Monday, July 27, 2026
26.4 C
Hyderabad

యుద్ధం మొదలైంది!

యుద్ధతంత్రాలు అనేకం. రక్తపు చుక్క నేల రాలకుండా, ఒక్క సైనికుడు నేలకొరగకుండా కూడా యుద్ధాలు గెలవవచ్చు. యుద్ధమంటే నేరుగా పోరాడటమొక్కటే కాదు. శతృవును దిగ్బంధనం చేయడం కూడా యుద్ధంలో భాగమే. అన్ని విధాలుగా కట్టడి చేసి, ఊపిరాడకుండా చేసి, లొంగదీసుకోవడం కూడా యుద్ధనీతే. ఇప్పుడు ఇండియా అదే చేస్తోంది. పాక్‌ మాత్రం నిద్రలేని రాత్రులు గడుపుతోంది. ప్రపంచ దేశాలు నమ్మలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. నిజంగానే యుద్ధం జరిగితే పాక్ పక్షాన నిలబడానికి ఒక్కదేశం కూడా వచ్చే పరిస్థితి కనుచూపు మేరలో కానరావడం లేదు.

ఇప్పటికే అనేక రకాలుగా భారత్‌ పాక్‌ను ముప్పుతిప్పలు పెడుతోంది. పహల్గాం దాడి జరిగి 15 రోజులు గడిచాయి. పాక్ పై చర్యలేవని కొందరు ప్రశ్నిస్తున్నారు. వ్యూహమేదని మరికొందరు నిలదీస్తున్నారు. యుద్ధాన్ని ఎప్పుడూ ఒకవైపు నుండే చూడొద్దు. యుద్ధం ఫలితాలు, లాభనష్టాలు ఇరువైపులా కొద్ది తేడాతో సమానంగానే ఉంటాయి. కాబట్టి యుద్ధ భీతిని గొలిపి, దాదాపు యుద్ధం లేకుండానే శత్రువును లొంగదీసుకోవాలి. సామ, భేద, దాన, దండోపాయాలు అన్నవి యుద్ధంలో బాగా వాడే విధానాలు. మొదటి మూడు పద్ధతులు విఫలమైన తరవాతే నాలుగోదైన దండోపాయం చేపట్టాలి. రావణుడు యుద్ధానికి సిద్ధమైన తరుణంలోనూ అతడి పట్టపు మహిషి మండోదరి అడ్డుపడి సామ, భేద, దాన, దండోపాయలను వివరిస్తుంది. పాక్‌ కూడా ఉగ్రవాదాన్ని భారత్ పై ఎగదోసే ప్రయత్నం నుంచి బయటపడి, తన శక్తిని తెలుసుకోవాలి. తన యుక్తిని ప్రదర్శించాలి. అన్నింటికంటే ముందు పాక్ అఖండ భారత్‌ నుంచి విడివడిన చిన్న ముక్కనని గుర్తించాలి. జ్ఞానోదయం చేసుకోవాలి. అప్పుడే పాక్‌ ప్రపంచ దేశాల్లో మనగలుగుతుంది. కానీ పాక్ పాలకులు భారత్ లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ, వేడుక చేసుకుంటూ, తమదేశ ప్రజలను మభ్య పెడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు.

ఇప్పుడు పాక్ పాపం పండింది. పహల్గాం దాడి తరవాత ఇప్పుడు భారత్‌ ఉచ్చుకు చిక్కి గిలగిలా కొట్టుకుంటోంది. ఇప్పటికే పాక్‌ యుద్ధ భయంతో సైన్యాన్ని మొహరించింది. ఉగ్రవాద శిబిరాలను ఖాళీ చేయించింది. గగనతలంపై ఆంక్షలు విధిచడంతో పాక్‌ ముప్పు తిప్పలు పడుతోంది. అసలే ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగా సాగుతున్న వేళ నానా ఇక్కట్లు పడుతోంది. మరోవైపు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలపడంతో పాక్ నీటి కోసం అల్లాడుతున్నది. మరోవైపు ఐక్యరాజ్య సమితిలో కూడా తాజాగా పాక్‌కు చుక్కెదురైంది. అంతర్జాతీయంగా కూడా భారత్‌ బలమైన మద్దతును కూడగట్టింది. పాక్‌ను దెబ్బతీస్తున్న ఈ చర్యలన్నింటినీ యుద్ధంలో భాగంగానే చూడాలి. ఇలా భారత్ పన్నిన ఈ పన్నాగాలతో అసలు యుద్ధానికి దిగలేని దుస్థితికి పాక్ చేరుకుంది.

నిజానికి 370 ఆర్టికల్‌ రద్దు తరవాత కశ్మీర్‌లో మళ్లీ ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్నాయి. పాఠశాలలు, కళాశాలలు కళకళలాడుతున్నాయి. విద్యా వాతావరణం మళ్లీ చిగురించింది. నిర్మాణ, పర్యాటక, అభివృద్ధి కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. ప్రజాస్వామ్యం వికిసిస్తోంది. యువత స్వయం ఉపాధితో మళ్లీ శక్తిమంతమవుతోంది. పర్యాటకులు వెల్లువెత్తుతున్నారు. ప్రజల ఆదాయాలు గణనీయంగా పెరుగు తున్నాయి. ఈ దశలో పహల్గాం ఉగ్రదాడి కశ్మీర్ ని కకావికలం చేసింది. కశ్మీరీలనే కాదు, యావత్ భారతావనిని నివ్వెరపరచింది. అందుకే పాక్ పహల్గాం ఉగ్రదాడిని ఆసేతు హిమాచలం ఖండకండాలుగా ఖండించింది. అన్ని పార్టీలు సైతం రాజకీయాలకతీతంగా భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది. ఈ క్రమంలో తీసుకున్న చర్యల వల్లే ఇప్పుడు పాక్‌ ఏకాకి అయింది. పాక్ కి ఇప్పుడు చైనా కూడా బహిరంగంగా మద్దతు ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది.

పహల్గాం ఉగ్రదాడి ప్రతి భారతీయుని హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది. ప్రతి భారతీయుని రక్తం మరిగిపోతోంది. పాక్‌ను తుదముట్టించాలని ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడు. అందుకే పహల్గాం ఘటనపై తక్షణమే ప్రతీకార చర్యలు చేపట్టాలనే డిమాండ్లు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. అయితే పాక్ ను దెబ్బకొట్టడం ఎలా? దెబ్బకొడితే అబ్బా అనాల్సిందే. పాక్ ను మళ్ళీ కోలుకోకుండా చేయాల్సిందే. అందుకే గత అనుభవాలను, వర్తమాన సమీకరణాలను, భవిష్యత్తు అవసరాలను సమీక్షించుకుని అడుగు వేయాలి.

అగ్ర రాజ్యాలైన అమెరికా, రష్యాలు సైతం మద్దతునిస్తున్నాయి. గల్ఫ్‌ దేశాలు పాక్‌ను నమ్మే స్థితిలో లేవు. పాక్ చుట్టుముట్టున్న దేశాలు మనకు అండగా నిలుస్తున్నాయి. ఈ దశలో పహల్గాం దాడులకు ప్రతీకారంగా ఎప్పుడు ఎలా ఎలాంటి చర్య తీసుకోవాలనే విషయమై సైనిక దళాలకు ప్రధానమంత్రి సంపూర్ణ స్వేచ్ఛనిచ్చినట్టు ప్రకటించారు. ఇక ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వెనకా యుద్ధ తంత్రం ఇమిడి ఉందని భావించాలి. అందుకే పాకిస్తాన్ ప్రతి చర్యా మేకపోతు గాంభీర్యంలా, కవ్వింపుగా ఉంటున్నాయి. భయంతో చస్తున్న పాక్‌ నేతలు ఆ భయాన్ని కప్పిపుచ్చుకుంటూ, అనవసర ప్రేలాపనలు పేలుతున్నారు. ఇదంతా అక్కడి ప్రజలకు కూడా బాగా తెలుసు. అందుకే అక్కడి పాలకులపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వస్తోంది. సైనికాధికారులు, సైనికుల్లోనూ వ్యతిరేకత పెల్లుబికుతోంది. అందుకే అనేక మంది రాజీనామాలు చేస్తున్నారు. పాక్ పై భారత్ దాడికంటే ముందే పాక్ లో అంతర్యుద్ధం వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉండటమే కాదు. మనమంతా అండగా నిలవాలి. మరిన్ని త్యాగాలకు సిద్ధంగా ఉండాలి.

Latest News

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

జూలై 27, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి త్రయోదశి మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం మూల ఉదయం 11.00 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం వైధృతి రాత్రి 12.18 వరకు ఉపరి విస్కమ్బ కరణం తైతుల మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి...

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News