Wednesday, September 16, 2026
27.1 C
Hyderabad

రచ్చకు ముందే చర్చలు!

అడుగు ఎఫెక్ట్

ఎమ్మెల్యేలతో భేటీలు!!

-తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పరిణామాలపై ఎఐసిసి సీరియస్

-నష్ట నివారణకు నడుం బిగించాలని అధిష్ఠానం ఆదేశం

-స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయానికి దిశానిర్దేశం

-రంగంలోకి దిగిన సీఎం, పిసిసి, ఎఐసిసి పరిశీలకురాలు

-రెబెల్స్ తోపాటు ఎమ్మెల్యేలందరితో నేడు రేవంత్ భేటీ

-నాలుగు గ్రూపులుగా ఎమ్మెల్యేలు

– ముగ్గురు కీలక నేతల చర్చలు

– ఎమ్మెల్యేలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు

– మంత్రులు-ఎమ్మెల్యేల మధ్య సమన్వయం

– ప్రభుత్వ పథకాలపై ప్రజల్లోకి విస్తృత ప్రచారం

– స్థానిక ఫలితాలను బట్టే.. ఎమ్మెల్యేలకు ప్రాధాన్యతలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో నష్ట నివారణకు ఓ ‘అడుగు’ పడింది. ‘అడుగు’లో ఫిబ్రవరి 3న ‘‘తిరుగుబాటా? తిరుగుబావుటా? టార్గెట్ ఎవరు? రేవంతా? పొంగులేటా?’’, ఫిబ్రవరి 4న ‘‘మంత్రివర్గమా? మా గోడు వినుమా..! ఏడాది దాటింది.. ఏమీ చేయలేకపోతున్నామయ్యా!’’ ఇదీ ఎమ్మెల్యేల మనోగతం’’ అనే శీర్షికలతో తెలంగాణలో ప్రస్తుత పరిణామాలు, ఎమ్మెల్యేల సమస్యలు, పరిష్కారాలతో కూడిన సమాచారంతో అడుగు డిజిటల్ మీడియా ఎక్స్లూజివ్ గా అందించిన వరస కథనాలకి అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రభుత్వం స్పందించింది. అంతర్గత సవరింపులకు, సర్దుబాట్లకు సమాలోచన చేస్తున్నది. అధిష్ఠానం దిశా నిర్దేశం మేరకు రెబెల్స్ తో పాటు ఎమ్మెల్యేందరితోనూ గురువారం సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలకు నిధులు, విధులు అప్పగిస్తూనే, వచ్చే స్థానిక ఎన్నికలపై ఫోకస్ పెట్టనున్నారు.

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ పరిణామాలపై ఎఐసిసి సీరియస్ అయిందా? ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశం-అసంతృప్తి నేపథ్యంలో ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గే కస్సుబుస్సులాడారా? ఎట్టి పరిస్థితుల్లోనూ వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని రాహుల్ రఫాడించారా? ఈ ఆదేశాలు, దిశానిర్దేశాలు ఎలా ఉన్నా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎఐసిసి నుంచి రాష్ట్ర పరిశీలకురాలు దీపా దాస్ మున్షీలు రంగంలోకి దిగారు. హైదరాబాద్ లో ప్రత్యేకంగా సమావేశమైన ఆ 8 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అలాగే మిగతా పార్టీ ఎమెల్యేలందరినీ నాలుగు గ్రూపులుగా విభజించి, ఒక్కో గ్రూపుతో ముగ్గురు ప్రత్యేక నేతలు భేటీ కానున్నారు. అనంతరం వారితో సీఎం సమావేశమై అందరితోనూ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. ఎమ్మెల్యేల సమస్యలు తెలుసుకుని అందుకు తగిన విధంగా నిధులు, విధులు, మంత్రులతో సమన్వయం, సీఎంగా తనతో తరచూ కలిసే అవకాశాలపై రేవంత్ చర్చించనున్నారు.

ముందుగా ఆ 8 మందితోనే భేటీ
ముందుగా ప్రత్యేకంగా సమావేశమైన ఆ 8మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పెద్దలు భేటీ కానున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఒక హోటల్ లో 8 మంది ఎమ్మెల్యేలు డిన్నర్ కు కలిశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేలుగా గెలిచి ఏడాది గడిచినప్పటికీ, ఏమీ చేయలేకపోతున్నామని వాపోయారు. సీఎం అపాయింట్ మెంట్ దొరకడం లేదని, మంత్రులు పట్టించుకోవడం లేదని, నియోజకవర్గంలో ప్రజలు తిరుబాటు చేసే పరిస్థితులు వచ్చాయని వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. భేటీ అయిన వారిలో అనిరుధ్ రెడ్డి (జడ్చర్ల), భూపతిరెడ్డి (నిజామాబాద్ రూరల్), యెన్నం శ్రీనివాస్ రెడ్డి (మహబూబ్ నగర్), మురళీనాయక్ (మహబూబాబాద్), కూచకుళ్ళ దామోదర్ రెడ్డి (నాగర్ కర్నూలు), సంజీవరెడ్డి(నారాయణ్ ఖేడ్), దొంతి మాధవరెడ్డి (నర్సంపేట), బీర్ల అయిలయ్య (ఆలేరు) ఉన్నారు. వారు ప్రత్యేకంగా సమావేశం ఎందుకు కావాల్సి వచ్చింది? మీడియాతో ఎందుకు మాట్లాడారు? వారి సమస్యలు ఏంటి? వారి పరిష్కారాలేంటి? అనే అంశాలపై ఓ క్లారిటీకి రానున్నారు.

ఎమ్మెల్యేలందరితోనూ సమావేశం
అనంతరం మంత్రులను కలుపుకుని, కాంగ్రెస్ పార్టీ మిగతా ఎమ్మెల్యేందరితోనూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎఐసిసి నుంచి రాష్ట్ర పరిశీలకురాలు దీపా దాస్ మున్షీలు సమావేశం కానున్నారు. వేర్వేరుగా ఎమ్మెల్యేల సమస్యలేంటి? ఉమ్మడిగా ఏమేమి ఉన్నాయి? వాటి పరిష్కార మార్గాలేంటి? వంటి అంశాలను చర్చించనున్నారు.

ఎమ్మెల్యేలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు
నియోజకవర్గాల పురోగతికి ప్రత్యేకంగా ఎమ్మెల్యేలకు నిధులు ఇచ్చే విషయాన్ని ఈ సందర్భంగా ప్రకటించనున్నారు. కనీసం రూ.50 నుంచి రూ.100 కోట్ల చొప్పున ఎమ్మెల్యేకు ఇచ్చే విషయమై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. శాఖల వారీగా వచ్చే నిధులు, రొటీన్ నిధులపై కూడా ఎమ్మెల్యేలకు సరైన అవగాహన కల్పించి, దిశానిర్దేశం ఇవ్వనున్నట్లు తెలిసింది.

మంత్రులు-ఎమ్మెల్యేల మధ్య సమన్వయం
ఇదిలావుండగా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సరైన సమన్వయం కుదిర్చే విధంగా ఈ సమావేశం సాగనుంది. మంత్రులు… ఎమ్మెల్యేలకు తగిన గౌరవం ఇవ్వాలని, వారు తీసుకువచ్చే సమస్యలపై సానుకూలంగా స్పందించాలని, ఒకవేళ ఏమైనా సమస్యలు ఉంటే వారికి స్పష్టతనివ్వాలని సూచించనున్నారు. ప్రజా పనులపై వెంటనే స్పందించాలని మంత్రులను ఆదేశించనున్నారు. సమన్వయంతో కలిసికట్టుగా పని చేసే విధంగా విష్పష్టత రానుంది.

ప్రభుత్వ పథకాలపై ప్రజల్లోకి విస్త్రుత ప్రచారం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని, ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలో నేరుగా ప్రజలను కలిసే విధంగా కార్యక్రమాలు రూపొందించుకుని, ప్రభుత్వ పథకాల అమలును వారికి వివరించాలని చెప్పనున్నారు. అధికారులను, ఎమ్మెల్యేలను మంత్రులు కలుపుకుని పోవాలని ఆదేశించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నదని, మిగతా అన్ని హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని ప్రజలకు వివరించాలని ఆదేశించనున్నారు. రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా నిధులు రైతుల ఖాతాల్లో పడుతున్న విషయాలను కూడా ప్రజలకు వివరించాలని నిర్ణయించారు.

స్థానిక ఫలితాలను బట్టే.. ఎమ్మెల్యేలకు ప్రాధాన్యతలు
రానున్న స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం, పార్టీ అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు సీఎం చెప్పనున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచే విధంగా సంసిద్ధండా ఉండాలి. ఈసారి స్థానిక ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం లభించనుంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలి. ఆ బాధ్యతలు జిల్లాల ఇన్ చార్జీ మంత్రులు, ఎమ్మెల్యేలదేనని, స్థానిక ఫలితాలను బట్టి, ఎమ్మెల్యేలకు ప్రాధాన్యతులుంటాయని స్పష్టం చేయనున్నారు.

Latest News

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News