ఏపీ cabinet| కేబినెట్ సమావేశం నిర్ణయాలు ప్రకటించిన minister| మంత్రి పార్ధసారథి |Parthasarathi
Andhra Pradesh| ఆంధ్రప్రదేశ్ State| రాష్ట్ర Cabinet| మంత్రివర్గం ఏడాది పాలనలో 26 కేబినెట్ సమావేశాలు నిర్వహించి అనేక ప్రజా సంక్షేమ, అభివృద్ధి నిర్ణయాలను తీసుకుందంటూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్ధసారథి తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ సమావేశం నిర్వహించి Chief Minister| ముఖ్యమంత్రి Chandrababu| చంద్రబాబు ఆధ్వర్యంలో కీలకమైన విధానాత్మక నిర్ణయాలు తీసుకోవడం పాలనలో పారదర్శకతకు, చర్చల ప్రాధాన్యతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
రాజధాని నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ కోసం ల్యాండ్ పూలింగ్ రూల్స్–2025 రూపొందించి కేబినెట్ ఆమోదించినట్టు మంత్రి తెలిపారు. అసైన్డ్ భూములపై వివాదాలు లేకుండా, పునర్విమర్శలతో రీ సర్వే చేసి మెరుగైన ప్యాకేజీతో ల్యాండ్ పూలింగ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. జీఎడీ టవర్, హెచ్వోడి టవర్ల నిర్మాణ పనులు ఎన్సీసీ, షాపూజీ పల్లంజీ, ఎల్ అండ్ డీలకు అప్పగించినట్టు వివరించారు.
రాష్ట్రంలో కొత్తగా 7 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నట్టు తెలిపారు. భవన నిర్మాణాల నిబంధనల్లో మార్పులు చేస్తూ, వాటిని సులభతరం చేయాలని కేబినెట్ ఆమోదించినట్టు తెలిపారు. టెన్నిస్లో రజత పతకం సాధించిన సాకేత్ సాయికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటక అభివృద్ధిలో భాగంగా గండికోట వద్ద రిసార్టు నిర్మాణానికి 50 ఎకరాల భూమి కేటాయించిందని తెలిపారు.
శ్రీశైలం డ్యామ్, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ భద్రతా పనుల కోసం రూ.350 కోట్లు మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేయాలని సీఎం ఆదేశించినట్టు చెప్పారు. గోదావరి నుంచి వృథాగా సాగిపోయే 3 వేల టీఎంసీలు నీటిని వినియోగించుకునేందుకు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు తీసుకువచ్చినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే విధంగా చేపట్టనున్నట్టు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
Vijayawada| విజయవాడలో Ambedkar| అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణాన్ని సోషల్ వెల్ఫేర్ శాఖ నుంచి ఏపీ కల్చరల్ డిపార్ట్మెంట్కు బదిలీ చేయాలని నిర్ణయించగా, పెండింగ్ పనులకు నిధులు విడుదల చేసి పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. రాజధాని అమరావతిలో అధునాతన సదుపాయాలతో కన్వెన్షన్ సెంటర్ నిర్మించనున్నట్టు తెలిపారు. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో 4,687 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయనున్నట్టు తెలిపారు. విశాఖపట్నం మధురవాడలో 22.19 ఎకరాల్లో కాగ్నిజెంట్ సంస్థ 1,582 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమ ఏర్పాటు చేయనుందని, దాని ద్వారా 8,000 ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అమరావతిలో E3 రోడ్డును NH-16 కు అనుసంధానించేందుకు రూ.682 కోట్లకు టెండర్లు ఆమోదించినట్టు వెల్లడించారు.
ఏపీ మార్క్ఫెడ్ ద్వారా 273.17 కోట్లతో పొగాకు కొనుగోలు చేయనున్నట్టు, 20 మిలియన్ టన్నుల పొగాకు సేకరించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది పొగాకు సాగు కోసం క్రాప్ హాలిడే ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. పరిశ్రమల రంగంలో రాష్ట్రానికి 28,546 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, వీటిద్వారా 30,270 ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. స్మార్ట్ ఆంధ్ర సంస్థను “స్వర్ణాంద్ర పి4 ఫౌండేషన్”గా మారుస్తూ ప్రతిపాదనలు ఆమోదించినట్టు తెలిపారు.
ఏడాది పాలన సందర్భంగా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో సభలు నిర్వహించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. అదే సమయంలో పల్నాడు పర్యటన సందర్భంగా JAGAN| జగన్ చేపట్టిన కార్యకలాపాలను తప్పుబడుతూ, అనుమతులేకుండా నిరసనలు, బలప్రదర్శన నిర్వహించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. నరికేస్తాం, తొక్కేస్తాం లాంటి భాషను సమర్థించడం దురదృష్టకరమని, ఇలాంటి హింసాత్మక భావజాలం ప్రజల మధ్యకు రాకూడదని హితవు పలికారు.
బనకచర్ల ప్రాజెక్టుపై ఎవరికైనా విమర్శ అవసరం లేదని, వృథాగా వెళ్లే గోదావరి నీటిని వినియోగించుకునేందుకు, రెండు రాష్ట్రాలకు లాభదాయకంగా ఉండేలా ఈ ప్రాజెక్టు రూపొందించామని తెలిపారు. సామరస్యపూర్వక చర్చల ద్వారానే బనకచర్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథాన్ని సీఎం చంద్రబాబు కలిగి ఉన్నారని మంత్రి పార్ధసారథి వివరించారు.

