Saturday, July 25, 2026
22.7 C
Hyderabad

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య, సమాన అవకాశాల కోసం ఆందోళన చెందడం ఆలోచించాల్సిన విషయం. ఉద్యోగాల కొరతతో పాటు నియామకాలలో ఆలస్యం, పరీక్షల రద్దు, పేపర్ లీకేజీలు యువతలో నిరాశను మరింత పెంచుతున్నాయి.

యువత ఆగ్రహాన్ని అణచివేయడం పరిష్కారం కాదు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పడమే నిజమైన పాలనా బాధ్యత. అధికార, ప్రతిపక్షమన్న తేడా లేకుండా ప్రతి రాజకీయ శక్తి యువత భవిష్యత్తును రాజకీయ ప్రయోజనాల కంటే ఉన్నతంగా చూడాలి. పార్లమెంట్‌లో చర్చలు జరగాలి. ప్రజలకు నిజాలు తెలియాలి. తప్పు చేసినవారు ఎవ్వరైనా చట్టం ముందు జవాబుదారీగా నిలవాలి. యువత ఆక్రోశాన్ని రాజకీయ నినాదంగా కాకుండా ఒక హెచ్చరికగా గుర్తించాలి. లేకపోతే ఈ అసంతృప్తి మరింత విస్తరించి, భవిష్యత్తులో పెద్ద సామాజిక ఉద్యమాలకు దారితీసే అవకాశాన్ని విస్మరించలేం.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంటుందని ప్రతి రాజకీయ నాయకుడు చెబుతుంటాడు. కానీ అదే యువత వీధుల్లోకి వచ్చి తమ భవిష్యత్తుపై ప్రశ్నలు సంధించినప్పుడు నేతలు, అధికార యంత్రాంగం స్పందించే తీరు మాత్రం విభిన్నంగా ఉంటోంది. ఇటీవల నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వివాదం, దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు, పార్లమెంట్‌లో నెలకొన్న ప్రతిష్ఠంభన కీలక ప్రశ్నలను మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి. యువతలో పెరుగుతున్న అసహనం, అసంతృప్తిలకు కేవలం రాజకీయ సమాధానాలు సరిపోవు. వ్యవస్థాగత సంస్కరణలే శాశ్వత పరిష్కారం.

జాతీయ స్థాయిలో వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షను ప్రతి ఏడాది 24 లక్షల మంది విద్యార్థులు రాస్తున్నారు. లక్షలాది కుటుంబాల ఆశలు, సంవత్సరాల శ్రమ, కోట్లాది రూపాయల ఖర్చు ఈ ఒక్క పరీక్షపై ఆధారపడి ఉంటుంది. అలాంటి పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ కావడం కేవలం పరీక్షా నిర్వహణలో వైఫల్యం మాత్రమే కాదు. అది విద్యా వ్యవస్థపై విద్యార్థుల నమ్మకాన్ని దెబ్బతీసే ఘటన. అందుకే ఈ అంశంపై విద్యార్థుల ఆగ్రహాన్ని చిన్న సమస్యగా చూడడం సమంజసం కాదు.

పార్లమెంట్‌లో తీవ్ర చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రభుత్వం కూడా దర్యాప్తు, అరెస్టులు, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పినప్పటికీ, ప్రజల సందేహాలను నివృత్తి చేసేలా పారదర్శక వివరణ ఇవ్వాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా చర్చ జరిగేలా సహకరించడం అవసరం. నిరసన ఎంత ముఖ్యమో, చర్చ కూడా అంతే ముఖ్యం.

దేశంలో పేపర్ లీకేజీల సమస్య కొత్తది కాదు. గత పదేళ్లలో 150కు పైగా పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. యూపిఎ హయాంలోనూ లీకులు జరిగాయి. అనేక పరీక్షలు రద్దు కావడం, మళ్లీ నిర్వహించాల్సి రావడం, లక్షలాది మంది అభ్యర్థులు ఇబ్బందులు పడటం మాత్రం వాస్తవం. ప్రతి పరీక్ష రద్దు వెనుక వేలాది కుటుంబాల ఆర్థిక భారం, నెలల తరబడి చేసిన శ్రమ, మానసిక ఒత్తిడి ఉంటాయి.

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య, సమాన అవకాశాల కోసం ఆందోళన చెందడం ఆలోచించాల్సిన విషయం. అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదికల ప్రకారం యువ నిరుద్యోగం భారతదేశానికి ప్రధాన సవాల్. ఉద్యోగాల కొరతతో పాటు నియామకాలలో ఆలస్యం, పరీక్షల రద్దు, పేపర్ లీకేజీలు యువతలో నిరాశను మరింత పెంచుతున్నాయి.

జంతర్ మంతర్ లో జరిగిన విద్యార్థుల నిరసనలు కూడా ఇదే అసంతృప్తికి ప్రతిబింబం. సామాజిక మాధ్యమాల ద్వారా స్వచ్ఛందంగా సమీకరించిన వేలాది మంది యువత పాల్గొనడం, మహిళల భాగస్వామ్యం అధికంగా ఉండడం, రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యార్థులు తమ సమస్యలను వ్యక్తపరచడం కొత్త సామాజిక పరిణామం. ప్రతి నిరసన వెనుక రాజకీయ కోణం వెతకడం కంటే, ఆ నిరసనకు దారితీసిన కారణాలను అర్థం చేసుకోవడం పాలకుల బాధ్యత.

అవినీతి కూడా ఈ సంక్షోభానికి మరో మూల కారణం. ప్రశ్నాపత్రాల లీకేజీలు, నియామకాలలో అవకతవకలు, లంచగొండితనం వంటి ఘటనలు ఆయా వ్యవస్థలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. అవినీతి నిరోధక చట్టాలను మరింత సమర్థంగా అమలు చేయడం, దర్యాప్తు సంస్థలకు స్వతంత్రత కల్పించడం, వేగవంతమైన విచారణలు నిర్వహించడం, దోషులకు కఠిన శిక్షలు విధించడం అవసరం. అయితే శిక్షల విషయంలో రాజ్యాంగం, న్యాయవ్యవస్థ నిర్దేశించిన ప్రమాణాలు, మానవ హక్కుల సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు కూడా అత్యవసరం. పరీక్షల నిర్వహణలో అత్యాధునిక సాంకేతికత వినియోగం, ప్రశ్నాపత్రాల భద్రత, డిజిటల్ పర్యవేక్షణ, బాధ్యులపై వేగవంతమైన చర్యలు, పరీక్షా సంస్థల జవాబుదారీతనం పెంపు వంటి చర్యలు చేపట్టాల్సిన సమయమది. అలాగే నియామక ప్రక్రియలు నిర్ణీత కాలపట్టికలో పూర్తి చేయడం ద్వారా యువతలో నమ్మకాన్ని పునరుద్ధరించాలి.

యువత ఆగ్రహాన్ని అణచివేయడం పరిష్కారం కాదు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పడమే నిజమైన పాలనా బాధ్యత. అధికార, ప్రతిపక్షమన్న తేడా లేకుండా ప్రతి రాజకీయ శక్తి యువత భవిష్యత్తును రాజకీయ ప్రయోజనాల కంటే ఉన్నతంగా చూడాలి. పార్లమెంట్‌లో చర్చలు జరగాలి. ప్రజలకు నిజాలు తెలియాలి. తప్పు చేసినవారు ఎవ్వరైనా చట్టం ముందు జవాబుదారీగా నిలవాలి. యువత ఆక్రోశాన్ని రాజకీయ నినాదంగా కాకుండా ఒక హెచ్చరికగా గుర్తించాలి. లేకపోతే ఈ అసంతృప్తి మరింత విస్తరించి, భవిష్యత్తులో పెద్ద సామాజిక ఉద్యమాలకు దారితీసే అవకాశాన్ని విస్మరించలేం.

Latest News

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

యియర్ పోన్లతోటి శెవులకు శిల్లే!?|ADUGU TRENDS

కొత్త టెక్నాలజీ వచ్చిందంటే సాలు..ఇగ దానెంటే పడ్తం. గదాన్నే అనుసరిత్తం. ఏమైతాందో సూసుకోం. గసొంటిదే గీ యియర్ పోన్ల వాడకం. గదేందో సూద్దా పదండ్రి. అదే పనిగా యియర్ పోన్లను వాడేటోల్లకు గా కర్ణభేరి...

నీట్ లీకేజీ.. అంత లోకువా!?|EDITORIAL

పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే విద్యా వ్యవస్థపై నమ్మకం పోతుంది. అందువల్ల నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకే పరిమితం చేయకుండా, పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి...

జూలై 23, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి నవమి ఉదయం 08.27 వరకు ఉపరి దశమి నక్షత్రం విశాఖ రాత్రి తెల్ల 03.30 వరకు ఉపరి అనురాధ యోగం శుభ రాత్రి 10.06 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 08.28...

అడుగు ఎక్స్ క్లూజివ్: సీజేపీ ఆందోళన వెనక కుట్ర కోణం?|CJP|NATIONAL|ADUGU EXCLUSIVE

ప్రాణాలకు తెగించి రావాలని సందేశాలు ప్రాణత్యాగాలు చేసిన వారిని గుర్తుంచుకుంటాం సీక్రెట్ యాప్‌తో పరస్పరం సందేశాలు చేరవేత సంసద్ యాత్రపై కూపీ లాగుతున్న పోలీసులు|SAMSAD న్యూఢిల్లీ, జూలై 21 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం చేపట్టిన...

గాడ వజ్రాల వాన!?|ADUGU TRENDS

మన కాడ.. ఏ తియ్ మనకాడేంది? ఏడైనా.. శినుకంటే నీటి సుక్కే. జల్లంటే నీల్లే. అని అనుకుంటం కానీ, గాడ మాత్రం శినుకంటే వజ్రం. వానంటే వజ్రాలే!? కానీ, గా వజ్రాలను మనం...

యుద్ధ మేఘాలు ప్రపంచ శాంతికి ఆటంకాలు!?|EDITORIAL

యుద్ధం ఎప్పుడూ చివరి పరిష్కారం కాదు. ప్రతి బాంబు పేలుడు వెనుక వేలాది కుటుంబాల విషాదం ఉంటుంది. ప్రతి ఆంక్ష వెనుక లక్షలాది మంది సామాన్యుల జీవనోపాధి దెబ్బతింటుంది. కాబట్టి అమెరికా, ఇరాన్‌తో...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News