Sunday, April 12, 2026
36.2 C
Hyderabad

ప్రపంచ జనాభాలో మనమే నెంబర్ వన్!|EDITORIAL

ప్రపంచ జనాభా ఇప్పటికే 800 కోట్లు దాటింది. భారతదేశ జనాభా అధికారికంగా 146కోట్లకు చేరుకుంది. చైనా పకడ్బందీ జనాభా నియంత్రణతో 2వ స్థానానికి చేరుకుంది. 1987 జూలై 11న ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకున్న సందర్భాన్ని స్ఫూర్తిగా తీసుకుని, 1989లో ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా జనాభాపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు1989 జూలై 11వ తేదీన ’ప్రపంచ జనాభా దినోత్సవాన్ని’ నిర్వహించడం మొదలు పెట్టింది. ఆనాటి నుండి ప్రతి ఏటా జనాభా దినోత్సవం నిర్వహిస్తున్నారు. కుటుంబ నియంత్రణ, లింగ సమానత్వం, పేదరికం, తల్లి ఆరోగ్యం, మానవ హక్కులు వంటి వివిధ జనాభా సమస్యలపై ప్రజలకు అవగాహన పెంచడం ప్రపంచ జనాభా దినోత్సవం లక్ష్యం. 2025 ఏడాదికి ‘న్యాయమైన, ఆశాజనకమైన ప్రపంచంలో యువతకు వారు కోరుకున్న కుటుంబాల్ని స్రుష్టించే అధికారాన్ని ప్రసాదించడం’ అనే థీమ్ ని నిర్ణయించారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో మన దేశం (146 కోట్ల జనాభా) మొదటి స్థానంలో ఉంది. చైనా (142 కోట్ల జనాభా) రెండో స్థానంలో ఉంది. వరసగా అమెరికా, ఇండోనేషియా, పాకిస్తాన్, నైజీరియా, బ్రెజిల్, బంగ్లాదేశ్, రష్యా, ఇథియోపియా దేశాలు మిగతా స్థానాల్లో ఉన్నాయి. జనాభా వృద్ధి రేటులో భారత దేశం 4వ స్థానంలో ఉండగా, చైనా -0.23శాతం ఉండటం విశేషం. ప్రపంచ జనాభాతో పోల్చినప్పుడు భారత దేశ వృద్ధిరేటు 18.3 శాతం ఉండగా, చైనా వృద్ధి రేటు 17.7శాతంగా నమోదైంది.

ఇక దేశంలో జనాభా పెరుగుదలలో రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వరసగా మొదటి పది స్థానాలను ఆక్రమించాయి.

అధిక జనాభా ఆహారం, నీరు, గృహనిర్మాణం, ఉద్యోగాల కొరత వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది ఆరోగ్య సంరక్షణ, విద్యా వ్యవస్థలపై అపారమైన ఒత్తిడిని కలిగిస్తుంది. అధిక జనాభా వల్ల పర్యావరణ, కాలుష్య సమస్యలు కూడా సంభవిస్తాయి. అధిక జనాభాను అరికట్టడానికి అవగాహన, కుటుంబ నియంత్రణ, స్థిరమైన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించాలి. ఇప్పుడే చర్యలు తీసుకోకపోతే, అధిక జనాభా ప్రభావం భవిష్యత్ తరాల జీవన ప్రమాణాలకు ముప్పు కలిగిస్తుంది.

ముఖ్యంగా మన దేశంలో స్థిరమైన అభివృద్ధి వైపు పయనించాలంటే జనాభా నియంత్రణ అత్యంత కీలకం. జనాభా నియంత్రణ లేకుండా, సహజ వనరులు, ఉద్యోగాలు, గృహనిర్మాణం, ఆరోగ్య సంరక్షణ వంటివి సాధించడం అసాధ్యమవుతుంది. జనాభా నియంత్రణ ద్వారా పేదరికాన్ని నిర్మూలించగలం. ప్రజల జీవన ప్రమాణాలను పెంచవచ్చు.

మనం నివసిస్తున్న ఈ భూమొత్తాన్ని ఉపయోగించుకోవాల్సిన వనరుగా కాకుండా, సంరక్షించాల్సిన ఇల్లుగా పరిగణించాలి. లింగబేధం లేకుండా అందరికీ విద్యను అందించాలి. ప్రతి ఒక్కరూ గౌరవంగా, భద్రత, సమాన అవకాశాలతో జీవించగలిగే సమాజాన్ని సృష్టించాలి.

నియంత్రణ లేకపోవడంతో ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగి పోతున్నది. పెరిగిన జనాభా వలన పలు ప్రపంచ దేశాలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ప్రజలకు కనీస మౌలిక సదుపా యాలు కల్పించ లేక సతమతమ వుతున్నాయి. విద్య,వైద్యం,ఆరోగ్యం, త్రాగునీరు, పారిశుధ్యం వంటి అనేక అంశాల్లో ప్రభుత్వాలు ప్రజలకు న్యాయం చేయలేక పోతున్నాయి. పెరుగుతున్న జనాభా కారణంగా కనీస వసతుల కల్పన ఏ ప్రభుత్వానికైనా తలకుమించిన భారంగా మారుతోంది. గృహకల్పన, అక్షరాస్యత, నిరుద్యోగం, పౌష్ఠికాహారం, ఉద్యోగ కల్పన వంటి అంశాలు విషమ సమస్యలుగా మారాయి. ప్రకృతి వైపరీత్యాలతో అనేక దేశాలు సతమతమవు తున్నాయి. చాలా దేశాల్లో ఈనాటికీ కనీస విద్య గగనకుసుమంలా మారింది. ఆహార సమస్యతో అనేక దేశాలు అలమటిస్తున్నాయి.

మనదేశంలో త్వరలోనే జన, కుల జన గణన జరుగనుంది. జనాభాపై పూర్త క్లారిటీ రానుంది. పెరుగుతున్న జనాభాకనుగుణంగా మన ప్రభుత్వాలు ఏం చేయనున్నాయన్నది కీలకంగా మారనుంది. జనాభా నియంత్రణపై దృష్టి సారించాలి. లేకుంటే దేశ వనరులు బతకడానికి కూడా సరిపోవు. జనభా నియంత్రణపై మన ప్రభుత్వం చైనా లాగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

అందరికీ ఆరోగ్యం అన్న లక్ష్యానికి ఇంకా దూరంగా వుండడానికి అధిక జనాభాయే కారణం. అయితే కొన్ని అంశాలలో అంతర్జాతీయ స్థాయి వైద్యం అందిస్తున్నామని చెప్పుకుంటున్నా…నేటికీ సామాన్యులకు అది కలగానే మిగిలింది. ఫార్మా, వ్యాక్సిన్ల రంగాల్లో ముందంజ వేస్తున్నా, జనాభాకు సరిపడా అందించలేని దుస్థితిలో ప్రపంచం ఉంది. అధిక జనాభా ఆరోగ్యరంగం అసమానతలకు కారణంగా మారింది. ప్రపంచంలో జనాభా పెరుగుదలను కట్టడి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వాలు లేకపోవడం ఈ దారుణానికి కారణంగా చూడాలి.

ముఖ్యంగా భారత్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ లాంటి దేశాలు జనాభా నియంత్రణపై దృష్టి పెట్టడం లేదు. దీంతో పెరుగుతున్న జనాభాతో వనరులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇది వెంటనే చర్చించాల్సిన అతిపెద్ద సమస్యగా చూడాలి. జనాభా పెరుగుతున్న కొద్దీ సమస్యలు కూడా పెరుగుతాయని గుర్తించాలి. ప్రతి కుటుంబం తమకు తాముగా జనాభా నియంత్రణకు కట్టుబడాలి. ప్రభుత్వాలు జనాభా నియంత్రణకు కఠిన చట్టాలు అమలు చేయాలి.

Latest News

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్-2|HISTORY|ARTEMIS-2

సురక్షితంగా భూమికి చేరిన వ్యోమగాములు చంద్రుడి చుట్టూ చారిత్రాత్మక పది రోజుల యాత్రను ముగించుకుని నాసాకు చెందిన 'ఆర్టెమిస్-2' వ్యోమగాములు శనివారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి చేరుకున్నారు. కాలిఫోర్నియాలోని శాన్టియాగో తీర సమీపంలో పసిఫిక్...

గిది అగ్గిపెట్టేనుల్లా!?|ADUGU TRENDS

గిది నిజ్జంగా అగ్గి పెట్టే! గా ఎండకు ఎండదు. ఆనకు తడవదు. సలికి మండకుండా ఉండదు. జేబుల పెట్టుకుంటే మోటుగుండదు. అరె! మరైతే గిదేం అగ్గిపెట్టే? అని గద అనిపిస్తుంది. కనీ, గిది...

దేశంలో సామాజిక సమస్యలకు పరిష్కారాలేవి!?|EDITORIAL

భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించి 80 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న ఈ సందర్భంలో, సాధించిన విజయాలకన్నా ఎదుర్కొంటున్న సవాళ్ళే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, సామాజిక రంగంలో ఇంకా...

11-04-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ నవమి రాత్రి 08.34 వరకు ఉపరి దశమి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 10.08 వరకు ఉపరి శ్రవణ యోగం సిద్ద మధ్యాహ్నం 03.29 వరకు ఉపరి సాధ్య కరణం తైతుల ఉదయం 07.59...

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News