Thursday, July 30, 2026
22.6 C
Hyderabad

ఇక చాలు!?|STOP

ISSUES| వి‘వాదా’లను వదిలేయండి
PANCHAYAT| పంచాయితీలు పక్కన పెట్టండి
పంచాయతీలపై దృష్టి పెట్టండి
మీ SERVICES| సేవలు పార్టీకి అవసరం
PARTY| పార్టీ కోసమే పని చేయండి
LOCAL| ‘స్థానికం’గా సత్తా చాటాలి
KONDA| కొండా దంపతులకు MEENAKSHI| మీనాక్షి హితవు
పార్టీకి కట్టుబడి పని చేస్తాం: మీనాక్షికి కొండాల సంజాయిషీ
వివరణతో కూడిన నివేదిక అందజేత
నేనే తప్పూ చేయలేదు : MINISTER| మంత్రి కొండా సురేఖ| KONDA SUREKHA
కావాలనే నన్ను రెచ్చగొడుతున్నారు : కొండా మురళి| KONDA MURALI
SUSMITHA| సుస్మిత ఆలోచనలు వంశపారంపర్యం కావచ్చు అధిష్టానం ఆదేశాల మేరకే ఎన్నికల్లో పోటీ
నేనెవరికీ భయడనంటూ MEDIA| మీడియాతో వ్యాఖ్యలు
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో కొండా దంపతుల భేటీ

మొత్తానికి కాంగ్రెస్ లో కొండా దంపతుల వివాదాలకు తెరపడిందా? ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాక పుణ్యమాని రాజీ కుదరిందా? 5వ తేదీతో ముడిపడిన సమస్య 3వ తేదీతోనే ముగిసిందా? నేను మానార్క్ ని, నేనెవరి మాటా వినను. నన్నెవరూ మోసం చేయలేరనే కొండా మురళి పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ మాట విన్నారా? కొండా దంపతులతోపాటు, వారి ప్రత్యర్థుల మధ్య సర్దుబాటు జరిగిందా? ఏం జరిగిందో కానీ, కొండా దంపతులకు భవిష్యత్ దర్శనం జరిగినట్లుంది. మీనాక్షి నటరాజన్ గట్టిగానే హెచ్చరించినట్లు తెలిసింది. ఇక చాలు! వివాదాలను వదిలేయండి. పార్టీ కోసం పని చేయండి. మిగతా సమస్యలు నాకు వదిలేయండి. నోరు అదుపులో పెట్టుకోండి. అనవసరంగా మాట్లాడొద్దు. పార్టీని ఇరకాటంలో పెట్టొద్దు. మీరు ఇరకాటంలో పడొద్దు. పని చేస్తూ పోవాలని హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో పార్టీకి కట్టుబడి పని చేస్తామని, వచ్చే స్థానిక ఎన్నికల్లో ఎవరికి అవకాశం ఇచ్చినా గెలిపించుకు వస్తామని కొండా దంపతులు మీనాక్షికి మాట ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వివరణతో కూడిన ఫిర్యాదును సంజాయిషీ రూపంలో ఇచ్చి సమస్యను సద్దుమణిగే విధంగా చూసుకున్నట్లుగా తెలుస్తున్నది. అయితే బయటకు వచ్చాక యథావిధిగా కొండా దంపతులు తగ్గేదేలే? అన్నట్లుగా కొద్దిగా తగ్గి మీడియాతో మాట్లాడారు. తమ బిడ్డ సుస్మిత పోస్టును ఆమె ఇష్టానికి వదిలేసి, ఆమె తమ వంశపారంపర్యంగా ఆలోచిస్తున్నట్లుందని ముక్తాయించారు.

హైదరాబాద్, జులై 3 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
క్రమశిక్షణ కమిటీ పరిధిలోనే తానున్నా తనను కావాలనే కొందరు రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్‌ నేత కొండా మురళి అన్నారు. పనిచేసే వాళ్ళపైనే రాళ్లు రువ్వుతారని చెప్పారు. నడిచే ఎద్దునే పొడుస్తారన్నారు. తన విషయంలో 44 ఏళ్ళుగా ఇది కొనసాగుతూనే ఉన్నదని తెలిపారు. తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధినని వెల్లడించారు. తన సతీమణి, మంత్రి కొండా సురేఖతో కలిసి ఆయన హైదరాబాద్‌ హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గ్రూప్‌ రాజకీయ పరిణామాలపై వివరించారు. తాజా పరిణామాలపై 16 పేజీల లేఖ అందించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తమపై చేసిన వ్యాఖ్యలను, పార్టీలో తన ప్రత్యర్థులు తనపై చేస్తున్న ఆరోపణలను మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ‘నేను వెనుకబడిన వర్గాల ప్రతినిధిని. ఒకరి గురించి నేను కామెంట్‌ చేయను. నాకు ప్రజాబలం ఉంది. చాలా కేసులకే నేను భయపడలేదు. నాకు భయం లేదని ముందు నుంచీ చెబుతూనే ఉన్నా’నని మరోసారి ఉద్ఘాటించారు. ‘నేను పేదల సమస్యలు పరిష్కరిస్తాను కాబట్టే జనం నా దగ్గరికి వస్తారు. పనిచేసే వారిపైనే కొందరు రాళ్లు వేస్తారు. నడిచే ఎద్దునే పొడుస్తారు. నేను ఎవరికీ భయపడేది లేదు. నాకు ఎలాంటి గ్రూపు రాజకీయాలతో సంబంధం లేదు. వరంగల్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు కాంగ్రెస్‌ వచ్చేలా చూస్తాం. పార్టీ ఎవరికి టికెట్లు ఇచ్చినా గెలిపించే బాధ్యత తీసుకుంటానని మీనాక్షి నటరాజన్‌తో చెప్పా. మా సేవల్ని పార్టీ ఉపయోగించుకోవాలని కోరాం. పార్టీకీ మీ సేవలు అవసరమని మీనాక్షీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీని బతికించడమే నా ఉద్దేశం. రాహుల్ గాంధీని ప్రధాని చేయడం నా లక్ష్యం. రేవంత్‌రెడ్డిని ఇంకో పదేండ్లు ముఖ్యమంత్రిగా చూడాలి. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు అండగా నిలుస్తా.’ అని మురళి చెప్పారు.

నేనే తప్పూ చేయలేదు : కొండా సురేఖ
తనకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నానని మంత్రి కొండా సురేఖ అన్నారు. తాను నిబంధనల ప్రకారమే పని చేస్తున్నాని చెప్పారు. తన శాఖలో ఉన్న ఫైల్స్‌ అన్నీ పరిశీలించుకోవచ్చని, మంత్రిగా ఇప్పటివరకు ఎలాంటి తప్పులు చేయలేదని వెల్లడించారు.

సుస్మిత ఆలోచన వంశపారంపర్యం కావచ్చు
తన కూతురు సుష్మితలో పారేది కొండా మురళి, కొండా సురేఖల రక్తమని, ఆమెకు తమ ఆలోచనలు వంశపారంపర్యంగా రావడంలో తప్పు లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి సురేఖ అన్నారు. ఆమె రాజకీయ ఆలోచనలను తప్పు పట్టలేమని చెప్పారు. భవిష్యత్తును ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించుకునే అధికారం ఆమెకు ఉందని, ఈ విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తామని ఆమె చెప్పారు.

మొత్తానికి మీనాక్షి నటరాజన్ జోక్యంతో కొండా దంపతులు, పార్టీ నేతల మధ్య నెలకొన్న సమస్య సద్దుమణిగింది. తాత్కాలికంగానైనా సర్దుబాటు జరిగింది. ఇరు వర్గాలను హెచ్చరించి దారికి తెచ్చింది. అయితే, పార్టీ హెచ్చరికలతో ఇరు వర్గాలు గప్ చుప్ గా ఎంత కాలం ఉంటాయన్నది వేచి చూడాలి.
…..

Latest News

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News