Wednesday, September 2, 2026
29.2 C
Hyderabad

హైకమాండ్‌ ముందు కొండా సురేఖ బాంబ్‌..|KONDA SUREKHA|CONGRESS

రేవంత్‌పై చర్యలకు డిమాండ్‌..|CM|REVANTH REDDY

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకూ షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలంటూ డిమాండ్‌
రాష్ట్రంలో రాజగోపాల్‌రెడ్డి వార్నింగ్‌!|KOMATIREDDY RAJAGOPAL REDDY|WARNING

ఢిల్లీలోని ఇందిరా భవన్‌ వేదికగా తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. పార్టీ అంతర్గత విభేదాలు, నేతల మధ్య పరస్పర ఆరోపణలు, క్రమశిక్షణ చర్యల అంశంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టి సారించిన వేళ.. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ సమావేశం కాగా.. మంత్రి కొండా సురేఖ కూడా ఇందిరా భవన్‌కు చేరుకుని తన వాదనను అధిష్ఠానం ముందు వినిపించారు. ఇటీవల పార్టీ నేతల మధ్య చోటుచేసుకున్న పరిణామాలు, తనపై వచ్చిన ఫిర్యాదులు, కమిటీ నివేదిక తదితర అంశాలపై హైకమాండ్‌ వివరణ కోరిన నేపథ్యంలో సురేఖ తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించినట్లు తెలుస్తోంది.

‘నాపై చర్యలు తీసుకునే ముందు రేవంత్‌పై చర్యలు తీసుకోవాలి’

తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్‌రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని కొండా సురేఖ డిమాండ్‌ చేసినట్లు సమాచారం. రేవంత్‌రెడ్డి పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకుంటున్నారని, ఇలాంటి వ్యాఖ్యలు క్రమశిక్షణ చర్యల పరిధిలోకి రావా? అని ఆమె ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తనపై మాత్రమే చర్యలు తీసుకోవడం సరికాదని, పార్టీలో అందరికీ ఒకే విధమైన నిబంధనలు వర్తించాలని ఆమె స్పష్టం చేసినట్లు సమాచారం. రేవంత్‌రెడ్డిపై పలువురు మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారని సురేఖ హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

‘నాపై మాట్లాడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకూ షోకాజ్‌ ఇవ్వాలి’

తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ కోరారు. తనపై ప్రెస్‌మీట్‌లు పెట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెనుక ఎవరున్నారో తనకు తెలుసని ఆమె వ్యాఖ్యానించారు. వారి విషయంలో కూడా అధిష్ఠానం ఆలోచించాలని కోరినట్లు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో తాను చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పానని సురేఖ స్పష్టం చేశారు.

‘ఎమ్మెల్యేలతో బలవంతంగా మాట్లాడించారు’

తనపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యల వెనుక అసలు కథ వేరే ఉందని కొండా సురేఖ ఆరోపించారు. ఎమ్మెల్యేలతో తమపై బలవంతంగా మాట్లాడించారని, ఎవరూ స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడలేదని ఆమె పేర్కొన్నారు. ఫోన్‌ చేసి పిలిస్తే బలవంతంగా వెళ్లామని కొందరు ఎమ్మెల్యేలే చెబుతున్నారని ఆమె అన్నారు. అయితే, తమను వెనుక నుంచి మాట్లాడించిన వారి పేర్లు మాత్రం తాను వెల్లడించదలుచుకోలేదని చెప్పారు. ఎవరు చెప్పించారో తమకు తెలుసని సురేఖ వ్యాఖ్యానించారు.

‘రాజీనామా చేసే ప్రసక్తే లేదు’

తన పదవిపై కూడా కొండా సురేఖ కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు కాంగ్రెస్‌ అధిష్ఠానం తనను రాజీనామా చేయాలని అడగలేదని ఆమె తెలిపారు. ఒకవేళ సీఎం రేవంత్‌రెడ్డి పెడుతున్న ఒత్తిడితో అధిష్ఠానం తనను బర్తరఫ్‌ చేస్తే చేయనివ్వండి అని వ్యాఖ్యానించారు. కానీ తాను మాత్రం రాజీనామా చేయబోనని, రాజీనామా చేసే ప్రసక్తే లేదని సురేఖ తేల్చిచెప్పారు. దీంతో ఆమె వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో మరింత సంచలనంగా మారాయి.

‘మంత్రులపై ఫిర్యాదులు వస్తే ఎందుకు మాట్లాడరు?’

ఇదే సమయంలో ఇతర మంత్రులపై వచ్చిన ఆరోపణలను కూడా సురేఖ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భార్యకు సంబంధించిన కమీషన్ల ఆరోపణలపై ఫిర్యాదులు వచ్చాయని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. పలువురు మంత్రులపై కూడా అనేక ఆరోపణలు ఉన్నాయని, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వాటికి ఏం సమాధానం చెబుతారు? అని ఆమె ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కొందరు రెడ్లు మాట్లాడితే వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, బీసీ సామాజికవర్గానికి ఒక న్యాయం, ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయమా? అని ప్రశ్నించినట్లు సమాచారం.

‘నా కూతురు వ్యాఖ్యలకు నాపై చర్యలు వద్దు’

తన కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యల అంశాన్ని కూడా సురేఖ హైకమాండ్‌ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తన కుమార్తెను సీఎం రేవంత్‌రెడ్డి రెచ్చగొట్టారని, అందుకే ఆమె అలా మాట్లాడిందని సురేఖ పేర్కొన్నట్లు సమాచారం. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనపై చర్యలు తీసుకోవద్దని ఆమె కోరినట్లు తెలుస్తోంది.

రాజగోపాల్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. ‘కాంగ్రెస్‌ను ఎవడూ కబ్జా చేయలేడు’

మరోవైపు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తమ ఇంట్లోకి, పార్టీలోకి వచ్చి తమను వెళ్లగొడతామని ఎవరైనా అనుకుంటే ఊరుకోబోమని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. రాజగోపాల్‌రెడ్డి ఉండగా కాంగ్రెస్‌ పార్టీని ఎవడూ కబ్జా చేయలేడని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. నిజమైన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు కూడా పార్టీ అంతర్గత రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

హైకమాండ్‌ భరోసా.. ‘వచ్చే రెండేళ్లు ప్రజల కోసం పనిచేయాలి’

మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై హైకమాండ్‌ సంతృప్తి వ్యక్తం చేసినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. వచ్చే రెండేళ్లు పేద ప్రజల సంక్షేమం కోసం మరింతగా పనిచేయాలని కేసీ వేణుగోపాల్‌, మల్లికార్జున ఖర్గే సూచించినట్లు ఆయన వెల్లడించారు. మంత్రి కొండా సురేఖకు సంబంధించిన అంశంపై పార్టీ తరఫున ఇవ్వాల్సిన సమాచారాన్ని అధిష్ఠానానికి అందించామని, తుది నిర్ణయం మాత్రం కాంగ్రెస్‌ హైకమాండ్‌ తీసుకుంటుందని మహేష్‌కుమార్‌ గౌడ్‌ స్పష్టం చేశారు.

తుది నిర్ణయం అధిష్ఠానానిదే.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఉత్కంఠ

ఢిల్లీలో జరిగిన సమావేశాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. ఒకవైపు కొండా సురేఖ తనపై చర్యలు తీసుకోవద్దని, తనపై వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేయడం.. మరోవైపు రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అదే సమయంలో రాజగోపాల్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడం పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చింది. కమిటీ నివేదికపై హైకమాండ్‌ ఏ నిర్ణయం తీసుకుంటుంది? కొండా సురేఖపై చర్యలు ఉంటాయా? ఆమె చేసిన ఆరోపణలపై అధిష్ఠానం ఎలా స్పందిస్తుంది? రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులపై ఆమె చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి వివరణ కోరుతుంది? అన్నదానిపై తెలంగాణ కాంగ్రెస్‌ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Latest News

సిడెం సేపట్లనే బరువు తగ్గొచ్చా!?|ADUGU TRENDS

ఒగప్పుడంటే ఎండా, వానా, సలి, శేను, శెలకా, బరువు పనులు, కట్టం బతుకులు..ఇగిప్పుడంటే ఏసీలు, ప్యాన్ల కింద కుర్సీలల్ల జీతాలైపాయె. కట్టం తక్కువాయె ఒత్తిడి ఎక్కువాయె. గందుకే శానా మంది బరువులు పెరిగి,...

సర్కార్, పోలీసులు, సీజేపీకి అసలైన పరీక్ష!?|EDITORIAL

సీజేపీ గత ఆందోళనల సందర్భంగా అసాంఘిక శక్తులు చొరబడ్డాయన్న ఆరోపణలను కూడా తేలికగా తీసుకోలేం. అయితే ఖలిస్తాన్ అనుకూల శక్తులు లేదా ఇస్లామిక్ ఉగ్రవాదులు నిరసనలో చేరతారన్న వాదనలను నిర్ధారిత ఆధారాలు లేకుండా...

సెప్టెంబర్ 02, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి పంచమి ఉదయం 05.40 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం భరణి రాత్రి 02.12 వరకు ఉపరి కృత్తిక యోగం ధ్రువ రాత్రి 10.41 వరకు ఉపరి వ్యాఘాత కరణం గరజి సాయంత్రం 04.44 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఆన్ లైన్లనే మనువు… అచ్చింతలు!?|ADUGU TRENDS

పెండ్లిల్లు సొర్గంల నిర్ణయిత్తరట. ఎవలితో? ఎక్కడ? ఎప్పుడు? ఎట్ల జరగాల్నో? గాడనే తేలుత్తరట. గవాటి సంగతేమో! గనీ, గీ మద్దెల భూమ్మీద మనువులు మాత్రం మానవులే నిర్ణయిత్తాండ్రు. గా అమెరిక అధ్యచ్చుడు ట్రంపు...

చల్లని హిమాలయాల్లో విస్ఫోటక వాటర్ బాంబ్స్!|EDITORIAL

ముప్పు పర్వత ప్రాంతాలకే పరిమితం కాదు. సిక్కిం లేదా నేపాల్ హిమాలయాల్లో పెద్ద స్థాయిలో జీఎల్ఓఎఫ్ సంభవిస్తే కోసి, గండక్, తీస్తా వంటి నదుల ద్వారా వరదనీరు దిగువ మైదాన ప్రాంతాలకు చేరే...

సెప్టెంబర్ 01, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి చవితి ఉదయం 07.10 వరకు ఉపరి పంచమి నక్షత్రం అశ్విని రాత్రి 03.17 వరకు ఉపరి భరణి యోగం వృద్ధి రాత్రి 01.14 వరకు ఉపరి ధ్రువ కరణం బాలవ ఉదయం 07.12 వరకు ఉపరి కౌలవ రాహుకాలం...

ఆగస్టు 31, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం సంకట హరచతుర్థి తిధి తదియ ఉదయం 08.20 వరకు ఉపరి చవితి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.01 వరకు ఉపరి అశ్విని యోగం గండ రాత్రి 03.29 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర ఉదయం 08.20...

అమ్మ.. నాన్న… ఓ కూతురు!|KONDA FAMILY|CONGRESS|CM|REVANTH REDDY

కొండా ఫ్యామిలీ@వివాదాలు ఎందులోనూ ఇమడరు మరెందులోనూ పొసగరు ఎవరినీ అంగీకరించరు వారెవరికీ అంగీకారంగా ఉండరు వారిది ఇష్టానుసారం.. వారికి లేదు అధిష్ఠానం.. లేనేలేదు విచారం! కొండంత ప్రచారం సొంత నియోజవర్గంలోనూ పార్టీ నేతలు, కార్యకర్తలతో విభేదాలు, కేసులు రాష్ట్ర రాజకీయాల్లో ‘అమ్మ! నాన్న!! ఓ...

గుప్తుల పూర్వయుగం|ADUGU DIGITAL MEDIA|SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

సుమారు 135 సంవత్సరాల మౌర్యుల పాలన తర్వాత భారత ఉపఖండంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడి మౌర్య సామ్రాజ్య పతనానికి కారణమైంది. మౌర్యులు బ్రాహ్మణులు కారని పండితులు తిరుగుబాటు చేయడం, అవైదిక మతాలైన బౌద్ధ, జైన...

గిది శేపా.. బంగారు తునకా!?|ADUGU TRENDS

పుస్తెలమ్మైనా పులస తినాల్నన్నరు. పులస శేపకున్న గిరాకీ అసొంటిది మరి. ఏటికి ఎదురీదుతూ పులసలు దొరికే అరుదైన కాలమిది. గా పులస శేప కోసం జనం ఎగబడ్తరు. ఎంత డబ్బైనా పెట్టి కొంటరు....

నేపాల్ లో సవాల్ గా సహాయక చర్యలు!|EDITORIAL

హిమాలయ ప్రాంతాల్లో వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు దేశాలు సిద్ధంగా ఉన్నాయా? అధిక ఉష్ణోగ్రతలు, మంచు కరుగుదల, హిమనదుల అస్థిరత, కొండచరియలు వంటి పరిణామాలు భవిష్యత్‌లో ఆకస్మిక వరదల ముప్పును పెంచే అవకాశం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 05 వరకు రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా మంచి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News