Wednesday, July 29, 2026
23.6 C
Hyderabad

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన మార్పు ఎన్నికల సంస్కరణల ద్వారానే సాధ్యం. లేకపోతే రాజ్యాంగం అదే రూపంలోనే కొనసాగుతూనే, ప్రజాస్వామ్యం తన ఆత్మను కోల్పోయే ప్రమాదం ఉంది.

దేశంలో ఎన్నికల ప్రక్రియ “మళ్ళీ మళ్ళీ వస్తున్న ఒకే నాయకత్వం”తో ఇబ్బందీ పడుతోంది. అదే వ్యక్తులు పదేపదే ఎన్నికవుతూ వస్తున్నారు. ఈ ధోరణి కొత్త నాయకత్వ ఆగమనానికి పెద్ద అడ్డంకిగా మారింది. గణాంకాల ప్రకారం, గత కొన్ని దశాబ్దాల్లో లోక్‌సభలో తిరిగి ఎన్నికయ్యే సభ్యుల శాతం 50%కు పైగా ఉండటం గమనార్హం. దీన్ని నియంత్రించేందుకు గరిష్టంగా రెండు పదవీకాలాలకే పరిమితిని విధించడం అవసరం. అలాంటి నిబంధనలు ప్రవేశపెడితే రాజకీయాల్లో కొత్త ఆలోచనలకు మార్గం సుగమం అవుతుంది.

ఎన్నికల్లో డబ్బు ప్రవాహం, కండ, మంద బలం ప్రభావం తీవ్రంగా పెరిగింది. ఒక పార్లమెంట్ ఎన్నికలో ఒక అభ్యర్థి చేసే ఖర్చు సగటు వంద కోట్లు దాటుతున్నది. అధికారికంగా ఖర్చు పరిమితి ఉన్నప్పటికీ, అనధికారిక వ్యయాలు ఎన్నికల సంఘం నియంత్రణలో లేవు. 2019 సాధారణ ఎన్నికల్లో మొత్తం ఖర్చు రూ. 60వేల కోట్లకు పైగా జరిగినట్లు అంచనాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఖర్చులను ప్రభుత్వమే భరించే విధానం లేదా పారదర్శక ఫండింగ్ విధానాలను అమలు చేయడం అత్యవసరం.

సామాజిక న్యాయం మరో ప్రధనాంశం. దళితులు, గిరిజనులు, మహిళలు కలిపి దేశ జనాభాలో 70% వరకు ఉన్నప్పటికీ, చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం తగిన స్థాయిలో లేదు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, మహిళలకు మాత్రం పరిమిత అవకాశాలే ఉన్నాయి. కనీసం 33% మహిళా రిజర్వేషన్ అమలు చేయడమే కాకుండా, వెనుకబడిన వర్గాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించే దిశగా చర్చ, చర్యలు జరగాలి.

ఒకే అభ్యర్థి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం అనే వ్యవహారం ప్రజాధనం వృథా చేయడమే కాకుండా, ఉపఎన్నికలకు దారితీస్తుంది. ఒకసారి ఎన్నికైన తర్వాత ఒక సీటును వదిలేయాల్సి రావడం వల్ల, ఆ చోట మరోసారి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. అందువల్ల ఒకే వ్యక్తి ఒకే నియోజకవర్గానికి పరిమితం కావాలని చట్టపరమైన మార్పులు చేయాలి.

“ఒకే దేశం – ఒకే ఎన్నిక” విధానం ఆవశ్యం. దేశంలో తరచూ ఎన్నికలు జరుగడం వల్ల ఖర్చు పెరగడంతో పాటు పాలనపై ప్రభావం పడుతోంది. కేంద్రం, రాష్ట్రాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం వల్ల ఖజానాపై భారం తగ్గుతుంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు, రాజకీయ విభేదాలు ఉన్నాయి. అయినప్పటికీ, దీన్ని అమలు చేసే స్పష్టమైన ప్రణాళిక అవసరం.

ఓటరు జాబితా లోపాలు, దొంగ ఓట్లు పెద్ద సమస్యగా మారాయి. దేశవ్యాప్తంగా ఓటర్ లిస్టుల్లో లోపాలు, ప్రజాస్వామ్య నిష్పాక్షికతకు తీవ్ర భంగం కలిగిస్తున్నాయి. ఓటరు జాబితాను నిరంతరం నవీకరించడం, సాంకేతికత ఆధారంగా గుర్తింపు వ్యవస్థలను బలోపేతం చేయడం అత్యవసరం. ప్రతి ఓటరు తన నివాస ప్రదేశంలోనే ఓటు వేయగల విధంగా చట్టపరమైన స్పష్టత అవసరం.

ప్రజాప్రతినిధుల జీతభత్యాలు, పెన్షన్లు కూడా సమస్యే. ప్రస్తుతం ఒక ప్రజాప్రతినిధి ఒక్కసారే ఎన్నికైనా జీవితకాలం పెన్షన్ పొందే అవకాశం ఉంది. కొందరు అసెంబ్లీ, పార్లమెంట్ రెండు స్థాయిల్లో ఎన్నికైతే, రెండు పెన్షన్లు కూడా పొందుతున్నారు. ఈ విధానాన్ని వెంటనే పన: సమీక్షించాలి. పనితీరు ఆధారంగా సౌకర్యాలు ఉండే విధంగా మార్పులు చేయాలి.

ప్రజల భాగస్వామ్యం. ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీల మధ్య పోటీగా, అదేదో నేతల వ్యవహారంగా మారిపోయాయి. సామాన్య ప్రజలకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి, రాజకీయాల్లో ప్రవేశించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అవసరమైతే ప్రత్యేక నిబంధనలు లేదా ప్రోత్సాహకాలు ప్రవేశపెట్టి వారిని ప్రోత్సహించాలి.

ఎన్నికల సంస్కరణలు కేవలం ఒక రాజకీయ పార్టీ లేదా నాయకుడి బాధ్యత కాదు. ఇది దేశవ్యాప్తంగా చర్చించాల్సిన అంశం. రాజ్యాంగ సవరణల నుంచి పరిపాలనా మార్పుల వరకు సమగ్ర చర్యలు అవసరం. ప్రజాస్వామ్యం బలపడాలంటే ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా, సమానత్వంతో ఉండాలి.

సీట్ల పెంపు వంటి పైపై మెరుగులతో కాకుండా, అసలు సమస్యలను పరిష్కరించే ఎన్నికల సంస్కరణల ద్వారానే భారత ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. కొత్త నాయకత్వానికి మార్గం కల్పించడం, ధనబలం ప్రభావాన్ని తగ్గించడం, సామాజిక న్యాయాన్ని సాధించడం వంటి లక్ష్యాలతో సాగితేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.

Latest News

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

జూలై 27, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి త్రయోదశి మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం మూల ఉదయం 11.00 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం వైధృతి రాత్రి 12.18 వరకు ఉపరి విస్కమ్బ కరణం తైతుల మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి...

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News