Monday, August 24, 2026
23.3 C
Hyderabad

Farmer|రైతును King|రాజుగా చేసిందే ప్రజా పాలన|People’s Government

RAITHU BHAROSA| రైతు భరోసా సభలో CM| సీఎం రేవంత్ రెడ్డి |REVANTH REDDY గర్జన

TELANGANA| తెలంగాణ రైతు భరోసా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. SECRETERIAT| సచివాలయం సాక్షిగా STATE| రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు పండుగ చేసుకుంటున్న రోజు ఇదని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో, తెలంగాణ రైతాంగం అండతో చిన్న వయసులో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినట్టు గుర్తుచేశారు. తెలంగాణ చరిత్ర భూమి చుట్టూనే పోరాటాలు, త్యాగాలు జరిగాయని, సొంత ఊరు, భూమిని తల్లిదండ్రులతో సమానంగా చూస్తామని తెలిపారు.

ప్రజా ప్రభుత్వంలో రైతులకు మొదటి ప్రాధాన్యత ఆ తరువాతే ఆడబిడ్డలు, ఉద్యమకారులు, విద్యార్థులని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో FARMERS| రైతులకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.7625 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. ఎన్నికల హామీ మేరకు రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసి 25 లక్షల 35 వేల మంది రైతులకు రూ.20,617 కోట్ల రుణమాఫీని ఖాతాల్లో జమ చేసినట్టు వివరించారు.

AUGUST| ఆగస్టు 15, 2024 నాటికి రైతులను రుణ విముక్తులుగా చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు. గతంలో వరి వేస్తే ఉరి వేసుకున్నట్టేనని కేసీఆర్ చెప్పారని గుర్తుచేసి, ప్రజా ప్రభుత్వం వచ్చాక వరి పండించండి, మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. రైతులకు మన ప్రభుత్వంపై నమ్మకం ఉండటం వల్లే దేశంలో అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని అన్నారు. 2 కోట్ల 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి దేశంలో మొదటి స్థానాన్ని తెలంగాణ దక్కించుకుందన్నారు.

దళారుల దోపిడీని అడ్డుకున్న GOVERNMENT| ప్రభుత్వం తమదేనని, మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ |BONUS ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణేనని గర్వంగా చెప్పారు. KCR| కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను క్యాన్సర్ బారిన పడినట్లు వదిలేశారని, మామ శకుని అయితే అల్లుడు శనీశ్వరుడని, రైతులకేమి చేశారని వారు ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. కోకాపేటలో భూములు అమ్మి రైతు భరోసా, ఔటర్ రింగ్ రోడ్డును తెగనమ్మి రుణమాఫీ చేయాలన్న బలహీనతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

KALESHWARAM| కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోచుకున్న KCR| కేసీఆర్ ప్రభుత్వం రైతుల ముసుగులో వేల కోట్లు సంపాదించిందని, MOINABAD| మొయినాబాద్, JANWADA| జన్వాడ, GAJWEL| గజ్వేల్‌లలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజల దగ్గర 8 లక్షల కోట్ల అప్పు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. పదేళ్లలో వాళ్ళు ధనవంతులయ్యారు.. కానీ ధనిక తెలంగాణను దివాళా రాష్ట్రంగా మార్చారన్నారు.

తమ ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసి, మొత్తం 1 లక్షా 4 వేల కోట్లను 18 నెలల్లో రైతుల కోసం ఖర్చు చేసిందని వివరించారు. వ్యవసాయాన్ని పండుగగా మార్చిన ప్రజా పాలన తమదేనని అన్నారు. కేసీఆర్‌తో OPEN DEBATE| ఓపెన్ డిబేట్ కు సిద్ధంగా ఉన్నానని సవాలు విసిరారు. మీరు లక్ష కోట్లు కొల్లగొడితే, మేము రైతుల కోసం 1 లక్షా 4 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.

WOMENS| మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తూ పదేళ్ల పాలన, 18 నెలల పాలనను అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, సీతారామ ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోయాయో చెప్పాలన్నారు.

దేవాదుల ప్రాజెక్టు పూర్తయితే 4 వేల ఎకరాల సాగు జరిగేదని, కానీ కేసీఆర్ పూర్తి చేయలేదని విమర్శించారు. ప్రాజెక్టులపై ఉదాసీనంగా వ్యవహరించారని, లక్ష కోట్లు దోచుకుని ఇప్పుడు బనకచర్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాకు చంద్రబాబు అవసరమైతే అక్కడే ఉండేవాణ్ణి.. కానీ సోనియమ్మ ఆశయాలతో కాంగ్రెస్‌లో చేరాను అన్నారు.

GODAVARI| గోదావరి బనకచర్లపై శాసనసభలో చర్చకు సిద్ధమని, స్పీకర్‌కు లేఖ రాసి చర్చ పెట్టాలంటూ కేసీఆర్‌ను సూటిగా సవాలు చేశారు. తాము నిజాయితీతో రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నామని, సాగునీటి న్యాయం కోసం నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు.

Latest News

ఆగస్టు 24, సోమవారం, 2026|RASHI PHALALU 

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి ద్వాదశి రాత్రి తెల్ల 05.13 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 08.43 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం ప్రీతి ఉదయం 08.32 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం బవ సాయంత్రం 04.17...

మౌర్యుల చరిత్ర|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS|HISTORY

(క్రీ.పూ.320 నుండి క్రీ.పూ.180 వరకు) భారతదేశ చరిత్రలో మహా సామ్రాజ్యంగా తొలుత మౌర్య సామ్రాజ్యము వెలిసింది. మౌర్యులు భారత ఉపఖండం(ప్రస్తుత భారతదేశం, పాకిస్థాన్, ఆఫ్ఘానిస్తాన్, బాంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, టిబెట్) మొత్తాన్ని ఇక చక్రాధిపత్యంగా...

నడుస్తున్న మనిషి|POETRY|PARVATHALU

నిలబడిన చోట పెళ్లున కొమ్మ విరిగి పడ్డట్లు మనుషులు కూలిపోతూ కుటుంబాలనొదిలి వెళ్ళిపోతున్నారు అనారోగ్యమిప్పుడు శత్రుదేశాల దాడిలా ప్రమాదకరమైంది వైరస్ ఎప్పుడు మాటుగాస్తుందో ఆరోరోగ్యం ఎప్పుడు మందగిస్తుందో నవ్వుతున్న మనిషి నవ్వుతున్నట్లే అయ్యో !ఇందాకనే ఫోన్ లో మాట్లాడిండని అంటూ...

మనిషి అంటే పర్వతాలే!|PARVATHALU|HUMANITY

పర్వతాలు... పేరుకు తగ్గట్లే, మేరు పర్వతం. అనేక పర్వతాల సరితూగే శక్తిగల మేరునగధీరుడు. ధీశాలి. కోరకున్నా వరాలిచ్చే అపర పరమేశ్వరుడు. ఆ భోళా శంకరుడి లాగే భోళా మనిషి. ప్రార్థించే పెదవులకన్నా, సాయం...

సీఎం సహాయ నిధికి 10 యేలిచ్చిన బిచ్చగాడు!?|ADUGU TRENDS

బిచ్చగాడే గదాని తీసి పారేయొద్దు. తక్కువ సూడొద్దు. ఒక్కొక్కటే వందలు, యేలైతయి. కానీ, గయి కూడబెట్టనీకే ఎంతో కట్ట పడాలె. బిచ్చమెత్తడం అంత అల్కనేం కాదు. అభిమానం సంపుకోవాలె. అవమానాలు భరించాలె. ఇచ్చినా,...

రూపాయి బియ్యంతో కోట్లలో దళారుల దందా!|EDITORIAL

రేషన్ బియ్యం అక్రమ రవాణా కేవలం లబ్ధిదారుల స్థాయిలోనే కాదు. కొన్నిచోట్ల డీలర్లు, దళారులు కుమ్మక్కై నిల్వలను నిలువునా మింగేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గోదాములు, హోటళ్లు, ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా జరుగుతున్నాయి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 23 నుండి ఆగస్టు 29 వరకు వార రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా మంచి...

ఒక్కరోజు బిచ్చగాడి సంపాదనెంతంటే..!?|ADUGU TRENDS

ఒకాయినెకు ఓ అవుడియా వచ్చింది. తానే బిచ్చమెత్తితే? గట్ల బిచ్చమెత్తి రోజుకు ఎంత సంపాయించొచ్చు? గదాంట్ల ఉండే సాదకబాదకాలు తెలుసుకుందామని. ఇగ ఆగకుండ ఐవుడియా వచ్చిందే లెక్క... యెంటనే ఆ అవతారమెత్తిండు. ఆఖరికి...

ప్రియాంక-బెటర్ ఛాయిసేనా!?|EDITORIAL

కాంగ్రెస్ కు ‘ప్రియాంక బెటర్ ఛాయిసా?” అన్నదానికంటే ‘కాంగ్రెస్ మెరుగైన ప్రతిపక్షంగా ఎలా సాగాలి?’ అన్నదే ముఖ్యం. సభను సజీవంగా మార్చడం ద్వారా ప్రతిపక్షం బలపడుతుంది. ప్రభుత్వాన్ని విమర్శించడంతో పాటు ప్రత్యామ్నాయ విధానాన్ని...

ఆగస్టు 22, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి దశమి రాత్రి 01.18 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం జ్యేష్ఠ పగలు 03.33 వరకు ఉపరి మూల యోగం వైధృతి ఉదయం 07.15 వరకు ఉపరి విస్కమ్బ కరణం తైతుల పగలు 12.18 వరకు ఉపరి గరజి రాహుకాలం...

కొండా సురేఖ చుట్టూ రాజకీయ ఉచ్చు..|KONDA SUREKHA|CONGRESS|CM|REVANTH REDDY

పార్టీ నుంచి బహిష్కరించాలంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు|MLA|MLC తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన...

గిదో కుక్కల కు.ని. పంచాయితీ!?|ADUGU TRENDS

గీ మద్దెల కుక్కల రోజులొచ్చినయి. మనుసుల లెక్కనే గా కుక్కల జనాభా కూడా పెరిగింది. గవి జనం మీదకు ఎగపడుడు. కరుసుడు, పీక్కతినుడు కూడా ఎక్కువై పోయింది. గ వాట్ని సంపుదామంటే, జీవ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News