Tuesday, July 28, 2026
28.4 C
Hyderabad

ఓట్ చోర్ ఎవరు? పార్టీలా!? ప్రజలా!?|EDITORIAL

‘ఓట్ చోరీ’తో ఇండియా కూటమికి సంబంధం లేదని ఆ కూటమిలో భాగస్వామి నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలనం చేశారు. ఇదే అంశంపై కాంగ్రెస్ ఢిల్లీలో ‘ఓట్ చోర్ గద్దీ చోడ్’ బహిరంగసభ నిర్వహించిన తెల్లారే ఆయన స్పందించిడం గమనార్హం. ‘ప్రతి పార్టీకి తన సొంత ఎజెండాను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంది. ఓట్ చోరీ, సర్ లను తమ ప్రధాన పోరాటంగా కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఏం చేయలో మనం వాళ్ళకు చెప్పలేం కదా?’ అన్నారు. అంతకుముందు ఇండియా కూటమి పరిస్థితి వెంటిలేటర్ పై ఉన్నట్లుందని కూడా వ్యాఖ్యానించారు. ఒమర్ వ్యాఖ్యలను బట్టి, ఓట్ చోరీ జరుగుతోందా? జరిగితే ఎవరా ఓట్ చోర్ లు? పార్టీలా? ప్రజలా?

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రజలుఆశలకు, ఆశయాలకు సంకేతాంగా నిలుస్తుంది. అయితే, భారత రాజకీయాల్లో తరచూ వినిపించే మాట.‘ఓట్ల దొంగతనం’, ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది’, ‘అధికార పార్టీయే ఓట్ల దొంగ’. ఈ ఆరోపణలు అన్ని జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలపైనా ఉన్నాయి. అసలు ప్రశ్న ఏమిటంటే, నిజంగా ఓట్ల దొంగ ఎవరు?
‘ఓట్ చోరీ’ అంటే కేవలం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడమే కాదు. డబ్బు, మద్యం, కులం, మతం, అధికార దుర్వినియోగం, మీడియా ప్రభావం, అలవికాని హామీలన్నీ ఓటు స్వేచ్ఛను దెబ్బతీసే పద్ధతులే. ఓట్ చోరీ సాంకేతిక సమస్య మాత్రమే కాక, నైతిక వైఫల్యం కూడా.

దేశంలో కాంగ్రెస్ దీర్ఘకాలంగా అధికారంలో ఉంది. అది వ్యవస్థలను తనకు అనుకూలంగా ఉపయోగించుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య హక్కుల్ని అణచివేయడం, అధికార యంత్రాంగాన్ని తమ పార్టీ ప్రయోజనాలకు వాడుకోవడం వంటి విమర్శలు కాంగ్రెస్‌పై బలంగా ఉన్నాయి. రాష్ట్రాల్లో డబ్బు రాజకీయాలు, కుటుంబ పాలన, స్థానిక నాయకుల అక్రమాలు కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఇవి పరోక్ష “ఓట్ చోర్” పద్ధతులే.

బీజేపీపై కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. మత విద్వేషాలు, జాతీయత పేరుతో ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం, మీడియా మీద ప్రభావం, ప్రభుత్వ సంస్థల స్వతంత్రతను తగ్గించడం వంటి అంశాలు బీజేపీని విమర్శలకు గురిచేశాయి. ప్రతిపక్ష పార్టీలను, నేతలను విచారణ సంస్థల ద్వారా భయపెట్టడం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ప్రభుత్వాలను కూల్చడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన చర్యలు. ఇవన్నీ ప్రత్యక్ష ఓట్ చోరీ కాకపోయినా, ప్రజల స్వేచ్ఛాయుత నిర్ణయాలని ప్రభావితం చేసే పద్ధతులే.

ప్రాంతీయ పార్టీలు కూడా ఈ జాబితాలేకే వస్తాయి. డీఎంకే, ఏఐఏడీఎంకే, బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ, సమాజ్‌వాది, బీఎస్పీ వంటి పార్టీలు కూడా డబ్బు, కులం, మతం, ప్రాంతీయ, ప్రలోభాల భావోద్వేగాలపై రాజకీయాలను నెరుపుతున్నవే. “మనోడే గెలవాలి” అనే భావన ప్రజాస్వామ్యాన్ని కుటుంబ లేదా కుల రాజకీయం వైపు నడిపింది. ఇక్కడ ఓటు ప్రజల స్వేచ్ఛా అభిప్రాయానికి కాకుండా సామాజిక రాజకీయ ఒత్తిడికి లోనవుతున్నది.

ప్రత్యక్ష, పరోక్ష ‘ఓట్ చోరీ’లో రాజకీయ పార్టీలతో పాటు ఓటరు పాత్రను విస్మరించలేం. డబ్బు తీసుకుని ఓటేయడం, కులం లేదా మతం పేరుతో ఓటేయడం, భవిష్యత్ అభివృద్ధి కంటే తక్షణ స్వలాభాలకే ప్రాధాన్యం ఇవ్వడం, ప్రలోభాలకు లోనవడం ద్వారా ఓటరే తన ఓటును తానే అమ్ముకుంటున్నాడు.
మీడియా కూడా ఈ పాపంలో భాగమే. పార్టీకో పత్రిక, పత్రికకో పార్టీ ఉండటం, ఒక పార్టీకి అనుకూలంగా, మరో పార్టీని నిరంతరం దూషించడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తోంది. ఇది కనిపించని ఓట్ చోరీ. సోషల్ మీడియా ద్వారా అబద్ధాలు, అసత్యాలు ప్రచారమై ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
ఓట్ చోరీ ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవస్థీక్రుతంగా విస్తరించిన విషం. పార్టీలను, ప్రజలను కూడా దోషులుగా పరగణించాల్సందే. ఇది మన రాజకీయ సంస్కృతిలో ఉన్న లోపం. ఆ లోపాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలతోపాటు, ప్రతి పౌరుడిది కూడా. ఓటరు చైతన్యం, స్వతంత్ర సంస్థల బలోపేతం, పారదర్శక ఎన్నికల ప్రక్రియ, బాధ్యతాయుత మీడియా కలిసి పనిచేసినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం నిలుస్తుంది.

Latest News

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

జూలై 27, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి త్రయోదశి మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం మూల ఉదయం 11.00 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం వైధృతి రాత్రి 12.18 వరకు ఉపరి విస్కమ్బ కరణం తైతుల మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి...

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News