Sunday, July 26, 2026
30.8 C
Hyderabad

నిన్న హరీశ్ రావు, నేడు కేటీఆర్… మరి రేపు!?|KCR|HARISHRAO|KTR|BRS|PHONE TAPPING

తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మరిపిస్తున్నది. రోజుకో మలుపుతో రోజురోజుకు మరింత ఉత్కంఠను రేపుతోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేశారనే ఆరోపణలతో మొదలైన ఈ కేసు, ఇప్పుడు ఆ పార్టీ అగ్ర నేతల వరకూ చేరింది. ఇప్పటికే ఈ కేసుతో సంబంధమున్న పోలీసు అధికారులను, బాధితులను విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం… నిన్న మాజీ మంత్రి హరీశ్ రావును, నేడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు పిలిచింది. మరి ‘రేపు ఎవరు?’ అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. సర్వత్రా ఉత్కంఠతోపాటు ఆసక్తి రేపుతోంది.

హైదరాబాద్, జనవరి 22 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
తెలంగాణలో గత ప్రభుత్వ కాలంలో పోలీస్ విభాగాన్ని ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థులు, పార్టీ నేతలు, వ్యాపారవేత్తలు, మీడియా వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేసి, నిఘా పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇది జాతీయ, రాష్ట్ర భద్రత, శాంతి భద్రతల పేరుతో జరిగిందా? లేక పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమేనా? అనే అంశాలే దర్యాప్తులో కీలకంగా మారాయి. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం, నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేశారన్న అనుమానాలు బలపడుతున్నాయి.

ఈ కేసుతో సంబంధముందన్న ఆరోపణలతో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులను, పలువురు నేతలను, బాధితులను ‘సిట్’ విచారించింది. హరీష్ రావు నిన్నటి విచారణ ఈ కేసులో కీలక మలుపు. అప్పట్లో ఆయన కీలక మంత్రిగా ఉండటంతో, సిట్ అడిగిన ప్రశ్నలు రాజకీయ ఆదేశాల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ‘ఆ పెద్దాయన ఎవరం’టూ ప్రశ్నించినట్లు గుప్పుమంది. హరీష్ రావు తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, ఇది పూర్తిగా రాజకీయ కక్షతో కూడిన కేసని, కాంగ్రెస్ ప్రభుత్వం తమపై ప్రతీకారం తీర్చుకుంటోందని వ్యాఖ్యానించారు. అయితే, దర్యాప్తు సంస్థలు మాత్రం సాంకేతిక ఆధారాలు, అధికారుల వాంగ్మూలాల ఆధారంగా విచారిస్తున్నామని చెబుతున్నాయి.

ఇక నేడు కేటీఆర్ ను విచారిస్తుండటం ఈ కేసును ఆసక్తికరంగా మార్చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీ, మున్సిపల్ పరిపాలన వంటి కీలక శాఖలను నిర్వహించిన కేటీఆర్, ప్రభుత్వంలో రెండో అధికార కేంద్రంగా వ్యవహరించారు. ఫోన్ ట్యాపింగ్ వంటి సున్నితమైన అంశం ఆయనకు తెలియకుండా జరిగిందా? లేదా వ్యవస్థాగతంగా తీసుకున్న నిర్ణయాలా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేటీఆర్ కూడా ఈ కేసును రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ, తాము న్యాయపరంగా ఎదుర్కొంటామని ప్రకటించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ‘రేపు ఎవరు?’ అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతోంది. ‘పెద్దాయన’ చెప్పాడనే వాంగ్మూలాలు రావడాన్ని బట్టి చూస్తే, అప్పటికీ, ఇప్పటికీ బీఆర్ఎస్ లో, అప్పటి ప్రభుత్వంలోనూ కేసీఆర్ నే ‘పెద్ద సారు’, ‘పెద్దాయన’ అని సంబోధించేవారు. ఆయితే ఆ పెద్దాయన కేసీఆరేనా? అన్న చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాల నేతలు, ప్రముఖులు, సొంతపార్టీలోని పెద్దలు వగైరా దాదాపు ఆరు వేల మంది ఫోన్లు ట్యాప్ అయినట్లుగా వెల్లడవడాన్ని బట్టి, అంతటి స్థాయిలో నిఘా వ్యవస్థ పనిచేయాలంటే అత్యున్నత రాజకీయ అనుమతి అవసరమన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఆ అత్యున్నత అధికారం ఆనాడు కేసీఆరే నిర్వర్తించారు. అయితే, కేసీఆర్‌ను నేరుగా ఈ కేసుతో అనుసంధానించేలా ఇప్పటివరకు అధికారిక ప్రకటనలేవీ లేవు. అయినప్పటికీ, దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ ఎవరెవరి పాత్ర బయటపడుతుందన్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.

రాజకీయంగా ఈ కేసు కాంగ్రెస్‌కు ఒక ఆయుధంగా మారినట్టు కనిపిస్తోంది. బీఆర్‌ఎస్ పాలనలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతిన్నాయని, వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు, బీఆర్‌ఎస్ మాత్రం ఇది పూర్తిగా రాజకీయ ప్రతీకార చర్య అని, ఎన్నికల్లో ఓడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తమను టార్గెట్ చేస్తోందని విమర్శిస్తోంది. ఈ పరస్పర ఆరోపణల మధ్య, ప్రజలు మాత్రం అసలు నిజం ఏమిటన్నదానిపై స్పష్టత వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు.
న్యాయపరంగా చూస్తే, ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత సున్నితమైన విషయం. చట్టబద్ధమైన అనుమతులు, స్పష్టమైన కారణాలు లేకుండా ఫోన్లు ట్యాప్ చేయడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో వ్యక్తిగత గోప్యత హక్కును మౌలిక హక్కుగా గుర్తించింది. అలాంటి పరిస్థితిలో, ఈ కేసులో ఆరోపణలు నిజమైతే, ఇది కేవలం రాజకీయ కేసు కాకుండా, ఒక పెద్ద రాజ్యాంగ సంక్షోభంగా కూడా మారే అవకాశం ఉంది.

ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో దీర్ఘకాల ప్రభావం చూపే అంశంగా మారింది. ఇది బీఆర్‌ఎస్ నాయకత్వానికి పెద్ద సవాల్‌గా మారుతుందా? లేక కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా ఎదురుదెబ్బ అవుతుందా? అన్నది మరికొద్ది రోజుల్లోనైనా తేలుతుందా? చూడాలి మరి.

Latest News

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

యియర్ పోన్లతోటి శెవులకు శిల్లే!?|ADUGU TRENDS

కొత్త టెక్నాలజీ వచ్చిందంటే సాలు..ఇగ దానెంటే పడ్తం. గదాన్నే అనుసరిత్తం. ఏమైతాందో సూసుకోం. గసొంటిదే గీ యియర్ పోన్ల వాడకం. గదేందో సూద్దా పదండ్రి. అదే పనిగా యియర్ పోన్లను వాడేటోల్లకు గా కర్ణభేరి...

నీట్ లీకేజీ.. అంత లోకువా!?|EDITORIAL

పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే విద్యా వ్యవస్థపై నమ్మకం పోతుంది. అందువల్ల నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకే పరిమితం చేయకుండా, పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News