Friday, April 3, 2026
35.2 C
Hyderabad

ASSEMBLY|అసెంబ్లీ వేదికగా… సమరానికి సై!|WAR

చట్ట సభల్లో వార్!?
మాటల యుద్ధం!!
కయ్యానికి CONGRESS|కాంగ్రెస్ సిద్ధం
దండెత్తనున్న BRS|గులాబీ గళం
కథన రంగంలోకి BJP|కమలదళం
మూమెంట్ ను బట్టి AIMIM|ఎంఐఎం
అస్త్రశస్త్రాలతో అధికార పక్షం
కత్తులు నూరుతున్న విపక్షాలు
ఆరు గ్యారెంటీలే వాటి అస్త్రాలు
రాష్ట్రం దివాళే అభివ్రుద్ధికి ఆటంకం
బీసీలకు 24శాతం రిజర్వేషన్ల బిల్లు, జీవో
సెప్టెంబర్ రెండో వారంలోనే స్థానిక నోటిఫికేషన్
కాళేశ్వరం అవినీతిపై కమిషన్ నివేదిక బహిర్గతం
ఫోన్ ట్యాపింగ్, ఆర్థిక భారాలే GOVERNMENT|సర్కార్ కు శస్త్రాలు
వాడివేడిగా ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు

ఓవైపు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశ పెట్టొద్దని హై కోర్టులో భంగపడ్డ మామా అల్లుళ్ళు కేసీఆర్, హరీశ్ రావులు, తాజాగా మధ్యంతర దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి అసెంబ్లీలో చర్చించినా సరే, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, న్యాయస్థానం తీర్పు ఇచ్చే వరకు ఆ నివేదికనే సస్పెండ్ చేయాలని వారు కోరారు. మరోవైపు ఈ రోజే అసెంబ్లీలో కాలేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టి, చర్చించేందుకు సర్కార్ సంసిద్ధమైంది. ఇదే కాకుండా, అధికార పక్షం, ప్రతిపక్షంపై మరిన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంది. బీసీలకు 24శాతం రిజర్వేషన్ల బిల్లుపై చర్చించి, ఆ వెంటనే జీవోను తేనుంది. సెప్టెంబర్ రెండో వారంలోనే స్థానిక నోటిఫికేషన్ వెలువడేలా చకచకా పావులు కదుపుతోంది. ఇంకా.. ఫోన్ ట్యాపింగ్, ఆర్థిక భారాలు వంటి, శస్త్రాలను సంధించడానికి సిద్ధం చేసుకుంది. ప్రతిపక్షాలని పూర్తిగా కట్టడి చేయడానికి ప్రత్యేకంగా తమ డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన సెలెక్టెడ్ టీమ్ కు తగిన తర్ఫీదు ఇచ్చి, తయారు చేసుకుంది. అయితే, ప్రతిపక్షం రాష్ట్రంతో సంబంధంలేని యూరియాను, అరిగిపోయిన రికార్డుగా మారిన ఆరు గ్యారెంటీలను, ప్రకృతి వైపరీత్యమైన వర్షాలను అస్త్రాలను చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు తమ ఉనికిని చాటుకోవడానికి బీజేపీ రెఢీ అంటున్నా, యూరియా సరఫరా, బీసీ బిల్లు వంటి అంశాలు ఆ పార్టీకి ముగుతాడు వేస్తున్నాయి. ఎంఐఎం సందర్భాన్ని బట్టి ఎలా వ్యవహరించాలో సిద్ధంగానే ఉంది. అసెంబ్లీ సమరానికి సై అంటున్నపార్టీలతో సమావేశాలు వాడి వేడిగా సాగనున్నాయి. కాగా, కాలం కలిసొచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వంలో వర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్, ఆగస్టు 30 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
సీన్ రివర్స్ అయింది. సిన్మా అసాధారణంగా ప్రతిపక్షానికి కనిపిస్తోంది. ఆడ లేక ఓడే అధికార పార్టీ, ఆడించే స్థానానికి చేరింది. తెలంగాణలో నేటి నుండి జరుగనున్న ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఒక విచిత్ర పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలంటే అధికార పార్టీకి ఎక్కడో బెరుకు, వెన్నులో వణుకు ఉంటాయి. కానీ ఈసారి అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉత్సాహంగా ఉరుకలు వేస్తోంది. సభకైనా, సవాళ్ళకైనా, సమరానికైనా సై అంటున్నది.
తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు బయటి చలిని మరిపించే, వాడి వేడిగా జరగనున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాట యుద్ధం జరగబోతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ప్రతిపక్షమే డిఫెన్స్ లో ఉంది. అధికార పక్షం అఫెన్స్ లో ఉంది. మిగతా పార్టీలు అసలు ఈ ఆట ఆడాలో తెలియని ఆయోమయంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంత ఉత్సాహంగా ఉంది.
అందుకు తగ్గ అస్త్ర, శస్త్రాలను సిద్ధం చేసుకుని అన్నింటికీ సంసిద్ధంగా ఉంది. కానీ, ప్రతిపక్షం మాత్రం ఈ సారి సభకు భయపడుతున్నట్లుగా ఉంది. బెరుకుగా, వణుకుగా కనిపిస్తోంది. మాటల్లో ఉండే వాడి, వేడి మెల్లగా కొరవడుతోంది. కాళేశ్వరం అవినీతిపై వేసిన కమిషన్ నివేదిక ఆపార్టీకి ఆశనిపాతంగా, భీతావహంగా మారింది. అందుకే మామా అల్లుళ్ళ కోర్టుల గుమ్మాలను ఎక్కుతూ, మొక్కుతూ ఉన్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వంటివేవోవో వారు వదలించుకున్నా, విదిలించుకున్నా, వారిని వదిలేలా లేవు. వదిలించేలా సీఎం లేరు. కోర్టులు, నిబంధనలు, సభా నియమాలు, చివరకు కాలం కూడా వారికి కలిసి వచ్చేలా లేవు. బీఆర్ఎస్ ను అధికార పార్టీ అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ ప్రజా కోర్టు బోనులో దోషిగా నిలిపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది.

మరోవైపు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై త్వరలోనే వెలువడనున్న నోటిఫికేషన్ ప్రతిపక్షాన్ని ఉక్కిరిబిక్కిర చేయనున్నాయి. అరిగిపోయిన ఆరు గ్యారెంటీల గ్రామఫోన్ రికార్డు కూడా వారిని గట్టెక్కించేలా కనిపించడం లేదు. అసెంబ్లీలో పడే అవినీతి మచ్చతోనే స్థానిక సమరానికి వెళ్లాల్సిన పరిస్థితిని రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షానికి కల్పించనున్నారు.

తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు బయటి చలిని మరిపించే, వాడి వేడిగా జరగనున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాట యుద్ధం జరగబోతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ప్రతిపక్షమే డిఫెన్స్ లో ఉంది. అధికార పక్షం అఫెన్స్ లో ఉంది. మిగతా పార్టీలు అసలు ఈ ఆట ఆడాలో తెలియని ఆయోమయంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంత ఉత్సాహంగా ఉంది.
కయ్యానికి మేం సైతం అంటున్నకమల దళం, ప్రధాన ప్రతిక్షం బీఆర్ఎస్ ల మధ్య కాంగ్రెస్ ఉన్నా, వేటికవే ఆ పార్టీలను కట్టడి చేయడానికి ప్రభుత్వం రెఢీ అయిందని తెలుస్తోంది. అందుకు అంశాల వారీగా, బీఆర్ఎస్ ను, బీజేపీని, అవసరమైతే ఎంఐఎంను కూడా అడ్డుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.

అటు భాజాపా, భారాసా మధ్యలో కాంగ్రెస్
ఎంఐఎం కూడా వారి స్థాయిలో వారు తమ మంత్రి వర్గాన్ని, ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీలలో తగిన సబ్జెక్ట్, వాగ్ధాటి ఉన్న వారిని గుర్తించి, వేర్వేరుగా తయారు చేసినట్లు తెలుస్తోంది. సభలో అధికార పార్టీని ఇరుకున పెట్టే అంశాలు వచ్చినప్పుడు వ్యవహరించే తీరుతోపాటు, ఎదురుదాడి చేసేందుకు తగిన తర్ఫీదు ఇచ్చినట్ల సమాచారం. ఈసారి ప్రతిపక్షాలను అష్ట దిగ్బంధనం చేసి, అన్ని విధాలుగా పై చేయి సాధించాలని పాకులాడుతున్నట్లుగా సమాచారం.

సీఎం సహా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వివేక్, సీతక్క, పొన్నం, లక్ష్మణ్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మందుల సామెల్, వేముల వీరేశం, కడియం, దానం వంటి ఎమ్మెల్యేలు మండలిలో మరికొందరిని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

దీనికి దీటుగా కాగ్ నివేదికలు, ఆరు గ్యారెంటీల అమలు, ప్రభుత్వంలో అవినీతి, యూరియా, వర్షాకాల వైపరీత్యం, రైతాంగ సమస్యలు వంటి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి.
ఇక మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ యథావిధిగా ఈసారి కూడా అసెంబ్లీకి హాజరయ్యేలా లేరు. దీంతో ఆ భారతమంతా కేటీఆర్, హరీశ్ రావులు, మధ్య మధ్య జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి వంటి వారిపై పడనుంది. దీంతో అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరగున్నాయి.

సర్కార్ లో వర్షాతిరేకాలు!
కాంగ్రెస్ కు కలిసొచ్చిన ‘కాలం’

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడో లేదో తెలియదు కానీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం కాలం కలిసే వచ్చింది. తెలంగాణలో నిన్న మొన్నటి దాకా కురుస్తూనే ఉన్న భారీ వర్షాలు కాంగ్రెస్ లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుంటే, సర్కార్ లో మాత్రం వర్షాతిరేకాలు వెల్లడవుతున్నాయి. కరువు నుంచి కరువు తీరా పడిన వానలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని విధాలుగా కలిసివచ్చిందనే చెప్పాలి. వర్షాల్లేక రైతుల ఆందోళన ప్రభావం నేరుగా ప్రభుత్వంపై పడింది. మరోవైపు అప్పులతో దివాళా తీసిన రాష్ట్ర ఖజానా వెక్కిరిస్తోంది. అప్పులకు వడ్డీలు కట్టలేని దీన స్థితి దిక్కుమాలి ఉంది. చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితుల్లో ఆరు గ్యారెంటీల అమలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దైన్యం దర్జాగా తిష్టేసిం. రెగ్యులర్ పథకాలకు కూడా నిధుల కొరత తిక్కలేపుతోంది. యువ వికాసం లాంటి పథకాలను లాంచ్ చేయలేక లబోదిబోమంటున్నది సర్కార్.
ఈ సమయంలోనే వానలు లేక దిగాలు పడిన రైతులు నేరుగా సర్కార్ నే టార్గెట్ చేశారు. వర్షాల్లేవ్, రైతు బంధు వస్తదో రాదో? పంట నష్టాలు ఎలాగూ సర్కార్ ఇవ్వదు. వీటిని ఎవరు భరించాలె? సర్కార్ వైఫల్యాలను గుర్తు చేసుకుంటూ మరీ రైతులు తిట్టిపోశారు. ఇక ఇప్పుడు వద్దంటే వానలు కురిసి రైతులు పంటల పనుల్లో బిజీగా మారారు. ఎవరి పనుల్లో వారున్నారు. దీంతో రైతుల నుంచి, కాలం కావడంలేదన్న ఇతర అన్ని వర్గాల నుంచి సర్కార్ పై వ్యతిరేకత తగ్గిందనే చెప్పాలి. జనగామ జిల్లా లాంటి ఎత్తైన మెట్ట ప్రాంతాల్లో మాత్రం వర్షాలు సాధారణ స్థాయిలో కూడా కురవలేదు. పైగా, చెరువులు, కుంటలు నిండక, కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ వరకు ఇంకా వర్షాకాలం మిగిలే ఉన్నందున అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే, నిన్న, మొన్నటి పరిస్థితుల కంటే ఓవర్ ఆల్ గా సర్కార్ పై వ్యతిరేకత చాలా వరకు తగ్గింది.

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News