Tuesday, September 15, 2026
25.2 C
Hyderabad

సేమ్ టు సేమ్..! షేమ్ టు షేమ్!!|EDITORIAL

మహ్మద్ బిన్ తుగ్లక్ చాలా తెలివైన వాడని చరిత్ర చెబుతోంది. మధ్యయుగంలో ప్రగాఢముద్రవేయగలిగిన వ్యక్తిత్వాన్ని కలిగి వున్నాడు. దూరదృష్టి, ఆలోచనాపరుడు, రాబోయే యుగాలు, తరాల గూర్చి ఆలోచించగలిగే శక్తినీ గలిగినవాడు. అని ప్రతీతి. అప్పట్లోనే బంగారు నాణాలకు బదులు రాగి, వెండి నాణాలను ప్రవేశ పెట్టాడు. కరువు కాటకాల సమయంలో ప్రజల ముక్కుపిండి మరీ పన్నులు వసూలు చేసిన తుగ్లక్, చివరకు జుట్టు పన్ను కూడా విధించాడని చెబుతారు. రాజ్య రక్షణ కోసమే ఆయన ఆనాడు అలా చేసి ఉండవచ్చు. కానీ, విచ్చలవిడి పన్నులు, పరిపాలనా పద్ధుతల వల్ల తుగ్లక్ పాలన అంటే పిచ్చి పాలన అనీ, తుగ్లక్ అంటే పిచ్చోడనే ముద్ర పడిపోయింది. ఎంత తెలివైనోడైనా, తెలివి తక్కువ పనులు చేస్తే ఆనాటి నుండే తుగ్లక్ అనడం రివాజుగా మారింది. బహుషా ఇప్పుడు మన పాలకులను తుగ్లక్ పూనాడేమో తెలియదు కానీ, తుగ్లక్ ను మించిన పద్ధుతలను అవలంబిస్తున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ పన్నులు తుగ్లక్ పరిపాలనకు అత్యంత దగ్గరగానే కాదు సేమ్ టు సేమ్ అనిపిస్తుంది. షేమ్ టు షేమ్ కూడా అనుకోవచ్చు.

తుగ్లక్ పన్నులు… పరిపాలన!

నోట్ల రద్దు ఫలితాలు ఏ మేరకు ఫలితాలు సాధించాయో ఆనాడే ప్రజల అనుభవంలోకి వచ్చేశాయి. ఇప్పుడు జీఎస్టీ కూడా ప్రజల ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్న ఓ విచిత్ర విధానంగా మారిపోయింది. నాడు తుగ్లక్ జుట్టు పన్ను వేస్తే, ఇప్పుడు చివరకు చెత్త పన్ను కూడా వేసేస్తున్నారు. నిత్య జీవితంలో ప్రజలు ఏది కొన్నా, నిత్యావసరంగా ఏ వస్తువును వాడినా, చివరకు ఆహారం తీసుకోవడం నుంచి విసర్జన దాకా మనిషి జీవితమంతా పన్నుల మయంగా మారిపోయింది. ఆరోగ్యం కోసం తీసుకున్న ఇన్సూరెన్స్‌, సేవింగ్స్‌ కోసం తీసుకున్న జీవితభీమాలపైనా జీఎస్టీ తప్పడం లేదు. 12 నుంచి 18శాతం ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు.

తాజా గాణాంకాల మేరకు దేశంలో ఈ ఏడాది ఒక్క జూన్‌లోనే రూ.2,591 కోట్ల నికర జీఎస్టీ వసూలైంది. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జూన్‌ నెలకు ఇదే అత్యధికం. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి తైమ్రాసికంలో మొత్తం వసూలైన నికర జీఎస్టీ రూ.8,860 కోట్లు. గతేడాది జూన్‌లో వచ్చిన రూ.3,910 కోట్ల పన్ను ఆదాయం కంటే ఇది 6.58 శాతం ఎక్కువ. ఈ ఏడాది జూన్‌లో ఐజీఎస్టీ సెటిల్మెంట్‌ రూ.1,365 కోట్లు వచ్చింది. వృత్తి పన్ను రూ.29 కోట్ల నుంచి రూ.49 కోట్లకు పెరిగింది. లిక్కర్‌పై వ్యాట్‌ రూ.61 కోట్ల నుంచి రూ.86 కోట్లకు, పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్‌ రూ.1,380 కోట్ల నుంచి రూ.1,435 కోట్లకు పెరిగింది.
మీరు హోటల్ కి వెళ్ళి టిఫిన్ చేస్తే రూ.500 బిల్లు అయిందనుకుందాం. హోటల్ బిల్లులో ఎస్ జీఎస్టీ రూ.45, సీజీఎస్టీ రూ.45 కలిపి మొత్తం రూ.590కి బిల్లు వస్తుంది. జీఎస్టీ అంటే ఒకటే బిల్లు కదా? ఈ రెండు జీఎస్టీలేంటి? అనే అనుమానం కలుగుతుంది. కానీ, ఈ రెండు కలిపితేనే జీఎస్టీ. ఎస్జీఎస్టీ రాష్ట్రానికి, సీజీఎస్టీ కేంద్రానికి వెళుతుందన్నమాట. అంటే జీఎస్టీ లో కేంద్రం సగం, రాష్ట్రం సగం చొప్పున పంచుకుంటున్నాయి. అంటే ప్రజల నుండి వసూలు చేసే జీఎస్టీని అటు కేంద్రం, ఇటు రాష్ట్రం చెరిసగంగా పంచుకుంటున్నాయని అర్థం. అందుకే జీఎస్టీ దోపిడీని కలిసికట్టుగా కేంద్రం, రాష్ట్రాలు ఇష్టానుసారంగా చేస్తున్నాయి. కాబట్టే, కేంద్రాన్ని రాష్ట్రాలు, రాష్ట్రాలను కేంద్రం ఎప్పటికీ ప్రశ్నించవు, నిలదీయవు. పన్నలు వసూళ్ళ దందాను ఆ విధంగా దండుకునే ఏర్పాట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్నాయన్నమాట. ఇప్పుడు ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి? సగటు మనిషిని, సామాన్యుడిని ప్రభుత్వాలే ఈ విధంగా దోపిడీ చేస్తుంటే ఎవరిని ఎవరు ప్రశ్నించాలి? మనమే ఓటు వేసి, గెలిపించుకుని, పరిపాలించడానికి అవకాశాన్ని, అధికారాన్ని అప్పగించింది ఎందుకు? ఇందుకేనా? ఇదేం దోపిడీ? ఇదేం పన్నుల విధానం? నిలదీసేదెవ్వరు?

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాట్‌ స్థానంలో జీఎస్టీ పన్ను విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇది ప్రభుత్వాలకి ఆదాయం పెరగటానికి తోడ్పడింది. గత పార్లమెంట్‌ సమావేశాల్లో ఇన్సూరెన్స్ పై జీఎస్టీ తగ్గించాలని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కోరితే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పెద్దగా పట్టించుకోలేదు. నిజానికి ప్రజల సమస్యలను తెలుసుకునే బదులు ఎదురుదాడి చేశారు. అయితే ప్రస్తుతం మధ్యతరగతి భారతీయులకు అనుగుణంగా పన్ను రేట్లలో తగ్గింపును అందించ బోతున్నట్లు వెల్లడైంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అనేక వస్తువుల ధరలను అధిక జీఎస్టీ బ్రాకెట్‌ నుంచి తక్కువ పన్నులకు మార్చాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఏయే రంగాల్లో ప్రజలు బాధపడుతున్నారో గుర్తించాలి. ప్రస్తుతం మధ్య, దిగువ మధ్య తరగతి ఆదాయం కలిగిన ప్రజల కోసం జీఎస్టీ పన్నుల విషయంలో కూడా పెద్ద మార్పులకు కేంద్రం శ్రీకారం చుడుతోందని సమాచారం. 12 శాతం కింద ఉన్న అనేక వస్తువులపై పన్నును 5 శాతానికి తగ్గించనున్నట్లు తెలిసింది. నిజంగా ఇలాంటి ఆలోచన ఉంటే అనేక రంగాలపై పన్ను శాతాన్ని అత్యదికంగా 5శాతానికి తగ్గిస్తే మేలు.

ఇకపోతే పన్నుల్లో హేతుబద్దత లేకపోవడం వల్ల చిన్న, మధ్యతరగతి ప్రజలు, కంపెనీలు జీఎస్టీ కట్టుకోలేక దివాళా తీస్తున్నారు. ఉప్పులు, పప్పులపై జీఎస్టీ పడ్డాక కూడా ఇడ్లీ దోశలపై పన్నులు వాయిస్తున్నారు. మధ్యతరగతి ప్రజలు హోటల్‌కు వెళ్లి టిఫిన్‌ చేయలేని దుస్థితి నెలకొంది. దేశంలో నిరుద్యోగ తీవ్రత చాలా ఎక్కువగా వుంది. పని చేయగలిగిన శ్రామికుల సంఖ్య 64 శాతానికి పెరిగిందని, కేవలం 37 శాతం మందికి మాత్రమే పనులు దొరికాయని ఓ నివేదిక తెలిపింది. యువతకు ఉపాధి కల్పించడం దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్‌గా మారింది. సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ ప్రభావంతో నిరుద్యోగం మరింత తీవ్రం కానుంది. ఐటి సేవల రంగాలలో తక్కువ నైపుణ్యం ఉంటే చాలన్న రీతిలో సాగుతోంది. ఐటి కంపెనీలు కూడా ఉద్యోగులను ఉన్న పళంగా తీసేస్తున్నాయి. ప్రధాని మోడీ చెబుతున్నట్లుగా 2047 నాటికి దేశం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే విద్యారంగం, వ్యవసాయరంగం కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. అత్యధిక అక్షరాస్యత వున్న కేరళ తలసరి ఆదాయం దేశంలో మొదటి స్థానంలో వుంది. తర్వాత స్థానాల్లో తమిళనాడు, తెలంగాణ వున్నాయి. బీహార్‌ తలసరి ఆదాయం అతి తక్కువగా వుండడానికి అక్షరాస్యత కూడా ముఖ్య కారణం. మేక్‌ ఇన్‌ ఇండియా, మేడ్‌ ఇన్‌ ఇండియా నినాదాలను రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారు. ప్రపంచీకరణ ఆర్థిక విధానాల వల్ల ప్రభుత్వ సేవలు కుదించుకుపోయాయి. ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో పాటు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పేదరికం లేని సమాజం కోసం ప్రణాళికలు అమలు చేయడమంటే ముక్కు పిండి పన్నుల వసూలు చేయడం మాత్రం కాదని గుర్తించాలి.

Latest News

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News