Sunday, July 26, 2026
31.4 C
Hyderabad

ఊహించని కలయిక!|PALLA RAJESHWAR REDDY| KOMMURI PRATHAP REDDY

PALLA| పల్లాను కలిసి KOMMURI| కొమ్మూరి పరామర్శ
JANGAON| జనగామ POLITICS| రాజకీయాల్లో విమర్శ

జనగామ నియోజకవర్గ రాజకీయాల్లో ఒక ఊహించని కలయిక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యే స్థానానికి ఒకరు BRS| బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మరొకరు CONGRESS| కాంగ్రెస్ తరపున పోటీ చేసిన డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డి. అయితే ఆ ఎన్నికల్లో కొమ్మూరిపై 15,783 ఓట్ల తేడాతో పల్లా గెలిచారు. అప్పటి నుంచి వారి మధ్య రాజకీయ విభేదాలు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. విమర్శలు, విమర్శలకు ప్రతివిమర్శలు, బల ప్రదర్శనలు, దూషణలు తరచూ జరిగేవి. కానీ తాజాగా ఎమ్మెల్యే పల్లా స్వగృహంలో ఆయనను పరామర్శించేందుకు జనగామ జిల్లా డిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కొమ్మూరి వెళ్లిన విషయం రాజకీయంగా ఊహించని పరిణామంగా మారింది. ప్రమాదం అనంతరం ఇంట్లో పల్లా విశ్రాంతి తీసుకుంటుండగా, ఇంటికే వెళ్లి మరీ పరామర్శించిన కొమ్మూరి చర్యకు వెనుక రాజకీయ మతలబు ఉందా అనే చర్చ ప్రారంభమైంది. రెండు పార్టీల నేతలు సామాజికంగా ఒకే వర్గానికి చెందినవారైన నేపథ్యంలో ఈ కలయిక మరింత ఆసక్తికరంగా మారింది. ఇక రాబోయే రోజుల్లో జనగామ జిల్లాలో చేర్యాల నియోజకవర్గం తిరిగి ఏర్పడే అవకాశం ఉండటంతో, ఆ నియోజకవర్గంలో పాగా వేయాలనే ఉద్దేశంతో కొమ్మూరి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు చేరువ కాబోతున్నారా? పల్లా ద్వారా మళ్లీ టచ్‌లోకి వెళుతున్నారా? అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. కొమ్మూరి గతంలో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన కొడుకు రాజకీయ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని పల్లాను కలిసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఏదేమైనా, ఈ కలయిక జనగామ నియోజకవర్గంలో రాజకీయం మరింత వేడిరాజేసింది. ఈ ప్రస్తుత పరిణామాలకు వారిరువురిలో ఎవరో ఒక్కరు సమాధానం చెప్పాలి. లేదంటే మాత్రం కాలమే సమాధానం చెప్తుంది.

 

Latest News

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

యియర్ పోన్లతోటి శెవులకు శిల్లే!?|ADUGU TRENDS

కొత్త టెక్నాలజీ వచ్చిందంటే సాలు..ఇగ దానెంటే పడ్తం. గదాన్నే అనుసరిత్తం. ఏమైతాందో సూసుకోం. గసొంటిదే గీ యియర్ పోన్ల వాడకం. గదేందో సూద్దా పదండ్రి. అదే పనిగా యియర్ పోన్లను వాడేటోల్లకు గా కర్ణభేరి...

నీట్ లీకేజీ.. అంత లోకువా!?|EDITORIAL

పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే విద్యా వ్యవస్థపై నమ్మకం పోతుంది. అందువల్ల నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకే పరిమితం చేయకుండా, పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News