Tuesday, September 15, 2026
32.2 C
Hyderabad

జీవ వైవిధ్యంతోనే జీవన సాఫల్యం!|EDITORIALS

ప్రకృతి మానవ జాతికి లభించిన గొప్ప వరం. ఈ సకల చరాచర ప్రపంచంలో అత్యంత విలువైనది ప్రకృతే. ప్రకృతి మనకు అన్నీ ఇస్తుంది. కానీ, అదే ప్రకృతికి మనమేం ఇస్తున్నాం? విధ్వంసం, వినాశనం చేయడం తప్ప! ఆవిధ్వంసమే ఇప్పుడు మొత్తం కేవలం ప్రకృతికే కాదు స్రుష్టి వినాశనానికే దారి తీస్తున్నది. మొక్కే కదా అని పీకేస్తే, చెట్టే కదా అని తొలగిస్తే, చెత్తే కదా అని వేసేస్తే, పొగే కదా అని వదిలేస్తే, అంతా చేయట్లేదా? నేనొక్కరినే కాదు కదా! అని నిర్లక్ష్యం వహిస్తే, ఏర్పడుతున్న విలయం అంతా అంతా ఇంతా కాదు. తనను తాను ఉద్ధరించుకుంటేనే ఉద్యమమైనా, విప్లవమైనా, చివరకు మార్పైనా, మరేదైనా.|EDITORIALS

ప్రకృతిని మనం కాపాడుకుంటేనే అది మనల్ని కాపాడుతుంది. ప్రకృతి మనుగడతోనే మన మనుగడ ఇమిడి ఉంది. భారతీయ సనాతన ధర్మం, సంస్క్రుతి, సంప్రదాయాలు మొత్తం ప్రకృతిని పూజించడం, ఆరాధించడంతోనే ముడిపడి ఉన్నాయి. జీవ వైవిధ్యం ప్రకృతిలోనే గాక, మన జీవన విధానంలోనూ పరంపరగా వస్తూ ఉంది. గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని లను పంచభూతాలు అన్నాం. జీవధాతువే పంచభూతాల్లో సజీవంగా ఉంది. అందుకే మనం మన భూమిని మనకు జన్మనిచ్చే తల్లితో సమానంగా చూస్తాం. భూమాత, భూతల్లి అంటున్నాం. నీటినిచ్చే నదులన్నింటికీ తల్లికి సమానమైన స్త్రీలింగంతో కూడిన పేర్లే పెట్టుకున్నాం. చివరకు ఉగాది, బతుకమ్మలాంటి దాదాపు అన్ని పండుగలు కూడా ప్రకృతి సంబంధమైనవే. ప్రకృతితో మానవాళిది, జీవకోటిది విడదీయలేని పెనవేసుకున్న పేగు బంధం. ప్రకృతిని పూజించుకోవడం, అవసరమైన మేరకు అనుభవించడం, రక్షించుకోవడం, జీవ వైవిధ్యాన్ని మన భవిష్యత్తు తరాలకు అందించడమనే ప్రక్రియ మన జీవన విధానం చేసుకోవాలి. చెట్టును, పుట్టను పూజించడం వెనక ఉన్న మర్మం కూడా ఇదే.|EDITORIALS

నిజానికి మానవుడు భూమ్మీద పడినప్పటి నుండే ప్రకృతి విధ్వంసం మొదలైంది. మిగతా జీవరాశిలో విధ్వంసం కంటే జీవ వైవిధ్యమే ఉంటుంది. ప్రకృతి బహుషా మనిషి చేసినంత వినాశనం మరే జీవి చేయడం లేదనే అతిశయోక్తి కానే కాదు. ఈనాటి సునామీ లాంటి ప్రళయాల నుంచి, అతివ్రుష్టి, అనావ్రుష్టి, కరువు కాటకాలు, ప్రాణాంతక, అంటువ్యాధులు ప్రబలడం వరకు అంతా ప్రకృతితో ముడిపడినవే. అంతెందుకు మనం పీల్చేగాలి, నీరు, వాతావరణం మొత్తం కలుషితం కావడానికి మానవుడే అంటే మనమే కారణం. మానవ తప్పిదాల కారణంగా లేదా విధ్వంసం కారణంగా జీవజాతుల మనుగడ కూడా ప్రశ్నార్థకం అయింది. వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. జీవరాశుల్లో, వనరుల్లో, భూమి మీద సకల స్రుష్టిలోనే సమతౌల్యం దెబ్బతిని జీవవైవిధ్యం సర్వనాశనమై నశించిపోతోంది. జీవ వైవిధ్యంపై ప్రజలలో అవగాహనను పెంచటానికి ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా మే22న ‘అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని’ జరుపు కోవాలని నిర్ణయించింది. ప్రతి ఏటా ఒక థీమ్ తో ప్రకృతి పరిరక్షణ, జీవ వైవిధ్యం వంటి అంశాలపై ప్రజల్లో విస్త్రుత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. కానీ, అది తత్ దినంలా మారి పోయింది.|EDITORIALS

భారతీయ సంస్కృతిలో భాగంగానే చెట్టు, చేమ, పశుపక్ష్యాదులను పూజించటం జరుగుతోంది. జీవజాతులు వివిధ రకాల సేవలను, ప్రయోజనాలను మానవ జాతికి, పర్యావరణానికి అందిస్తున్నాయి. పెంపుడు జంతువులు మనుషులకు చేదోడుగా ఉంటాయి. మనుషులతో మమేకమై జీవిస్తున్నాయి. ఇతర జంతుజాతులు కూడా ఒకదానిని ఒకటి ఆహారంగా తీసుకునే లక్షణం కారణంగా ఆయా జీవరాశుల వైవిధ్యం కూడా సమతౌల్యం అవుతున్నది. జీవ జాతుల జీవన క్రియల్లో విడుదల అయ్యే వ్యర్థాలు కూడా భూసారానికి ఉపయోగపడే విశిష్టత ప్రకృతిలోనే ఉండటం విశేషం. ఫలాలు, ఔషధ మొక్కలు, ఆహారాన్నిచ్చే మొక్కలు, వనరులు ఎంత అద్భుతమైనదీ స్రుష్టి. మానవ ఆహారం మొత్తం ప్రకృతి మనకు ఇస్తుంది. జీవవైవిధ్యంలో అత్యంత ప్రయోజనకరమైన జంతువ ఆవు. ఆవు పాలు, పేడ, మూత్రం, నెయ్యి ప్రకృతి పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నది. ఆవును పూజించే సంస్కారం బహుషా ఇందుకే ఏర్పడిందేమో.|EDITORIALS

పెరుగుతున్న భూతాపం, భూవ్మిూద నివశిస్తున్న సకల జీవరాశుల మనుగడను తీవ్ర సంక్షోభానికి దారి తీస్తున్నది. అందుకే ముందు ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. కాలుష్యాన్ని నివారించాలి. వాతావరణ సమతౌల్యాన్ని పాటించాలి. మనం కేవలం కొంత కాలం జీవించిపోవడానికి మాత్రమే ఈ భూమ్మీద జన్మించాం. మనకంటే ముందు తరాలు, మన తర్వాత తరాలు కూడా ఉంటాయి. మన ముందు తరాలు ప్రకృతిని కాపాడి మనకిచ్చారు కాబట్టే ఇవ్వాళ మనం బతికి బట్టకడుతున్నాం. అలాగే ఇంతకంటే మెరుగైన ప్రకృతిని అంటే జీవించే అవకాశాలను మనం మన తర్వాత తరాలకు ఇవ్వాలి. నిజానికి మనం ఇవ్వాళ మన పిల్లలకు సంపాదించి ఇస్తున్న ఆస్తుల కంటే కూడా పవిత్రమైన మెరుగైన ప్రకృతిని రక్షించి అందించడమే అన్నింటికంటే ముఖ్యం. జంతువులేవీ మనుషుల్లా ఆస్తులను కూడబెట్టడం లేదు. ఆలోచనలో, మాటలో తప్ప మనం జంతువులకంటే భిన్నమేమీ కాము. కానీ స్వార్థంతో, నిర్లక్ష్యంతో నీడనిచ్చే చెట్టునే నరక్కుంటున్నట్లుగా మనకు అన్నీ ఇచ్చే ప్రకృతిని, ఈ స్రుష్టిని సర్వనాశనం చేసుకుంటున్నాం. అలాగే మన భివిష్యత్తును కూడా.|EDITORIALS

Latest News

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News