Thursday, April 30, 2026
29.7 C
Hyderabad

Government|పాలనలో పురోగతికి మార్గదర్శకంగా కీలక నిర్ణయాలు|Decision

ఏపీ cabinet| కేబినెట్ సమావేశం నిర్ణయాలు ప్రకటించిన minister| మంత్రి పార్ధసారథి |Parthasarathi

Andhra Pradesh| ఆంధ్రప్రదేశ్ State| రాష్ట్ర Cabinet| మంత్రివర్గం ఏడాది పాలనలో 26 కేబినెట్ సమావేశాలు నిర్వహించి అనేక ప్రజా సంక్షేమ, అభివృద్ధి నిర్ణయాలను తీసుకుందంటూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్ధసారథి తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ సమావేశం నిర్వహించి Chief Minister| ముఖ్యమంత్రి Chandrababu| చంద్రబాబు ఆధ్వర్యంలో కీలకమైన విధానాత్మక నిర్ణయాలు తీసుకోవడం పాలనలో పారదర్శకతకు, చర్చల ప్రాధాన్యతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

రాజధాని నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ కోసం ల్యాండ్ పూలింగ్ రూల్స్–2025 రూపొందించి కేబినెట్ ఆమోదించినట్టు మంత్రి తెలిపారు. అసైన్డ్ భూములపై వివాదాలు లేకుండా, పునర్విమర్శలతో రీ సర్వే చేసి మెరుగైన ప్యాకేజీతో ల్యాండ్ పూలింగ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. జీఎడీ టవర్, హెచ్‌వోడి టవర్ల నిర్మాణ పనులు ఎన్‌సీసీ, షాపూజీ పల్లంజీ, ఎల్ అండ్ డీలకు అప్పగించినట్టు వివరించారు.

రాష్ట్రంలో కొత్తగా 7 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నట్టు తెలిపారు. భవన నిర్మాణాల నిబంధనల్లో మార్పులు చేస్తూ, వాటిని సులభతరం చేయాలని కేబినెట్ ఆమోదించినట్టు తెలిపారు. టెన్నిస్‌లో రజత పతకం సాధించిన సాకేత్ సాయికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటక అభివృద్ధిలో భాగంగా గండికోట వద్ద రిసార్టు నిర్మాణానికి 50 ఎకరాల భూమి కేటాయించిందని తెలిపారు.

శ్రీశైలం డ్యామ్, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ భద్రతా పనుల కోసం రూ.350 కోట్లు మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేయాలని సీఎం ఆదేశించినట్టు చెప్పారు. గోదావరి నుంచి వృథాగా సాగిపోయే 3 వేల టీఎంసీలు నీటిని వినియోగించుకునేందుకు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు తీసుకువచ్చినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే విధంగా చేపట్టనున్నట్టు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

Vijayawada| విజయవాడలో Ambedkar| అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణాన్ని సోషల్ వెల్ఫేర్ శాఖ నుంచి ఏపీ కల్చరల్ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేయాలని నిర్ణయించగా, పెండింగ్ పనులకు నిధులు విడుదల చేసి పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. రాజధాని అమరావతిలో అధునాతన సదుపాయాలతో కన్వెన్షన్ సెంటర్ నిర్మించనున్నట్టు తెలిపారు. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

రాష్ట్రంలో 4,687 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయనున్నట్టు తెలిపారు. విశాఖపట్నం మధురవాడలో 22.19 ఎకరాల్లో కాగ్నిజెంట్ సంస్థ 1,582 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమ ఏర్పాటు చేయనుందని, దాని ద్వారా 8,000 ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అమరావతిలో E3 రోడ్డును NH-16 కు అనుసంధానించేందుకు రూ.682 కోట్లకు టెండర్లు ఆమోదించినట్టు వెల్లడించారు.

ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా 273.17 కోట్లతో పొగాకు కొనుగోలు చేయనున్నట్టు, 20 మిలియన్ టన్నుల పొగాకు సేకరించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది పొగాకు సాగు కోసం క్రాప్ హాలిడే ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. పరిశ్రమల రంగంలో రాష్ట్రానికి 28,546 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, వీటిద్వారా 30,270 ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. స్మార్ట్ ఆంధ్ర సంస్థను “స్వర్ణాంద్ర పి4 ఫౌండేషన్”గా మారుస్తూ ప్రతిపాదనలు ఆమోదించినట్టు తెలిపారు.

ఏడాది పాలన సందర్భంగా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో సభలు నిర్వహించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. అదే సమయంలో పల్నాడు పర్యటన సందర్భంగా JAGAN| జగన్ చేపట్టిన కార్యకలాపాలను తప్పుబడుతూ, అనుమతులేకుండా నిరసనలు, బలప్రదర్శన నిర్వహించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. నరికేస్తాం, తొక్కేస్తాం లాంటి భాషను సమర్థించడం దురదృష్టకరమని, ఇలాంటి హింసాత్మక భావజాలం ప్రజల మధ్యకు రాకూడదని హితవు పలికారు.

బనకచర్ల ప్రాజెక్టుపై ఎవరికైనా విమర్శ అవసరం లేదని, వృథాగా వెళ్లే గోదావరి నీటిని వినియోగించుకునేందుకు, రెండు రాష్ట్రాలకు లాభదాయకంగా ఉండేలా ఈ ప్రాజెక్టు రూపొందించామని తెలిపారు. సామరస్యపూర్వక చర్చల ద్వారానే బనకచర్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథాన్ని సీఎం చంద్రబాబు కలిగి ఉన్నారని మంత్రి పార్ధసారథి వివరించారు.

Latest News

భూకంపం పుట్టిస్తున్న భూ సేకరణ!|EDITORIAL

అభివృద్ధి ప్రజల సహకారంతో మాత్రమే సుస్థిరంగా ఉంటుంది. రైతులను భాగస్వాములుగా కాకుండా బాధితులుగా మార్చే విధానాలు దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉండవు. అమరావతి వంటి మహత్తర ప్రాజెక్ట్ విజయవంతం కావాలంటే, అక్కడి రైతుల నమ్మకం,...

29-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 07.30 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం హస్త రాత్రి 12.00 వరకు ఉపరి చిత్త యోగం హర్షణ రాత్రి 08.52 వరకు ఉపరి వజ్ర కరణం కౌలవ ఉదయం...

ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్! హార్మూజ్ ని తెరుస్తాం! కానీ,

అమెరికాకు ఇరాన్ రెండు షరతులు అమెరికా-ఇరాన్ చర్చలపై అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఇరాన్ కొత్త ప్రతిపాదనలు ముందుకు తెచ్చింది. హర్మూజ్ జలసంధిని తెరిచి నౌకల రాకపోకలకు అనుమతిస్తామని తెలిపింది. అయితే అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని...

శిన్న శిట్కాతోటి కొవ్వు ఖతం!?|ADUGU TRENDS

ఇగిప్పుడు అందరి బాధా గా పెయ్యిల శెడు కొవ్వే! మనం తినే ఆహారపు అలవాట్లు, బతుకు తెరువులు బాగా మారినయి. జీవన శైలి గూడ మస్తుగ మారింది. ఇగ గిదీంతోటి పెయ్యిల అట్టు...

కొంగ జపం శాంతి తపం!?|EDITORIAL

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు నిజమేనా? అసలా చర్చలు దౌత్య నాటకమా? నిజమైన పరిష్కార ప్రయత్నమా? మధ్యప్రాచ్యంలోని తాజా ఉద్రిక్తతలను పరిశీలిస్తే ఈ ప్రశ్న తలెత్తక మానది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య...

28-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 07.22 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ఉత్తర రాత్రి 11.09 వరకు ఉపరి హస్త యోగం వ్యాఘాత రాత్రి 09.48 వరకు ఉపరి హర్షణ కరణం బవ ఉదయం...

27-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.45 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం పుబ్బ రాత్రి 10.46 వరకు ఉపరి ఉత్తర యోగం ధ్రువ రాత్రి 11.09 వరకు ఉపరి వ్యాఘాత కరణం వణజి ఉదయం...

పదే పదే అదే మాట!|BRS|KCR|TELANGANA

గెలిస్తే కేసీఆర్ క్రెడిట్|CREDIT ఓడితే ప్రజలదే పొరపాటు|PEOPLE గులాబీ బాస్ వింత శోధన|PINK BOSS కేసీఆర్ వితండ వాదన వెయ్యేళ్ళైనా బీఆర్ఎస్ కు బుద్ధి రాదా? ఇక కేసీఆర్, ఆయన ఫ్యామిలీ మారదా? ‘అప్పుడు ఓట్లేసి తప్పు చేశారు... ఇప్పడు ప్రజలు...

గోడకు నీల్లు పట్టే ఇకమతు!?|ADUGU TRENDS

కొత్తగ ఇల్లు కడితే, గా గోడలకు నీల్లు పట్టుడు అంత అల్కన కాదు. గోడలెక్కి పైపుతోటి నీల్లు కొట్టాలె. లేకపోతే గా కింది నుండే పైపుతోటి గోడలకు పట్టాలె. ఇగ గా నీల్లతోటి...

కవిత కొత్త పార్టీ భవిష్యత్తేంటి?|EDITORIAL

కవిత రాజకీయ ప్రయాణం ఒక అవకాశమూ, ఒక పరీక్ష కూడా. ప్రజా సమస్యలను నిజాయితీగా అర్థం చేసుకుని, వాటికి పరిష్కారాలు చూపగలిగితేనే ఈ పార్టీ నిలబడుతుంది. లేని పక్షంలో ఇది కూడా ఇతర...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 26 నుండి మే 02 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనుల్లో చురుకుదనం కనిపిస్తుంది. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి మెరుగైన...

పేదోడి ఏసీ ఎట్లుందో సూడుండ్రి!?|ADUGU TRENDS

పేదోల్ల ప్రిజ్జు కూజలు, మట్టికుండల్ని సూసినం. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్లు.. కొన్నింటికి మనం కొనలేనప్పుడు, గసొంటి వాటినే కాస తక్కువల తయారు చేసుకుంటం. రకరకాల ఉపాయాలు శేత్తం. ఇగ గీ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News