కాకినాడ తీరంలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు మరణిస్తున్న సమస్యపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. తాబేళ్ల మరణాలకు కారణమైన అంశాలను గుర్తించి, సంబంధిత కారకులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వన్యప్రాణుల పరిరక్షణకు మరింత మెరుగైన చర్యలు తీసుకునేందుకు సమగ్ర అధ్యయనం అవసరమని తెలిపారు. ఈ దర్యాప్తు ఫలితాలు త్వరగా అందుబాటులోకి రాగ, తీర ప్రాంతంలో తాబేళ్ల సంరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని పవన్ కల్యాణ్ ఆదేశాలు ఇచ్చారు

