Friday, July 31, 2026
24.6 C
Hyderabad

కొంప ముంచిన కొబ్బరి కాయ!

దిగి వచ్చిన ‘ కొండ ‘!
అనుయాయులే అండ!!
కార్మిక భవన నిర్మాణం వైపు అడుగులు
నష్ట నివారణకై చర్చలు

అడసు తొక్కనేల… కాలు కడగనేల… అనేది సామెత. కొండా దంపతుల విషయంలో ఇది మరోసారి రుజువైంది. అపారమైన రాజకీయ అనుభవం, సుదీర్ఘ పరిపాలన దక్షత, చిన్న పొరపాటుతో బూడిదలో పోసిన పన్నీరు అయ్యే పరిస్థితికి దారితీసింది. ఊరక(మౌనంగా)నే ఉంటే ఊబీ లోకి కూరుకుపోయే స్థాయికి చేర్చింది. అయితే రచ్చ రచ్చ అయిన ఈ మొత్తం వ్యవహారం నుంచి ఏకకాలంలో బయట పడాలంటే ఏమి చేయాలి? అదే స్థలంలో కార్మిక భవనం తిరిగి కట్టడం తప్ప వేరే దారే లేదని అంతర్గత చర్చల్లోనూ తేలిపోయింది. సరిగ్గా ఇప్పుడు కొండా దంపతులు అదే ఆలోచిస్తున్నారు. కార్మిక భవన నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నారు.

కొబ్బరి కాయే కదా! అని కొడితే కొంప ముంచింది. ఉన్నది ఊడే దాకా తెచ్చింది. ఉప్పు నిప్పులా ఉండే ప్రతిపక్షాలను ఏకం చేసింది. ప్రజా, కార్మిక సంఘాలకు కలిపింది. చెల్లా చెదురైన మిల్లు కార్మిక కుటుంబాలను ఒక్కటి చేసింది. గత ప్రభుత్వంలో చేసిన పాపం, కొండా దంపతులకు పామై చుట్టుకుంది. పెద్ద ప్రజా ఉద్యమానికే దారి తీసింది. మౌనం మరింత నష్టం చేసింది. కాలం కళ్ళు తెరిపించింది. ఇప్పుడు నష్ట నివారణకు నడుము బిగించింది.

వరంగల్ అజంజాహి కార్మిక భవన స్థలంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ఏ ముహూర్తాన కొబ్బరికాయ కొట్టారో!? కానీ, అప్పటి నుంచి కొండా దంపతులపై రాజకీయంగా విమర్శలు ఎక్కువయ్యాయి. ఓ వస్త్ర వ్యాపారికి మద్దతుగా నిలిచారన్న అపవాదు మూట కట్టుకోవడమే కాక, కార్మిక వర్గానికి నష్టం చేశారన్న విమర్శలు మొదలయ్యాయి.. ప్రధాన పత్రికలు, మీడియా, సోషల్ మీడియా అన్నింటా కొండా దంపతులపై ముప్పేట దాడి జరిగింది. ఇదే సమయంలో తన రాజకీయ ప్రత్యర్థి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య రాజకీయంగా వరంగల్ తూర్పులో పుంజుకోవడం కొత్త తల నొప్పికి దారి తీసింది. స్వపక్షంలో విపక్షానికి కారణమైంది. సొంత గూటి లోనే వింత పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. పార్టీలోనే ప్రత్యర్థి వర్గం కార్మిక భవన అంశంలో విమర్శలు చేయడం, వ్యతిరేకంగా పని చేయడం కొండా మురళీధర్ రావు జీర్ణించుకోలేకపోయారు. ఓవైపు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశంపై అధిష్టానం పావులు కదుపుతుండడం, మంత్రి వర్గం నుంచి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నిష్క్రమిస్తారని మీడియా కోడై కూస్తుండడం, సొంత నియోజకవర్గంలోనే తమకు వ్యతిరేక శక్తులు పుంజుకోవడం రాజకీయంగా ఇరుకున పడినట్లయింది. ఈ దశలో తన సహజ మొండి వైఖరిని ప్రదర్శించడమా? లేక కరాఖండిగా వ్యహరించడమా? లేక యుక్తిగా, ఉపాయంగా బయట పడటమా? అని కొండా దంపతులు తమ అంతరంగికులు, అనుయాయులు, శ్రేయోభిలాషుల తో సుదీర్ఘంగా మంతనాలు జరిపారని తెలిసింది. ఈ దశలో మొండిగా ఉంటే మొదటికే మోసం రావచ్చనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయినట్లు తెలిసింది.

అన్ని విమర్శలకు చెక్
ఏక కాలంలో అన్ని విమర్శలకు చెక్ పెట్టాలని కొండా దంపతులు భావిస్తున్నట్లు సమాచారం. అలాగే నష్ట నివారణ చర్యలు చే పట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకు అనుగుణంగా నాలుగు రోజుల క్రితం ఇదే అంశంపై హైదరాబాద్ లో కొండ దంపతులు తమ ముఖ్య అనుచరులు, పలువురు కార్పొరేటర్లు ముఖ్య నేతలతో సమావేశమై చర్చించినట్లు తెలిసింది.

కార్మిక భవనం కట్టాల్సిందే!
అజంజాహి కార్మిక భవనం కూల్చామని వస్తున్న విమర్శలు, అపవాదు నుంచి బయట పడాలంటే కార్మిక భవనం కూల్చిన చోటే అన్ని హంగులతో కొత్తగా భవనాన్ని కార్మికుల కోసం కట్టించాలన్నది కొండ వర్గీయులు కరాఖండిగా తేల్చి చెప్పారని తెలిసింది. ఇదే విషయాన్ని బాస్ కొండా మురళి దృష్టికి వారు తీసుకెళ్లడంతో ఆయన కూడా కార్మిక భవనం కట్టించే విషయంలో కార్మికులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటేనే విమర్శలకు పుల్ స్టాప్ పెట్టొచ్చని ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. కార్మిక భవనం కట్టించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి.. మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో అజంజాహి కార్మిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయిస్తే బాగుంటుందని ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఈ నిర్ణయాన్ని దావోస్ పర్యటనలో ఉన్న సిఎం రాష్ట్రానికి వచ్చిన వెంటనే ఆయన దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఐతే, ఈ నిర్ణయాన్ని సాధ్యమైనంత తొందరలో అమలు చేస్తేనే సత్ఫలితం ఉంటుందన్నది సుస్పష్టమైంది.

Latest News

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News