Sunday, July 26, 2026
31.4 C
Hyderabad

నిబద్ధ, నిస్వార్థ రాజకీయ నేత సురవరం!|EDITORIAL

నేటి స్వార్థ రాజకీయాల్లో నిస్వార్థంగా నేనున్నానని చెప్పుకోదగిన ఉదాత్త రాజకీయవేత్త సురవరం సుధాకర్‌ రెడ్డి. ఆజన్మాంతం సామాన్యుడిగానే ఉంటూ, అసామాన్య రాజకీయ ప్రతిభను ప్రదర్శించిన వ్యక్తి ఆయన. దేశం గర్వించదగ్గ సురవరం మన తెలుగువాడు, తెలంగాణవాడు కావడం మనకు గర్వకారణం.

కమ్యూనిస్టు రాజకీయాల్లో ఉంటూనే సురవరం సుధాకర్ రెడ్డి, దేశ రాజకీయాల్లో ప్రభావశీలమైన ముద్రవేశారు. అయితే, కమ్యూనిస్టులు ఏకం కావాలన్న ఆయన కోరిక మాత్రం తీరకుండానే పోయారు. ఎప్పుడూ ప్రజా సమస్యలతోనే ఆయన జీవితం ముడిపడి ఉండేది. తెలంగాణ కమ్యూనిస్టు దిగ్గజాలలో గతేడాది సీతారాం ఏచూరిని కోల్పోయాం. ఏడాదిలోపే ఇప్పుడు సురవరంను కోల్పోయాం. జాతీయ రాజకీయాల్లో తెలుగువారు కనుమరుగు అవుతున్నారు. గట్టిగా నిలబడే నేతలు లేకుండా పోతున్నారు. ఈ క్రమంలోనే సురవం, వృధ్ధాప్య అనారోగ్య కారణాలతో మనలను వీడిపోయారు.

ఆయన రాజకీయాల్లో అజాతశత్రువు. అంతకు మించిన నిస్వార్థం ఆయనకు ఆభరణం. పీడిత, తాడిత వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన తెలంగాణ ముద్దుబిడ్డ. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర్‌ రెడ్డి సమస్యలు ఎక్కడున్నా వాటి పరిష్కారానికై పోరాడేందుకు ఎప్పుడూ ముందుండే వారు. సమస్యలపై ఎంత గట్టిగా పోరాడేవారో ఆయన అంతకుమంచి సౌమ్యుడు. ఆయన సౌమ్యత్వానికి, పోరాటానికి పొంతన ఉండేది కాదు. కానీ జన్మతః వచ్చిన మృదు స్వభావం కారణంగా ఆయన అజాత శతృవు అయ్యారేమో అనిపిస్తుంది. ఆయన మాట్లాడినంత సేపు ఇంకా వినాలనిపిస్తుంది. సాదాసీదాగా ఉంటూ జాతీయ రాజకీయాల్లో చెలామణి కావడం చాలా కష్టం. కానీ అది సాధ్యమని రుజువు చేసిన దిగ్గజనేత సురవం. తెలంగాణ వైతాళికుడు, గోల్కొండ పత్రిక వ్యవస్థాపకుడు సురవరం ప్రతాపరెడ్డి తమ్ముడు స్వాతంత్ర్య సమరయోధుడు వెంకటరామిరెడ్డి కుమారుడు సుధాకర్‌రెడ్డి. అటు తండ్రి, ఇటు పెదనాన్న వారసత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్నారు. ఒకవైపు పెదనాన్న సాంస్కృతిక ఉద్యమ ఆదర్శాలను, మరోవైపు తండ్రి స్వాతంత్య పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న సుధాకర్‌రెడ్డి, చిన్న వయసులోనే సమస్యలపై పోరుబాట పట్టిన తీరు అమోఘం. కర్నూలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే బ్లాక్‌బోర్డు, చాక్‌పీస్‌ వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంపై నిరసన చేపట్టారు. అది ఉద్యమంగా మారి, నగరంలోని మిగతా విద్యాలయాలకు వ్యాపించింది. అన్ని స్కూల్స్ కి అవి సమకూరాయి.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి జాతీయ స్థాయి నేతగా సురవరం ఎదిగారు. దివంగత జైపాల్‌ రెడ్డితో పాటు ఆయన కూడా కమ్యూనిస్టు ఉద్యమంలో రాటుదేలారు. ఎన్నో వామపక్ష ఉద్యమాలు, ఎన్నో ప్రజా పోరాటాల్లో పాలు పంచుకున్నారు. రెండుసార్లు నల్గొండ పార్లమెంట్‌ సభ్యులుగా ఎన్నికైన సురవరం సుధాకర్‌ రెడ్డి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గొప్ప నాయకుడనిపించుకున్నారు. పోరాటలు, ప్రజా ఉద్యమాల పట్ల ఉన్న నిబద్దత కారణంగా ప్రజానేతగా సురవరం గొప్ప పేరు సంపాదించుకున్నారు. పీడిత వర్గాల అభ్యున్నతి కోసం జీవితకాలం కృషి చేశారు.

తెలంగాణ ఉద్యమంతో ఆయనది విడదీయరాని అనుబంధం. ఏఐఎస్‌ఎఫ్‌ నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు సాగింది. 2012 నుంచి 2019వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవిలో కొనసాగారు. మూడు దఫాలుగా ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2000లో విద్యుత్‌ బిల్లుల పెంపునకు వ్యతిరేకంగా వామపక్షాలు చేసిన పోరాటంలో సురవరం ది ముఖ్యమైన పాత్ర. చండ్రరాజేశ్వరరావు తరువాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రెండో తెలుగు వ్యక్తిగా సురవరం నిలిచారు. 1960లో ఏఐఎస్‌ఎఫ్‌ కర్నూలు పట్టణ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆతర్వాత కర్నూలు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 1962లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం చేసిన సమ్మెకు కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. ఈ కమిటీ- 62రోజుల పాటు- చేసిన సమ్మెకు నాయకత్వం వహించారు. అనంతరం కర్నూలులోని కళాశాల విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1965లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ చదువుతున్న సమయంలో కళాశాల విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం ఏఐఎస్‌ఎఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాధ్యతలను సురవరానికి అప్పగించారు. 1966లో ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ ప్రధానకార్యదర్శి అయ్యారు. దీంతో ఆయన దిల్లీకి మకాం మార్చారు. 1969లో రెండోసారి ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. 1970లో ఏఐఎస్‌ఎఫ్‌, 1972లో ఏఐవైఎఫ్‌నకు జాతీయ అధ్యక్షుడయ్యారు. 1971లో కేరళలోని కొచ్చిన్‌లో జరిగిన సీపీఐ 9వ నేషనల్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో జాతీయ కమిటీ- సభ్యుడయ్యారు. 1974లో తిరిగి ఆంధప్రదేశ్‌కు వచ్చిన సురవరం ఆనాటి నుంచి 1984 వరకు సీపీఐ ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. 1985, 90లో కొల్లాపూర్‌ అసెంబ్లీ నుంచి సురవరం సుధాకర్‌ రెడ్డి పోటీ- చేసి ఓడిపోయారు. 1994లో కర్నూలులోని డోన్‌లో అప్పటి సీఎం విజయ భాస్కర్‌రెడ్డిపై పోటీచేసి ఓడిపోయారు. 1998లో ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇలా ఒక్కో మెట్టు ఎక్కినా, ఒదిగే ఉన్నారు. ఇంతటి ఉన్నత లక్షణాలు, ఉదాత్త ఆశయాలు కలిగిన సురవరం మనవాడు కావడం మన అదృష్టం అయితే, మనకు లేకుండా పోవడం మన దురదృష్టం.

Latest News

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

యియర్ పోన్లతోటి శెవులకు శిల్లే!?|ADUGU TRENDS

కొత్త టెక్నాలజీ వచ్చిందంటే సాలు..ఇగ దానెంటే పడ్తం. గదాన్నే అనుసరిత్తం. ఏమైతాందో సూసుకోం. గసొంటిదే గీ యియర్ పోన్ల వాడకం. గదేందో సూద్దా పదండ్రి. అదే పనిగా యియర్ పోన్లను వాడేటోల్లకు గా కర్ణభేరి...

నీట్ లీకేజీ.. అంత లోకువా!?|EDITORIAL

పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే విద్యా వ్యవస్థపై నమ్మకం పోతుంది. అందువల్ల నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకే పరిమితం చేయకుండా, పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News