Sunday, May 31, 2026
37.2 C
Hyderabad

ఆర్యవైశ్య మహాసభలో ఆంధ్రా పెత్తనం|ARYAVAISHYA MAHASABHA|ANDHRA

ఆర్యవైశ్య మహాసభ అట్టర్ ప్లాప్
తెలంగాణ నేతల బహిష్కరణ
రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నేత మిడిదుడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ఆంధ్రా పెత్తనమే కొనసాగుతోందని, తెలంగాణ వైశ్యనేతలు దూరంగా ఉండటమే ఇందుకు కారణమని రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నేత మిడిదుడ్డి శ్యాంసుందర్ ఆరోపించారు. రాష్ట్ర మహాసభ అధ్యక్షుడిగా అమరవాది లక్ష్మీనారాయణ హైదరాబాద్‌లో శనివారం పదవీ స్వీకార ప్రమాణం చేయగా, జరిగిన సభ ఆశించిన స్థాయిలో సాగకపోగా, అట్టర్ ఫ్లాప్ అయిందని ఆయన అన్నారు. కేవలం ఆంధ్ర నాయకులకే పరిమితమైన ఈ సభకు తెలంగాణ నేతలెవరూ హాజరు కాలేదని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు.

అమరవాది ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తెలంగాణ ఆర్యవైశ్య నేతలు, ఆర్యవైశ్య ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో బహిష్కరించడం ద్వారా అమరవాది వర్గానికి గట్టి బుద్ధి చెప్పారని శ్యామ్ విమర్శించారు. ముఖ్యంగా వైశ్య పితామహుడు గంజి రాజమౌళి గుప్తా, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్త, వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ సుజాత, వంటి హేమాహేమీలతో పాటు వైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కోలేటి దామోదర్, ఉప్పల శ్రీనివాస్ గుప్త, బొల్లం సంపత్ వంటి వారు అమరవాది ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదన్నారు. ప్రోటోకాల్ ఉన్న నాయకులు సైతం ఈ ‘అక్రమ ఎన్నిక’ను నిరసిస్తూ దూరంగా ఉండటం, అమరవాది వర్గం పట్ల ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

గత 11 ఏళ్లుగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న అమరవాది వర్గానికి తెలంగాణ వైశ్య సమాజం ఈ విధంగా చెంపదెబ్బ కొట్టిందని శ్యాంసుందర్ మండిపడ్డారు. నిన్నటి వరకు ఆంధ్ర నేతలను విమర్శించిన వారే, నేడు టీజీ వెంకటేష్, కనకరాజు వంటి ఆంధ్ర నాయకుల అండ కోసం పాకులాడటం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని ధ్వజమెత్తారు. గతంలో శ్రీశైలం సత్రం విషయంలో ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టిన అమరవాది, ఇప్పుడు తన పదవి కోసం ఆంధ్ర నేతలను ఆశ్రయించడం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం 2-3 ఓట్ల సాంకేతిక మెజారిటీతో, అంగబలం, అర్థబలంతో గెలిచినంత మాత్రాన అది నిజమైన విజయం కాదని, తనకు వచ్చిన 520 ఓట్లు నీతినిజాయితీకి ప్రతీకలని ఆయన స్పష్టం చేశారు.

కేవలం కొద్దిమంది రైస్ మిల్లర్ల నాయకులతో తూతూమంత్రంగా సభ జరుపుకోవడం హాస్యాస్పదమని, ఈ అక్రమ పదవి శాశ్వతం కాదని ఆయన హెచ్చరించారు. వైశ్య మహాసభలో జరిగిన అక్రమాలు, అన్యాయంపై త్వరలోనే న్యాయస్థానం ద్వారా పోరాటం చేస్తామని, తప్పు చేసిన వారికి కోర్టు ద్వారా బుద్ధి చెబుతామని శ్యాంసుందర్ హెచ్చరించారు. పదవుల కోసం, వ్యాపారాల కోసం కొందరు బానిసలుగా మారవచ్చు కానీ, ఆత్మాభిమానం ఉన్న ఆర్యవైశ్య జాతి అన్యాయాన్ని ఎప్పుడూ సహించదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ పేరుతో ఆంధ్రా నేతలతో సభ నిర్వహించి అమరవాది వర్గం ఏకాకిగా మిగిలిపోయిందని, భవిష్యత్తులో తమ సత్తా ఏంటో చూపిస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.

Latest News

ఫ్లాష్..ఫ్లాష్..ఫ్లాష్! బాల్కొండలో సంచలనం?|SENSATIONAL|BALKONDA

1500 కుటుంబాలను కుల బహిష్కరణ చేసినట్లు ఆరోపణలు!|NIZAMABAD|OUT CASTING నిజామాబాద్ జిల్లా, బాల్కొండలో దాదాపు 1500 కుటుంబాలను సామాజికంగా బహిష్కరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)...

బంగారం నది!?|ADUGU TRENDS

నమ్మలేక పోతున్నరు కదా? నిజంగా ఇది నిజమేనుల్లా.. బంగారం నది ఎక్కడో కాదు. మన దేశంలనే ఉన్నది. గా నదిల నీల్లతోపాటే బంగారం కూడ కొట్టుకొత్తది. ఇగ గా బంగారానికి సర్కారే ఏలం...

జనాభా-రాజకీయావసరమా? సామాజికావసరమా!?|EDITORIAL

దేశాభివృద్ధి మానవ గణాంకాలలో కాదు. నాణ్యమైన మానవ వనరుల అభివృద్ధిలో ఉంటుంది. జనాభా పెంపు రాజకీయ అవసరమా? సామాజిక అవసరమా? ముందుగా ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలపై ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. డా. మార్గం-అడుగు,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మే 31, ఆదివారం 2026 నుండి జూన్ 6, శనివారం 2026 వరకు మేషం ఈ వారం మేష రాశి వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక...

ఇగ కరెన్సీ నోట్లు కరాబే కావట!?|ADUGU TRENDS

మనం ఏం తినాల్నెన్నా, ఏం కొనాల్నెన్నా, ఇంకే శేయాల్నెన్నా పైసలే! దేనికైనా పైసలే! పైసా లేనిదే ఏ పనీ కాదు. గందుకే గదా ‘పైసా ఫేకో.. తమాషా దేఖో’ అన్నరు. మరి గా...

కాల గమనంలో కమ్యూనిస్టులు!|EDITORIAL

ఒకప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టు పార్టీలు నేడు తమ అస్తిత్వాన్ని కాపాడుకునే స్థితికి చేరడం కాలపరిణామానికి నిదర్శనం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు లేనట్లే శాశ్వత ఆధిపత్యం కూడా...

30-05-2026, శనివారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:42 తిథి : శుక్ల-చతుర్దశి ఉదయం 11:48 వరకు, తదుపరి పూర్ణిమ నక్షత్రము : విశాఖ మధ్యాహ్నం 12:46 వరకు, తదుపరి...

మనసులతో పాటే కుక్కలు తింటానయి!?|ADUGU TRENDS

కుక్కకు కూడా ఓ రోజొస్తదన్నట్లు.. ఇగిప్పుడు కుక్కల రోజులొచ్చినయి.! కుక్కను గ్రామ సింహం అంటరు. ఇగిప్పుడు ఇంటింటికీ సింహమైందనుకోండ్లి! కుక్కలను గిప్పుడు మనుసుల కంటే మనుసులే మంచిగ సూసుకుంటాండ్లు. పాలు, పెరుగు, పండ్లు,...

ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయాలు!|EDITORIAL

తమిళనాడులో సీఎం విజయ్ వ్యూహం విజయవంతమవుతుందా? ఉప ఎన్నికల్లో ప్రజలు అదే స్థాయిలో మద్దతు ఇస్తారా? ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను ప్రజలు అంగీకరిస్తారా? అన్నాడీఎంకే, డీఎంకేల ఎదురుదాడి ఎలా ఉంటుందన్నది...

29-05-2026, శుక్రవారం| RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:42 శుక్ల-త్రయోదశి శ్రాద్ధ తిథి: జ్యేష్ఠ శుక్ల-చతుర్దశి తిథి : శుక్ల-త్రయోదశి ఉదయం 9:52 వరకు, తదుపరి శుక్ల-చతుర్దశి నక్షత్రము స్వాతి ఈ...

సీకులకు సిమిటి!?|ADUGU TRENDS

శిన్న శిన్న ఉపాయాలే పెద్ద పెద్ద ఉపశమనాలిత్తయి. గవాటినే మనం నిర్లచ్చం శేత్తం. మర్సిపోతం. ఇగ గవాటితోటి మస్తు కట్ట పడ్తం. గయి గుర్తు పెట్టుకుంటిమా? ఇగ ఎట్లుంటదో సూడుండ్రి. మనం పక్కా ఇండ్లు...

అక్రమ వలసలపై ఉక్కుపాదం!|EDITORIAL

భారత్ దేశంలో అక్రమ వలసల సమస్య ఇప్పుడు కేవలం సరిహద్దు భద్రత అంశంగా మాత్రమే కాకుండా.. ఆర్థిక, సామాజిక, రాజకీయ, జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సవాలుగా మారింది. మన పొరుగున సరిహద్దుల్లో...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News