మహారాష్ట్రల బీడ్ అంబాజోగాయిల అమ్రుత్ మహోత్సవ్ వేడుకలు జర్గుతానయి. అమ్రుత్ దౌడ్ మొదలైతాంది. గండ్లకు హఠాత్తుగా ఓ 47 ఏండ్ల రమాబాయి రణవీర్ దూసుకొచ్చింది. గా మారథాన్ పరుగు పందెంల ఉరుకుడు మొదలు పెట్టింది. కాసేపటికే స్లిప్పర్ శెప్పులు తెగినయి. గయి శేత పట్టుకుంది. శీరె శింగులు అడ్డంపడ్తానయి. అయినా, ఉరుకుడు ఆపలే. ఉరుకుతూనే ఉంది. గట్ల ఉరికి ఉరికి, శివరికి గామె గా మారథాన్ ఉరుకుట్ల గెలిసింది.

గా రమాబాయికి కొన్నేండ్ల కిందటనే పెనిమిటి కాలం శేసిండు. ఇద్దరాడపిల్లలు. పదిండ్లల్ల పని శేసుకుంట గవాల్లను సదివిత్తాంది. అయితే, గీ ఉరుకుడు గురించి యిన్నది. గండ్ల గెలిత్తే పైసలొత్తయని తెల్సుకుంది. గందుకే ఎవ్వలికి శెప్పకుండ గా ఉరుకుట్ల పాల్గొన్నది. గెలిసింది. గా పోటీల పాల్గొన్నోల్లు శాలా మందికి గామె బిడ్డల వయసే ఉంది. గా ప్రైజు మనీ శిన్నదే అయినా, ఓ బిడ్డ ఫీజుకు అక్కరకొత్తదనడంతోటి గాడ ఉన్నోల్లంతా ఒక్కసారే ఉద్వేగానికి గురైండ్రు. కన్న బిడ్డల కోసం గామె సంకల్పాన్ని అభినందించిండ్రు. గీ అమ్మ పేమ ఎంతో మందికి స్ఫూర్తినిపుంతాంది.

