Friday, June 5, 2026
27 C
Hyderabad

పాఠాలు, గుణపాఠాలు నేర్పిన PLANE ACCIDENT|విమాన ప్రమాదం!|EDITORIAL

AHMEDABAD| అహ్మదాబాద్‌ AEROPLANE| విమాన దుర్ఘటన నుంచి మనం ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. సాంకేతిక లోపమో, మానవ తప్పిదమో కానీ, మారణహోమం జరిగిపోయింది. ఎన్నో కలలు, మరెన్నో ఆశలతో ఆ విమానాన్ని ఎక్కిన వారు గమ్యాన్ని ముద్దాడక ముందే మృత్యువుని ముద్దాడారు. ఎంతో నమ్మకమైన, భద్రంగా పేరున్న AIR INDIA| ఎయిర్ ఇండియా విమానం పూర్తిగా ఎయిర్ లోకి వెళ్ళక ముందే కుప్పకూలిపోయింది. విమానాన్ని గమ్యానికి చేర్చే ట్యాంక్ నిండా ఉన్న ఫ్యూయల్ అందులోని వాళ్ళని మంటల్లో మాడ్చి మసి చేసింది. ఒకేసారి వెయ్యి డిగ్రీల వేడిని రగిల్చిన ఆ మంటలకు అందులోని ప్రయాణీకులు, సిబ్బంది, పైలట్ సహా అంతా కాలిబూడిదైపోయారు. ఒకే ఒక్కడు మృత్యుంజయుడైయ్యాడు. తనను తానే నమ్మలేని విధంగా బతికి బట్టకట్టాడు.

గగన ప్రయాణం గరళ ప్రయాణంగా మారిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం పౌర విమాణ చరిత్రలోనే అత్యంత విషాదాన్ని మిగిల్చింది. విమానం ఎగిరిన కొద్ది నిమిషాల్లోనే నేలకొరిగింది. మంటల్లో మాడిపోయింది. యంత్రాలు పని చేయలేదో? మరెదో? కానీ, పైలట్ ఇచ్చిన సమాచారానికి, సమాధానం కూడా వినలేని దీన స్థితిలో అది కూలిపోయింది. బహుషా జనావాసాల్లో కూలిపోకుండా పైలట్ తీసుకున్న జాగ్రత్త వల్లనో ఏమో పక్కకు తప్పించబోయినా, అది పైలట్ చేతిలో లేకుండా పోయి, మెడికల్ కాలేజీ భవనంలోకి దూసుకుపోయింది. దీంతో డాక్టర్లు, మెడికోలు ఈ ప్రమాదంలో మరణించారు. జానవాసాల్లోని కొందరు మృత్యువాతపడ్డారు. మొత్తానికి ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 డ్రీమ్‌ లైనర్ విమాన ప్రమాదం ఘోర విషాదాన్ని నింపింది. విమానంలోని 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 మంది సిబ్బంది మొత్తం 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరు బతికారు. విమానం కూలిన వైద్య కళాశాల మెడికోల వసతి గృహ సముదాయం ధ్వంసమై 33 మంది వరకూ మృతి చెందడటంతో మృతుల సంఖ్య 274కు చేరింది.

2009లో 787-8 డ్రీమ్‌ లైనర్ ప్రపంచంలో వాడుకలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన తొలి ప్రమాదం కూడా ఇదే కావడం విశేషం. బోయింగ్ 787 లోపభూయిష్టమని, ప్రయాణికులకు ప్రమాదకరమని సలోహ్‌పోర్ అనే విజిల్‌బ్లోయర్ ఏడాది క్రితమే హెచ్చరించారని ప్రచారం జరుగుతోంది. లోపాల కారణంగా విమానం పదేపదే ప్రయాణించిన తర్వాత ముక్కలైపోవచ్చని చెప్పారట. ఆ సమస్యే ఎయిర్ ఇండియా విమానం కూలడానికి కారణం కావచ్చని అన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే విమాన ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవచ్చని కూడా తన వాంగూల్మంలో పేర్కొన్నారు. ఇప్పుడు సలోహ్‌పోర్ అనుమానమే నిజమైందా?

ఇక విమానం కూలిన ప్రదేశంలో దొరికిన బ్లాక్ బాక్స్ ఆధారంగా ప్రమాద కారణాలను అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాయిస్, సిస్టమ్ డాటాను విశ్లేషిస్తున్నారు. ప్రమాదంపై దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

విమానం కూలిపోయే సమయంలో పరిస్థితిని ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)తో పైలెట్ మాట్లాడిన మాటలు అర్థం చేస్తున్నాయి. ‘విమానంలో పవర్ లేదు. నో థ్రస్ట్. గోయింగ్ డౌన్.. మేడే.. మేడే.. మేడే..’ అని పైలెట్ సుమత్ చెప్పారు. థ్రస్ట్ అంటే విమానాన్ని ముందుకు నడిపే శక్తి. ఇది విమానం ఇంజిన్‌లు లేదా ప్రొపెల్లర్ల ద్వారా ఉత్పత్తి అవుతుంది. థ్రస్ట్ అంటే నెట్టడం అనే అర్థం కూడా ఉంది. అయితే ఈ విమాన ప్రమాదానికి ఇంజిన్ లేదా ప్రొపెల్లర్ల వైఫల్యం కారణమని భావించవచ్చా? ప్రమాద కారణాలను అన్వేషించేందుకు జాతీయ దర్యాప్తు బృందం(ఎన్‌ఐఏ) రంగంలోకి దిగింది.

ఈ ఘటన మనకు ప్రధానంగా విమాన యానంలోని సాంకేతికత నైపుణ్యాలని మరింత సాధించాలన్న సత్యాన్ని చాటింది. సాధారణంగా విమనాలు బయలుదేరే ముందు దాని సామర్థ్యం, యంత్రాల పనితీరు, సాంకేతికతలు, లోపాలను పరిశీలించిన తరవాతనే ప్రయాణానికి సంసిద్ధమవుతారు. అలా జరిగిందా? లేదా? అలాగే ఆ ఎయిరిండియా విమానం ఢిల్లీ నుండి అహ్మదాబాద్ మీదుగా లండన్ వెళుతున్నది. అహ్మదాబాద్ వరకు బాగానే వచ్చిన విమానం ఒక్కసారిగా ఎందుకలా అయ్యింది? మరే కోణమైనా ఉందా? అన్నవి తేలాల్సిన అంశాలు. 146 కోట్లు ఉన్న దేశ జనాభాకు తగ్గట్లుగా ఇప్పటికీ విమానయానం లేదు, విమానాలు లేవు, విమానాశ్రయాలు లేవన్న విమర్శలను ఒకసారి ఆలోచించుకోవాలి. తాజా ఘటనపై సునిశిత పరిశోధన జరగాలి.

నిజానికి అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటన ఒళ్ళు జలదరింప చేస్తోంది. ఆ పెనువిషాదం గుండెలను పిండేస్తున్నది. వందల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఎందరో కలలను చిదిమేసింది. తప్పెవరిదైనా వందలాది ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. కొన్ని బతుకులు ఛిద్రం అయ్యాయి. విమనాల ఉత్పత్తి మొదలు సాంకేతికత వరకు సమగ్ర అధ్యయనం చేయాలి. ఈ ప్రమాదం నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా తన విమానాల సంపూర్ణ ప్రక్షాళనకు సిద్ధపడాలి. దేశీయ విమానయాన సంస్థల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి. సాంకేతిక వైఫల్యాల నుంచి మానవ నిర్లక్ష్యం వరకూ ఈ ప్రమాదానికి దోహదం చేసిన అన్ని అంశాలను గుర్తించి, అవసరమైన చర్యలను చేపట్టాలి.

Latest News

నల్లా దానంతటదే బందైతది!|ADUGU TRENDS

నల్లా పెట్టుడే కాదుల్లా, బంజేసుడు కూడా పెద్ద పనే. నల్లా తిప్పితే నీళ్లొత్తయి. కనీ, నల్లా బంజేయాల్నంటే, గాడ కావలి కాయాలె. లేకపోతే, నా నీల్లన్నీ తొణికి, బయటకి కారిపోతయి. గట్ల కావొద్దని...

‘మమత’ల కోవెలలో వేరుకుంపట్ల కలతలు|EDITORIAL

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా కొనసాగిన వామపక్ష పాలనకు ముగింపు పలికి, 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేశారు. గత పదిహేనేళ్లుగా...

04-06-2026, గురువారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి...

ట్రాక్టర్ ట్రాలే స్విమ్మింగ్ పూల్!?|ADUGU TRENDS

ఎన్కటికి శేద బాయిలు, ఈత బాయిలుండేయి. శేద బాయిలు మంచినీల్లకు, ఈత బాయిలు ఎండాకాలం పిల్లలు, పెద్దలు ఈదడాన్కే ఉండేటియి. ఊరు ఊరంతా గా బాయిల్లనే ఉండేది. ఈత మీద మోజు తగ్గనోల్లు,...

ఇంధన రేషనింగ్ విధానమే మేలు!|EDITORIAL

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాల్ కేవలం పెట్రోల్ ధరల పెరుగుదల మాత్రమే కాదు. అది ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశం. ధరలను పెంచి భారాన్ని ప్రజలపై...

03-06-2026, బుధవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి కృష్ణ-పంచమి నక్షత్రము...

పెండ్లంటే, గిదే పొండ్లి!?|ADUGU TRENDS

ఇగో పెండ్లంటే గిదే.. గిట్లనే.. అబ్బో గట్లనా? అన్నట్లుగా శేసుకుంటాండ్లు. లచ్చలు, కోట్లు కర్సు పెడ్తాండ్లు. పెండ్లి పిల్ల, పిల్లగాండ్ల మీద కోట్లు కుమ్మరిస్తాండ్లు. కట్న కానుకలతోటి పని లేకుండ, పెండ్లి కర్సునే...

తెలంగాణ ఆవిర్భావం-ప్రజల ఆశలు, ఆశయాలు!|EDITORIAL

మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్పగా తెర్లైంది. ప్రస్తుతం రాష్ట్ర రుణభారం రూ.7 లక్షల కోట్లకు పైగా చేరింది. అప్పులు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ అప్పులు ఉత్పాదక ఆస్తులుగా...

03-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు https://www.instagram.com/reel/DZDc5uGy3Lk/?igsh=ZWtxaG1ka3BwOWd2 సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-తదియ శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-తదియ తిథి : కృష్ణ-తదియ...

ఐపీఎల్ లో 5 అవార్డులు గెలుచుకున్న వైభవ్|IPL|VAIBHAV SURYAVANSHI

అవార్డుల వర్షం కురిపించిన స్టార్ ఆటగాళ్లు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అభిమానులకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలను అందించింది. యువ ఆటగాళ్ల సత్తా, సీనియర్ క్రికెటర్ల అనుభవం, చివరి బంతి వరకు సాగిన...

ఈ సాలా కప్ నమ్దే రీలోడెడ్|RCB|IPL|CUP|FINAL

గుజరాత్‌ను మట్టి కరిపించిన RCB ఐపీఎల్ 2026 మకుటాన్ని ముద్దాడిన బెంగళూరు! ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్...

01-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-పాడ్యమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-పాడ్యమి తిథి : కృష్ణ-పాడ్యమి సాయంత్రం 4:39 వరకు, తదుపరి కృష్ణ-విదియ నక్షత్రము...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News