Tuesday, August 25, 2026
30.5 C
Hyderabad

వ్యవ‘సాయ’మేది!?|EDITORIAL

ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్లు, వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా ఫలితం ప్రకృతి, ప్రభుత్వం, వ్యాపారులు, దళారుల చేతుల్లోనే ఉండే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి రైతు ఆర్థిక స్థితిని మాత్రమే కాదు, దేశ ఆహార భద్రతనూ ప్రభావితం చేసే ప్రమాదం ఉంది.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే వెన్నెముక. దేశ జనాభాలో దాదాపు సగానికి పైగా ప్రజల జీవనాధారమూ వ్యవసాయమే. అయితే, ఈ రంగం పూర్తిగా వర్షాధారమై ఉండటం వల్ల ప్రతి ఏడాది రైతు ఆశలు ఆకాశం వంక చూస్తూనే ఉంటాయి. ఈసారి ఆ ఆశలను ఎల్‌నినో ప్రభావం మరింత అడియాశలు చేసి, అనిశ్చితిలోకి నెట్టింది. జూన్‌లో కురవాల్సిన నైరుతి రుతుపవనాలు ఆలస్యమవడం, జూలైలోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, జూన్ నెలలో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే 40 శాతం తక్కువగా నమోదైంది. జూలై మొదటి వారంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో లోటు కొంత తగ్గినా, దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతాయని హెచ్చరించింది. జూలై నెలలో వర్షపాతం దీర్ఘకాల సగటులో 94 శాతం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశముందని కూడా అంచనా వేసింది. అంటే కేవలం 6శాతమే వర్షాలన్నమాట.

వర్షాల లేమి ప్రభావం ఇప్పటికే దేశమంతా కనిపిస్తోంది. జూలై మధ్యకు వచ్చినా అనేక ప్రాంతాల్లో వరి నారుమళ్లు ఎండిపోతున్నాయి. రైతులు వేసిన విత్తనాలు మొలకెత్తక మళ్లీ విత్తాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే పోగుంటలకు రైతులు తయారయ్యారు. మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో గోదావరిలో కొంత ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ, కృష్ణా పరీవాహక ప్రాంతంలో నీటి లభ్యత ఆందోళన కలిగిస్తోంది. సాగునీటి కొరతతో పాటు తాగునీటి సమస్య కూడా గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగు గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా వెనుకబడి ఉంది. జూలై 5 నాటికి గత ఏడాదితో పోలిస్తే 21 శాతం తక్కువ విస్తీర్ణంలోనే విత్తనాలు వేశారు. దీనికి ప్రధాన కారణం వర్షాల వెనుకబాటే. వాతావరణ నిపుణులు తక్కువ నీటితో సాగయ్యే మక్కజొన్న, సజ్జలు, పెసర, కందులు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచిస్తున్నారు.

అయితే, రైతు సమస్యలు వర్షాల కొరతతోనే ముగియవు. వ్యవసాయం నేడు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, డీజిల్, ట్రాక్టర్ల అద్దెలు, కూలీల వేతనాలు… ప్రతి అంశంలో వ్యయం గణనీయంగా పెరిగింది. కానీ పెట్టుబడికి తగిన దిగుబడి రావడం లేదు. వచ్చిన పంటకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదు. కనీస మద్దతు ధర ప్రకటించినా, కొనుగోలు వ్యవస్థలో ఉన్న లోపాలు రైతును మార్కెట్ దళారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేస్తున్నాయి.

నకిలీ విత్తనాలు రైతాంగాన్ని మరోవైపు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. అధిక దిగుబడుల పేరుతో విక్రయించే నాసిరకం విత్తనాల వల్ల మొలక శాతం తగ్గి, పంటలు దెబ్బతింటున్నాయి. సీజన్ సమయంలో ఎరువుల కొరత రైతులకు మరో శాపంగా మారుతోంది. అవసరమైన సమయంలో ఎరువులు అందకపోవడంతో దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశమే లేకుండా పోతోంది.

ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్ల వానలు… వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా ఫలితం ప్రకృతి, ప్రభుత్వం, వ్యాపారులు, దళారుల చేతుల్లోనే ఉండే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి రైతు ఆర్థిక స్థితిని మాత్రమే కాదు, దేశ ఆహార భద్రతనూ ప్రభావితం చేసే ప్రమాదం ఉంది.

ఈ సంక్షోభానికి మరో విషాదకర కోణం రైతుల అప్పులు. బ్యాంకు రుణాలు సకాలంలో అందని చిన్న, సన్నకారు రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అధిక వడ్డీలు, పంట నష్టాలు, గిట్టుబాటు ధరల లేమి కలిసి వారిని అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. ఆర్థిక, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఇప్పటికీ ఆగకపోవడం దేశానికి సిగ్గుచేటు.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు రైతు భరోసా, పీఎం కిసాన్ వంటి సహాయాలు, పరిహారాలు ప్రకటించడం సరిపోదు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాల వారీగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు రూపొందించాలి. తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలి. చెరువుల పునరుద్ధరణ, వర్షపు నీటి సంరక్షణ, మైక్రో ఇరిగేషన్ విస్తరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. నకిలీ విత్తనాలపై ప్రత్యేక దాడులు నిర్వహించి కఠిన శిక్షలు అమలు చేయాలి. ఎరువులను సకాలంలో అందుబాటులో ఉంచాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఆలస్యం కాకుండా నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలి. కనీస మద్దతు ధరను చట్టబద్ధ హామీగా మార్చే అంశాన్ని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. వ్యవసాయం నిలబడితేనే ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, దేశ అభివృద్ధి నిలకడగా ఉంటాయి. ఎల్‌నినో ఒక సహజ వాతావరణ ప్రక్రియ కావచ్చు. కానీ దాని ప్రభావాన్ని విపత్తుగా మారనివ్వకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించడం పాలకుల బాధ్యత. ఈ వర్షాకాలం మరోసారి గుర్తు చేస్తున్న సందేశం ఒక్కటే. వ్యవసాయాన్ని కాపాడటం అంటే రైతును మాత్రమే కాదు, దేశ భవిష్యత్తును కాపాడటమని గుర్తుంచుకోవాలి.

Latest News

పార్టీ పెడితే పోలా!|ADUGU EXCLUSIVE|KONDA FAMILY|NEW PARTY

అడుగు ఎక్స్ క్లూజివ్ కొండా దంపతుల కొత్త పార్టీ? పాత పార్టీల్లో పొసగడం కష్టమే! కొత్త పార్టీతో ప్రయాణం స్పష్టమే! లక్ష్యం బీసీ సామాజిక న్యాయమే! ఇప్పటికే ప్రధాన పార్టీల్లో0చి బయటకు  కాంగ్రెస్ కాదంటే బీజేపీ ఛాన్స్? సిద్ధాంత రీత్యా కమలంలోనూ కష్టమే ఇప్పటికే...

పూర్వ ప్రేమికులకు.. అపూర్వ ప్రేమ రోజు!?|ADUGU TRENDS

యినడానికి గిది ఇబ్బందిగనే ఉన్నా, ఇది నిజమే మరి! కాకపోతే గిది మన దేసంల కాదు. పరాయి దేశంల. ఎవలైనా వయసొచ్చినంక పేమల పడ్తరు. అందరూ గా పేమల్ని గెలపించుకోలేరు. ఐటెంక వేరెవ్వల్నో...

వంటింట్లో మంట! తిరేదేలా తంటా?|EDITORIAL

ధరల పెరుగుదల కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు. అది సామాజిక సమస్య కూడా. నెల ఆదాయం పెరగకుండానే నెలవారీ ఖర్చు పెరిగితే మధ్యతరగతి పొదుపులు కరిగిపోతాయి. పేద కుటుంబాలు పోషకాహారం, విద్య,...

ఆగస్టు 25, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు *శ్రావణమాసం* *శుక్లపక్షం* తిధి త్రయోదశి పూర్తిగా రోజంత నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 11.03 వరకు ఉపరి శ్రవణ యోగం ఆయుష్మాన్ ఉదయం 09.04 వరకు ఉపరి సౌభాగ్య కరణం కౌలవ సాయంత్రం 06.05 వరకు ఉపరి తైతుల రాహుకాలం పగలు 03.00...

ఆగస్టు 24, సోమవారం, 2026|RASHI PHALALU 

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి ద్వాదశి రాత్రి తెల్ల 05.13 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 08.43 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం ప్రీతి ఉదయం 08.32 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం బవ సాయంత్రం 04.17...

మౌర్యుల చరిత్ర|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS|HISTORY

(క్రీ.పూ.320 నుండి క్రీ.పూ.180 వరకు) భారతదేశ చరిత్రలో మహా సామ్రాజ్యంగా తొలుత మౌర్య సామ్రాజ్యము వెలిసింది. మౌర్యులు భారత ఉపఖండం(ప్రస్తుత భారతదేశం, పాకిస్థాన్, ఆఫ్ఘానిస్తాన్, బాంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, టిబెట్) మొత్తాన్ని ఇక చక్రాధిపత్యంగా...

నడుస్తున్న మనిషి|POETRY|PARVATHALU

నిలబడిన చోట పెళ్లున కొమ్మ విరిగి పడ్డట్లు మనుషులు కూలిపోతూ కుటుంబాలనొదిలి వెళ్ళిపోతున్నారు అనారోగ్యమిప్పుడు శత్రుదేశాల దాడిలా ప్రమాదకరమైంది వైరస్ ఎప్పుడు మాటుగాస్తుందో ఆరోరోగ్యం ఎప్పుడు మందగిస్తుందో నవ్వుతున్న మనిషి నవ్వుతున్నట్లే అయ్యో !ఇందాకనే ఫోన్ లో మాట్లాడిండని అంటూ...

మనిషి అంటే పర్వతాలే!|PARVATHALU|HUMANITY

పర్వతాలు... పేరుకు తగ్గట్లే, మేరు పర్వతం. అనేక పర్వతాల సరితూగే శక్తిగల మేరునగధీరుడు. ధీశాలి. కోరకున్నా వరాలిచ్చే అపర పరమేశ్వరుడు. ఆ భోళా శంకరుడి లాగే భోళా మనిషి. ప్రార్థించే పెదవులకన్నా, సాయం...

సీఎం సహాయ నిధికి 10 యేలిచ్చిన బిచ్చగాడు!?|ADUGU TRENDS

బిచ్చగాడే గదాని తీసి పారేయొద్దు. తక్కువ సూడొద్దు. ఒక్కొక్కటే వందలు, యేలైతయి. కానీ, గయి కూడబెట్టనీకే ఎంతో కట్ట పడాలె. బిచ్చమెత్తడం అంత అల్కనేం కాదు. అభిమానం సంపుకోవాలె. అవమానాలు భరించాలె. ఇచ్చినా,...

రూపాయి బియ్యంతో కోట్లలో దళారుల దందా!|EDITORIAL

రేషన్ బియ్యం అక్రమ రవాణా కేవలం లబ్ధిదారుల స్థాయిలోనే కాదు. కొన్నిచోట్ల డీలర్లు, దళారులు కుమ్మక్కై నిల్వలను నిలువునా మింగేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గోదాములు, హోటళ్లు, ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా జరుగుతున్నాయి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 23 నుండి ఆగస్టు 29 వరకు వార రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా మంచి...

ఒక్కరోజు బిచ్చగాడి సంపాదనెంతంటే..!?|ADUGU TRENDS

ఒకాయినెకు ఓ అవుడియా వచ్చింది. తానే బిచ్చమెత్తితే? గట్ల బిచ్చమెత్తి రోజుకు ఎంత సంపాయించొచ్చు? గదాంట్ల ఉండే సాదకబాదకాలు తెలుసుకుందామని. ఇగ ఆగకుండ ఐవుడియా వచ్చిందే లెక్క... యెంటనే ఆ అవతారమెత్తిండు. ఆఖరికి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News