Thursday, April 30, 2026
31.7 C
Hyderabad

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు దారితీస్తున్నాయి. నగరాల సుందరీకరణ, పెట్టుబడులు, పర్యాటకం వంటి లక్ష్యాలు ఎలా ఉన్నా, ప్రజల కనీస నివాస హక్కులు, జీవనోపాధి ప్రశ్నార్థకం అవుతున్నాయి.

ఎనిమిది దశాబ్దాల స్వతంత్ర పాలనలో కూడా దేశంలో పేదరికం తొలగిపోలేదు. పాలకుల్లో నిజాయితీ, నిబద్ధత, దూరదృష్టి, చిత్తశుద్ధి లోపించడమే ఇందుక్కారణం. ప్రజలు కట్టే పన్నులను, వనరులను సమర్థంగా వినియోగించగలిగినా, సమాజంలో కనీస అభివృద్ధి సాధ్యమే. కానీ, పాలకులు సంక్షేమం పేరుతో తాత్కాలిక ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తూ, దీర్ఘకాలిక ప్రణాళికలను విస్మరిస్తున్నారు. పేదరికం నిర్మూలాంశం కాకుండా, నిరపేక్ష రాజకీయాంశంగా మారింది.

ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించారు. నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూశారు. తెలంగాణను తెచ్చామంటున్న కేసీఆర్ పాలనలో భారీ ప్రాజెక్టులు చేపట్టినా, వాటి అమలు అధ్వాన్నంగా మారింది. మల్లన్న సాగర్, కొండ పోచమ్మసాగర్ రిజర్వాయర్ల కోసం గ్రామాలను ఖాళీ చేయించాల్సి వచ్చింది. వేలాది ఎకరాల భూములు సేకరించబడ్డాయి. కానీ ఆ ప్రాజెక్టుల నిర్వాసితులకు సరైన పునరావాసం, స్థిరమైన జీవనోపాధి కల్పించడంలో విఫలమయ్యారు. పైగా ఆ నిర్వాసితులు గూడు విడిచిన పక్షుల్లా కకావికలమయ్యారు.

మూసీ నదిని శుద్ధి చేసి, సబర్మతి తరహాలో సుందరీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టింది. మొదటి దశలో, రూ.4,100 కోట్ల ఏడీబ్లోన్ రుణంతో, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుండి బాపూఘాట్ వరకు 20 కి.మీ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా గాంధీ సరోవర్, పర్యాటక ప్రాంతాలు, అమ్యూజ్‌మెంట్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, గ్రీన్‌స్పేస్‌లు ఏర్పాటు చేస్తారు. 55 కి.మీ. మేర నది ప్రక్షాళన జరుగుతుంది, రూ.3,100 కోట్లతో ట్రంక్ ఇంటర్సెప్టర్ సీవర్ పైప్‌లైన్ పనులు కూడా చేపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం 50 మీటర్ల బఫర్ జోన్‌తో సహా 3,279 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం డీపీఆర్ పూర్తి చేసి, పనులను వేగం చేస్తోంది. అయితే, భూసేకరణ, ప్రజల తరలింపు, పర్యావరణం, పునరావాసం వంటి వివాదాలు, అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అయితే, ఈ ప్రాజెక్టు అమలుపైనే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూసీ పరివాహకంలో నివసిస్తున్న వేలాది కుటుంబాలను తరలించక తప్పదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కబ్జాలను పక్కన పెడితే, మరి నిర్వాసితులకి పునరావాసం ఎక్కడ కల్పిస్తారు? భూమి కోల్పోయిన వారికి భూమి ఇస్తారా? ఇళ్లు కోల్పోయిన వారికి సముచిత గృహాలు కట్టిస్తారా?

మూసీ ప్రక్షాళన జరగాల్సిందే. అదే సమయంలో ఆ పరివాహకంలో నివసించే వారికి నివాసం, విద్య, వైద్యం, ఉపాధి, రవాణా వంటి సౌకర్యాలు అందేలా చూడాలి. అప్పుడు మాత్రమే ఆ పరివాహక ప్రజలు కూడా ఈ మార్పును స్వాగతిస్తారు. లేకపోతే తిరగబడతారు. ప్రతిపక్షాల ఈ అవకాశం కోసమే కాచుక్కూచుకున్నాయన్నది మరవరాదు.

మూసీ ప్రక్షాళన, పర్యావరణ పునరుద్ధరణ, పర్యాటకాభివృద్ధి నగర భవిష్యత్తుకు అవసరమైన లక్ష్యాలే. కానీ వాటిని సాధించే ప్రక్రియలో ప్రజల జీవన హక్కులు దెబ్బతినకూడదు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టు కేవలం మౌలిక వసతుల ప్రణాళికగా కాకుండా, సమగ్ర సామాజిక పునరావాస ప్రణాళికగా మారాలి.

అభివృద్ధి విజయవంతం కావాలంటే ప్రజల విశ్వాసం, భాగస్వామ్యం అవసరం. పారదర్శకంగా సాగితేనే మూసీ ప్రాజెక్టు హైదరాబాద్ నగరానికి గర్వకారణంగా నిలుస్తుంది. లేకపోతే అది మరో వివాదాస్పద ప్రాజెక్టుగా మిగిలిపోతుంది. అభివృద్ధి ప్రజల కోసం అయితేనే దానికి అర్థం ఉంటుంది. ప్రజలే ప్రథమం అనే సూత్రాన్ని గుర్తుంచుకుంటేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది.

Latest News

అదిరింది..గీ బొంగులతో పందిరి!?|ADUGU TRENDS

సల్లగుండాలె! సూడ్డానికి మంచిగుండాలె! ఏం శేయాలె? గిట్ల ఆలోసించిన గీ అన్నకు భలే ఐడియా వచ్చింది. గదేందో సూత్తాం పదండ్రి. అసలే ఎండా కాలం.. ఆపైన వానా కాలం. ఇగ తర్వాత సలికాలమే అనుకోండ్లి!...

కవిత్వాన్ని భూమార్గం పట్టించిన మహాకవి!|EDITORIAL

సమాజాన్ని మేల్కొలిపే శక్తి సాహిత్యానికి ఉంది. ఆ శక్తికి రూపం ఇచ్చినవారు కవులు. అలాంటి కవుల్లో అగ్రగణ్యుడు శ్రీరంగం శ్రీనివాసరావు, అంటే “శ్రీశ్రీ”. ఆయన కవిత్వం కేవలం సాహిత్యానికే పరిమితం కాలేదు. అది...

30-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు చతుర్దశి రాత్రి 08.06 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం చిత్త రాత్రి 01.21 వరకు ఉపరి స్వాతి యోగం వజ్ర రాత్రి 08.23 వరకు ఉపరి సిద్ది కరణం గరజి ఉదయం...

భూకంపం పుట్టిస్తున్న భూ సేకరణ!|EDITORIAL

అభివృద్ధి ప్రజల సహకారంతో మాత్రమే సుస్థిరంగా ఉంటుంది. రైతులను భాగస్వాములుగా కాకుండా బాధితులుగా మార్చే విధానాలు దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉండవు. అమరావతి వంటి మహత్తర ప్రాజెక్ట్ విజయవంతం కావాలంటే, అక్కడి రైతుల నమ్మకం,...

29-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 07.30 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం హస్త రాత్రి 12.00 వరకు ఉపరి చిత్త యోగం హర్షణ రాత్రి 08.52 వరకు ఉపరి వజ్ర కరణం కౌలవ ఉదయం...

ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్! హార్మూజ్ ని తెరుస్తాం! కానీ,

అమెరికాకు ఇరాన్ రెండు షరతులు అమెరికా-ఇరాన్ చర్చలపై అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఇరాన్ కొత్త ప్రతిపాదనలు ముందుకు తెచ్చింది. హర్మూజ్ జలసంధిని తెరిచి నౌకల రాకపోకలకు అనుమతిస్తామని తెలిపింది. అయితే అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని...

శిన్న శిట్కాతోటి కొవ్వు ఖతం!?|ADUGU TRENDS

ఇగిప్పుడు అందరి బాధా గా పెయ్యిల శెడు కొవ్వే! మనం తినే ఆహారపు అలవాట్లు, బతుకు తెరువులు బాగా మారినయి. జీవన శైలి గూడ మస్తుగ మారింది. ఇగ గిదీంతోటి పెయ్యిల అట్టు...

కొంగ జపం శాంతి తపం!?|EDITORIAL

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు నిజమేనా? అసలా చర్చలు దౌత్య నాటకమా? నిజమైన పరిష్కార ప్రయత్నమా? మధ్యప్రాచ్యంలోని తాజా ఉద్రిక్తతలను పరిశీలిస్తే ఈ ప్రశ్న తలెత్తక మానది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య...

28-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 07.22 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ఉత్తర రాత్రి 11.09 వరకు ఉపరి హస్త యోగం వ్యాఘాత రాత్రి 09.48 వరకు ఉపరి హర్షణ కరణం బవ ఉదయం...

27-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.45 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం పుబ్బ రాత్రి 10.46 వరకు ఉపరి ఉత్తర యోగం ధ్రువ రాత్రి 11.09 వరకు ఉపరి వ్యాఘాత కరణం వణజి ఉదయం...

పదే పదే అదే మాట!|BRS|KCR|TELANGANA

గెలిస్తే కేసీఆర్ క్రెడిట్|CREDIT ఓడితే ప్రజలదే పొరపాటు|PEOPLE గులాబీ బాస్ వింత శోధన|PINK BOSS కేసీఆర్ వితండ వాదన వెయ్యేళ్ళైనా బీఆర్ఎస్ కు బుద్ధి రాదా? ఇక కేసీఆర్, ఆయన ఫ్యామిలీ మారదా? ‘అప్పుడు ఓట్లేసి తప్పు చేశారు... ఇప్పడు ప్రజలు...

గోడకు నీల్లు పట్టే ఇకమతు!?|ADUGU TRENDS

కొత్తగ ఇల్లు కడితే, గా గోడలకు నీల్లు పట్టుడు అంత అల్కన కాదు. గోడలెక్కి పైపుతోటి నీల్లు కొట్టాలె. లేకపోతే గా కింది నుండే పైపుతోటి గోడలకు పట్టాలె. ఇగ గా నీల్లతోటి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News