Friday, April 10, 2026
36.2 C
Hyderabad

ఏపీలో ‘కల్తీ’ ఆజ్యం’!|EDITORIAL

సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంలో పడింది. లడ్డూ తయారీలో ఉపయోగించే ‘నెయ్యి కల్తీ’ అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తీవ్ర ఉద్రిక్తతల్లోకి నెట్టింది. పవిత్ర ఆలయ ప్రసాదం రాజకీయ యుద్ధంగా మారి, చివరికి పరస్పర దూషణలు, దాడులు, విధ్వంసాలకు దారితీయడం రాష్ట్ర ప్రజాస్వామ్య స్థాయిని దిగజార్చింది. రాజకీయాల్లో విమర్శలు సహజమే, కానీ, దానికి పవిత్ర ఆలయాన్ని ఆలవాలం చేసుకోవడమేగాక, హింసాత్మకం చేయడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు.

ఇటీవల జోగిరమేశ్ ఇంటిపై పెట్రో బాంబు దాడి ప్రయత్నం, అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడులు, గతంలో నెల్లూరు జిల్లాలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన ఘటనలు రాజకీయ అసహనానికి ప్రతీకలు. వైకాపా హయాంలో ఇలాంటివి జరిగాయని విమర్శించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు పునరావృతమవడం అత్యంత దురదృష్టకరం. అధికారంలో ఎవరు ఉన్నా, ప్రజాస్వామ్యంలో హింసకు ఆస్కారం ఇవ్వకూడదు.

పవిత్ర తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన తిరుమల శ్రీవారి ప్రసాదం కల్తీ నెయ్యితో తయారైందన్న అంశాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో ఆలయ భూములు, ఆభరణాలు, నియామకాలు, పూజా విధానాలపై వివాదాలు వచ్చినా, లడ్డూ ప్రసాదం అంశం మాత్రం మరింత సున్నితమైనది.

2024 మేలో చంద్రబాబు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల ప్రక్షాళనపై హామీలు ఇచ్చారు. కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకం తర్వాత లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. టీటీడీ అధికారులే పోలీసులకు ఫిర్యాదు చేయడం, ప్రభుత్వం ‘సిట్‌’ను నియమించడం వేగంగా జరిగిపోయాయి. ఇదే సమయంలో టీటీడీ మాజీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి సిట్‌కు బదులుగా సీబీఐ విచారణ కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

సుప్రీం కోర్టు ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధారాలు లేకుండా లడ్డూలో కొవ్వు కలిసిందని ప్రకటించి భక్తుల మనోభావాలను దెబ్బతీయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగవద్దని హితవు పలికింది. అనంతరం సీబీఐ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో విచారణ జరిపి 36 మందిని నిందితులుగా చార్జిషీటులో చేర్చింది. ఉత్తరాఖండ్‌కు చెందిన భోలే బాబా డెయిరీ నిర్వాహకులు విపిన్ జైన్, పోమిల్ జైన్‌లను ప్రధాన కారకులుగా గుర్తించింది.

సీబీఐ నివేదిక ఈ వివాదానికి మరో మలుపు ఇచ్చింది. నెయ్యిలో భారీ స్థాయిలో కల్తీ జరిగిందని, అది అసలు నెయ్యే కాదని తేల్చినప్పటికీ, జంతు కొవ్వు లేదా పంది కొవ్వు కలిపినట్టు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. నమూనాల్లో నిజమైన నెయ్యి శాతం చాలా తక్కువగా ఉండగా, పామాయిల్, పామ్ స్టియరిన్, ఇతర రసాయనాలు కలిపినట్టు నిర్ధారించింది. భోలే బాబా డెయిరీ నుంచి పాలు లేదా నెయ్యి సరఫరా అయిన దాఖలాలు లేవని కూడా పేర్కొంది.

ఈ నివేదికను తమకు అనుకూలంగా మలుచుకుంటూ వైసీపీ నేతలు ‘మేము నిర్దోషులం’ అన్న ప్రచారాన్ని తీవ్రం చేశారు. జగన్ సహా పలువురు నేతలు ప్రాయశ్చిత్త హోమాలు, ఆలయ సందర్శనలు చేస్తూ రాజకీయ సంకేతాలు పంపారు. అయితే నెయ్యిలో కొవ్వు లేదన్న అంశాన్ని మాత్రమే పట్టుకుని, 200 కోట్ల రూపాయలకుపైగా విలువైన కల్తీ నెయ్యి సరఫరా నిజాన్ని విస్మరించడం సరికాదు. కల్తీ జరిగిందన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు.

వాస్తవానికి ఈ వ్యవహారాన్ని ఒక పార్టీ లేదా ఒక ప్రభుత్వ వైఫల్యంగా చూడలేం. ఎవరు అధికారంలో ఉన్నా ఏడుకొండలపై అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. పవిత్రతకు ప్రతీక అయిన తిరుమల వ్యవస్థలో లోపాలు కొనసాగుతున్నాయన్నది చేదు నిజం. కానీ ఈ అంశాన్ని రాజకీయంగా రెచ్చగొట్టి, ప్రజలను విభజించి, హింసకు ప్రేరేపించడం అత్యంత ప్రమాదకరం. అభ్యంతరకరం.

చివరికి ఈ వివాదం రాజకీయ విమర్శల నుంచి భౌతిక దాడుల వరకూ వెళ్లడం రాష్ట్రానికే కాదు రాజకీయాలకూ మంచిది కాదు. అధికార మార్పిడి ఇదే సంస్కృతి మరింత తీవ్రంతరం చేస్తుందన్న భయం సహజం. అందుకే ఇలాంటి సున్నితమైన పవిత్ర అంశాలను రాజకీయం చేయడం తగదు. పవిత్రమైన దేవాలయాలను రాజకీయ యుద్ధ భూములుగా వాడుకోచూడటం బుద్ధి తక్కువ తనం. పవిత్ర ఆలయాలను, వాటి మానాన వాటిని వదిలేద్దాం. భక్తుల మనోభావాలను గౌరవిద్దాం. అవమానపర్చడం ఆపేద్దాం. రాజకీయాలను వేరుగా చేద్దాం. ఇకిప్పుడు ఇల వైకుంఠాన్ని అకుంఠిత దీక్షతో పరిరక్షిద్దాం.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News