Tuesday, July 28, 2026
23.4 C
Hyderabad

కబ్జాలకు కళ్ళెం వేసేదెప్పుడు?|EDITORIAL

చెరువులు, నాలాలు కబ్జాకు గురవుతున్నాయని స్వయంగా ప్రకటిస్తున్న పాలకులు అందుకు తగ్గట్లుగా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. కబ్జాకోరులకు రక్షణగా నిలుస్తున్నదెవరు? అసలు కబ్జాలకు పాల్పడుతున్నది ఎవరు? ప్రభుత్వాలు లేదా అధికారుల అండదండలు లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? అయినా, ప్రజల మొప్పు కోసం ఇలా మాట్లాడటం నాయకులకు అలవాటుగా మారింది. కబ్జాలు చాలా కాలంగా జరుగుతున్నవే. ప్రేక్షకులుగా చూస్తుండిపోయి, సహకరించిన వాళ్ళకు ముందుగా శిక్షలు పడాలి. కబ్జాదారులకు కళ్ళెం వేయాలి.
మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

చెరువులు, నాలాలు కబ్జాకు గురవుతున్నాయని స్వయంగా ప్రకటిస్తున్న పాలకులు అందుకు తగ్గట్లుగా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. కబ్జాకోరులకు రక్షణగా నిలుస్తున్నదెవరు? అసలు కబ్జాలకు పాల్పడుతున్నది ఎవరు? ప్రభుత్వాలు లేదా అధికారుల అండదండలు లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? అయినా, ప్రజల మొప్పు కోసం ఇలా మాట్లాడటం నాయకులకు అలవాటుగా మారింది. కబ్జాలు చాలా కాలంగా జరుగుతున్నవే. ప్రేక్షకులుగా చూస్తుండిపోయి, సహకరించిన వాళ్ళకు ముందుగా శిక్షలు పడాలి. కబ్జాదారులకు కళ్ళెం వేయాలి.

నిజానికి చెరువులు, నాలాల కబ్జాలు దశాబ్దాలుగా జరుగుతున్నాయి. వాటికి అనుమతులు ఇస్తున్నది అధికారులు. ఓట్ల కోసం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నది పాలకులు. పాలకులు లేదా ప్రభుత్వాలు తలచుకుంటే కబ్జాలను అరికట్టడం, తొలగించడం పెద్ద విషయమేమీ కాదు. ముందుగా నిబంధనలు కఠినం చేసి, వాటిని కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. ప్రస్తుత కబ్జాలను తొలగించాలి. రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అది పోయాక మరొకలా మాట్లాడ కూడదు. అసలు సమస్యే ఈ రాజకీయ పార్టీలతో వస్తున్నది. చట్టాలు చేసేది, నిబంధనలను రూపొందించేదీ వాళ్ళే. ఆ చట్టాలను ఉల్లంఘించేదీ వాళ్ళే. లేదా వాళ్ళ అనుచరగణమే. ఇదో విషవలయంగా మార్చేసిన పాపం కూడా రాజకీయ పార్టీలదే. పైగా ఈ సమస్యలను అప్పుడే వచ్చినట్లు కొత్తగా వాటిని తొలగించాలని మాట్లాడేది కూడా వాళ్ళే. వాళ్ళ అవసరాల కోసం ఆరోపణలకు దిగడం, నానా రాద్ధాంతం చేయడం పార్టీలకు అలవాటుగా మారింది.
ఇక హైడ్రాను ఏర్పాటు చేసి, ఆక్రమణలను అడ్డంగా కూల్చేస్తున్న క్రెడిట్ ని దక్కించకున్న సీఎం రేవంత్‌ రెడ్డి ఆలోచించాలి. వరంగల్‌ జిల్లాలో వరదనష్టం సందర్భంగా కబ్జాలపై వ్యాఖ్యలు చేసిన సీఎం, అందుకు తగ్గట్లుగా వెంటనే ప్రణాళికలు సిద్దం చేసి, అమలు చేసి, చిత్తశుద్ధిని చాటాలి. హైడ్రా ఏర్పాటు సందర్భంగా ఆయన ముందే చెప్పినట్లు హైడ్రాను హైదరాబాద్ కే పరిమితం చేయకుండా, నగరాలకు, పట్టణాలకు, మండలాలు, గ్రామాలకు తద్వారా తక్షణమే రాష్ట్ర వ్యాప్తం చేయాలి.
అయితే, తుఫాన్లు, ఉత్పాతాలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా సాయం ప్రకటించడం, అందరినీ ఆదుకున్నామని గొప్పలు చెప్పుకోవడంతో సరిపెట్టేస్తున్నారు.ఆక్రమణలను తొలగించాలన్న దానికి కూడా ప్రణాళిక లేదు.

ఏపీలో తుఫాన్‌ సహాయక కార్యక్రమాల్లో అధికారులు బాగా పనిచేశారని సీఎం చంద్రబాబు సర్టిఫికెట్లు ఇచ్చారు. జీతాలు తీసుకుంటున్న అధికారులు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించడాన్ని కూడా ప్రత్యేకంగా అభినందించాల్సిందే. వెన్నుతట్టి ప్రోత్సహించాల్సిందే.

ఇక తుఫాన్‌ గండం గడిచింది కనుక గ్రామాల వారీగా బాధితులను గుర్తించి ఆదుకోవాలి. అన్నదాతల విషయంలో అలసత్వం తగదు. తాజా మొంథా తుపాన్‌ కారణంగా వ్యవసాయం ముఖ్యంగా వరి, పత్తి తదితర పంటలకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. కోస్తాతో పాటు తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ చూసినా నీట మునిగిన పైర్లు కనపడుతున్నాయి. ఏ గ్రామానికి వెళ్లినా నిండా మునిగిపోయిన తమను ఆదుకోవాలంటూ కన్నీటితో విజ్ఞప్తులు చేస్తున్న అన్నదాతలే కనిపిస్తున్నారు. కొబ్బరి, అరటి తోటలు కూడా బాగా దెబ్బతిన్నాయి. ఈ సంవత్సరం పంటల బీమా పథకం కూడా రాష్ట్రంలో అమలులో లేకపోవడం గమనార్హం. ప్రభుత్వం తన వాటా కట్టకపోవడంతో ఈ పథకం ఆగిపోయింది. అలాగే మత్య్సకారులు తుపాన్‌ వల్ల దాదాపు వారం రోజులుగా వేట ఆగిపోయింది. ఉవ్వెత్తున ఎగిసిన అలల కారణంగా తీరంలో కట్టిఉంచిన బోట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రొయ్యల రైతులు కూడా భారీగా నష్టపోయారు. కేంద్రం నుండి ప్రకృతి విపత్తు సాయం ఇతోధికంగా అందేట్లు చూడాలి. కేంద్రం ఉదారంగా ముందుకు రావాలి.
ముందుగానే అంచనా వేసినట్లుగానే మొంథా అల్లకల్లోలం సృష్టించింది. తుఫాన్‌ కారణంగా ప్రాణ నష్టాన్ని గణనీయంగా నివారించడం ఒక సానుకూల పరిణామం. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది తుఫాన్‌ బాధితులుగా మారినట్లు, 76 వేల మందికి పైగా పునరావాస శిబిరాలకు తరలించినట్టు, ముగ్గురు మృతి చెందినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. గతంతో పోలిస్తే అధికార యంత్రాంగం ఈసారి మరింత అప్రమత్తంగా వ్యవహరించింది. ఇదే చొరవతో ఇప్పుడు బాధితుల కన్నీళ్లు తుడవాలి. అది ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం కావాలి.

Latest News

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

జూలై 27, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి త్రయోదశి మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం మూల ఉదయం 11.00 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం వైధృతి రాత్రి 12.18 వరకు ఉపరి విస్కమ్బ కరణం తైతుల మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి...

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News