Tuesday, August 4, 2026
27.7 C
Hyderabad

Government|పాలనలో పురోగతికి మార్గదర్శకంగా కీలక నిర్ణయాలు|Decision

ఏపీ cabinet| కేబినెట్ సమావేశం నిర్ణయాలు ప్రకటించిన minister| మంత్రి పార్ధసారథి |Parthasarathi

Andhra Pradesh| ఆంధ్రప్రదేశ్ State| రాష్ట్ర Cabinet| మంత్రివర్గం ఏడాది పాలనలో 26 కేబినెట్ సమావేశాలు నిర్వహించి అనేక ప్రజా సంక్షేమ, అభివృద్ధి నిర్ణయాలను తీసుకుందంటూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్ధసారథి తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ సమావేశం నిర్వహించి Chief Minister| ముఖ్యమంత్రి Chandrababu| చంద్రబాబు ఆధ్వర్యంలో కీలకమైన విధానాత్మక నిర్ణయాలు తీసుకోవడం పాలనలో పారదర్శకతకు, చర్చల ప్రాధాన్యతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

రాజధాని నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ కోసం ల్యాండ్ పూలింగ్ రూల్స్–2025 రూపొందించి కేబినెట్ ఆమోదించినట్టు మంత్రి తెలిపారు. అసైన్డ్ భూములపై వివాదాలు లేకుండా, పునర్విమర్శలతో రీ సర్వే చేసి మెరుగైన ప్యాకేజీతో ల్యాండ్ పూలింగ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. జీఎడీ టవర్, హెచ్‌వోడి టవర్ల నిర్మాణ పనులు ఎన్‌సీసీ, షాపూజీ పల్లంజీ, ఎల్ అండ్ డీలకు అప్పగించినట్టు వివరించారు.

రాష్ట్రంలో కొత్తగా 7 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నట్టు తెలిపారు. భవన నిర్మాణాల నిబంధనల్లో మార్పులు చేస్తూ, వాటిని సులభతరం చేయాలని కేబినెట్ ఆమోదించినట్టు తెలిపారు. టెన్నిస్‌లో రజత పతకం సాధించిన సాకేత్ సాయికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటక అభివృద్ధిలో భాగంగా గండికోట వద్ద రిసార్టు నిర్మాణానికి 50 ఎకరాల భూమి కేటాయించిందని తెలిపారు.

శ్రీశైలం డ్యామ్, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ భద్రతా పనుల కోసం రూ.350 కోట్లు మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేయాలని సీఎం ఆదేశించినట్టు చెప్పారు. గోదావరి నుంచి వృథాగా సాగిపోయే 3 వేల టీఎంసీలు నీటిని వినియోగించుకునేందుకు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు తీసుకువచ్చినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే విధంగా చేపట్టనున్నట్టు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

Vijayawada| విజయవాడలో Ambedkar| అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణాన్ని సోషల్ వెల్ఫేర్ శాఖ నుంచి ఏపీ కల్చరల్ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేయాలని నిర్ణయించగా, పెండింగ్ పనులకు నిధులు విడుదల చేసి పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. రాజధాని అమరావతిలో అధునాతన సదుపాయాలతో కన్వెన్షన్ సెంటర్ నిర్మించనున్నట్టు తెలిపారు. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

రాష్ట్రంలో 4,687 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయనున్నట్టు తెలిపారు. విశాఖపట్నం మధురవాడలో 22.19 ఎకరాల్లో కాగ్నిజెంట్ సంస్థ 1,582 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమ ఏర్పాటు చేయనుందని, దాని ద్వారా 8,000 ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అమరావతిలో E3 రోడ్డును NH-16 కు అనుసంధానించేందుకు రూ.682 కోట్లకు టెండర్లు ఆమోదించినట్టు వెల్లడించారు.

ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా 273.17 కోట్లతో పొగాకు కొనుగోలు చేయనున్నట్టు, 20 మిలియన్ టన్నుల పొగాకు సేకరించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది పొగాకు సాగు కోసం క్రాప్ హాలిడే ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. పరిశ్రమల రంగంలో రాష్ట్రానికి 28,546 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, వీటిద్వారా 30,270 ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. స్మార్ట్ ఆంధ్ర సంస్థను “స్వర్ణాంద్ర పి4 ఫౌండేషన్”గా మారుస్తూ ప్రతిపాదనలు ఆమోదించినట్టు తెలిపారు.

ఏడాది పాలన సందర్భంగా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో సభలు నిర్వహించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. అదే సమయంలో పల్నాడు పర్యటన సందర్భంగా JAGAN| జగన్ చేపట్టిన కార్యకలాపాలను తప్పుబడుతూ, అనుమతులేకుండా నిరసనలు, బలప్రదర్శన నిర్వహించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. నరికేస్తాం, తొక్కేస్తాం లాంటి భాషను సమర్థించడం దురదృష్టకరమని, ఇలాంటి హింసాత్మక భావజాలం ప్రజల మధ్యకు రాకూడదని హితవు పలికారు.

బనకచర్ల ప్రాజెక్టుపై ఎవరికైనా విమర్శ అవసరం లేదని, వృథాగా వెళ్లే గోదావరి నీటిని వినియోగించుకునేందుకు, రెండు రాష్ట్రాలకు లాభదాయకంగా ఉండేలా ఈ ప్రాజెక్టు రూపొందించామని తెలిపారు. సామరస్యపూర్వక చర్చల ద్వారానే బనకచర్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథాన్ని సీఎం చంద్రబాబు కలిగి ఉన్నారని మంత్రి పార్ధసారథి వివరించారు.

Latest News

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News