సుమారు 135 సంవత్సరాల మౌర్యుల పాలన తర్వాత భారత ఉపఖండంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడి మౌర్య సామ్రాజ్య పతనానికి కారణమైంది.

మౌర్యులు బ్రాహ్మణులు కారని పండితులు తిరుగుబాటు చేయడం, అవైదిక మతాలైన బౌద్ధ, జైన మతాలూ ఆవిర్భవించడం, ప్రజలు ఆ మతాలను బాగా ఆచరించడం వల్ల ప్రజల్లో మౌర్య సామ్రాజ్యం పట్ల వ్యతిరేకత మొదలైంది. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత అశోక ధమ్మను ప్రారంభించి అహింసాయుత మార్గాన్ని ఎంచుకోవడం కొన్ని కారణాలుగా చెప్పుకోవచ్చు. క్రీ.పూ.200 నుండి క్రీ.శ.300 వరకు భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం మరియు గుప్త సామ్రాజ్య యుగం. మౌర్య అనంతర కాలంలో భారతదేశంలో అనేక స్వదేశీ మరియు విదేశీ రాజ్యాలు అవతరించాయి. వీరు రాజ్యాలను విభాగాలుగా పంచుకున్నారు.
స్వదేశీ రాజ్యాలు
1) కణ్వ రాజ్యం: మత్స్య, వాయు పురాణాల ప్రకారం వీరు కణ్వాయన గోత్రానికి చెందిన బ్రాహ్మణులు అని తెలుస్తుంది. పాటలీపుత్రము (ప్రస్తుత బీహార్ ప్రాంతం) వీరి రాజధాని. వాసుదేవ కణ్వ తొలి రాజు మరియు వంశ స్థాపకుడు. చివరి కణ్వ రాజైన సుశర్మను ఒక ఆంధ్ర రాజు అంతమొందించినట్టు పురాణాలు తెలియచేస్తున్నాయి.
2) శాతవాహన రాజ్యం: మొర్యుల పతనం తర్వాత దక్కన్ ప్రాంతం మొత్తాన్ని ఏకం చేసి ఏకచక్రాధిపత్యంగా వీరు పాలించారు. ప్రస్తుత మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ లు వీరి రాజ్యంలో భాగం. వీరికి అనేక రాజధానులు ఉన్నట్లుగా సాహిత్యం మరియు శాసనాల ద్వారా తెలుస్తుంది.
రాజధానులు: కోటిలింగాల (ప్రస్తుత జగిత్యాల, తెలంగాణ); శ్రీకాకుళం (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్); ధాన్యకటకం (గుంటూరు జిల్లాలోని అమరావతి, ఆంధ్రప్రదేశ్); ప్రతిష్టానుపురం (మహారాష్ట్ర లోని ఔరంగాబాద్).
క్రీ.పూ.225 నుండి క్రీ.శ.225 వరకు సుమారు 450 సంవత్సరాలు దక్కన్ ప్రాంతాన్ని శాతవాహన వంశంలో 30 మంది రాజులు పాలించినట్లుగా మత్స్య పురాణం తెలియచేస్తుంది.
వీరి రాజ్య స్థాపకుడు సిముఖుడు. ఇతను కోటిలింగాలను రాజధానిగా చేసుకొని పాలించినట్లు అక్కడ లభించిన నాణాలు, పురాణాలు తెలియచేస్తున్నాయి.
3) మహామేఘవర్ష వంశం: ప్రస్తుత ఒడిశా ప్రాంతంలోని ఉదయగిరి కొండల్లో ఒక జైన గుహాలయంలో ఖారవేళుడు రాసిన హతిగుంఫా శాసనం ఈ వంశం గురించి తెలియచేస్తుంది. ఈ శాసనం ప్రకారం తమ రాజధాని అయినా కళింగనగరి (ప్రస్తుత ఒడిశా ప్రాంతం) వరదల్లో ధ్వంసం అయితే ఖారవేళుడు దాన్ని పునర్నిర్మించాడని, పంట కాలువలకు మరమ్మత్తులు చేయించాడని ఈ శాసనము తెలియచేస్తుంది. ఇతను జైన మతాన్ని ఆచరించి రాణిగుంప, గణేశగుంప అనే జైన గుహాలయాలను నిర్మించి జైనులకు కానుకగా ఇచ్చాడు. దక్షిణ తమిళ రాజ్యాలైన చోళ, పాండ్య , చేరా లను ఓడించి సంపదను దోచుకున్నాడని ఇతని రెండవ శాసనం తెలియచేస్తుంది.
తమిళ రాజ్యాలు (చోళ, పాండ్య, చేరా)
దక్షిణ భారతదేశంలో తమిళ సాహిత్యం, భాషను ఆదరికిఞ్హి అభివృద్ధి చేసినందువల్ల ఈ మూడు రాజ్యాలను తమిళ రాజ్యాలు అంటారు.
1) చోళ: వీరు పాలించిన ప్రాంతం ఉత్తర తమిళనాడు. రాజధాని కావేరి పట్టణంగా ఉండేది. వీరి రాజా చిహ్నం పులి.
కరికాల చోళుడు ఈ వంశంలో గొప్పవాడు.
2) పాండ్య: వీరు దక్షిణ తమిళనాడును పాలించారు. మథురై వీరి రాజధానిగా కొనసాగింది. వీరి రాజచిహ్నం చేప. నెడుంజెళియన్ వీరిలో గొప్పవాడు.
3) చేర: వీరు కేరళ ప్రాంతాన్ని పరిపాలించారు. వంజి వీరి రాజధాని. సెంగుత్తవాన్ ఈ వంశంలో గొప్పవాడు. విల్లు వీరి రాజచిహ్నం.
శుంగరాజ్యం
మధ్య భారతదేశాన్ని మధ్యప్రదేశలోని విధీశాను రాజధానిగా చేసుకొని పరిపాలించారు .వీరు మొదట్లో మౌర్యుల దగ్గర ఉన్నతాధికారులుగా ఉంటూ తర్వాత స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు.
పుష్యమిత్ర శుంగుడు: ఇతను ఈ రాజ్య స్థాపకుడు. మౌర్య చక్రవర్తి అయిన బృహద్రద దగ్గర సేనాపతిగా పనిచేస్తూ అతనిని హత్య చేసి శుంగ వంశాన్ని స్థాపించాడు. ఇతను బౌద్ధ మాత వ్యతిరేకి అని అధికుడు నిర్మించిన 24000 స్థూపాలను ధ్వంసం చేసాడని బౌద్ధ గ్రంథమైన దివ్యవదన తెలియచేస్తుంది. కానీ పండితులు, చరిత్రకారులు ఈ వాదనతో ఏకీభవించట్లేదు.
విదేశీ రాజ్యాలు
భారతదేశంలో మౌర్యుల అనంతరం కొన్ని విదేశీ తెగలు దండెత్తి వచ్చి అనేక రాజ్యాలను స్థాపించారు. అందులో ఒకటి ఇండో-గ్రీకులు (యవనులు), స్కిథియన్లు (శకులు).
1) ఇండో-గ్రీకులు (యవనులు): ఉత్తర ఆఫ్ఘానిస్తాన్ కు చెందిన గ్రీకులు భారతదేశంలో ఒక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించి ఇక్కడే శాశ్వతంగా స్థిరపడి భారత సంస్కృతిలో కలిసిపోయారు. కాబట్టి వీరిని ఇండో-గ్రీకులు లేదా యవనులు అని పిలుస్తారు. వీరు గ్రీకుల్లో అయోనియన్ తెగకు చెందినవారు. క్రీ.పూ.165 నుండి సకల (పాకిస్థాన్) రాజధానిగా మినాండర్ (మిళిందుడు) అనే రాజు పరిపాలించాడు. వీరు ఈ సకల రాజ్యాన్ని భూతాల స్వర్గంగా పేర్కొన్నారు. మిళిందుడు బౌద్ధ మతాన్ని ఆచారించాడు. ఇతని ఆస్థానకవి అయిన నాగసేనుడు చెప్పిన విషయాలను గ్రంథస్థం చేయించి “నాగసేనభిక్షుసూత్ర” అనే పేరుతో ప్రచురించాడు. ఇది పాళీ భాషలో రాయబడింది. ఇది బౌద్ధులకు పవిత్ర గ్రంథంగా కొనసాగుతుంది.
భారతదేశంలో ఇండో-గ్రీకులు నాణెముల ముద్రణలో చాలా మార్పులు తీసుకువచ్చారు. రెండువైపులా ముద్రించిన నాణాలను ప్రవేశపెట్టడంతో అప్పటివరకు వినియోగించిన Punchmarked Coins అదృశ్యమయ్యాయి.
2) స్కిథియన్లు (శకులు): మధ్య ఆసియాలోని స్కిథియన్ గిరిజన తెగకు చెందిన వీరిని భారతదేశంలో శకులు అంటారు. వీరు 5 స్వతంత్ర రాజ్యాలను స్థాపించి భారతదేశాన్ని పాలించారు. అవి కపిస రాజ్యం(ఆఫ్ఘానిస్తాన్ లోని కపిస రాజధానిగా పాలించారు), తక్షశిల రాజ్యం (పాకిస్థాన్ లోని తక్షశిల రాజధానిగా మరొక శక రాజ్యం కొనసాగింది), మథుర రాజ్యం (ఉత్తర ప్రదేశ్ లోని మథుర వీరి రాజధాని), ఉజ్జయిని రాజ్యం (మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయిని రాజధానిగా మాల్వా మరియు గుజరాత్ లని ఏకం చేసి రుద్రదమనుడు అనే రాజు పరిపాలించాడు. ఇతను వేసిన జునాఘడ్ శాసనం భారతదేశంలో తొలి సంస్కృత శాసనంగా చెప్పవచ్చు), దక్కన్ శక రాజ్యం (వీరు మధ్యప్రదేశ్ లోని మాండసోర్ రాజధానిగా సహపాణుడు అనే రాజు పరిపాలించాడు.


