Saturday, September 19, 2026
31.2 C
Hyderabad

అచ్చంపేటను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం

మాచారంలో భావోద్వేగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం

నాగర్‌కర్నూల్ జిల్లా మాచారంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ప్రజలను ఉద్దేశించి భావోద్వేగంతో మాట్లాడారు. “నల్లమల బిడ్డగా ఈ గడ్డపై నిలబడి మాట్లాడటం నాకు గర్వకారణం” అంటూ తన అనుబంధాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అచ్చంపేట నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు విశేష ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే అధికారులకు తగిన సూచనలు చేశామని, రైతుల పక్షాన పోరాడే ప్రభుత్వంగా నిలుస్తామని స్పష్టం చేశారు.

పోడు భూముల విషయంలో గత ప్రభుత్వాల తీరుపై విమర్శలు చేస్తూ, పోరాడిన వారిని జైలుకు పంపిన చరిత్ర వారి దెబ్బతిన్న పాలనకు నిదర్శనమని అన్నారు. ఇక తమ ప్రభుత్వ హయాంలో పోడు భూముల్లో వ్యవసాయం చేయేందుకు సోలార్ పంపుసెట్లు అందించడం ద్వారా రైతులకు బలాన్నిచ్చామని తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రతి రైతుకూ సోలార్ పంపుసెట్ అందించేలా చర్యలు చేపట్టామని, రాబోయే వంద రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అవసరమైన నిధులు తానే భరిస్తానని హామీ ఇచ్చారు.

రైతుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం రూ.60 వేల కోట్లను ఖర్చు చేసిందని సీఎం గుర్తు చేశారు. ముఖ్యంగా సన్నాలు పండించే రైతులకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇవ్వడం, పేదలందరికీ సన్న బియ్యం సరఫరా చేయడం వంటి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్న బియ్యం, 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు.

మహిళల కోసం ఉచిత ఆర్టీసీ ప్రయాణం అందిస్తూ వారి ఆర్థిక స్వావలంబనకు అవకాశాలిచ్చామని, ఆడబిడ్డలను RTC బస్సులకు యజమానులుగా చేస్తూ వారి ఆధిక్యాన్ని చాటామన్నారు. వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి స్వయం సహాయక సంఘాల మహిళలకు బాధ్యత అప్పగించిన ఘనత తమదేనన్నారు. ఆదానీ, అంబానీలకు పోటీగా మహిళలకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణను దేశంలోనే ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నామని, 60 వేల ఉద్యోగాల నియామక ప్రక్రియ మొదలుపెట్టిన ఘనత తమ ప్రభుత్వానిదని తెలిపారు. కేంద్రం సైతం నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణలో ఉంచిన రాష్ట్రంగా తెలంగాణను ప్రథమ స్థానంలో నిలిపిందని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలోనూ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు.

చివరిగా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిని పట్టించుకోనని, పథకాలను అనుభవించే ప్రజలే తమకి న్యాయమైన సమాధానమని స్పష్టం చేశారు. రుణమాఫీ, ఉచిత బస్సులు, విద్యుత్ వంటి పథకాలు ప్రజలకు గుర్తుండిపోతాయని, తప్పుడు ప్రచారాలు ప్రజలను మోసగించలేవని అన్నారు. “ఇందిరమ్మలా, నేను కూడా ప్రజల గుండెల్లో నిలవాలన్నదే నా లక్ష్యం” అంటూ ప్రసంగాన్ని ముగించారు.

Latest News

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News