Monday, July 27, 2026
24.4 C
Hyderabad

‘హద్దులు’ దాటిన అ‘పరిమిత’ అధికారాలు!|EDITORIAL

అమెరికా రాజకీయ, పరిపాలనా వ్యవస్థలో ఇప్పుడు అధ్యక్ష అధికారాల పరిమితి చర్చనీయాంశమైంది. డోనాల్డ్ ట్రంప్ చేపట్టిన టారిఫ్ ల పెంపుపై ఆ దేశ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో, సుంకాలు విధించే అధికారం రాజ్యాంగ బద్ధంగా కాంగ్రెస్‌కే చెందుతుందా? లేక అత్యవసర చట్టాల కింద అధ్యక్షుడు విస్తృత అధికారాలను వినియోగించగలడా? అనే ప్రశ్నలు అమెరికా రాజకీయాల్ని కుదిపేస్తున్నాయి. ఇప్పుడీ చర్చ అమెరికా సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

అమెరికా రాజకీయ, పరిపాలనా వ్యవస్థలో ఇప్పుడు అధ్యక్ష అధికారాల పరిమితి చర్చనీయాంశమైంది. డోనాల్డ్ ట్రంప్ చేపట్టిన టారిఫ్ ల పెంపుపై ఆ దేశ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో, సుంకాలు విధించే అధికారం రాజ్యాంగ బద్ధంగా కాంగ్రెస్‌కే చెందుతుందా? లేక అత్యవసర చట్టాల కింద అధ్యక్షుడు విస్తృత అధికారాలను వినియోగించగలడా? అనే ప్రశ్నలు అమెరికా రాజకీయాల్ని కుదిపేస్తున్నాయి.
అమెరికా రాజ్యాంగ నిర్మాతలు అధికార విభజనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. పన్నులు విధించే అధికారం కాంగ్రెస్‌కు ఇవ్వడానికి కారణం, ప్రజాప్రతినిధులే ఆర్థిక భారాన్ని నిర్ణయించాలన్న భావన. అయితే కాలక్రమేణా కొన్ని చట్టాల ద్వారా అధ్యక్షుడికి ప్రత్యేక పరిస్థితుల్లో ఆర్థిక నియంత్రణాధికారాలు కల్పించారు. ముఖ్యంగా అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం వంటివి విదేశీ వాణిజ్యంపై నియంత్రణ సాధనాలుగా ఉపయోగించబడ్డాయి. కానీ వాణిజ్య నియంత్రణ అంటే సుంకాలు విధించడమా? లేక అది కాంగ్రెస్ పరిధిలోనే ఉండాలా?

ట్రంప్ తన పదవీకాలంలో “అమెరికా ఫస్ట్” అనే నినాదంతో టారిఫ్‌లను ప్రధాన ఆయుధంగా మలిచారు. చైనాతో ప్రారంభమైన వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. చైనాపై భారీ సుంకాలు విధించడం ద్వారా అమెరికా పరిశ్రమలను రక్షిస్తున్నామని ట్రంప్ వాదించారు. అదే సమయంలో ఇండియా, యూరోపియన్ యూనియన్ వంటి భాగస్వామ్య దేశాలపైనా అదనపు సుంకాలు విధించడం ద్వారా వాణిజ్య ఒప్పందాలపై ఒత్తిడి తెచ్చారు. ఆయన అనుచరుల దృష్టిలో ఇది దూకుడు నాయకత్వం. విమర్శకుల దృష్టిలో ఇది అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను దెబ్బతీసే కుటిలతత్వం.

ఈ వివాదం న్యాయస్థానాల దాకా వెళ్లడం అమెరికా ప్రజాస్వామ్య పటుత్వానికి నిదర్శనం. సుప్రీంకోర్టు వంటి న్యాయవ్యవస్థలు కార్యనిర్వాహక అధికారాలను పరిమితం చేసే బాధ్యతను నిర్వర్తిస్తాయి. ఒకవేళ న్యాయస్థానం అధ్యక్ష నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమని తేల్చితే, ఆ తీర్పును గౌరవించడం ప్రజాస్వామ్య పరిపక్వతకు సూచిక. అదే సమయంలో కోర్టు తీర్పుపై నిరసనలు వ్యక్తం చేయడం కూడా ప్రజాస్వామ్యంలో భాగమే. కానీ, న్యాయవ్యవస్థ స్వతంత్రతను ప్రశ్నించే ధోరణి పెరిగితే, అది వ్యవస్థాపరమైన ఉద్రిక్తతలకు దారితీస్తుంది.

టారిఫ్‌ల ఆర్థిక ప్రభావం కూడా ద్వంద్వ స్వరూపం కలిగినదే. ఒకవైపు దేశీయ పరిశ్రమలకు రక్షణ లభిస్తుంది. దిగుమతులపై ఆధారపడే రంగాలు స్వదేశీ ఉత్పత్తి వైపు మళ్లే అవకాశం ఉంటుంది. మరోవైపు వినియోగదారులకు ధరల పెరుగుదల భారంగా మారుతుంది. గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి పెరుగుతుంది. పెట్టుబడిదారులు స్థిరత్వాన్ని కోరుకుంటారు. విధానాలపై స్పష్టత లేకపోతే మార్కెట్లు ప్రతికూలంగా స్పందిస్తాయి.

ప్రపంచ దేశాల ప్రతిస్పందన కూడా ఆసక్తికరంగా ఉంది. కొన్ని దేశాలు అమెరికా అంతర్గత న్యాయ ప్రక్రియను గమనిస్తూ సంయమనంతో స్పందిస్తున్నాయి. మరికొన్ని దేశాలు తమ వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ ఒప్పందాలపై దృష్టి సారిస్తున్నాయి. గ్లోబల్ వాణిజ్య వ్యవస్థ పరస్పర ఆధారితమైంది. ఒక దేశం తీసుకునే నిర్ణయం, అందునా అమెరికా లాంటి అగ్రరాజ్యం తీసుకునే నిర్ణయాలు మొత్తం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి.

ట్రంప్ విధానాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ, అమెరికాలో కాంగ్రెస్, న్యాయవ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యనిర్వాహకశాఖను నియంత్రిస్తుంటాయి. అమెరికా చరిత్రలో అనేక సందర్భాల్లో అధ్యక్షులు విస్తృత అధికారాలను వినియోగించేందుకు ప్రయత్నించారు. ఆ సమయాల్లో ఆ వ్యవస్థలే ఆ హద్దులను గుర్తు చేశాయి. ప్రజాస్వామ్యం అంటే విభేదాలు లేని వ్యవస్థ కాదు. విభేదాలను వ్యవస్థాగతంగా పరిష్కరించే సామర్థ్యం ఉన్న వ్యవస్థ.

అంతిమంగా జాతీయ ప్రయోజనాల పేరుతో అసాధారణ అధికారాలను వినియోగించడం సమంజసమా? ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా, ప్రపంచ వాణిజ్య సంబంధాలను దెబ్బతీసే విధానాలు దీర్ఘకాలంలో ప్రయోజనకరమా? ఇప్పుడీ చర్చ అమెరికా సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది.

Latest News

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

జూలై 27, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి త్రయోదశి మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం మూల ఉదయం 11.00 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం వైధృతి రాత్రి 12.18 వరకు ఉపరి విస్కమ్బ కరణం తైతుల మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి...

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News