిన అలాంటి వాహనాల స్క్రాప్ విలువ చలా తక్కువేననే సంగతి తెలిసిందే.

అధికారులు వాడే వాహనాలపై ఆడిట్ ఉందా?
ఈ నేపథ్యంలో ప్రభుత్వ వాహనాల ఎలక్ట్రిఫికేషన్ వంటి పెద్ద నిర్ణయాన్ని అమలు చేయాలంటే ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ వాహనాలు ఎన్ని? శాఖల వారీగా ఎన్ని? వాటిలో ఎన్ని పాతవి? ఎన్ని కొత్తవి? వాటి వేలం ద్వారా వచ్చే ఆదాయం ఎంత? ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు దశల ప్రణాళిక ఏమిటి? ఇవన్నింటిలోనూ స్పష్టత అవసరం.

అంచనా, ప్రణాళిక ముఖ్యం
ప్రభుత్వం నిజంగా పర్యావరణ హిత విధానాన్ని అమలు చేయాలనుకుంటే పాత వాహనాల స్క్రాపింగ్ పాలసీ, కొత్త వాహనాల కొనుగోలు దశల ప్రణాళిక, మొత్తం ఖర్చు వివరాలను అంచనా వేయాలి. అలాగే ప్రభుత్వ వాహనాలు, అధికారులు వాడుతున్నవి, నియమనిబంధనలు, వాడే వారి అర్హతలు, వాటి వినియోగం ఆధారంగా సమీక్షించి, మదింపు చేయాలి. అలా చేస్తేనే ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది.

భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలే వినియోగించాలనే విషయంలో సందేహం లేదు. కానీ ప్రజల డబ్బుతో అమలు చేసే ప్రభుత్వ కార్యక్రమాలు ప్రకటనలతో కాకుండా లెక్కలు, పారదర్శకత, స్పష్టమైన ప్రణాళిక ఆధారంగా జరగాలి. లేకపోతే అది మరో ఖరీదైన ప్రభుత్వ ప్రయోగంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

Latest News

బీజేపీ-ఆత్మపరిశీలనకు సరైన సమయం! EDITORIAL

ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక ఒక సందేశం! ప్రతి ఉప ఎన్నిక ఒక హెచ్చరిక!! ప్రతి ప్రజా ఉద్యమం పాలకుల పాలనకు అద్దం. ఇప్పటిదాకా అప్రతిహతంగా అధికారం చెలాయిస్తున్న బీజేపీ అనూహ్యంగా ఈ మూడింటినీ...

ఆగస్టు 05 బుధవారం 2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు , ఆషాఢ మాసము-కృష్ణపక్షం తిథి కృష్ణ-సప్తమి ఈ రోజు (05) రాత్రి 8:42 వరకు, తదుపరి కృష్ణ-అష్టమి నక్షత్రము అశ్విని ఈ రోజు (05) రాత్రి 9:18 వరకు,...

ఇగ పోను అన్ లాక్ శేసుడు అల్కన!!?|ADUGU TRENDS

ఇగో గిప్పుడు గా పోన్ల వాడుడు అందరికీ అల్కగైపోయింది. సంటి పోరగాండ్ల కానుంచి, పండు ముసలోల్ల దాకా పోను వాడుతనే ఉన్నరు. ఇగ గీ వాడుట్ల అప్పుడప్పుడు గా పోన్ల లాకుల నెంబర్ల...

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News