చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలోని పరమపావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంభరీ నవరాత్ర మహోత్సవములు శనివారం మూడవ రోజుకు చేరుకున్నాయి. క్షీరాన్న నివేదన నీరాజన మంత్ర పుష్ప శాకంభరీ ఉత్సవ నిర్వహణలోని మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా అమ్మవారి దశ మహావిద్యలలోని కాళీ క్రమాన్ని, షోడశీ క్రమాన్ని అనుసరించి ఉదయం “కుల్లా”, సాయంకాలం *”నిత్యక్లిన్నా” గాను అమ్మవారిని అలంకరించి నవరాత్ర విశేష పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఆలయ ఈవో శేషుభారతీ, ఆలయ సిబ్బంది, ధర్మకర్తల ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

