Wednesday, July 29, 2026
23.1 C
Hyderabad

మరోసారి MLA|ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి|RAJAGOPAL REDDY వివాదాస్పద వ్యాఖ్యలు|SENSATIONAL COMMENTS

MUNUGODU|మునుగోడుకి అన్యాయం చేయొద్దు

నాకు పదవి కన్నా మునుగోడు DEVELOPMEMT|అభివృద్దే ముఖ్యం

-ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

మునుగోడు నియోజకవర్గం ప్రజల అభివృద్ధి కోసం తన వ్యక్తిగత ప్రయోజనాల కంటే ఎక్కువ కృషి చేస్తున్నానని, ఈ ప్రాంతానికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని మాజీ ఎంపీ, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి బహిరంగంగా కోరారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే, అది తనకు జరిగిన అన్యాయంగా భావిస్తానని, తనకు అన్యాయం జరిగినా… పర్వాలేదని కానీ ప్రజల అభివృద్ధిని ఆపకూడదని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వానికి చెప్పినట్లే ప్రస్తుత ప్రభుత్వానికీ ఇదే అభ్యర్థన చేస్తున్నానని అన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలను సమయానికి అమలు చేయాలని, ఆలస్యం చేయకుండా వాగ్దానాలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. మాటిచ్చారు కాబట్టి ఇవ్వండి, కానీ అప్పటివరకు మునుగోడు అభివృద్ధి పనుల్లో ఒక్క రూపాయి కూడా ఆపొద్దని రాజ్ గోపాల్ రెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతం సమీకరణాలు కుదరటం లేదనే కారణం చూపించడం తగదని, ఎవరు అడ్డుకుంటున్నారు, ఎందుకు అడ్డుకుంటున్నారు అని ప్రశ్నించారు.

తనను పార్టీలోకి తీసుకున్నప్పుడు తాను, అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నదమ్ములు అనే విషయం అందరికీ తెలియదా… అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండోసారి మంత్రి పదవిపై హామీ ఇచ్చినప్పుడు కూడా ఆ విషయం తెలియదా… అన్నారు. ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య, ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్నట్లు ఇప్పుడు పరిస్థితి మారిందని వ్యాఖ్యానించారు.

రాజకీయ సమీకరణల పరంగా ఖమ్మం జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలు ఉండగా ముగ్గురు మంత్రులు ఉన్నారని, నల్గొండ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా ముగ్గురు మంత్రులు ఉండడంలో తప్పేమీ లేదని అన్నారు. తాను, తన అన్న ఇద్దరూ సమర్థులం, గట్టి నాయకులమని, ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే ఎలాంటి నష్టం ఉండదని చెప్పారు. ఆలస్యమైనా తాను ఓపికగా వేచి చూస్తానని, కానీ మునుగోడు ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను నిరంతరం కృషి చేస్తున్నానని, భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా, నల్గొండ జిల్లా ఎమ్మెల్సీగా పని చేసిన అనుభవాన్ని ఉపయోగించి ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని అన్నారు. నల్గొండ జిల్లాలోని ఇతర నియోజకవర్గాలతో పోల్చితే మునుగోడు వెనుకబడిందని, ఈ పరిస్థితిని మార్చడం తన లక్ష్యమని చెప్పారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు న్యాయం జరగాలని, ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు పాఠశాలలు పేద ప్రజలపై భారం మోపకూడదని ఆయన సూచించారు. పేదవాళ్లకండగా ఉండటమే నా ధ్యేయం అని చెప్పారు. తనకు పదవి ఏదైనా భగవంతుడు ఇస్తే అది మునుగోడు ప్రజల కోసమే ఉపయోగపడుతుందని, వ్యక్తిగత లాభం కోసం కాదని రాజ్ గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

అభివృద్ధి కార్యక్రమాలు, వైద్య, విద్యా రంగాల మెరుగుదల, మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మునుగోడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజల సంక్షేమమే తన రాజకీయ జీవనోపాధి మూలం అని, అందుకోసం ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని ముందుకు సాగుతానని రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు.

Latest News

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

జూలై 27, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి త్రయోదశి మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం మూల ఉదయం 11.00 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం వైధృతి రాత్రి 12.18 వరకు ఉపరి విస్కమ్బ కరణం తైతుల మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి...

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News