Thursday, September 17, 2026
25.5 C
Hyderabad

ఎడిటోరియల్: 09.03.2025

పార్లమెంటు ముందుకు పలు కీలక సమస్యలు!

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల రెండో సెషన్‌ సోమవారం నుంచి జరుగనున్నది. ఈ సమావేశంలోనే పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ప్రధానంగా జనగణన, అందులోనే కులగణన చేపట్టాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. జనగణన చేపట్టేందుకు ఇప్పటికే అధికార బిజెపి సానుకూల సంకేతాలు ఇచ్చింది. అయితే కులగణకు మాత్రం ససేమిరా అంటోంది. దేశంలో కులచిచ్చు రగల్చడం సరికాదని బిజెపి వాదిస్తోంది. నిజానికి దేశంలో ఇంకా కుల నిచ్చెనమెట్ల వ్యవస్థే వేళ్ళూనుకొని ఉంది. కుల, మత ప్రాతిపదికన ఓట్లు, సీట్లు, పదవులు, చదువులు, ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు అసలు కులమే లేదు. ఉన్నా కులాల కుంపట్లు అంటూ వదిలేయడం ఇంకెంత కాలం? ఇది సమంజసమేనా!? సుదీర్ఘ కాలంగా జనాభా తక్కువ ఉన్న కొన్ని కులాలే ఎక్కువ ప్రతిఫలాలు పొందుతుంటే, ఎక్కువ జనాభా ఉన్న తక్కువ కులాల పరిస్థితి ఏంటి? కొన్నింటికే కాకుండా అన్ని కులాలకు అవకాశాలింకెప్పుడు? ఎప్పటికైనా పాలకులు పాలకులే!, పాలితులు పాలితులే? అనే పరిస్థితి ఇంకెంత కాలం? ఇవ్వాళ కుల చిచ్చులని వదిలేస్తే రేపు ఇవే చిచ్చులు, చిచ్చుబుడ్లై, బాంబులై, బద్ధలై దేశాన్నే అంతర్గత విచ్ఛిన్నానికి దారి తీయవచ్చు(?)కదా! విజ్ఞులు ఆలోచించాలి.

ఇక నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుత జనాభా ఆధారంగా నియోజకవర్గాల గణన చేస్తే తాము నష్టపోతామని దక్షిణాది రాష్టాల్రు గగ్గోలు పెడుతున్నాయి. సీట్లు తగ్గవని అంటున్న బిజెపి..ఏయే రాష్ట్రాల సీట్లు తగ్గవో స్పష్టంగా చెప్పడం లేదు. ఇప్పటికే తమిళనాడు సిఎం స్టాలిన్‌ దీనిపై యుద్ధమే ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాల సిఎంలకు లేఖలు రాశారు. ఉత్తరాదికంటే దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గిన జనాభా కారణంగా నియోజకవర్గాల కుదింపు కుట్రలు జరుగు తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి కూడా ఇదే విషయాన్ని సమర్ధిస్తున్నారు. సీట్ల తగ్గింపు జరగదంటున్న కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి మాటల్లోనూ స్పష్టత లేదు. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో ఇదే విపక్షాలకు ప్రధాన ఎజెండా కానుంది. సాధారణంగా లోక్‌సభ, శాసనసభల నియోజక వర్గాల సంఖ్య జనాభా ప్రాతిపదికన నిర్ణయిస్తారు. దేశంలో భిన్నత్వాన్ని, ప్రజాస్వామిక స్ఫూర్తిని చాటేలా చట్టసభల్లో అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం లభించేలా సీట్ల కేటాయింపు ఉంటుంది. అన్ని వర్గాలకు కూడా సరైన ప్రాతినిధ్యం దక్కాలంటే జన, కుల గణన కూడా తప్పనిసరి.

జనగణన, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు, ఉమ్మడి పౌరస్మృతి వంటివి రానున్న ఒకటి రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని బిజెపి ఆలోచిస్తోంది. ఆ తరవాత జమిలి ఎన్నికలకు వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జమిలి జరిపి తీరుతామన్న పట్టుదలలో మోడీ ప్రభుత్వం ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతమని విపక్షాలు వాదిస్తున్నాయి. జమిలిపై పట్టులుగా ఎవరి లెక్కలు వారికున్నాయి. అయితే తరచూ ఎన్నికల వల్ల సమయం వృధా, దేశ ఖజానా ఖర్చే తప్ప మరేం లేదు. నిత్యం ఎన్నికలతో ప్రజా సమస్యలు కొట్టుకు పోతున్నాయి.
ప్రధానంగా జమిలికి ముందే జనాభా గణన జరగాలి. అందులో కుల గణన ఉండి తీరాలి. ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి రావాలి. ఒకే దేశం, ఒకే చట్టం అమల్లోకి రావాలి. జాతి, మత, కుల, ప్రాంత, రాష్ట్రాలకతీతంగా పెరుగుతున్న జనాభాను కట్టడి చేయాలి. నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగుతున్న అనుమానాలను తెరదించాలి. పనిలోపనిగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిన గవర్నర్‌ వ్యవస్థతో పాటు శాసన మండలులు, కార్పొరేషన్ల చైర్మన్లు వంటి వాటిని శాశ్వతంగా ఎత్తేస్తే మంచిది.

ఇక చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాన్ని ఆమోదించారు. దీనికి జనగణను లంకె వేశారు. 2023లోనే ఈ బిల్లు 106వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టంగా మారింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం జనగణన పూర్తయిన వెంటనే దాన్ని అమల్లోకి తీసుకుని వస్తామని హావిూ ఇచ్చింది. ఆ మేరకు చట్టంలో కూడా పొందుపరిచింది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలులోకి రావాలంటే కచ్చితంగా జన, కుల గణన జరిగితీరాలి. అప్పుడే మహిళల దశాబ్దాల కల సాకారమవుతుంది. చట్ట సభల్లో 50శాతం అందాల్సిన మహిళలకు కనీసం 33శాతం రిజర్వేషన్లు అయినా దక్కుతాయి. మరి ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఏం తేలనుందనేదానిపై దేశమంతా ఎదురుచూస్తున్నది. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Latest News

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News