Thursday, August 6, 2026
29 C
Hyderabad

‘మహి’లో సమున్నత ‘మహి’ళ!|EDITORIAL

అరుంధతి, సతీ అనసూయ, సీత, సావిత్రి, ద్రౌపది వంటి మహనీయ మహిళలు ధైర్యం, ధర్మం, సహనం, త్యాగం వంటి విలువలకు ప్రతీకలుగా నిలిచారు. అలాగే కాళీ, లక్ష్మీ, సరస్వతి, దుర్గాదేవి, పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, గంగమ్మ వంటి పేర్లతో అమ్మవారిని ఆరాధించడం ద్వారా మహిళను దైవత్వ స్థాయికి తీసుకెళ్లిన సంస్కృతి మనదే. భూమిని భూతల్లి, ధరిత్రి, ధరణి, భూదేవి, అవని, అనీ.. నదులను గంగా, యమున, సరస్వతి, గోదావరిలుగా, స్త్రీరూపంగా భావించి గౌరవించడం మన సంప్రదాయం.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

భారతీయ సంస్కృతిలో మహిళ స్థానం అత్యున్నతం. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః” అంటే ‘‘ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో, పూజింపబడతారో, అక్కడ దేవతలు కొలువుంటారు’’. అనాదిగా భారతీయ సమాజం మహిళను తల్లి రూపంలో, శక్తి స్వరూపిణిగా, కుటుంబానికి మూలస్తంభంగా భావించింది. మన ఇతిహాసాలు, పురాణాలు కూడా మహిళల గౌరవాన్ని ప్రతిబింబించే అనేక ఉదాహరణలతో నిండి ఉన్నాయి. అరుంధతి, సతీ అనసూయ, సీత, సావిత్రి, ద్రౌపది వంటి మహనీయ మహిళలు ధైర్యం, ధర్మం, సహనం, త్యాగం వంటి విలువలకు ప్రతీకలుగా నిలిచారు. అలాగే కాళీ, లక్ష్మీ, సరస్వతి, దుర్గాదేవి, పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, గంగమ్మ వంటి పేర్లతో అమ్మవారిని ఆరాధించడం ద్వారా మహిళను దైవత్వ స్థాయికి తీసుకెళ్లిన సంస్కృతి మనదే. భూమిని భూతల్లి, ధరిత్రి, ధరణి, భూదేవి, అవని, అనీ.. నదులను గంగా, యమున, సరస్వతి, గోదావరిలుగా, స్త్రీరూపంగా భావించి గౌరవించడం మన సంప్రదాయం.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం చరిత్ర కూడా మహిళల హక్కుల కోసం జరిగిన పోరాటాల నుంచే ప్రారంభమైంది. 1909 ఫిబ్రవరి 28న అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అమెరికన్ సోషలిస్ట్ పార్టీ మొదటిసారిగా జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది. గార్మెంట్ కార్మికులపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా కార్మిక నాయకురాలు థెరిసా మల్కెయిల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తరువాత 1910లో కోపెన్‌హేగన్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా సమావేశంలో మహిళా హక్కుల కోసం ఒక ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. చివరికి 1975లో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా సంవత్సరాన్ని ప్రకటించి, 1977లో మార్చి 8ను అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా గుర్తించింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు మహిళల హక్కులు, సమానత్వం, సాధనలను గుర్తించే రోజుగా జరుపుకుంటున్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని ప్రత్యేక రంగులు కూడా ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఊదా, ఆకుపచ్చ, తెలుపు రంగులు ఈ దినోత్సవానికి ప్రతీకలుగా భావిస్తారు. పర్పుల్ న్యాయం, గౌరవాన్ని సూచిస్తే, ఆకుపచ్చ ఆశను సూచిస్తుంది. తెలుపు స్వచ్ఛతకు ప్రతీకగా భావిస్తారు. ఈ రంగులు మహిళల సాధికారతను, సమానత్వాన్ని ప్రతిబింబిస్తాయి.

అయితే, ఇంతటి గొప్ప సంస్కృతి కలిగిన సమాజంలోనే నేడు మహిళలపై జరుగుతున్న రకరకాల దాడులు, అన్యాయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మహిళను ఆటవస్తువుగా, భోగవస్తువుగా చూడడం బాధాకరం. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పటికీ, మహిళలపై హింస, వివక్ష పూర్తిగా తగ్గలేదనేది వాస్తవం. చట్టాలు ఉన్నప్పటికీ అవి కఠినంగా అమలుకాకపోవడం, సమాజంలో ఉన్న పాతపద్ధతుల ఆలోచనలు ఇంకా మారకపోవడం కూడా దీనికి కారణాలు.

మహిళలు సమాజంలో అనేక పాత్రలు పోషిస్తున్నారు. మొదట తల్లి రూపంలో, తరువాత అక్కగా, చెల్లిగా, భార్యగా, గురువుగా మహిళ ఎంతో కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తుంది. కుటుంబాన్ని సమర్థంగా నిర్వహించడమే కాకుండా సమాజంలో కూడా మహిళ తన ప్రతిభను నిరూపిస్తోంది. నేడు మహిళలు విద్య, విజ్ఞానం, వైద్యం, రాజకీయాలు, పరిపాలన, వ్యాపారం సహా అంతరిక్షం దాకా అనేక రంగాల్లో విశేషంగా రాణిస్తున్నారు. టీచర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు, పైలట్లు, సైనికులు వంటి అనేక బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. యుద్ధరంగంలో కూడా మహిళలు తమ ధైర్యం, సామర్థ్యాన్ని నిరూపిస్తున్నారు.

అభివృద్ధిలో కూడా మహిళల పాత్ర కీలకంగా మారుతోంది. ఆర్థికాభివృద్ధి, సామాజిక పురోగతిలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తే వారు ఏ రంగంలోనైనా అద్భుత విజయాలు సాధించగలరని రుజువవుతూనే ఉంది. గతంతో పోలిస్తే విద్యావకాశాలు పెరగడం, ఉద్యోగాల్లో మహిళల సంఖ్య పెరగడం వంటి మార్పులు ఆశాజనకంగా ఉన్నాయి. అయినప్పటికీ పూర్తి స్థాయి లింగ సమానత్వం సాధించడానికి ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది.

అయితే మహిళల గౌరవం ఒక్కరోజు జరుపుకునే ఉత్సవంతో మాత్రమే పరిమితం కావద్దు. ప్రతిరోజూ, ప్రతిచోటా మహిళలను గౌరవించే సంస్కృతి మన సమాజంలో ఏర్పడాలి. కుటుంబం నుంచే ఈ మార్పు ప్రారంభం కావాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచే లింగ సమానత్వం గురించి అవగాహన కల్పించాలి. మహిళలపై జరిగే అన్యాయాలపై సమాజం కఠినంగా స్పందించాలి. చట్టాల అమలు మరింత బలంగా ఉండాలి.

అమ్మ, గురువు, అక్క, చెల్లి, భార్య వంటి అనేక పాత్రలు పోషిస్తున్న మహిళల సేవలను గుర్తించి వారికి గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత. మహిళ లేకుండా కుటుంబం లేదు, సమాజం లేదు, సృష్టి కూడా లేదు. కాబట్టి మహిళలను గౌరవించడం అంటే మన సంస్కృతిని గౌరవించడం అన్నమాట.

Latest News

మౌర్య పూర్వయుగం|ADUGU SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

క్రీ.పూ.650 నుండి క్రీ.పూ.250 మధ్య ఉన్న కాలాన్ని మౌర్యుల పూర్వయుగం లేదా బుద్ధుని యుగం లేదా షోడశ మహాజనపాదాల యుగం అని అంటారు. ఈ కాలంలో గౌతమ బుద్ధుడు ముఖ్య పురుషుడు కాబట్టి...

సంయమనం కోల్పోతే రాజకీయ సంక్షోభమే!?|EDITORIAL

వ్యక్తిగత విమర్శలు తాత్కాలిక రాజకీయ ప్రచారానికి ఉపయోగపడవచ్చు. కానీ, దీర్ఘకాలంలో నాయకుడి విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. రాజకీయ వారసత్వం కేవలం కుటుంబ నేపథ్యంతోనే రాదు, హుందాతనంతో కూడిన నాయకత్వంతోనే నిలుస్తుంది. మాటలతో సంపాదించేది ప్రచారం...

ఆగస్టు 06, గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి మధ్యాహ్నం 03.39 వరకు ఉపరి నవమి నక్షత్రం భరణి సాయంత్రం 06.11 వరకు ఉపరి కృత్తిక యోగం గండ మధ్యాహ్నం 02.03 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 03.39వరకు ఉపరి తైతుల రాహుకాలం...

తింటే గీ అవ్వ శేతి గారెలే తినాలె!?|ADUGU TRENDS

ఎన్కటికి... యింటే భారతమే యినాలె... తింటే గారెలే తినాలన్నరు. కనీ, ఇగిప్పుడైతే, తింటే గింటే గీ అవ్వ శేతి గారెలే తినాల్నని తిన్నోల్లంటాండ్రు. మరి, గా గారెల ముచ్చటేందో సూద్దాం పదండ్రి. ములుగు జిల్ల...

బీజేపీ-ఆత్మపరిశీలనకు సరైన సమయం! EDITORIAL

ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక ఒక సందేశం! ప్రతి ఉప ఎన్నిక ఒక హెచ్చరిక!! ప్రతి ప్రజా ఉద్యమం పాలకుల పాలనకు అద్దం. ఇప్పటిదాకా అప్రతిహతంగా అధికారం చెలాయిస్తున్న బీజేపీ అనూహ్యంగా ఈ మూడింటినీ...

ఆగస్టు 05 బుధవారం 2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు , ఆషాఢ మాసము-కృష్ణపక్షం తిథి కృష్ణ-సప్తమి ఈ రోజు (05) రాత్రి 8:42 వరకు, తదుపరి కృష్ణ-అష్టమి నక్షత్రము అశ్విని ఈ రోజు (05) రాత్రి 9:18 వరకు,...

ఇగ పోను అన్ లాక్ శేసుడు అల్కన!!?|ADUGU TRENDS

ఇగో గిప్పుడు గా పోన్ల వాడుడు అందరికీ అల్కగైపోయింది. సంటి పోరగాండ్ల కానుంచి, పండు ముసలోల్ల దాకా పోను వాడుతనే ఉన్నరు. ఇగ గీ వాడుట్ల అప్పుడప్పుడు గా పోన్ల లాకుల నెంబర్ల...

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News