Friday, September 4, 2026
30.9 C
Hyderabad

భారతీయ ‘ఆత్మ’ను ఆవిష్కరిద్దామా!?|EDITORIAL

‘మహాత్మా గాంధీ ఉపాధి హామీ’ పథకాన్ని ‘బాపు గ్రామీణ్ రోజ్ గార్ యోజన’ పథకంగా మారుస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. భారతదేశంలో ఊళ్ళు, పట్టణాలు, ప్రభుత్వ పథకాలు, వీధుల పేర్లు మారుస్తూ ఉండటం ఇటీవలి కాలంలో ఒక ప్రధాన రాజకీయ, సామాజిక అంశంగా మారింది.

భారతదేశంలో పేర్ల మార్పు కొత్తేమీ కాదు. ఇంతకుముందు. 1956లో ట్రావెన్‌కోర్-కొచ్చిన్‌ను కేరళగా, 1996లో మద్రాస్ ను చెన్నైగా, 2001లో కలకత్తా ను కోల్‌కతా గా, 2011లో ఒరిస్సాను ఒడిషాగా, 2006లో పాండిచ్చేరిని పుదుచ్చేరిగా మార్చారు. 2016లో ప్రధాని అధికారిక నివాసం పేరును ‘లోక్ కళ్యాణ్ మార్గ్’గా, ‘రాజ్‌పథ్‌’ను ‘కర్తవ్య పథ్’గా, తాజాగా ప్రధాని కార్యాలయానికి ‘సేవాతీర్థ్’గా, రాష్ట్ర గవర్నర్ల నివాసాలు ‘రాజ్‌భవన్‌’లను ‘లోక్ భవన్’గా మార్చడం తెలిసిందే. ఇదే కోవలో ఉపాధి హామీ పథకానికి కూడా పేరు మార్చారు. అయితే, బీజేపీ అధికారంలోకి వచ్చాక మార్చిన పేర్లే ఎక్కువ వివాదాస్పదమవుతున్నాయి.
ఈ ప్రక్రియ కొందరికి చరిత్ర పునరుద్ధరణగా అనిపిస్తే, మరికొందరికి రాజకీయ దురుద్దేశంగా, ప్రజాధన దుర్వినియోగంగా కనిపిస్తోంది. పేరు కేవలం ఒక గుర్తింపేనా, లేక ప్రజల భావోద్వేగాలకు, చరిత్ర జ్ఞాపకాలకు, ప్రాధాన్యాలకు ప్రతీకనా? పేర్ల మార్పు సమంజసమా? నిజంగా మార్చాల్సిన అవసరం ఉందా? ఉంటే ఏ మేరకు?

దేశం సహా, రాష్ట్రాలు, ప్రాంతాలు, ఊర్లు, పట్టణాలు, గ్రామాలు, వీధులు, మనుషుల పేర్లకు భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉంటుంది. వాటన్నింటి ప్రభావం ఆయా పేర్లపై ఉంటుంది. ఆర్యులు, ముస్లింలు, బ్రిటీషర్లు మొదలైన వలస పాలనల కాలంలో, అనేక పేర్లు మార్పు జరిగింది. ఆ పేర్లు ఇప్పుడు స్థానిక సంస్కృతిని, భాషను, సంప్రదాయాలను ప్రతిబింబించవు అనే వాదన ఉంది. అలాంటి సందర్భాల్లో ప్రాచీన చరిత్రను, స్థానిక గుర్తింపును ప్రతిఫలించే పేర్లను పునరుద్ధరించడం అవసరమా? ఇది నిజంగా ప్రజల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించి, సాంస్కృతిక అవగాహనను బలపరుస్తుందా? అయితే, పేర్ల మార్పు అన్నది కేవలం రాజకీయ ప్రేరేపిత భావోద్వేగాల ఎజెంగా జరిగితే సమస్యలు తలెత్తుతాయి.
పేరు చరిత్రను ప్రతిబింబిస్తుంది. ఊరు, వీధి పేర్లు తరతరాలుగా ప్రజల జీవితాలతో ముడిపడి ఉంటాయి. పేరు ద్వారా ఆ ప్రాంత చరిత్ర, సామాజిక పరిణామాలు, సాంస్కృతిక నేపథ్యం వెల్లడవుతాయి. అలాంటి పేర్లను తరచూ మారిస్తే చరిత్రను చెరిపేయడమేనా? చరిత్రలోని తప్పులను సరిదిద్దడమే లక్ష్యమైతే, పేర్ల మార్పు కంటే చరిత్రపై అవగాహన పెంపొందించడం, విద్య ద్వారా నిజాలను ప్రజలకు తెలియజేయడం ఉత్తమ మార్గం కాదా?

ప్రభుత్వాలు తమ భావజాలానికి అనుగుణంగా పేర్లు మార్చడం ద్వారా తమ రాజకీయ అజెండాను అమలుకు ప్రయత్నిస్తుంటాయి. ఇది ప్రజాస్వామ్యంలో సహజమేనని కొందరు వాదిస్తే, మరికొందరు దీనిని అధికార దుర్వినియోగంగా చూస్తారు. ప్రజల ప్రాథమిక సమస్యలు విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక సదుపాయాలు. వీటిని విస్మరించి, పేర్ల మార్పులపై దృష్టి పెట్టడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమనే విమర్శ బలంగా వినిపిస్తోంది.

పేర్ల మార్పు పరిపాలనా వ్యయభారం. ఒక ఊరు లేదా పట్టణం పేరు మారితే, ప్రభుత్వ పత్రాలు, మ్యాపులు, బోర్డులు, రికార్డులు, డిజిటల్ డేటాబేసులు అన్నీ మార్చాల్సి వస్తుంది. దీనివల్ల భారీగా ప్రజాధనం ఖర్చవుతుంది. ఆ ఖర్చు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉపయోగపడితే మరింత ప్రయోజనకరంగా ఉంటుందన్న అభిప్రాయాలూ ఉన్నాయి. పేరు మార్పు వల్ల ప్రయోజనం లేకపోతే, ఆ వ్యయం న్యాయసమ్మతమా? ఆలోచించాలి.

సాధారణంగా ప్రభుత్వ పథకాల పేర్లు ప్రజలకు గుర్తుండేలా, ఆకర్షణీయంగా పెడతారు. అయితే ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ పథకాల పేర్లు మారితే, ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుంది. అసలు సమస్య పథకం పేరు కాదు, ఆ పథకం అమలు. పేర్లు మారుస్తూ పాత పథకాలను కొత్తవిగా చూపించడం వల్ల ప్రజలకు వాస్తవ ప్రయోజనం కలగదు. ఇదంతా ‘పేర్ల రాజకీయం’గా మాత్రమే మిగిలిపోతుంది.
అదేవిధంగా, చరిత్రను పూర్తిగా తిరస్కరించడం కూడా సరైనది కాదు. చరిత్రలో మంచి, చెడులుంటాయి. పేర్ల మార్పు ద్వారా చరిత్రను సరిదిద్దగలమనే భావన భ్రమ మాత్రమే. బదులుగా, చరిత్రను విమర్శనాత్మకంగా అధ్యయనం చేసి, ప్రజలకు అవగాహన కల్పించడమే మేలైన మార్గం.

పేర్లు మార్చడం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సమంజసమే అయినా, అది ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయం కాదు. పేర్ల మార్పు కన్నా విద్య, ఉపాధి, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి ఈ నిర్ణయాలు రాజకీయ లాభనష్టాలకంటే ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, ఆలోచనాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Latest News

తలుసుకుంటే కాందేంది? నదే శుభ్రమైంది!?|ADUGU TRENDS

గీ డిగ్రీలు సదివే పిల్లలు ఏం ఆలోశిస్తరు? ఆటా, పాటా, అల్లరి, సదువు, కెరీర్ గివే కదా? కనీ గీ పిల్లగాడు గివేవీ ఆలోసించలే.. తమ ఊరి పక్కనుండే పోతున్న నది గురించి...

కొండా కుటుంబం దారెటు!?|EDITORIAL

అనూహ్యం కాకపోయినా, అనివార్యంగా జరిగిపోయింది. పరిణామాల ఫలితాలేమైనా, కొండంత ఆశయం, తన కూతురు, తమ భవిష్యత్తు కోసం కొంత పట్టువిడుపు ప్రదర్శించి ఉంటే, కొండా సురేఖ మంత్రి పదవి నిలిచేదేమో! అయినా కొండా...

సెప్టెంబర్ 04, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం శ్రీ కృష్ణాష్టమి తిధి అష్టమి రాత్రి 11.20 వరకు ఉపరి నవమి నక్షత్రం రోహిణీ రాత్రి 11.20 వరకు ఉపరి మృగశిర యోగం హర్షణ సాయంత్రం 05.00 వరకు ఉపరి వజ్ర కరణం బాలవ పగలు 12.30 వరకు ఉపరి...

అధిష్ఠానం నిర్ణయంపై చిన్నారెడ్డి సంచలనం|CHINNA REDDY|CONGRESS

ఒక్క పోటుతో కూల్చేశారు.. పదవులపై నాకు సోకు లేదు తనకు పదవులపై ఎలాంటి ఆసక్తి, వ్యామోహం లేదని స్పష్టం చేశారు. ఎంతో కష్టపడి రాజకీయంగా ఈ స్థాయికి వచ్చానని, అయితే ఒక్క పోటుతో తనను పదవి...

నా బర్తరఫ్‌ చెల్లదు|KONDA SUREKHA|SENSATIONAL COMMENTS

ఈరోజు నాకు జరిగింది.. రేపు మీకూ జరుగుతుంది ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడండి రేవంత్‌ సర్కార్‌పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పదవి నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు....

BREAKING: కొండా సురేఖపై వేటు..చిన్నారెడ్డి ఔట్

సీఎం రేవంత్‌ నిర్ణయం! తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్లు అధికారిక నోట్‌ వెల్లడించింది. ఈ మేరకు...

కొండా సురేఖకు కేఏ పాల్ ఆహ్వానం..|KONDA SUREKHA|KA PAUL

కాంగ్రెస్‌ను వీడి ప్రజాశాంతి పార్టీలోకి రండి మంత్రి కొండా సురేఖకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బహిరంగ ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సురేఖ పార్టీ...

రాజీనామా చేయాల్సిందే.. లేదంటే బర్తరఫ్‌!|KONDA SUREKHA|RESIGN|BURTRAF

కొండా సురేఖకు అధిష్ఠానం అల్టిమేటం.. ఇంటి వద్ద నిర్మానుష్యం పార్టీ లైన్‌ దాటని అనుచరులు  తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌...

ఉద్వాసనమే!|KONDA SUREKHA|CM|REVANTH REDDY|DELHI

సురేఖను పట్టించుకోని అధిష్ఠానం ముక్తసరిగా మూడు ముక్కల్లో ఖర్గేతో మచ్చట అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ కార్యాలయంలోనే రోజంతా పడిగాపులు నిరాశతో వెనుతిరిగిన మంత్రి కొండా సురేఖ ఖర్గే, కేసీలతో రేవంత్ రెడ్డి వేర్వేరుగా భేటీలు సురేఖ వ్యవహారాన్ని...

గీ కర్ణాటక ట్రాఫిక్ కట్టాలకు గింత కథ ఉందా!?|ADUGU TRENDS

ట్రాఫిక్ కట్టాలు లేందెక్కడ? కిరాణా దుకాన్ల, రేషన్ షాపుల్ల, బ్యాంకుల్ల, బస్సుల్ల, రోడ్ల మీద, శివరాకరికి సులభ్ కాంప్లెక్సుల్ల కూడా రద్దేనాయె!? కానీ, గీ కర్ణాటకల రద్దీకి కర్ణునికి ఏదో లింకుందట సూద్దాం...

ఉగ్రమూలాలపై పాక్ కు భారత్ మరో హెచ్చరిక!?|EDITORIAL

పాకిస్తాన్ నిజంగా శాంతి కోరుకుంటే మాటలకంటే చర్యలు ముఖ్యం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకునే చర్యలు పారదర్శకంగా, నిరంతరంగా ఉండాలి. ఉగ్రవాదాన్ని ఒకప్పుడు వ్యూహాత్మక సాధనంగా చూసిన విధానాలకు స్వస్తి చెప్పి, పొరుగుదేశాలతో విశ్వాసాన్ని...

సెప్టెంబర్ 03, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి షష్ఠి రాత్రి 01.39 వరకు ఉపరి సప్తమి నక్షత్రం కృత్తిక రాత్రి 12.50 వరకు ఉపరి రోహిణి యోగం వ్యాఘాత రాత్రి 07.56 వరకు ఉపరి హర్షణ కరణం భద్ర పగలు 02.43 వరకు ఉపరి బవ రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News