Monday, August 3, 2026
29.5 C
Hyderabad

ట్రంపు సరే, మోడీ సుంకాల మాటేమిటి!?

వడ్డీరేట్లు, పన్నులు ప్రజలకు, వ్యాపారులకు, ఉద్యోగులకు, అన్ని వర్గాలకు అనువుగా ఉండాలి. వారు భరించేవిగా ఉండాలి. పన్నులు కూడా హేతుబద్దంగా ఉండాలి. విపరీతంగా పన్నులు, వడ్డీలు వసూలు చేస్తే ప్రజలు భరించలేరని గుర్తించాలి. స్వయం ఉపాధి పొందే వారికి, చవువుకునే వారికి ఉపయుక్తంగా ఉండాలి. డబ్బు వినిమయం, వస్తు కొనుగోళ్లకు అవినాభావ సంబంధం ఉంది. డబ్బు మార్కెట్లో చలామణి అవుతూనే వస్తూత్పత్తి ప్రజలకు చేరాలి. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగేలా పరపతి విధానం ఉండాలి. అలాగే పెట్రో ధరలు, గ్యాస్‌ ధరలు కూడా ప్రజల కొనుగోలు శక్తికి మించి ఉండరాదు. ఇవి వస్తువుల ధరలను కూడా నియంత్రిస్తుంటాయి. వీటి ధరల ఆధారంగానే మార్కెట్లో వస్తువుల ధరలు పెరుగుతాయి. వీటిని బ్యాలెన్స్‌ చేయడం ప్రభుత్వం నడిపిస్తున్న వారికి అవసరం. అదేపనిగా ఉచిత పథకాల కారణంగా సమాజంలో పనిచేసే వారి సంఖ్య తగ్గిపోతున్నది. తిని కూర్చునే వారు పెరుగుతున్నారు. దీంతో వస్తూత్పత్తి కూడా తగ్గుతుంది. ఇకపోతే ధర పెరిగినంత మాత్రాన పెట్రోలు, డీజిల్, గ్యాస్‌ వినియోగాన్ని తగ్గించలేం. కనుక వాటి కోసం మనం వెచ్చించే మొత్తం పెరిగింది. ఐతే కార్మికుల, ఉద్యోగుల వేతనాలు మొత్తం మాత్రం పెరగడంలేదు. దీంతో మనం ఇతర వస్తువుల వినియోగాన్ని తగ్గించివేస్తున్నాం. ఇతర సరుకుల వినియోగం ఎప్పుడైతే తగ్గిందో, ఆ మేరకు ఆయా రంగాలలో మాంద్యం ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి ప్రభుత్వం పూనుకోవాలి. కాని అలా జరగడం లేదు. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగినప్పుడల్లా వాటి విూద వసూలు చేసే పన్నుల మొత్తం కూడా పెరుగుతోంది. ప్రస్తుత సంక్షోభాన్ని నివారించాలంటే ప్రజల కొనుగోలు శక్తిని పెంచే మార్గాలు అన్వేషించాలి. ఉపాధికల్పన మార్గాలను అన్వేషించాలి. కనీసం పెట్రో ఉత్పత్తుల విూద పన్నులను పెంచడం తగ్గిస్తే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. అప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకోగలరు. అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్రో ధరల పెరుగుదల వలన అదనపు ఆదాయం సమకూరుతోంది. ఆవిధంగా వచ్చిన అదనపు ఆదాయాన్ని ఉపాధి కల్పన వంటి రంగాలకు ఖర్చు చేయడం బదులు, కార్పొరేట్లకు మరిన్ని రాయితీల్విడానికో, వారి బకాయిలను మాఫీ చేయడానికో వినియోగిస్తోంది. అలాగే మరిన్ని ఉచిత పథకాలకు వెచ్చిస్తున్నారు.

వాస్తవానికి మన దేశంలో పెట్రోలు ధరలో 45.5 శాతం, డీజిల్‌ ధరలో 39.8 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులకే పోతుంది. పన్ను రూపంలో వసూలు చేసే దానిలో కేంద్రం రాష్ట్రాలతో వాటా పంచుకోవాలి. అందుచేత మోడీ ప్రభుత్వం నేరుగా పన్ను రూపంలో కాకుండా స్పెషల్‌ డ్యూటీ, రోడ్‌ సెస్‌, ఇన్‌ఫ్రాస్టక్చ్రర్‌ సెస్‌ వంటి పేర్లతో వసూలు చేస్తోంది. తరచూ ఆర్ధిక మాంద్యం ఏర్పడడం వల్ల సరుకుల వినిమయం తగ్గిపోతుంది. అదే విధంగా ద్రవ్యోల్బణం పెరుగుతూ వుంటుంది. మన రూపాయి విలువ పడిపోయినా, సరుకుల ధరలు పెరిగినా అది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగం 8 శాతం దాటింది. వీటికి తోడు మన దేశ వార్షిక జిడిపి వృద్ధి రేటు ముందు అంచనా వేసినట్టుగా ఉండడం లేదని తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి.

ట్రంప్‌ విధానాలు, పాలస్తీనా,ఉక్రెయిన్‌ యుద్ధం ఆర్ధిక వ్యవస్థవిూద ప్రభావం చూపనున్నాయని అంటున్నారు. వృద్ధిరేటు తక్కువగా ఉండడం, ద్రవ్యోల్బణం అధికంగా ఉండడం, నిరుద్యోగం తీవ్రంగా ఉండడం నేటి ఆర్థి దుస్థితికి తాజా ఉదాహరణాలు. ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగాయి. ఐతే మార్కెట్ల విూద గుత్తాధిపత్యం కలిగివున్న బడా కార్పొరేట్లు ఆ పెరిగిన ధరలను వినియోగదారుల విూదకు నెట్టి వేస్తున్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడం వలన దాని ప్రభావం రవాణా రంగం విూద పడుతుంది. దాని కారణంగా ఇతర సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. ఇవన్నీ కలిసి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీని పర్యవసానంగా శ్రామిక ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. దాని వలన సరుకుల వినియోగం తగ్గిపోతుంది. మార్కెట్‌ లోని సరుకులు చెల్లుబాటు కావు. అందువలన ఆర్ధిక మాంద్యం ఏర్పడుతుంది.

మనదగ్గర పంటలు బాగానే పండుతున్నాయి. మిర్చి, పప్పు ధాన్యాలు విపరీతంగా పండుతున్నాయి. వరి లెక్కకు మించి పండిస్తున్నారు. అయితే ఈ ధరలు ప్రజలకు చేరడం లేదు. తాజాగా ఆక్వా రైతులు ట్రంప్‌ దెబ్బకు విలవిల్లాడుతున్నారు. చికెన్‌, మటన్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్నా ఆక్వా సామాన్యులకు అందుబాటు లోకి లేదు. దానిని ప్రజల చెంతకు తీసుకుని వెళ్లాల్సి ఉంది. ప్రజలకు మనదేశంలో లభిస్తున్న ఆహార ఉత్పత్తులు సరసమైన ధరలకు చేరాలి. ప్రధానంగా రొయ్యలను ఇంటింటికీ చేరుకునేలా చేయాలి. 140 కోట్లు జనాభా ఉన్న మన దేశంలో మాంసాహారులు కూడా ఎక్కువే. అమెరికా సుంకాలకు భయపడి కూర్చోకుండా ఆక్వాను ప్రజలకు అందించేలా ప్రణాళికలు చేయాలి. ట్రంపం సుంకాలను విమర్శిస్తున్న మనం మన వద్ద మోడీ సుంకాలను పట్టించుకోవడం లేదు. దేశం ఆర్థికంగా నిలదొక్కుకుని ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే జిఎస్టీ వడ్డింపులు భారీగా తగ్గాలి. ఉచిత పథకాలను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టాలి. తాయిలాలను పక్కన పెట్టాలి. కిలో రూపాయికే బియ్యం పథకానికి పాతరేయాలి. వడ్డీరేట్లు మరింతగా తగ్గాలి. విద్యార్థులు తీసుకునే విద్యారుణాలపై వడ్డీ నామ మాత్రంగా ఉండేలా చూడాలి.

ఇలా ఆలోచన చేసినప్పుడే, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది. సంపాదించింది తిండికి కూడా సరిపోకపోతే దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని పాలకులు, వారికి సలహాలు ఇస్తున్న మేధావులు గుర్తించాలి.
……ఎండ్.

Latest News

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News