మంత్రి కొండా సురేఖను కలిసిన కమిటీ సభ్యులు|MINISTER|KONDA SUREKHA
వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కరీమాబాద్ శ్రీ బీరన్న స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జూలై 25న తొలి ఏకాదశి బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆమెకు ఆహ్వానం అందజేశారు. ఆలయ ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు కమిటీ చేపడుతున్న ఏర్పాట్లను మంత్రికి వివరించారు. మంత్రి కొండా సురేఖను శాలువాతో సత్కరించి, ఆలయ ప్రసాదాన్ని అందజేశారు. బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు అందరి సహకారంతో ఏర్పాట్లు చేస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. మంత్రి కూడా ఉత్సవాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రిని కలిసిన వారిలో దేవస్థానం అధ్యక్షుడు కోరే సదానందం, కార్యదర్శి కోరే నాగరాజు, కుల పెద్ద దయ్యాల కృష్ణ, ఉపాధ్యక్షుడు గొట్టే సదానందం, సహాయ కార్యదర్శి వాసూరి శ్రీనివాస్, ముఖ్య సలహాదారులు మండల కొమురెల్లి, కోరే కుమారస్వామి (డిపో), బండారి రాజేశ్వర్, ఆర్గనైజర్ నంద నవీన్, కార్యవర్గ సభ్యులు కంచ తిరుపతి, కొమ్ము రాజు, కంచ మెట్టయ్య, మురికి చిన్న రవి, మాజీ అధ్యక్షుడు కోరే కృష్ణ, మాజీ కార్యదర్శి మురికి రాజు పాల్గొన్నారు.

