Thursday, September 17, 2026
27.7 C
Hyderabad

ఒక యుద్ధం ముగిసింది!|EDITORIAL

ఇది యుద్ధాల కాలంగా మారింది. ఎవరు ఎప్పుడు ఎవరిపై, ఏ దేశం మరే దేశంపై ఎప్పుడు దాడి చేస్తుందో తలియని కాలమిది. గత నాలుగైదేళ్లుగా ఉక్రెయిన్‌ రష్యాల మధ్య ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్‌ పాలస్తీనా మధ్య యుద్ధం నిరంతరంగా చూస్తూనే ఉన్నాం. భారత్‌లో ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా భారత్‌ పాక్‌లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. ప్రతిగా పాక్‌ ఇండియాపై దాడికి తెగించింది. పాక్ పప్పులుడకలేదు. దిక్కుతోచని పాక్‌ కాళ్ల బేరానికి వచ్చింది. యుద్ధం ఆపాలన్న వినతిపై మరోమాట లేకుండా భారత్‌ కాల్పుల విరమణకు అంగీకరించింది. 12 రోజుల క్రితం ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై దాడి చేసింది. ఇరాన్‌ కూడా ప్రతిదాడులతో తిరగబడింది. చివరకు అమెరికా కూడా రణరంగానికి దిగి ఇరాన్‌పై విరుచుకు పడింది. చివరకు ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపించానని ప్రగల్భాలు పలికిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధాన్ని కూడా తానే ఆపాలని కోరినట్లుగా ప్రకటించుకున్నారు. ప్రత్యక్షంగా యుద్ధానికి దిగి, ఇరాన్ దాడి చేసే సరికి తోకముడిచి, తానేదో శాంతికాముకుడినైనట్లు ట్రంప్ పోజు కొడుతున్నాడు.

ఏమైనప్పటికీ పశ్చిమాసియాలో ఒక యద్ధం ముగిసింది. లేదంటే ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయిన ప్రపంచ చమురు, ఆర్థిక వ్యవస్థ పెను సంక్షోభానికి గురయ్యేది. ఆయుధ సంపత్తి కలిగిన దేశాలు తమ ఆయుధాలను పరీక్షించుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ మాదేనంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తాజాగా ప్రకటన చేశారు. నిజానికి ఆయా దేశాల నేతల యుద్ధ కాంక్షల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వెనుకటికి రాజులు కూడా ఇలాగే యుద్ధాలు చేసి రాజ్యవిస్తరణకు పాల్పడేవారు. ఇప్పుడు మరో రూపంలో సామ్రాజ్యవాదం కొనసాగుతోంది. తమ ఆధిపత్యాన్ని అంగీకరించడం లేదన్న కారణంతో ఉక్రెయిన్‌పై రష్యా దాడికి తెగించింది. ఇరాన్‌ అణ్వస్త్ర ప్రయోగాలు చేస్తోందన్న కారణంతో ఇజ్రాయిల్‌, అమెరికాలు దాడికి తెగించాయి. ఈ దాడలతో ఇరాన్‌కు జరగాల్సిన నష్టం జరిగింది. అయితే పెద్దన్న పాత్రను పదిలపర్చుకోవాలన్న అమెరికా ఈ తరహా దాడులను ప్రోత్సహించడం సరికాదు. సాగినంత కాలం సరే, తర్వాత? యుద్ధ ప్రభావాలు బలహీన దేశాలపైనే కాదు, బలమైన దేశాలపై కూడా ఉంటాయి. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధంలో, పరోక్షంగా అన్నీతానై ఇజ్రాయెల్‌తో కథ నడిపించిన అమెరికా, చివరకు ప్రత్యక్షంగా కూడా యుద్ధానికి దిగింది. ఇరాన్ పై దాడులకు తెగబడింది. ఇరాన్ ఎదురు తిరిగింది. తిరిగి కతార్ లోని అమెరికా స్థావరాలపై దాడులకు దిగే సరికి తోకముడిచి శాంతి జపం చేస్తోంది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తనను తాను యుద్ధ వ్యతిరేకిగా ప్రచారం చేసుకున్న ట్రంప్‌ స్వయంగా కయ్యానికి కాలు దువ్వాడు. చివరకు యుద్ధాన్ని ముగిస్తున్నట్లుగా ప్రకటించారు.

అమెరికా నిరంతరం యుద్ధాల్లో మునిగితేలడంతో ప్రపంచంలో అశాంతి చెలరేగిందంటూ ఆరోపిస్తూ వచ్చిన ట్రంప్‌ , తాను అధికారంలోకి రాగానే అన్ని యుద్ధాలనీ ఆపేసి ప్రపంచానికి శాంతినిస్తానన్నాడు. ఆర్నెల్ల కాలంలోనే ఆయన తన అసలు రంగును బయటపెట్టుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున ఏడు బి2 స్పిరిట్‌ బాంబర్లు ఇరాన్‌లోకి ప్రవేశించి, మూడు అణుస్థావరాలవిూద బంకర్‌ బస్టర్‌ బాంబులు కురిపించాయి. ఇజ్రాయెల్‌ చేద్దామనుకున్న పనిని తానే స్వయంగా పూర్తిచేశారు. ఫర్దో, నతాంజ్‌ పాటు, శుద్ధి చేసిన యురేనియంను భారీ ఎత్తున నిల్వచేసిన ఇసఫహాన్‌ అణుకేంద్రాన్ని నాశనం చేయడానికి అదనంగా సబ్‌మెరైన్ల నుంచి ప్రయోగించిన టామాహాక్‌ క్రూయిజ్‌ మిసైళ్ళను ఉపయోగించారని వార్తలు వచ్చాయి. బీటూ బాంబర్లు, వందలాది యుద్ధవిమానాలు, సబ్‌మెరైన్లతో సహా సర్వ శక్తులనూ వాడి అమెరికా జరిపిన ఈ దాడిలో ఇరాన్‌ అణు స్థావరాలు ధ్వంసమైపోయాయి. పూర్తిగా, సమూలంగా వాటిని తుడిచిపెట్టేసినట్టు ట్రంప్‌ ప్రకటించాడు. చివరకు ఫలితం తేలింది కనుక యుద్ధం ముగిస్తున్నట్లు ప్రకటించాడు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్‌పిటీలో భాగస్వామి కాకుండా, భారీగా అణ్వాయుధాలు పోగేసుకున్న ఇజ్రాయెల్‌, ఆ ఒప్పందం మీద సంతకం చేసిన ఇరాన్‌ దగ్గర అణ్వాయుధాలు పోగుబడివున్నాయన్న ఆరోపణతో, ఇరాన్‌ను నిరాయుధం చేయడమే తన లక్ష్యంగా ప్రకటించి జూన్‌ 13న ఈ యుద్ధంలోకి దిగింది. కదనరంగంలోకి అమెరికా ప్రత్యక్ష ప్రవేశంతో ఆ మూడు అణుకేంద్రాలను నాశనం చేయడమనే లక్ష్యం పరిపూర్ణమైంది. అందుకే వెంటనే యుద్ధం ఆగిపోవాలి. ప్రపంచం ఇక కంటినిండా నిద్రపోవచ్చునని ప్రకటించి యుద్ధ విరమణను ప్రకటించేశాడు. అణుస్థావరాల నాశనంతో ఇరాన్‌ కాళ్ళబేరానికి వస్తుందని ట్రంప్‌ నమ్ముతున్నారు. శాంతిచర్చలకు, ఒప్పందాలకు కాలం చెల్లిందని, ఇక ప్రతీకారమే మిగిలిందని ప్రకటించిన ఇరాన్‌ కూడా శాంతిని కోరుకుంటూ యుద్ధ విరమణకు ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే ఇందులో ఎవరు పట్టుదలకు పోయినా మారణహోమం తప్పదు. ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ హెచ్చిరించినా ఆపని చేసే శక్తి లేదనే చెప్పాలి. దోహాలో ఉన్న అమెరికా స్థావరంపై దాడి చేసినా అది కూడా నామమాత్రమనే చెప్పుకోవాలి. ఇరాన్‌కు అత్యంత సమీపంలోనే అది గట్టిగా దెబ్బతీయగల దూరంలోనే అమెరికా స్థావరాలు అనేకం ఉన్నాయి. అయినా సాహసం చేయలేకపోయింది.

హర్ముజ్‌ జలసంధి మూతబడే ప్రమాదం ఉందంటూ వార్తలు రావడంతో స్టాక్‌మార్కెట్లు తలకిందులయ్యాయి. చమురుధరలు అమాంతంగా పెరిగాయి. ఇరాన్‌కు మాట సాయం చేస్తున్న దేశాలు ఆయుధాలతో ఆదుకుంటాయన్న నమ్మకం లేకుండా పోయింది. ప్రపంచానికి ఇంధనాన్ని సమకూర్చే ఈ కీలకమైన ప్రాంతం యుద్ధ జ్వాలల్లో కొనసాగడం సరికాదు. ఇదే ప్రపంచ దేశాలూ కోరుకున్నాయి. దీంతో ఎట్టకేలకు యుద్ధం ముగిసిందన్న ప్రకటన ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చింది.

Latest News

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News