Sunday, September 13, 2026
26.2 C
Hyderabad

LOCAL BODIES|స్థానిక సంస్థల RESERVATIONS|రిజర్వేషన్ల ఖరారు|MAHABUBNAGAR

ERSTWHILE|ఉమ్మడి MAHABUBNAGAR|పాలమూరులో HEAT|వేడెక్కిన రాజకీయం|POLITICS

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 27 (అడుగు న్యూస్):
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో విడుదల చేయడంతో పాలమూరు జిల్లాల్లో రాజకీయ సందడి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల సంఘానికి సంకేతాలు ఇచ్చింది.

గత ప్రభుత్వ హయాంలో టీఆర్ఎస్ పార్టీ ఆధిపత్యం చెలాయించి, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని జిల్లా పరిషత్తులను తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో కీలక మంత్రులుగా వున్న నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఆ ఐదు జిల్లాలు టీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చాయి. అయితే, 2023 చివర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పరిస్థితులు మారాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పాలమూరులో తన సత్తాను చాటుకోవడానికి సిద్ధమవుతోంది.

ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలను బీసీలకు కేటాయించగా, జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ ఎస్సీకి, నారాయణపేట జిల్లా పరిషత్ ఓసీకి కేటాయించింది. ఈ మార్పుతో బీసీ వర్గాల్లో ఆనందం నెలకొనగా, స్థానికంగా రాజకీయ ఆశావహుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం తమకు అనుకూలంగా జిల్లా పరిషత్ టికెట్లు దక్కించుకోవడానికి పై నాయకత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఐదు జిల్లా పరిషత్తులలో కనీసం మూడు దక్కే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో బీసీలకు కేటాయించడంతో అక్కడ కాంగ్రెస్ బలపడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే గద్వాల, నారాయణపేటలో మాత్రం పోటీ గట్టిగానే ఉంటుందని అంచనా.

ప్రస్తుతం గ్రామాలు, పట్టణాల్లో స్థానిక నాయకులు, ఆశావహులు తమ తమ క్యాడర్ ను సమీకరించుకోవడంలో బిజీగా ఉన్నారు. జిల్లా స్థాయి నాయకత్వం ఎంపీటీసీలు, జడ్పిటీసీలు, జిల్లా పరిషత్తులతో పాటు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కిందిస్థాయి క్యాడర్ పై దృష్టి పెట్టింది. గ్రామ స్థాయిలోని క్యాడర్ తమ నాయకుల చుట్టూ తిరుగుతూ రాజకీయంగా అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు కసరత్తులు చేస్తున్నారు.

అదే సమయంలో, బీసీ రిజర్వేషన్లలో 50 శాతం స్థానాలు మహిళలకు కేటాయించనున్న నేపథ్యంలో మహిళా ఆశావహుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గ్రామ, మండల స్థాయిల్లో చురుకుగా ఉన్న మహిళా కార్యకర్తలు ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఇది బీసీ వర్గాల నుంచి కొత్త నాయకత్వాన్ని వెలికితీయడానికి దోహదపడనుంది.

ఈ పరిణామాలను పరిశీలిస్తూ రాజకీయ వర్గాలు, విశ్లేషకులు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ముందస్తు ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీకి బలమైన బీసీ ఓటు బ్యాంకును సమకూర్చుకునే వ్యూహాత్మక అడుగు వేశారని. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో బహిరంగ సభలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను ఇప్పుడు అమలులోకి తేవడం చారిత్రాత్మకమని, ఇది రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పెద్ద ప్లస్ అవుతుందని చెబుతున్నారు.

ఏదేమైనా, ఈ రిజర్వేషన్ల ఖరారుతో పాలమూరు రాజకీయం వేడెక్కింది. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో, కాంగ్రెస్ పార్టీ ఎన్ని జిల్లా పరిషత్తులను తన ఖాతాలో వేసుకుంటుందో అన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

Latest News

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

సెప్టెంబర్ 11,శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి అమావాస్య ఉదయం 08.35 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పుబ్బ పగలు 02.08 వరకు ఉపరి ఉత్తర యోగం సాధ్య రాత్రి 06.54 వరకు ఉపరి శుభ కరణం నాగవ ఉదయం 08.35 వరకు ఉపరి కింస్తుంఘ్న రాహుకాలం...

గీ సర్, గా అన్నదమ్ముల్ని కలిపింది!?|ADUGU TRENDS

అవుమల్ల.. గది నిజమేనుల్లా... పత్యేక ఓట్ల సవరింపు (సర్) 35 ఏండ్ల కింద యిడిపోయిన అన్నదమ్ముల్ని కలిపింది. గదెట్లనో మీరే సదువుండ్రి. మన తెలంగాణ లెక్కనే గా పంజాబ్ ల సర్ సవరింపులు జరుగుతున్నయి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News