Tuesday, June 9, 2026
26.6 C
Hyderabad

కాన్వాయ్‌లు కాదు, రాజకీయ దుబారాలు!|EDITORIAL

ప్రజల జీవితాలను కష్టాల్లోకి నెట్టడం పొదుపు కాదు. ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్న వ్యర్థ వ్యయాలను తగ్గించడం. ప్రజలు త్యాగాలు చేయాలని కోరే నాయకులు ముందుగా తమ ఉచిత సదుపాయాలు, అలవెన్సులు, విలాసాలను తగ్గించుకోవాలి. విదేశీ పర్యటనలు, ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ రాజకీయాలు, అధిక భద్రతా కాన్వాయ్‌లు ఇవన్నిటిని నియంత్రించినప్పుడే కాదు, వాటిని ఒక్క రోజు షోలా కాకుండా కొనసాగించినప్పుడే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ ప్రతీకాత్మక నిర్ణయాలకంటే ధైర్యవంతమైన ఆర్థిక, రాజకీయ సంస్కరణలే అవసరం. కాన్వాయ్‌ల కార్లు తగ్గించడం మాత్రమే కాదు, రాజకీయ దుబారాలను తగ్గించడమే నిజమైన పొదుపు.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

దేశ ఆర్థిక పరిస్థితి మరోసారి ఆందోళనకరంగా మారింది. పశ్చిమాసియాలో యుద్ధం, పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ క్షీణత, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, స్టాక్ మార్కెట్ల పతనం ఇవన్నీ కలిసి భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనలు పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ పెంచాలని, బంగారం కొనుగోళ్లు తగ్గించాలని, ప్రభుత్వ వ్యయాలను నియంత్రించాలని కేంద్రం సూచిస్తోంది. దీనికి అనుగుణంగా మోదీ తన కాన్వాయ్ ని కుదించుకోగా, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కాన్వాయ్‌లలో కార్ల సంఖ్యను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. కేవలం కాన్వాయ్‌ల కార్లు తగ్గిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందా?

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలు ఉపరితల స్థాయిలో లేవు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 90 డాలర్ల దిశగా కదులుతున్నాయి. భారతదేశం అవసరమైన చమురులో దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. చమురు ధరల్లో ప్రతి 10 డాలర్ల పెరుగుదల దేశ దిగుమతులపై వేల కోట్ల అదనపు భారాన్ని మోపుతోంది. దీని ప్రత్యక్ష ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలపై పడుతుంది. పెట్రో ధరలు పెరిగితే రవాణా వ్యయం పెరిగి, దాని ప్రభావం ఆహార పదార్థాల నుండి నిర్మాణ సామగ్రి వరకు అన్ని రంగాలపై పడటం ఖాయం.

ఇప్పటికే ద్రవ్యోల్బణం సామాన్య ప్రజల నడుము విరుస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 13 నెలల గరిష్ఠ స్థాయికి చేరిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం 4% దాటడంతో పప్పుధాన్యాలు, కూరగాయలు, వంటనూనెలు, పాల ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. కానీ ప్రజల ఆదాయాలు మాత్రం అదే స్థాయిలో ఉన్నాయి. అసంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు క్షీణిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల నిధుల కోతల కారణంగా కొనుగోలు శక్తి పడిపోతోంది. ఈ పరిస్థితుల్లో పెట్రో ధరల పెంపు ప్రజలపై మరింత భారాన్ని మోపుతుంది.

ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు ప్రజలకు పొదుపు బోధనలు చేయడం కన్నా ముందుగా తమ దుబారా ఖర్చులను తగ్గించుకోవాలి. కాన్వాయ్‌లలో రెండు కార్లు తగ్గించడం ప్రజలకు సందేశాత్మక చర్యే కావచ్చు. కానీ, అది నిజమైన ఆర్థిక సంస్కరణ కాదు. దేశ రాజకీయ వ్యవస్థలో కొనసాగుతున్న అనవసర ఖర్చులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధులకు లక్షల్లో జీతాలు, భారీ భత్యాలు, జీవితాంతం పెన్షన్లు, ఉచిత బంగళాలు, ఉచిత విద్యుత్, ఫోన్, భద్రతా సిబ్బంది వంటి సౌకర్యాలపై ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఒకటి కంటే ఎక్కువ పెన్షన్లు పొందుతున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. ప్రజలకు పొదుపు చెప్పే ముందు ఈ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలి.

దేశవ్యాప్తంగా శాసన మండళ్ల నిర్వహణ, వివిధ స్థాయిల్లో రాజకీయ పదవుల విస్తరణ, అవసరానికి మించిన ప్రభుత్వ కమిటీలు కూడా ఖర్చును పెంచుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో శాసన మండళ్ల అవసరంపై ఏళ్ళుగా చర్చ జరుగుతున్నప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని కొనసాగిస్తున్నారు. ప్రజల డబ్బుతో నడిచే ఈ వ్యవస్థల్లో పారదర్శకత, వ్యయ నియంత్రణ అత్యవసరం.

ఇక సామాన్య ప్రజల అవసరాలపై మాత్రం భారాలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను పెంచింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సంకేతాలు ఇస్తోంది. విమాన ఇంధన ధరలు పెరగడంతో విమాన టిక్కెట్లు భారీగా పెరిగాయి. విదేశాల్లో ఉన్న పిల్లలను చూసేందుకు వెళ్లే మధ్యతరగతి కుటుంబాలకే ఇప్పుడు విమాన ప్రయాణం భారంగా మారింది. ప్రజల జీవన వ్యయాలు పెరుగుతుంటే ప్రభుత్వాలు మాత్రం ప్రతీకాత్మక చర్యలతో సరిపెట్టుకోవడం సరైంది కాదు.

దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే నిర్మాణాత్మక సంస్కరణలు అవసరం. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ సౌకర్యాలు పెంచాలి. రైతాంగానికి గిట్టుబాటు ధరలు కల్పించాలి. గ్రామీణ ఉపాధిని బలోపేతం చేయాలి. ధరల నియంత్రణ కోసం మార్కెట్ జోక్యం పెంచాలి. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే ఆర్థిక వ్యవస్థ చురుకుదనం పొందుతుంది. ప్రజలపై పన్నులు, ధరల భారాలు మోపడం ద్వారా కాదు.
ప్రజల జీవితాలను కష్టాల్లోకి నెట్టడం పొదుపు కాదు. ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్న వ్యర్థ వ్యయాలను తగ్గించడం. ప్రజలు త్యాగాలు చేయాలని కోరే నాయకులు ముందుగా తమ ఉచిత సదుపాయాలు, అలవెన్సులు, విలాసాలను తగ్గించుకోవాలి. విదేశీ పర్యటనలు, ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ రాజకీయాలు, అధిక భద్రతా కాన్వాయ్‌లు ఇవన్నిటిని నియంత్రించినప్పుడే కాదు, వాటిని ఒక్క రోజు షోలా కాకుండా కొనసాగించినప్పుడే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది.

దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ ప్రతీకాత్మక నిర్ణయాలకంటే ధైర్యవంతమైన ఆర్థిక, రాజకీయ సంస్కరణలే అవసరం. కాన్వాయ్‌ల కార్లు తగ్గించడం మాత్రమే కాదు, రాజకీయ దుబారాలను తగ్గించడమే నిజమైన పొదుపు.

Latest News

సేఫ్టీ డోర్లు!|ADUGU TRENDS

భద్రతకే భద్రత లేని రోజులియి.! మరైతే మనమెంత భద్రంగుండాలె? మనమెంత జాగర్త పడ్డా దోసేటోడు కొత్త కొత్త దారుల్ల దోస్తనే ఉన్నడు. కట్టం లేకుండా మన సొక్కం మన గాబుల్ల, జేబుల్ల నిండాలె....

దేశానికి ముప్పుగా డ్రగ్స్ దందా!|EDITORIAL

యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది సమాజం మొత్తం నిర్వర్తించాల్సిన సామూహిక కర్తవ్యం. నేడు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే రేపటి తరాన్ని ఆరోగ్యవంతమైన, సురక్షితమైన...

09-06-2026, మంగళవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-నవమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-నవమి తిథి : కృష్ణ-నవమి తె. ఝా 2:35 వరకు...

08-06-2026, సోమవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-అష్టమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-అష్టమి తిథి : కృష్ణ-అష్టమి తె. ఝా 3:24 వరకు...

ప్రొఫెసర్ వ్యాఖ్యలు-పోస్టు మార్టం|JANASENA|PROF.NAGESHWAR|PSPK

స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి కాని పనిని జాతీయ పార్టీ నెత్తికెత్తుకుందా? అందుకే జన సేనాని పవన్ ని తెలంగాణపైకి ఉసి గొల్పిందా? ఈ స్కెచ్ లో భాగంగానే జగన్ ను అరెస్ట్...

మందా? ‘మజా’కా!?|ADUGU TRENDS

ఎనకటికి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, సుట్టకు అగ్గి కావాలని మరొకడేడిసిండట! గీ ముచ్చట గట్లనే ఉన్నది. రోజులు మారినా, గా సామెతల అర్థాలు మారట్లేదు. గీ సామెతసొంటి ముచ్చటే గా చిత్తూరు జిల్లా...

ఆర్థిక మోసాలకు అడ్డుకట్టలే లేవా!?|EDITORIAL

చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 07 నుండి జూన్ 13 వరకు వారఫలాలు: మేషం: ఈ వారం కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సౌహార్దంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారవేత్తలు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా...

రెండోసారి రాజ్యసభకు సానా…|AP|TDP|RAJYASABHA|SANA SATHISH BABU

బాబుకు ధన్యవాదాలు తెలిపిన సతీష్ బాబు|CHANDRABABU|CM రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నేత సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా...

ఏపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు|AP|RAJYASABHA|TDP|JANASENA|BJP

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రం నుండి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను అధికార కూటమిలో అభ్యర్థుల ఎంపిక...

గడ్డి కావాలా, బాబూ..!|ADUGU TRENDS

పసువులకే కాదు, కాస బుద్ధి తక్కువున్నోల్లకు గడ్డి పెడతం.! గడ్డంటే గడ్డి కాదు కనీ, తిట్లన్నట్లు.!! గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలుతాగి మినిసి విషమవుతాడు అంటాడు ఆత్రేయ. మరి ఆవు మేసే...

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత!|EDITORIAL

పర్యావరణ దినోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. ప్రకృతిని కాపాడుకోవాలనే సామూహిక సంకల్పానికి ప్రతీక. పర్యావరణాన్ని రక్షించడం అంటే మానవజాతి భవిష్యత్తును రక్షించడమే. నేటి నిర్లక్ష్యం రేపటి విపత్తుకు దారితీయవచ్చు. అందుకే ప్రకృతి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News