Wednesday, May 6, 2026
33.2 C
Hyderabad

PARTY|పార్టీ POST|పదవికి RESPECT|గౌరవం, బాధ్యతా భావంతో కృషి చేయాలి

GANDHI BHAVAN| గాంధీభవన్ PCC| పిసిసి సమావేశంలో CM|సీఎం REVANTH REDDY| రేవంత్ రెడ్డి

గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి మరియు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ పిసిసి కమిటీ సభ్యులకు కీలక దిశానిర్దేశం చేశారు. పార్టీ భవిష్యత్తు, నాయకత్వ వికాసం, రాష్ట్ర ప్రగతిపై ఆయన స్పష్టమైన విధానాన్ని వ్యక్తపరిచారు. రాష్ట్రాన్ని దేశంలోనే మోడల్‌గా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానిదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రంలో నూతన పాలనతో ప్రజలకు సంక్షేమ పథకాల ఫలితాలు నేరుగా అందిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడి తెచ్చి కుల గణన చేపట్టేలా చేయడంలోనూ కాంగ్రెస్ పార్టీ విజయవంతమైందని గుర్తు చేశారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో గొప్ప ప్రగతిని సాధించాం. ఇదంతా కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమైంది. ప్రజలు నమ్మిన పార్టీగా మళ్లీ ఎన్నికల వేళ తమ ఆశలు మాతో పెట్టుకుంటారు అని సీఎం వ్యాఖ్యానించారు.

పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 45 లక్షల మందిని క్రియాశీలక సభ్యులుగా నమోదు చేయడమే కాకుండా, YOUTH CONGRESS| యూత్ కాంగ్రెస్, NSUI| ఎన్ఎస్యూఐ, జిల్లా అధ్యక్షులుగా ఉన్న వారిలో చాలామందికి ప్రభుత్వ పదవులు వచ్చాయని తెలిపారు. ఇది పార్టీ కార్యకర్తలకు విలువనిచ్చే విధానానికి నిదర్శనమన్నారు.

పార్టీ పదవులు సాధించిన ప్రతి ఒక్కరూ అవి క్యాజువల్‌గా తీసుకోకూడదు. అవి మీకిచ్చే గౌరవానికి ప్రతీకలు. రాజకీయ జీవితంలో ఎదుగుదలకు ఇవే బలం. ఇప్పటి నుంచే గ్రామాలకు వెళ్లి ప్రజల మధ్య ఉండాలి. వారి సమస్యలు తెలుసుకోవాలి. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని, పార్టీ విజయంలో ఇదే కీలకమవుతుంది. అందరూ సమన్వయంతో పనిచేస్తేనే నాయకత్వం గుర్తింపు ఇస్తుంది అని సూచించారు.

రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల సంఖ్య పెరగబోతున్న నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల విధానం, జమిలి ఎన్నికల ప్రభావం పార్టీ వ్యవస్థపై ఉండే అవకాశాన్ని సీఎం వివరించారు. 2029 ఎన్నికలు నూతన నాయకత్వానికి వేదికగా మారాలనీ, ఇప్పటి నుంచే ప్రతి నాయకుడు ప్రణాళికతో కష్టపడాలనీ పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం. అందరూ కలిసికట్టుగా పనిచేసి మళ్లీ రెండోసారి అధికారంలోకి రావాలి. మనకు పార్టీగా ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది – ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ సామాజిక న్యాయాన్ని సమర్థించడమే. ఈ దిశగా ప్రతి కార్యకర్త నిబద్ధతతో ముందుకు సాగాలి అని సీఎం స్పష్టం చేశారు.

అలాగే, పార్టీ జాతీయ అధ్యక్షుడు MALLIKHARJUN KHARGE| మల్లికార్జున ఖర్గే సుదీర్ఘకాలం ప్రజా ప్రతినిధిగా సేవలందించిన అరుదైన ఘనత సాధించారనీ, వారిని స్ఫూర్తిగా తీసుకుని కొత్త తరం నాయకులు అభివృద్ధి చెందాలని సీఎం సూచించారు. పార్టీ పదవులతోనే గుర్తింపు లభిస్తుందని, వాటికి తగిన గౌరవం, బాధ్యతతో వ్యవహరించాలని ఆయన పునరుద్ఘాటించారు.

Latest News

ప్లాస్టిక్ టబ్బే వాష్ బేసిన్!?|ADUGU TRENDS

తెలివుండాలె. ఇగ గదే ఉంటే ఎన్ని ఉపాయాలైనా శేయొచ్చు. గట్లనే గీ తమ్ముడు మంచి పాయమే శేసిండు. ప్లాస్టిక్ టబ్బును వాష్ బేసిన్ శేసిండు. కర్సు తక్కువల గదెట్ల శేసిండో మనమూ సూద్దామానుల్లా? ఒక...

విజయాలు సరే, జన జీవన ప్రమాణాలేంటి!|EDITORIAL

ఎన్నికలు కేవలం అధికార మార్పిడికి ప్రక్రియ మాత్రమే కాదు. అవి ప్రజల ఆశలు, ఆకాంక్షలు, సంతృప్తులు, అసంతృప్తుల ప్రతిబింబం. దేశంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే, దేశవ్యాప్తంగా ఓటర్లు స్పష్టంగా...

06-05-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి పూర్తిగా రోజంత నక్షత్రం మూల మధ్యాహ్నం 01.04 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ద రాత్రి 10.40 వరకు ఉపరి సాధ్య కరణం కౌలవ సాయంత్రం 05.36 వరకు ఉపరి...

మార్పు… తీర్పు!|ELECTIONS|5 STATES|RESULTS

బెంగాల్ లో కమల ప్రభజనం|WEST BENGAL తమిళనాట దళపతి సంచలనం|TAMILNADU కేరళలో యూడీఎఫ్|KERALAM అసోంలో బీజేపీ హ్యాట్రిక్|ASSAM పుదుచ్చేరిలో కమలం|PUDUCHERRY ఓడిపోయిన మమత, స్టాలిన్|MAMATHA BENARJEE|STALIN పరువునిలుపుకున్న విజయన్|VIJAYAN ‘దళపతి’తో ‘సోపతి’ ఎవరు?|THALALPATHY VIJAY నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ?|TELANGANA ఐదు రాష్టాల ఎన్నికల ఫలితాలు బిజెపికి...

తమిళనాట కొత్త చరిత|TAMILANADU|TVK PARTY

ద్రవిడ పార్టీలకు చరమగీతం అనూహ్యంగా దళపతి విజయం|THALAPATHY VIJAY స్టాలిన్ కు ఘోర పరాజయం|STALIN ప్రభావం చూపని బీజేపీ నేతలు|BJP LEADERS తమిళనాట కొత్త చరిత్ర ఆవిష్కృతమయ్యింది. అనూహ్యంగా దూసుకు వచ్చిన నటుడు విజయ్ పార్టీ తమిళనాట జెండా...

గదేం సూకిల్? గిదేం మాయ!?|ADUGU TRENDS

అవునుల్లా..! గీ సైకిల్ ను తొక్కేటోడు కంటికి కనిపించడు. కనీ, గా సైకిల్ మాత్రం రోడ్ల మీద పోతనే ఉంటది. ఇగ గిది సూసినోల్లు.. గిదేం సిత్రమని నోల్లు ఎల్లబెడతాండ్రు. గీ ముచ్చట...

మార్పుకై ప్రజల తీర్పు!|EDITORIAL

భారత రాజకీయాల్లో ప్రతి అసెంబ్లీ ఎన్నిక జాతీయ ఎన్నికలపై ప్రభావం చూపేదే. దేశ రాజకీయాలను మలుపు తిప్పేవే. సంకీర్ణ దశ నడుస్తున్న ప్రస్తుత దశలో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నది. గత కొన్ని...

05-05-2026 మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం సంకట హరచతుర్థి తిధి బ చవితి రాత్రి తెల్ల 04.40 వరకు ఉపరి పంచమి నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 10.29 వరకు ఉపరి మూల యోగం శివ రాత్రి 10.06 వరకు ఉపరి సిద్ద కరణం...

04-05-2026 సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 02.36 వరకు ఉపరి చవితి నక్షత్రం అనూరాధ ఉదయం 07.51 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం పరిఘ రాత్రి 09.26 వరకు ఉపరి శివ కరణం వణజి మధ్యాహ్నం...

ఆర్యవైశ్య మహాసభలో ఆంధ్రా పెత్తనం|ARYAVAISHYA MAHASABHA|ANDHRA

ఆర్యవైశ్య మహాసభ అట్టర్ ప్లాప్ తెలంగాణ నేతల బహిష్కరణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నేత మిడిదుడ్డి శ్యామ్ సుందర్ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ఆంధ్రా పెత్తనమే కొనసాగుతోందని, తెలంగాణ వైశ్యనేతలు దూరంగా ఉండటమే ఇందుకు కారణమని రాష్ట్ర...

గా ప్లాస్టిక్ పైపులతోటి ఇంటికప్పు!?|ADUGU TRENDS

ఎవలైనా గూన పెంకలు, బెంగుళూరు పెంకలతోటో, రేకులతోటో, సిమిటి కాంక్రీటుతోటో ఇంటికి పై కప్పేత్తరు. కానీ, గీ అన్న ఏకంగా ప్లాస్టిక్ పైపులతోటే ఇంటికప్పేసిండు. గీయనకు పై కప్పుల్లో పపంచ కప్పే ఇయ్యాలె...

అప్పుల ఊబీలోకి దేశం, రాష్ట్రాలు!|EDITORIAL

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సంక్షేమ పథకాల విస్తరణ, పెరుగుతున్న అప్పులు, ఆదాయ వనరుల పరిమితి, దుబారా ఖర్చులు, ఖర్చుల ప్రాధాన్యతా లోపాలు, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News