Friday, August 28, 2026
25.6 C
Hyderabad

అక్రమ వలసలపై ఉక్కుపాదం!|EDITORIAL

భారత్ దేశంలో అక్రమ వలసల సమస్య ఇప్పుడు కేవలం సరిహద్దు భద్రత అంశంగా మాత్రమే కాకుండా.. ఆర్థిక, సామాజిక, రాజకీయ, జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సవాలుగా మారింది. మన పొరుగున సరిహద్దుల్లో ఉన్న బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల నుంచి జరుగుతున్న లెక్కలేనన్ని చొరబాట్లు దేశంలోని పలు రాష్ట్రాల్లో జనాభాను ప్రభావితం చేస్తున్నాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం దేశంలో లక్షల సంఖ్యలో అక్రమ వలసదారులు ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే, ఈ లెక్కల్లో స్పష్టత లేదు. 2016లో కేంద్ర హోంశాఖ పార్లమెంట్‌కు ఇచ్చిన సమాచారం ప్రకారం దేశంలో 2 కోట్ల వరకు బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు ఉండవచ్చని అంచనా.

పశ్చిమ బెంగాల్, అసోం, త్రిపుర, బీహార్ వంటి సరిహద్దు రాష్ట్రాలు ఈ సమస్యను అత్యంత తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. అసోంలో 1985లో జరిగిన అసోం ఒప్పందం నుంచే విదేశీయుల సమస్య ప్రధాన చర్చగా మారింది. అనంతరం జాతీయ పౌర రిజిస్టర్ ప్రక్రియలో 19 లక్షల మంది జాబితా వెలుపల ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో రోహింగ్యాల అక్రమ వలస అంశం కూడా భద్రతా సంస్థలకు సవాలుగా మారింది. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం భారతదేశంలో 40 వేల వరకు రోహింగ్యాలు నివసిస్తున్నారని భావిస్తున్నారు. వీరిలో కొందరు హైదరాబాద్, జమ్మూ, ఢిల్లీ, మేవాత్ ప్రాంతాల్లో స్థిరపడినట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి.

అక్రమ వలసల ప్రభావం కేవలం జనాభా పెరుగుదలకే పరిమితం కాదు. నకిలీ ఆధార్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు, రేషన్ కార్డులు పొందడం ద్వారా కొందరు రాజకీయ, సామాజిక వ్యవస్థలోకి చొరబడుతున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితాల్లో విదేశీయుల పేర్లు ఉండటం వివాదాలకు దారితీస్తోంది. దీనివల్ల స్థానిక ప్రజల్లో ఉపాధి, వనరుల పంపకం, భూముల ఆక్రమణలపై అసంతృప్తి పెరుగుతోంది.

ఇదే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అక్రమ వలసలు, అసహజ జనాభా మార్పులపై అధ్యయనం చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రకాశ్ ప్రభాకర్ నవోలేకర్ ఆధ్యర్యం వహించనున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి దుర్గాశంకర్ మిశ్రా, మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ఆర్థికవేత్త డాక్టర్ షమికా రవి తదితరులు సభ్యులుగా ఉండటం ఈ కమిటీకి విశేష ప్రాముఖ్యతను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా మత, సామాజిక వర్గాల వారీగా జరుగుతున్న అసాధారణ జనాభా మార్పులను ఈ కమిటీ విశ్లేషించి, కాలపరిమితితో కూడిన విధాన సూచనలు చేయనుంది.

ప్రపంచ వ్యాప్తంగా కూడా అక్రమ వలసలపై కఠిన వైఖరి పెరుగుతోంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవడం అంతర్జాతీయ చర్చకు దారితీసింది. అదే విధంగా బ్రిటన్ కూడా వలస విధానాన్ని సంస్కరించింది. యూరప్‌లో కూడా అక్రమ వలసల నియంత్రణ కోసం అనేక దేశాలు సరిహద్దు భద్రతను బలోపేతం చేస్తున్నాయి. భారతదేశం కూడా తన భౌగోళిక, భద్రతా అవసరాల దృష్ట్యా ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేయలేని పరిస్థితి ఏర్పడింది.

ఇక పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితి మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చినవారు ఆధార్, ఓటరు కార్డులు పొంది స్థానిక వ్యవస్థల్లో కలిసిపోయారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఇటీవల రాష్ట్రంలో విదేశీయుల గుర్తింపు, నిర్బంధం, బహిష్కరణ చర్యలను వేగవంతం చేయాలని ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయించింది. “గుర్తించండి – తొలగించండి – బహిష్కరించండి” అనే నినాదంతో చర్యలు ప్రారంభించడం ద్వారా ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో నిర్బంధ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ కూడా వేగం అందుకుంది.
అయితే, ఈ అంశాన్ని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. చట్టబద్ధమైన శరణార్థులు, మానవ హక్కుల పరిరక్షణ అవసరాలను కూడా సమానంగా పరిగణనలోకి తీసుకోవాలి. మత, జాతి ఆధారిత విద్వేషం పెరగకుండా జాగ్రత్త పడటం ప్రభుత్వాల బాధ్యత. అక్రమ వలసలను అరికట్టడం ఎంత ముఖ్యమో, చట్టబద్ధ ప్రక్రియలో మానవీయ దృక్పథాన్ని పాటించడం కూడా అంతే అవసరం.

సరిహద్దు భద్రత బలోపేతం, ఆధార్-ఓటరు జాబితాల సమగ్ర పరిశీలన, నకిలీ పత్రాల మాఫియాపై కఠిన చర్యలు, రాష్ట్రాలు-కేంద్రం మధ్య సమన్వయం వంటి చర్యల ద్వారానే ఈ సమస్యకు స్థిరమైన పరిష్కారం సాధ్యమవుతుంది. అక్రమ వలసలు దేశ సార్వభౌమత్వానికి, సామాజిక, రాజకీయ, ఆర్థిక భద్రతకు ముప్పుగా మారకుండా ఇప్పుడే సమగ్ర కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉంది.

Latest News

‘రాఖీ’తో ‘రాజీ’…!?|RAKSHA BANDHAN|KONDA SUREKHA|CM|REVANTH REDDY

మంత్రి పదవికి ‘రక్షా’ బంధన్! కొండా సురేఖ వ్యూహం ఫలించేనా? ‘రక్షాబంధనం’ సురేఖక్క మంత్రి పదవిని రక్షిస్తుందా? ‘రాఖీ’తో ‘రాజీ’ కుదురుతుందా? మంత్రి కొండా సురేఖ వ్యూహం ఫలిస్తుందా? ఏం కానుంది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్...

తమ్ముడికి జీవితాన్నే బహమతిగా ఇచ్చిన అక్క!?|ADUGU TRENDS

రాఖీల పున్నం పండగను అన్నా శెల్లెల్లు, అక్కాతమ్ముళ్ల మద్దెల పేమానురాగాలకు, రచ్చణకు పతీకగా జరుపుకుంటరు. రాఖీ అంటే రచ్చణ కవచం. రచ్చా సూత్రం. గా అన్నాతమ్ముల్లకు ఆపదలు రాకుండా, గవాల్లు ఆయురారోగ్యాలతో కలకాలం...

హిమాలయాల్లో మహా విలయం!?|EDITORIAL

ఇంతటి విపత్తు నుంచి భారత్‌ పాఠాలు నేర్చుకోవాలి. హిమాలయాల్లో విచ్చలవిడిగా రహదారులు, హైడ్రోపవర్‌ ప్రాజెక్టులు, పర్యాటక నిర్మాణాలు చేపడుతూ పర్వతాల సహజ సమతౌల్యాన్ని దెబ్బతీస్తే ప్రమాదాల సంఖ్యేకాదు, వాటి తీవ్రతా పెరుగుతుంది. వాతావరణ...

ఆగస్టు 28, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం రాఖీ పూర్ణిమ జంధ్యాల పూర్ణిమ తిధి పౌర్ణమి ఉదయం 08.57 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం శతభిషం రాత్రి తెల్ల 03.43 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం అతిగండ ఉదయం 08.57 వరకు ఉపరి సుకర్మ కరణం బవ...

హద్దుల్లేని ముద్దురణం!?|ADUGU TRENDS

ము ముద్దంటే శేదా? అంటే ఎవరికి శేదు చెప్పండి? గందుకే కాకిపిల్ల కాకికి ముద్దన్నరు. తల్లికి పిల్లంటే ముద్దు. పేమికులకు ఒకలంటే ఇంకొకలికి ముద్దు. గా ముద్దు ముచ్చట ఒకామె గీ ఇధంగా...

ఆర్థిక పతనం దిశగా అమెరికా ఫస్ట్ నినాదం!?|EDITORIAL

‘అమెరికా ఫస్ట్’ అంటే ప్రపంచం నుంచి అమెరికా దూరం కావడం కాదు. అమెరికా ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతూనే ప్రపంచ వాణిజ్యం, శాంతి, స్థిరత్వంతో సమన్వయం సాధించాలి. లేకపోతే గొప్ప దేశాన్ని నిర్మించాలన్న నినాదమే...

ఆగస్టు 27, గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి చతుర్దశి ఉదయం 08.05 వరకు ఉపరి పొర్ణమి నక్షత్రం ధనిష్ఠ రాత్రి 02.38 వరకు ఉపరి శతభిషం యోగం శోభ ఉదయం 09.20 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 08.05 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

పనికి ఫార్చునర్ కారులో సఫాయి!?|ADUGU TRENDS

రోజులు మస్తుగ మారిపోతున్నయి. పేదా బక్క, బిక్కిబీదా తేడా లేకుండా పోతాంది. ఎవ్వలైనా హమ్ కిసీ సే కం నహీ అంటాండ్రు. గట్లనే గా సఫాయి కూడా అంటా0డు. గా సఫాయి రోజూ...

ఆర్థిక యుద్ధం అణుబాంబు కన్నా డేంజర్!?|EDITORIAL

యుద్ధానికి ఆయుధాలు అవసరం. ఆర్థిక యుద్ధానికి ప్రపంచ సహకారం అవసరం. అమెరికా ఆ సహకారాన్ని ఎంతవరకు సాధించగలదన్నదే అసలు పరీక్ష. ఇరాన్‌ను బలహీనపరచాలన్న అమెరికా ప్రయత్నం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచకుండా జాగ్రత్తపడాల్సిన...

ఆగస్టు 26, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి త్రయోదశి ఉదయం 06.53 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం శ్రవణ రాత్రి 01.03 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సౌభాగ్య ఉదయం 09.20 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 06.53 వరకు ఉపరి గరజి రాహుకాలం...

పార్టీ పెడితే పోలా!|ADUGU EXCLUSIVE|KONDA FAMILY|NEW PARTY

అడుగు ఎక్స్ క్లూజివ్ కొండా దంపతుల కొత్త పార్టీ? పాత పార్టీల్లో పొసగడం కష్టమే! కొత్త పార్టీతో ప్రయాణం స్పష్టమే! లక్ష్యం బీసీ సామాజిక న్యాయమే! ఇప్పటికే ప్రధాన పార్టీల్లో0చి బయటకు  కాంగ్రెస్ కాదంటే బీజేపీ ఛాన్స్? సిద్ధాంత రీత్యా కమలంలోనూ కష్టమే ఇప్పటికే...

పూర్వ ప్రేమికులకు.. అపూర్వ ప్రేమ రోజు!?|ADUGU TRENDS

యినడానికి గిది ఇబ్బందిగనే ఉన్నా, ఇది నిజమే మరి! కాకపోతే గిది మన దేసంల కాదు. పరాయి దేశంల. ఎవలైనా వయసొచ్చినంక పేమల పడ్తరు. అందరూ గా పేమల్ని గెలపించుకోలేరు. ఐటెంక వేరెవ్వల్నో...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News