Thursday, July 30, 2026
23 C
Hyderabad

KONDA|కొండా వర్సెస్ ఎర్రబెల్లి|ERRABELLI

ఒక్క దెబ్బకు మూడు పిట్టలు!
మలుపులు తిరుగుతున్న ‘కొండా’ దారులు!?
ట్విస్టుల మీద ట్విస్టులు

హైదరాబాద్, జులై 2 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
రాష్ట్ర అటవీ దేవాదాయశాఖల మంత్రి కొండా సురేఖ దంపతుల వ్యవహారం పార్టీ లోపలా, బయటా రోజుకో మలుపు తిరుగుతూ, ట్విస్టుల మీద ట్విస్టులు తీసుకుంటోంది. ఒకవైపు అంతర్గతంగా పార్టీలో కొందరిపై తిట్లతో మొదలైన పంచాయతీ, పరస్పర దూషణలు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారి తీసింది. చివరకు షోకాజు నోటీసులు, వివరణలు, వివరణల పేరుతో ఆరోపణలు, డెడ్ లైన్ల దాకా వెళ్ళింది. ఇంకోవైపు ‘పరకాలలో పోటీ చేయడానికి నేనొస్తున్నానంటూ’ కొండా దంపతుల కూతురు సుస్మితా పటేల్ ఇన్ స్టాలో పెట్టిన పోస్టు సంచలనమైంది. మరోవైపు గత ఎన్నికలో తూర్పు నియోజకవర్గంలో రూ.70 కోట్లు ఖర్చు చేశామన్న మంత్రి కొండ సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి నోరు జారడం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదుకు దారి తీసింది. గత ఎన్నికలో కొండా సురేఖ ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు స్వయంగా బుధవారం ఎన్నికల కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇదే అదనుగా కొండా మురళి వరంగల్ మంత్రి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఎర్రబెల్లి కుటుంబంలో పుట్టిన వారెవ్వరైనా సరే, ఎర్రబల్లులే!’ అంటూ మరో కొత్త వివాదానికి తెరలేపారు. పార్టీలో అంతర్గత ప్రత్యర్థులను, బయటి పార్టీ ప్రత్యర్థులను పక్కన పెట్టి, తన పాత ప్రత్యర్థులను అనూహ్యంగా తెరమీదకు తెచ్చారు. బహుశా ఈ విధంగా పార్టీ లోపలి లొల్లిని మరిపించడానికే, కొత్త లొల్లిని కొండా మురళి తెరమీదకు తెచ్చారా? ఈ ఎత్తుగడ వేశారా? కాకపోతే తన పాత శత్రువులను కొత్తగా తెర మీదకు తెచ్చిన ఎత్తుగడ ఫలిస్తుందా? కచ్చితంగా కొంత టైమ్ పాస్ కి సహాయ కారిగా మాత్రం నిలుస్తుందడంలో సందేహం లేదు.

నిజానికి కొండ దంపతులు ఎర్రబెల్లికి మిత్రులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత చాలా కాలం క్రితమే ఎర్రబెల్లి కి ప్రత్యర్థులుగా మారారు. అలా ఒకరికొకరు ప్రత్యర్థుల పేరు మీదే పరస్పర విమర్శలు, ప్రతి విమర్శలతోనే ఎదిగారని కూడా రాజకీయాల్లో అంటుంటారు. వేర్వేరు పార్టీల్లో, వేర్వేరు దారుల్లో వేర్వేరుగా ఎదిగినప్పటికీ, వాళ్ళంతా ఒక్కటే అనే వారూ లేకపోలేదు. కావాలనే ఇదంతా అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడూ రాజకీయంగా తలపడని కారణంగా కూడా ఈ విమర్శలు వచ్చి ఉంటాయి. ఒకే పార్టీలో కొద్ది కాలం ఉన్నప్పుడు కూడా వాళ్లు స్నేహం చేసినట్లు కానీ, కయ్యానికి కాలు దువ్వినట్లు కానీ కనిపించలేదు. ఇదంతా అవసరమైన చర్చ కాకపోయినా, సందర్భోచితం మాత్రమే!

ఇక నోరు పారేసుకోవడం వల్ల స్వయంకృతాపరాధం వల్ల ప్రస్తుతం కొండ దంపతులు పార్టీలోపలా, బయట సమస్యల్లో చిక్కుకున్నారు. కొన్ని అనూహ్య సమస్యల్లో కూరుకుపోయారు. మంత్రి గా మాట్లాడకూడదని అంశాలు వెల్లడించి మంత్రి సురేఖ, పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాల డిమాండ్ చేస్తూ, తిట్టిపోసి మురళి ఇబ్బందుల్లో పడ్డారు. ఆ తర్వాత వాళ్ళు వెనక్కు రాలేక ఒక్కో మెట్టు దిగుతూ, మరింత గా పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ వచ్చారు. దీనికి దీటుగా పార్టీ నేతలు సైతం సమాధానమిస్తూ వస్తున్నారు. సమస్యలు అధిష్టానానికి ఫిర్యాదుల దాకా వెళ్ళాయి. వివరణల్లో ఫిర్యాదులు, పార్టీలో కొందరు పెద్దలను వివాదాల గోదా లోకి లాగడం వంటివి అనవసరంగా అనివార్యమయ్యాయి. వివరణల వరకు ‘ చేయి ‘ దాటింది. డెడ్ లైన్ల వరకు వెళ్ళింది. మరోవైపు ఎన్నికల ఖర్చు వ్యవహారం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులకు వెళ్ళింది. సరిగ్గా ఈ సమయంలోనే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ పర్యటన కొంత కొండా దంపతులకు కలిసి వచ్చిందనే భావించాలి. ఈ వెసులుబాటును సరిగ్గా వినియోగించుకోవాల్సిన కొండా దంపతులు, మరో వైపు లాగారా?

ఒక్క దెబ్బకు మూడు పిట్టలు!
అన్న చందంగా, తన పాత ప్రత్యర్థిని, పార్టీలో అంతర్గతంగా తనకు ఇబ్బందులు తెస్తున్న మరో ప్రత్యర్థిని, తాజాగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన ఎన్నికల ప్రత్యర్థిని మొత్తం ముగ్గురిని కలిపి ఒకే గాటన కడుతూ కొండ మురళి ఎర్రబెల్లి కుటుంబంలో పుట్టిన వాళ్లంతా ఎర్రబల్లులే అని విమర్శలకు దిగారు. దీంతో సై ఒక వైపు నుంచి మరో వైపునకు మలుపు తిప్పినట్లు అయింది.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ, జిల్లా రాజకీయాల్లో అత్యంత విభాగంగాను చర్చనీయంగాను మారిన కొండా దంపతులు, మరెన్ని ట్విస్టులు ఇస్తారో చూడాలి. ఆయా సమస్యలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

వాళ్ళు ఎర్రబల్లులే

ఓరుగల్లు రాజకీయాల్లో ఎర్రబెల్లి కుటుంబంలో పుట్టినవారు ఎవరైనా సరే వాళ్ళు ఎర్రబల్లులేనని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు విమర్శించారు. వరంగల్ ఓసిటీ మంత్రి కొండా సురేఖ క్యాంపు కార్యాలయంలో మంగళవారం కొండా మురళీధర్రావు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సమావేశమయ్యారు. అనంతరం వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చిట్ల సత్యనారాయణ, ఇతర కార్పొరేటర్లతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ పర్యటనను విజయవంతం చేయాలని, ఎల్బీ స్టేడియంలో జరిగే సభకు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. భారాస నేత ఎర్రబెల్లి దయాకర్రావు, భాజపా నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణను ఉద్దేశించి కొండా మురళీ తీవ్ర విమర్శలు చేశారు. ఎర్రబెల్లి ఇంటి పేరు ఉన్నోళ్లు ఎర్ర బల్లులేనన్నారు. 2023 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి సురేఖమ్మను గెలిపించిన విషయంపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని చెప్పారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అన్ని కులాలకు భవనాలు కట్టిస్తామన్నారు. డివిజన్ల వారీగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అధికారులు, స్థానిక కార్పొరేటర్ల చేతుల మీదుగా తీసుకోవాలని సూచించారు.

https://youtu.be/UVR8t_PKe-0?feature=shared

కొండాపై ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు

మంత్రి కొండా సురేఖ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్‌ను సమర్పించారని ఆరోపిస్తూ, ఆమె శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ నేత, అప్పటి ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన ప్రదీప్ రావు, కొండా సురేఖ తన అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు సరైనవిగా ఇవ్వలేదని పేర్కొన్నారు.

సురేఖ భర్త కొండా మురళి ఇటీవల మీడియా ముందుకు వచ్చి ఎన్నికల ప్రచారానికి రూ.70 కోట్లు ఖర్చు చేశామని చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ మొత్తం ఖర్చు సురేఖ అఫిడవిట్‌లో ప్రస్తావించకపోవడం RP చట్టంలోని సెక్షన్ 10-A, 77, 78 ప్రకారం గంభీర ఉల్లంఘనగా పేర్కొన్నారు. అలాగే ఆమె అఫిడవిట్‌లో 2 ఎకరాల స్థిరాస్తిని మాత్రమే చూపించగా, మురళి 500 ఎకరాల భూమిని వారసత్వంగా పొందినట్లు స్వయంగా తెలిపారని పేర్కొన్నారు.

ఇవి తప్పుడు అఫిడవిట్ కింద RP చట్టంలోని 125-A సెక్షన్‌తో పాటు IPC సెక్షన్ 191, 193 ప్రకారం శిక్షార్హంగా పరిగణించాలన్నారు. పూర్తి విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రదీప్ రావు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ నేత నన్నపునేని నరేందర్ కూడా గతంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

https://youtu.be/v1CY3jTPBpc?feature=shared

Latest News

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News