Friday, April 10, 2026
36.2 C
Hyderabad

తెలంగాణ మగువల పూల జాతర!|EDITORIAL

తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులన్నీ నిండి కళకళలాడుతున్నాయి. పచ్చటి పంటపొలాలతో అలరారుతున్నాయి. అలాగే తంగేడు, గునుగు, గడ్డిపూలు వివరివిగా దొరకుతుండటంతో బతుకమ్మ సంబురాలు ఊరూవాడా ఉత్సాహంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇస్తోంది.

తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని దశదిశలా చాటి చెప్పే పండుగ ’బతుకమ్మ’. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా పువ్వులనే పూజించే సంస్కృతి ఒక తెలంగాణలోనే కనబడుతుంది. ముఖ్యం గా స్త్రీలకు అత్యంత ఇష్టమైన పండుగ గా ప్రసిద్ధికెక్కింది. తెలంగాణ అస్తిత్వాన్ని చాటిచెప్పే పండుగ మాత్రమే కాదు, స్త్రీల ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటే పండుగ. ఆడపడుచులందరికీ అత్యంత విశిష్టమైన పండుగ ఇది.
పూల జాతరను తలపించే, బతుకమ్మ పండుగ ప్రతి ఏటా సెప్టెంబర్‌/అక్టోబర్‌ నెలల్లో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి మొదలవుతుంది. దీనిని 9 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఈ బతుకమ్మను గౌరీ పండుగ అని కూడా అంటారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై, సద్దుల బతుకమ్మ వరకు రోజుకో తీరుగా ఆడి పాడే పండుగ. ఆ మరుసటి రోజే దసరా పండుగ వైభవంగా జరుపుకుంటారు. మహాలయ అమావాస్యతో ప్రారంభమై, దుర్గాష్టమితో ముగుస్తుంది. బతుకమ్మ పండుగంటే, ఆడబిడ్డల హృదయాలు ఉప్పొంగుతాయి. అన్నా చెల్లెల అనుబంధాలు, తల్లి బిడ్డల ప్రేమానుబంధాలు వెల్లివిరుస్తాయి. ఈ పూల పండుగ కోసం ఎదురు చూస్తూ.. అత్తగారింట్లో ఉన్న ఆడపిల్లలు మెట్టినింటి నుండి పుట్టినింటికి వస్తారు.
తెలంగాణలో శతాబ్దాలుగా జరుపుకుంటున్న ఈ పండుగ సంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో చారిత్రక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు నవాబులు, భూస్వాములు, పెత్తందార్లతో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి ఆకృత్యాలకు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకుని, తోటి మహిళలు పూజించే వారు. అట్లా వారి ప్రతీకగా పూలను పేర్చి బతుకమ్మ బతుకమ్మ అంటూ పాడేవారు. మరో చారిత్రక కథనం ప్రకారం చోళ రాజుల కాలంలో వేములవాడ నుండి శివలింగాన్ని పార్వతి నుండి వేరు చేసి తంజావూరు (తమిళనాడు)కు తరలించారు. దాంతో తమ దుఃఖాన్ని ఆనాటి చోళ రాజులకు తెలియజేస్తూ మేరు పర్వతములా పూలను పేర్చి బతుకమ్మను ఆడేవారు. తమ భావనలను కైకట్టి పాడేవారరు. ‘బృహదమ్మ’ పేరే చివరకు బతుకమ్మగా మారిందని అంటారు. వెయ్యి ఏళ్ళుగా బతుకమ్మ పండుగ చేసుకోవడం సంప్రదాయంగా వస్తోందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

ఇంకో పౌరాణిక కథ ప్రకారం, ఆనాటి చోళరాజు ధర్మాంగదునికి సంతానం ఉండదు. అనేక నోములు, వ్రతాలు ఫలితంగా ఆయన భార్యకు నూరుగురు పుత్రులు పుడతారు. అయితే, కాలం కలిసి రాక వారంతా యుద్ధాలలో ప్రాణాలు కోల్పోతారు. ఆ రాజదంపతులు తీరని దుఃఖంతో లక్ష్మీ దేవిని కొలుస్తారు. ఆ దేవతనే తమ కడుపున పుట్టమని వేడుకుంటారు. లక్ష్మీదేవి వారికి కుమార్తెగా పుడుతుంది. మునులంతా వచ్చి ఆమెను, ’నిండు నూరేళ్లు బతుకమ్మా’ అని దీవిస్తారు. అలా లక్ష్మీదేవే ’బతుకమ్మ’ గా పిలువబడుతుందని చెబుతారు. మహావిష్ణువు మరో చోట చక్రాంకుడనే రాజుగా జన్మిస్తాడు. అతనే లక్ష్మీ స్వరూపులైన బతుకమ్మను పెళ్లి చేసుకుంటాడు. నాటి నుండి దేశ ప్రజలంతా లక్ష్మీదేవి అవతారంగా బతుకమ్మను పూలతో అలంకరించి పండుగ జరుపుకుంటున్నారు.

బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి మరొక జానపద కథ కూడా ప్రచారంలో ఉంది. ఓ రైతుకు ఏడో సంతానంగా ఆడపిల్ల పుడుతుంది. అంతకు ముందు పుట్టిన ఆరుగురు ఆడపిల్లలు చనిపోతారు. దాంతో ఈమెను బతికిన అమ్మగా భావిస్తారు. అమ్మ నాన్నలే కాదు, ఊరూవాడ జనులంతా అప్పటి నుంచి ’బతుకమ్మ’ అని పిలుస్తారు. ఆమెతోడ ఒక్కడే అన్న. అతనికి చెల్లెలు అంటే పంచప్రాణాలు. బతుకమ్మకు పెళ్లి కాగానే అత్తగారింటికి పంపుతారు. భర్త ఆమెను బాగా చూసుకుంటాడు. అయితే పుట్టింటికి వచ్చిన సమయంలో వదిన, బతుకమ్మ పట్ల అన్న చూపించే ప్రేమని భరించలేక పోతుంది. అసూయ పడతది. అన్న ఊరు వెళ్లిన సమయం చూసుకొని, బతుకమ్మతో వదిన కలిసి చెరువు వద్దకు వెళతారు. అవకాశం కోసం ఎదురు చూసే వదిన, బతుకమ్మను గొంతు పిసికి చంపేస్తుంది. అక్కడే గొయ్యి తీసి పాతి పెడుతుంది. కానీ, అదే రోజు రాత్రి బతుకమ్మ తన అన్నకు కలలో వచ్చి విషయమంతా చెబుతుంది. చెరువు కట్టపై తాను తంగేడు చెట్టుగా పుట్టానని, వెంటనే వచ్చి తీసుకెళ్ళమని ప్రాధేయ పడుతుంది. అన్న వెళ్లి చూడగా అక్కడ తంగేడు చెట్టు బతుకమ్మ రూపంలో దర్శనమిస్తుంది. ఇతర పూలతో కలిపి తంగేడు పూలు జోడించి, బతుకమ్మను పేర్చి నీటిలో నిమజ్జనం చేయమని కోరుతుంది. ఇక అప్పటి నుంచి బతుకమ్మను పూజించే ఆచారం ఏర్పడిందని అనేక మంది విశ్వాసం.

బతుకమ్మను పేర్చి, మధ్యలో పసుపుతో గౌరమ్మను నిలుపుతారు. పూజలు చేసి. ధూప దీప నైవేద్యాలు సమర్పించి బయటకు తీసే ముందు బతుకమ్మను ఆ ఇంటి ఆడపడుచు తలమీద లేదా చేతులతో పట్టుకొని ఇంటి ముందు నిలబడ్డప్పుడు కొబ్బరికాయ కొట్టి, కాళ్లకు నీలారా పోసి డప్పు చప్పుళ్ళతో సమీపంలో ఉన్న దేవాలయం ప్రాంగణం లేదా విశాలమైన చావిడి వద్దకు సమూహంగా వెళ్తారు. బతుకమ్మలను ఒక చోట పెట్టి తీరోక్క పాటలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుకుంటూ ఆడతారు.

బతుకమ్మ పాటల్లో గ్రామీణ జీవనం ఉట్టి పడుతుంది. ఈ పాటలన్నీ తెలంగాణ సంస్కృతిని, విశిష్టతను చాటిచెబుతాయి. అసలు బతుకమ్మ అంటే ఓ రంగుల కల. పూల పండుగ. ఆడపడుచుల జానపద పాటలు, కోలాటం పాటలు, ఉయ్యాల పాటలు ఇలా ప్రతి ఒక్కటి సాంస్కృతిక వైభవాన్ని తరతరాలకు తెలియజేస్తాయి.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News