Friday, July 31, 2026
24.6 C
Hyderabad

సుదీర్ఘ పోరాట వారసత్వం… రాజకీయ జీవితం

ఐలమ్మ వారసుడు, పాలకుర్తి మాజీ సర్పంచ్ రామచంద్రం అస్తమయం

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ మనవడు, పాలకుర్తి గ్రామ పురోగతిలో కీలకంగా పని చేసిన, పాలకుర్తి మాజీ సర్పంచ్ చిట్యాల రామచంద్రం శుక్రవారం తెల్లవారు జామున మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్య కారణాలతో చికిత్స తీసుకుంటున్న ఆయన పాలకుర్తిలోని తన ఇంట్లోనే కన్నుమూశారు. రామచంద్రం భార్య భారతి తేదీ:16-03-2022లో మరణించగా, ఆయన ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలలో చిన్న కొడుకు గోపీ ఇంటర్ చదువుతున్న దశలోనే అకాల మరణం చెందారు. పెద్ద కుమార్తె హైదరాబాద్ లో, చిన్న కుమార్తె ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు.

చిట్యాల రామచంద్రం 1953లో పాలకుర్తిలో ఐలమ్మ ఐదుగురు కొడుకుల్లో పెద్ద కొడుకు చిట్యాల (కట్టెల) సోమయ్యకు మూడో సంతానంగా జన్మించారు. పాలకుర్తి హై స్కూల్ లోనే 10వ తరగతి వరకు చదువుకున్నారు. నాయినమ్మ, తండ్రిల పోరాట వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న రామచంద్రం, వారితోపాటు సిపిఐ లోనే కొనసాగారు. 1975లో సిపిఐతోనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. యువజన విభాగంలో పని చేస్తూ, మూడేండ్ల తర్వాత సిపిఎంకు మారారు. అప్పట్లో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు జీడి సోమనర్సయ్య శిష్యరికంలో ఎదుగుతూ వచ్చిన రామచంద్రం అప్పటిదాకా సుదీర్ఘంగా పాలకుర్తి సర్పంచ్ గా పని చేసిన వీరమనేని కిషన్ రావుని ఓడించి తేదీ: 01-06-1981లో పాలకుర్తి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. తేదీ 14-08-2001 వరకు దాదాపు 20 ఏండ్లపాటు అప్రతిహతంగా సర్పంచ్ గా కొనసాగారు. ఇప్పటి వరకు పాలకుర్తికి అత్యధిక కాలం పని చేసిన సర్పంచ్ రామచంద్రమే.

రైతు కూలీ ఉద్యమాలలో..
సిపిఐ యువజన విభాగంలో పని చేస్తూన్న సమయంలో అవిరినేని సోమేశ్వరరావుతో పాటు సమరయోధులు జీడి సోమయ్య, జీడి సోమనర్సయ్య తదితరులతో కలిసి రైతులు, రైతు కూలీల, కార్మిక ఉద్యమాలు చేశారు. పార్టీలో ఆయన అవిరినేని సోమేశ్వరరావు, గూడూరు చంద్రయ్య, బండి మదారు, గూన సోమయ్య, జీడి సత్యనారాయణ, సంకటబోయిన ఉప్పలయ్య, అనంతోజు కమ్మరి బ్రహ్మయ్య, అనుముల జనార్దన్ రెడ్డి, జీడి సోమనాథం, జీడి మల్లయ్య వంటి అనేక మంది కలిసి పలు ఉద్యమాలు చేశారు.

1969 ఉద్యమంలో..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో 1969లో కీలకంగా పని చేశారు. ఆ సమయంలో తన సహాధ్యాయులు ఎండి అఫ్జల్ ఖాన్, పాలకుర్తి మాజీ వార్డు సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎడవెల్లి సోమమల్లయ్య, తనతోపాటు రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 20 ఏండ్ల పాటు పాలకుర్తి గ్రామ కార్యదర్శిగా పని చేసిన ఎ.సోమేశ్వరరావులతో కలిసి పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో…
ఆతర్వాత తెలంగాణ మలి ఉద్యమ సమయంలోనూ కీలకంగా పని చేశారు. అప్పటికే విశాలాంధ్ర నినాదంతో ఉన్న కమ్యూనిస్టు పార్టీని కాదని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పని చేశారు. అదే సమయంలో పార్టీ ఆయనను పార్టీ వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో బహిష్కరించింది.

తర్వాత వివిధ పార్టీలతో…
అయితే ఆతర్వాత ఆయన మారుతున్న రాజకీయాలకనుగుణంగా తన రాజకీయ ప్రయాణాన్ని మార్చుకుంటూ వెళ్ళారు. కొంత కాలం టిడిపితోనూ, మరికొంత కాలం బిఆర్ఎస్ తోనూ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతోనూ కొనసాగారు. ఆయా పార్టీల్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో క్రియాశీలకంగా పని చేశారు.

యతిరాజారావును ఎదిరించి…సహకారం తీసుకుని..
రామచంద్రం రాజకీయ జీవితం పదవిలో ఉన్నప్పటికీ పోరాటాలతోనే గడిచింది. కమ్యూనిస్టు పార్టీలో ఉండటం, అప్పట్లో యతాజారావు ఎమ్మెల్యేగా ఉండటంతో, రాజకీయంగా ఆయన్ని ఎదిరిస్తూనే, పోరాడుతూనే, మరోవైపు గ్రామ అభివ్రుద్ధి కోసం ఆయన సహకారం తీసుకుంటూ తెలివిగా రాజకీయాలు చేశారు.

గ్రామాభివృద్ధిలో కీలకం…
రామచంద్రం తన సర్పంచ్ పదవీ కాలంలో పాలకుర్తి గ్రామ పురోగతిలో కీలకంగా పని చేశారు. భవిష్యత్తులో ఎదిగే గ్రామం, పెరిగే జనాభాకనుగుణంగా ఎంతో ముందు చూపుతో పని చేశారు. గ్రామంలో విశాలమైన రోడ్లు, మంచినీరు, విద్యుత్ వంటి మౌళిక సదుపాయాలు, అప్పట్లోనే 100 ఫీట్ల వెడల్పైన రోడ్లను ఏర్పాటు చేసిన ఘనత రామచంద్రంకే దక్కుతుంది.

ఉత్తమ గ్రామ పంచాయతీగా…
గ్రామ సర్పంచ్ గా ఆయన 20 ఏండ్ల ప్రస్థానంలో అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తి ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డులు పొందింది. సిపిఎం సర్పంచ్ గా ఉన్నప్పటికీ, అప్పటి ప్రధాన పార్టీలకు దీటుగా పని చేసిన ఆయన గ్రామానికి ఈ అవార్డులు రావడం విశేషం.

అనేకసార్లు జైలుకు…
యువ నాయకునిగా పని చేస్తూన్న సమయంలోనే రామచంద్రం, ఉప సర్పంచ్ అవిరినేని సోమేశ్వరరావు వంటి వారితో కలిసి చేసిన ఉద్యమాల్లో భాగంగా అనేక సార్లు జైలుకు పోయారు. రైతులు, కూలీల కోసం పోరాడే క్రమంలో ఆయనపై రాజకీయక కేసులు కూడా అయ్యాయి. అయితే వాటిని ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారు.

ఐలమ్మ విగ్రాహాల ఏర్పాటుతో…
సాయుధ పోరాట యోధురాలు చాకలి అయిలమ్మ మనవడిగా ఆమె విగ్రహాన్ని మొదట పాలకుర్తిలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఐలమ్మ విగ్రహాలు ఏర్పాటవడం, వాటిలో చాలావాటిని రామచంద్రం చేతే ఆవిష్కరించడం జరిగాయి. ఈ విధంగా రామచంద్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చారు. ఐలమ్మ వారసులు మరికొందరున్నప్పటికీ, ఆమె మనవడంటే రామచంద్రమే అనే స్థాయి ప్రచారాన్ని, ప్రాచర్యాన్ని పొందారు.

కీర్తి ప్రతిష్టలు
ఇదే తరుణంలో ఐలమ్మ జయంతి సందర్బంగా హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని, ఐలమ్మ వారసురాల్లో ఒకరికి మహిళా కమిషన్ సభ్యురాలిగా అవకాశం ఇస్తామని ప్రకటించారు. అయితే, వారి వారసుల మధ్య విభేదాల కారణంగా ఆ పదవి కేటాయింపు వాయిదా పడింది. అంతకుముందు అప్పటి సీఎం కెసిఆర్ సైతం రామచంద్రం కుటుంబాన్ని పిలిపించుకుని అభినందించి, సత్కరించి, తగిన గుర్తింపునిస్తామని ప్రకటించారు.

పలువురి సంతాపం
చిట్యాల రామచంద్రం మరణం పట్ల అనేక మంది తీవ్ర సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. సంతాపం తెలిపిన వారిలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, పార్టీ ఇన్ చార్జీ ఝాన్సీరెడ్డి, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, డాక్టర్ రాపోలు సత్యనారాయణ, అడుగు చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ, ఆయన సహాధ్యాయి ఎడవెల్లి సోమమల్లయ్య, సహచరులు అవిరినేని సోమేశ్వరరావు, బండి మదారు, జీడి సత్యనారాయణ, ఎండి అబ్బాస్ అలీ, ఎండి యాకూబ్, ఎడవెల్లి దండయ్య, గాదెపాక యాకయ్య, పాలకుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గూడూరు లెనిన్, సాయిసందీప్ తేజ మార్గం, డాక్టర్ జివై సోమయ్య, కడుదుల కరుణాకర్ రెడ్డి, చిట్యాల సమ్మయ్య, గుమ్మడిరాజుల సాంబయ్య, రాపర్తి కొమురయ్య, కమ్మగాని సుక్క సారయ్య, వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు తదితరులు ఉన్నారు.

Latest News

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News