Tuesday, August 4, 2026
29.8 C
Hyderabad

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు దారితీస్తున్నాయి. నగరాల సుందరీకరణ, పెట్టుబడులు, పర్యాటకం వంటి లక్ష్యాలు ఎలా ఉన్నా, ప్రజల కనీస నివాస హక్కులు, జీవనోపాధి ప్రశ్నార్థకం అవుతున్నాయి.

ఎనిమిది దశాబ్దాల స్వతంత్ర పాలనలో కూడా దేశంలో పేదరికం తొలగిపోలేదు. పాలకుల్లో నిజాయితీ, నిబద్ధత, దూరదృష్టి, చిత్తశుద్ధి లోపించడమే ఇందుక్కారణం. ప్రజలు కట్టే పన్నులను, వనరులను సమర్థంగా వినియోగించగలిగినా, సమాజంలో కనీస అభివృద్ధి సాధ్యమే. కానీ, పాలకులు సంక్షేమం పేరుతో తాత్కాలిక ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తూ, దీర్ఘకాలిక ప్రణాళికలను విస్మరిస్తున్నారు. పేదరికం నిర్మూలాంశం కాకుండా, నిరపేక్ష రాజకీయాంశంగా మారింది.

ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించారు. నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూశారు. తెలంగాణను తెచ్చామంటున్న కేసీఆర్ పాలనలో భారీ ప్రాజెక్టులు చేపట్టినా, వాటి అమలు అధ్వాన్నంగా మారింది. మల్లన్న సాగర్, కొండ పోచమ్మసాగర్ రిజర్వాయర్ల కోసం గ్రామాలను ఖాళీ చేయించాల్సి వచ్చింది. వేలాది ఎకరాల భూములు సేకరించబడ్డాయి. కానీ ఆ ప్రాజెక్టుల నిర్వాసితులకు సరైన పునరావాసం, స్థిరమైన జీవనోపాధి కల్పించడంలో విఫలమయ్యారు. పైగా ఆ నిర్వాసితులు గూడు విడిచిన పక్షుల్లా కకావికలమయ్యారు.

మూసీ నదిని శుద్ధి చేసి, సబర్మతి తరహాలో సుందరీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టింది. మొదటి దశలో, రూ.4,100 కోట్ల ఏడీబ్లోన్ రుణంతో, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుండి బాపూఘాట్ వరకు 20 కి.మీ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా గాంధీ సరోవర్, పర్యాటక ప్రాంతాలు, అమ్యూజ్‌మెంట్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, గ్రీన్‌స్పేస్‌లు ఏర్పాటు చేస్తారు. 55 కి.మీ. మేర నది ప్రక్షాళన జరుగుతుంది, రూ.3,100 కోట్లతో ట్రంక్ ఇంటర్సెప్టర్ సీవర్ పైప్‌లైన్ పనులు కూడా చేపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం 50 మీటర్ల బఫర్ జోన్‌తో సహా 3,279 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం డీపీఆర్ పూర్తి చేసి, పనులను వేగం చేస్తోంది. అయితే, భూసేకరణ, ప్రజల తరలింపు, పర్యావరణం, పునరావాసం వంటి వివాదాలు, అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అయితే, ఈ ప్రాజెక్టు అమలుపైనే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూసీ పరివాహకంలో నివసిస్తున్న వేలాది కుటుంబాలను తరలించక తప్పదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కబ్జాలను పక్కన పెడితే, మరి నిర్వాసితులకి పునరావాసం ఎక్కడ కల్పిస్తారు? భూమి కోల్పోయిన వారికి భూమి ఇస్తారా? ఇళ్లు కోల్పోయిన వారికి సముచిత గృహాలు కట్టిస్తారా?

మూసీ ప్రక్షాళన జరగాల్సిందే. అదే సమయంలో ఆ పరివాహకంలో నివసించే వారికి నివాసం, విద్య, వైద్యం, ఉపాధి, రవాణా వంటి సౌకర్యాలు అందేలా చూడాలి. అప్పుడు మాత్రమే ఆ పరివాహక ప్రజలు కూడా ఈ మార్పును స్వాగతిస్తారు. లేకపోతే తిరగబడతారు. ప్రతిపక్షాల ఈ అవకాశం కోసమే కాచుక్కూచుకున్నాయన్నది మరవరాదు.

మూసీ ప్రక్షాళన, పర్యావరణ పునరుద్ధరణ, పర్యాటకాభివృద్ధి నగర భవిష్యత్తుకు అవసరమైన లక్ష్యాలే. కానీ వాటిని సాధించే ప్రక్రియలో ప్రజల జీవన హక్కులు దెబ్బతినకూడదు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టు కేవలం మౌలిక వసతుల ప్రణాళికగా కాకుండా, సమగ్ర సామాజిక పునరావాస ప్రణాళికగా మారాలి.

అభివృద్ధి విజయవంతం కావాలంటే ప్రజల విశ్వాసం, భాగస్వామ్యం అవసరం. పారదర్శకంగా సాగితేనే మూసీ ప్రాజెక్టు హైదరాబాద్ నగరానికి గర్వకారణంగా నిలుస్తుంది. లేకపోతే అది మరో వివాదాస్పద ప్రాజెక్టుగా మిగిలిపోతుంది. అభివృద్ధి ప్రజల కోసం అయితేనే దానికి అర్థం ఉంటుంది. ప్రజలే ప్రథమం అనే సూత్రాన్ని గుర్తుంచుకుంటేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది.

Latest News

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News