Trending News
Sunday, December 7, 2025
28.2 C
Hyderabad
Trending News

అంతా పెద్దాయనే చేశారు!?|KCR|HARISHRAO|EATALA RAJENDER|KALESHWARAM COMMISSION

– అప్పుడు, SUB COMMITTEE|సబ్ కమిటీ కూడా వేశారు!
– CARPORATION|కార్పొరేషన్ ఏర్పాటు చేశారు!!
– CABINET|కేబినెట్ నిర్ణయాల మేరకే పనులు చేశారు!!!
– KALESHWARAM|కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల జవాబులు
– లోపల ఒకటి బయట మరొకటి చెప్పారా?
– TELANGANA|తెలంగాణ ప్రజల అనుమానాలు!?

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై KCR|కేసీఆర్ గుండెల్లో ఈటెలు దింపుతారనుకున్న EATALA RAJENDER|ఈటల మాటలు మాత్రమే చెప్పి వచ్చారా? కమిషన్ ముందు ఒకలా చెప్పి, బయట మరోలా మాట్లాడారా? చిక్కడు దొరకడులా సమాధానాలిచ్చారా? కమిషన్ కు తాను దొరకకుండా, కేసీఆర్ ను దొరక బుచ్చకుండా, హరీశ్ రావు కు ఎలాంటి హానీ జరగకుండా, అత్యంత జాగ్రత్తగా, తెలివిగా, లీగల్ గా కమిషన్ కు జవాబిచ్చారా? కమిషన్ ఎత్తుకు పై ఎత్తుగా జవాబిచ్చారా? ఇటు కాళేశ్వరం అవినీతి తనకంటకుండా అటు మరెవ్వరికీ అంటనివ్వకుండా, రాజకీయంగా తన భవిష్యత్తును మరింత భద్రం చేసుకున్నారా? కమిషన్ వేసిన, ప్రశ్నలు ఈటల చెప్పిన జవాబుల తీరును పరిశీలించినా, విచారణ అనంతరం బయటకు వచ్చిన ఈటల మాటలను విశ్లేషించినా అవుననే అనిపిస్తున్నది. పైగా తన నిజాయితీని, బీజేపీ నిబద్ధతను సమర్ధించుకుంటూ, కమిషన్ నివేదికను బటయ పెట్టాలని ఈటల చేసిన డిమాండ్ కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేదే. అయితే, ఎక్కడా బీఆర్ఎస్ కు గానీ, అప్పటి ప్రభుత్వానికి గానీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా జాగ్రత్త పడినట్లు ఆయన మాటలే అర్థం చేస్తున్నాయి. ఇవన్నీ ఆయన HARISH RAO|హరీశ్ రావుతో భేటీ అయింది నిజమేనన్నట్లు, పెద్దాయన డైరెక్షన్ లోనే నడుచుకున్నట్లు, బీఆర్ఎస్ తో అంటకాగినట్లు చెప్పకనే చెబుతున్నాయి.

‘‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి… అన్యుల మనముల్ నొప్పించక… తానొవ్వక…’’ అన్నట్లుగా అత్యంత ధన్యుడిగా కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలకు సమాధానాలిచ్చి బయట పడ్డారు మాజీ మంత్రి, ప్రస్తుత మల్కాజీగిరి ఎంపీఈటల రాజేందర్. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు 113వ సాక్షిగా మాజీ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం హాజరయ్యారు. 40 నిమిషాల పాటు విచారణ సాగింది. బ్యారేజీల నిర్మాణం, కాలేశ్వరం కార్పొరేషన్, డీపీఆర్‌పై మొత్తం 19 ప్రశ్నలను కమిషన్ ఈటలకు సంధించింది. కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్ ను ఎక్స్ పర్ట్, టెక్నికల్, సబ్ కమిటీల నిర్ణయాలకు అంటగట్టి, ప్రాజెక్టు డిపిఆర్, నిర్మాణం బాధ్యతలని కేబినెట్ కి, తానే ఆర్థిక మంత్రినైనప్పటికీ, ఆ బాధ్యత తనకు లేనే లేదని చెప్పి ఈటల తప్పించుకున్నారు. ఇదే సమయంలో అప్పటి ప్రభుత్వాన్ని, తనకు మంత్రి పదవినిచ్చిన కేసీఆర్ ని, హరీశ్ రావులని కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జవాబులిచ్చి తప్పించేశారు.

క్యాబినెట్ నిర్ణయాల మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేశారని ఈటెల చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్‌కు, ఫైనాన్స్ డిపార్ట్ మెంట్‌కు సంబంధం లేదని, కార్పొరేషన్ పూర్తిగా ఇరిగేషన్ శాఖ పరిధిలో పని చేసిందని అన్నారు. తుమ్మడి హట్టి దగ్గర కట్టాల్సిన బ్యారేజీని కాదని, టెక్నికల్ టీం రిపోర్టుల ఆధారంగా సబ్ కమిటీ నిర్ణయం మేరకు.. కేబినెట్ నిర్ణయం తీసుకుందని సమాధానం ఇచ్చారు. అలాగే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం చేయాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించింది. కేబినెటేనన్నారు. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు డిజైన్లు, నిర్మాణంతో సంబంధం ఉందా? అంటే తనకేం సంబంధం లేదని చెప్పానన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్‌పై అధికారం ఉండేదా అంటే తనకు ఎలాంటి అధికారం లేదని చెప్పినట్లు తెలిపారు. కాళేశ్వరం నిర్మాణం క్వాలిటీ గురించి ఇంజనీర్లు చూసుకోవాలని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హరీష్ నాయకత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేశారు, సబ్ కమిటీ, సీడబ్ల్యూసీ రిపోర్ట్ ఆర్థిక శాఖ ముందు పెట్టారని తెలిపారు.

మొదట రూ.63వేల కోట్ల అంచనాతో ప్రారంభం అయితే.. రైతుల డిమాండ్ మేరకు రూ.82 వేల కోట్లకు పోయిందన్నారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో 150 ఫీట్ల ఎత్తు నుంచి 148 ఫీట్లకు కుదించామన్నారు.

విచారణ తర్వాత బయటకు వచ్చిన ఈటల మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టికర్త కేసీఆర్ అని ఆయనే చెప్పుకున్నారని, ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ఆనాటి ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. కాళేశ్వరంపై నిర్ణయం తీసుకుంది కేసీఆర్ అని, అప్పుడు ఆయనే బాస్ అన్నారు.

మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పాప పంకిలంలోఈటల తాను ఇరుక్కోకుండా, అప్పటి ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావును ఇరికించకుండా అత్యంత జాగ్రత్తగా సమాధానాలు చెప్పినట్లుగా తేలిపోయింది. పైగా, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను త్వరగా బయటపెట్టాలని, నిజమైన దోషులు ఎవరో ప్రభుత్వం తేల్చాలని డిమాండ్ చేశారు. అప్పటి దాకా ఊరుకునేది లేదని తన రాజకీయ పరిణతిని ప్రదర్శించారు. అయితే 25 ఏళ్ళ తన రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా విలువలతో ఉన్నట్లు తెలిపారు. మరి పార్టీలు మారడం ఏ విలువల కిందకు వస్తుందో ఆయనే చెప్పాలి. ‘మా బతుకులో నిబద్ధతతో ఉంది… నా గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా. కొందరు బట్టకాల్చి మీదేస్తే నాకేమీ కాదు’ అని కూడా అన్నారు. బహుషా తాను కమిషన్ ఎదుట చెప్పిన జవాబులపై వచ్చే విమర్శలను కూడా ఈటల ముందే ఊహించినట్లున్నారు.

ఈటెలను అడిగిన ప్రశ్నలు ఇవే!

కమిషన్: మూడు బ్యారేజీల నిర్ణయం ఎవరిది? ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారు?
ఈటెల: క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది… తర్వాతే నిర్మాణం జరిగింది.
కమిషన్: మూడు బ్యారేజీలు అక్కడ కట్టకూడదని టెక్నికల్ కమిటీ రిపోర్టు ఇచ్చిందా ?
ఈటెల: టెక్నికల్ కమిటీ చాలా రిపోర్టులు ఇచ్చింది. ఫైనల్‌గా మూడు బ్యారేజీల నిర్మాణం నిర్ణయం కేబినెట్ తీసుకుంది.
కమిషన్ : రీ డిజైన్ చేయాలని ఎవరు ఆదేశించారు?
ఈటెల: మహారాష్ట్ర అభ్యంతరం చెప్పడంతో సీఎం కేసీఆర్ సబ్ కమిటీ వేశారు. హరీష్ రావు చైర్మన్‌గా సబ్ కమిటీలో నేను, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాం. ఎక్స్ పర్ట్ కమిటీ, టెక్నికల్ కమిటీ, సబ్ కమిటీ నిర్ణయం మేరకు రీ డిజైన్ జరిగింది.
కమిషన్: రీ డిజైన్ చేయడానికి సబ్ కమిటీ సంతకం చేసిందా?
ఈటెల: రీ డిజైన్ కోసం సబ్ కమిటీ సంతకం చేసింది.
కమిషన్: డీఆర్పీ కోసం 597.45 లక్షలు వ్యాప్కోన్ సంస్థకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా?
ఈటెల: తెలీదు.
కమిషన్: డీపీఆర్ అప్రూవల్ కేబినెట్‌లో జరిగిందా?
ఈటెల: అన్ని అనుమతులు కేబినెట్లో తీసుకున్నాం.
కమిషన్: కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్పస్ కోసం ఏర్పాటు చేశారు?
ఈటెల: నిధుల సమీకరణ, లోన్స్ కోసం ఏర్పాటు చేశారు. ఫైనాన్స్‌ పరిధిలోకి కార్పొరేషన్ రాదు.
కమిషన్: లోన్స్ రీపేమెంట్ ఎలా చేయాలి అనుకున్నారు?
ఈటెల: కార్పొరేషన్ నుంచి నిధులను కలెక్షన్ చేసి లోన్స్ రీపేమెంట్ చేయాలని అనుకున్నాం. కానీ కార్పొరేషన్ ద్వారా నిధులు కలెక్షన్ కాలేదు.
కమిషన్: ప్రాజెక్టు నిర్మాణం బడ్జెట్‌ ద్వారా జరిగిందా?
ఈటెల: నిధుల విడుదల అంతా కార్పొరేషన్ ద్వారానే జరిగాయి. ఆర్థిక శాఖకు సంబంధం లేదు.
కమిషన్: మూడు బ్యారేజీలు అక్కడ కట్టేది కాదని అంటే మీరేమంటారు?
ఈటెల: ఎక్కడ ఏ బ్యారేజీ కట్టాలన్నా టెక్నికల్ టీం చెప్తుంది.
కమిషన్: ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లేదు అంటే?
ఈటెల: అదంతా ఫైనాన్స్‌ శాఖ కిందికి రాదు. ఇరిగేషన్ శాఖ కిందికి వస్తుంది.

Latest News

సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని సర్పంచ్ రేసులో|PANCHAYATI TRENDS

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పంచాయతీలో అరుదైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా రైతులు, స్థానిక నాయకులు సర్పంచ్ పదవికి పోటీ చేసే గ్రామ రాజకీయాల్లో ఈసారి సాఫ్ట్‌వేర్ కంపెనీ...

తంగెడాకులతోటి ఇనుప ధాతువు తయారు?!|ADUGU TRENDS

ఆకే కదాని తీసిపారేయొద్దు! పువ్వే కదాని పీకి పారేయొద్దుల్లా!! ఏ పుట్టల ఏ పాముందో! అన్నట్లు... గా ఏ ఆకుల ఏం బలముందో ఎవరికి ఎరుక?! గిప్పటి దాకా మనకు ఆకులు, అలములల్ల ఔషధ...

కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం సాధ్యమేనా?!|EDITORIAL

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సఫలం కాలేకపోతోంది? ప్రజల నాడీ పట్టుకోవడంలో విఫలమవుతోందా? ప్రజా సమస్యలను గుర్తించలేకపోతోందా? గుర్తించినా వాటిని సరైన రీతిలో డీల్ చేయలేకపోతోందా? అధికార బీజేపీని ఎదుర్కోలేకపోతోందా? మోదీ,...

ఈ రోజు /వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

డిసెంబర్ 07--2025 నుండి డిసెంబర్ 13--2025 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీ శక్తి మరియు నిర్ణయాత్మకత మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తిపరమైన రంగంలో, మీరు ఎదుర్కొంటున్న ఎత్తు తక్కువలను...

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News