Friday, June 5, 2026
27 C
Hyderabad

TELANGANA|తెలంగాణ పురోగతికి పునరంకితం అవుదాం!|EDITORIAL

-ఇప్పుడు STATE|రాష్ట్ర అప్పుల భారం రూ. 8,06,298 కోట్లు
-అప్పులపై చెల్లించే వడ్డీలు, కిస్తీలు రూ. 39,396 కోట్లు
-రాష్ట్రంలో ఒక్కొక్కరి తలపై రూ. 2,30,346 తలసరి అప్పు
-దేశంలో కేంద్ర ప్రభుత్వాలు చేసే అప్పు భారం అదనం
-రాష్ట్రావతరణ వేళ! రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ఎలా?
-JUNE 2ND|జూన్ 2 రాష్ట్రావతరణ దినోత్సవం|STATE FORMATION DAY సందర్భంగా…

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు పూర్తవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తునాయి. మరి రాష్ట్రం సరైన అభివృద్ధి పథంలోనే పయనిస్తున్నదా? నిర్ణీత లక్ష్యాలు, ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకే పరిపాలన సాగుతోందా? రాష్ట్ర సాధన ఆశయాలు అమలు జరుగుతున్నాయా? రాజకీయ దుమారంలో అన్నీ కొట్టుకుపోతున్నాయా? రాష్ట్రావతరణ జరుపుకోబోతున్న ఈ తరుణంలో ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.

తెలంగాణ పురోగతికి పునరంకితం అవుదాం!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు పూర్తవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తునాయి. మరి రాష్ట్రం సరైన అభివృద్ధి పథంలోనే పయనిస్తున్నదా? నిర్ణీత లక్ష్యాలు, ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకే పరిపాలన సాగుతోందా? రాష్ట్ర సాధన ఆశయాలు అమలు జరుగుతున్నాయా? రాజకీయ దుమారంలో అన్నీ కొట్టుకుపోతున్నాయా? రాష్ట్రావతరణ జరుపుకోబోతున్న ఈ తరుణంలో ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.

సుదీర్ఘ సమిష్టి పోరాటాల అనంతరం, ఎన్నో త్యాగాల పునాదులతో శాంతియుత మార్గంలో రాష్ట్రం సాధించుకున్నాం. మొదటి తొమ్మిదిన్నరేళ్ళు బీఆర్ఎస్ పాలించింది. ఈ ఏడాదిన్నరగా కాంగ్రెస్ పరిపాలన చేస్తున్నది. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలు, అవినీతి, బంధుప్రీతి, కుటుంబం పాలన, విపరీతమైన భూ దందాలు, తెలంగాణ ఆత్మగౌవరం, అవమానాలు తట్టుకోలేని ప్రజలు ఆపార్టీ పాలనకి తిలోదకాలిచ్చి, కాంగ్రెస్ కు పట్టం కట్టారు. మంచి మెజార్టీనిచ్చారు. కేవలం ప్రజాకర్షక పథకాలకు లోనై కాకుండా, ఆత్మాభిమానం, నిజమైన అభివృద్ధి కోసం ప్రజలు మార్పును కోరుకున్నారు. నిజంగా ఇప్పుడు ఆ మార్పుకనుగుణంగానే పరిపాలన సాగుతోందా? రాష్ట్రం ప్రగతి పథంలోనే పయనిస్తోందా? ప్రజాపాలన ప్రజారంజకంగానే ఉందా? ప్రశ్నించుకోవాల్సిన, ప్రయాణాన్ని సరిదిద్దుకోవాల్సిన సరైన సమయం కూడా ఇదే.

రాష్ట్రం ఏర్పడి కేవలం 11 ఏళ్ళే, అంటే శైశవ దశే, తెలంగాణ ఇంకా పసికూనే అని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ, కాల క్రమంలో ఈ 11ఏళ్ళ ప్రయాణం చిన్నదేమీ కాదు. ఉమ్మడి రాష్ట్రం సహా, గడిచిన పాలన అనుభవాల గుణపాఠాలను గుర్తెరిగి ముందుకు సాగాల్సి ఉంది. ఏర్పడేనాటికి మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. రాష్ట్రం ఏర్పడే నాటికి 75వేల కోట్ల అప్పుతోపాటు, మిగులు బడ్జెట్ తో మొదలైంది. ఇప్పుడు రాష్ట్ర అప్పుల భారం రూ. 8,06,298 కోట్లు కు చేరింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో రూ.5.04 లక్షల కోట్ల అప్పులున్నాయి. కార్పొరేషన్ల పేరిట ఉన్న అప్పు రూ.3.01 లక్షల కోట్లు. వీటికి 2025-26లో చెల్లించే వడ్డీలు, కిస్తీలు కలిపి రూ. 39,396 కోట్లు. ఈ విధంగా చూస్తే, రాష్ట్రంలో ఒక్కొక్కరి తలపై రూ. 2,30,346 తలసరి అప్పు ఉంది. ఇక తాజా ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీల అమలుకు రూ. 53వేల కోట్లు అవుతుంది. ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలు సరేసరి. బడ్జెట్లో సగం జీతాలకు పోతే, ఇక మిగిలేది ఏంటి? 2025-26 బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ‘అప్పులు చేసిన రైతులు మిత్తీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా, ఇరిగేషన్ శాఖ అప్పులు, మిత్తీలతో ప్రభుత్వం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది.’ అన్నారు. మరి తెలంగాణ ఏర్పడ్డాక మనం సాధించింది అభివృద్ధా? అప్పేనా? పునస్సమీక్షించుకోవాలి.

ఇప్పటికీ పరిష్కారం కాని రాష్ట్ర విభజన సమస్యలు సహా, ఇంకా అనేకానేక సమస్యలు మిగిలే ఉన్నాయి. కొత్తగా సమస్యలు ఎలాగూ వస్తాయి. కానీ పాతవి పాతుకుపోతే, కొత్తవాటిని ఎదుర్కోవడం కూడా కష్టమే. నిజానికి అప్పుల భారం ప్రభుత్వాన్ని పని చేయనీయడం లేదు. ఉన్నంతలో మెరుగైన పాలన ఇవ్వాల్సిన అవసరం సీఎం రేవంత్‌ రెడ్డిపై ఉంది. ఈ క్రమంలో పార్టీపైనా, ప్రభుత్వంపైనా, పాలనపైనా సీఎం రేవంత్‌ రెడ్డి ఇంకా పట్టు బిగించాల్సి ఉంది. దుబారా ఖర్చులపై కేసీఆర్‌ను నిందించిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడుచేస్తున్నది కూడా అదే. ఓటు బ్యాంక్‌ రాజకీయాలు పక్కన పెట్టకపోతే పాతగతే ఇప్పటి పాలకులకు పట్టడం ఖాయం. ఆర్థిక క్రమ శిక్షణ, మరిన్ని కఠిన నిర్ణయాలతో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి పునరంకితం కావాలి.

ఇదే సందర్భంలో ఖజనాకు, ప్రజలకు భారంగా మారుతున్న పలు పథకాలను సమీక్షించుకోవడం కూడా ముఖ్యమే. విద్యుత్‌ వాడకంపై నియంత్రణ లేకుంటే ఉచిత పథకాలు మెడకు చుట్టుకుంటాయి. ఏకపక్ష నిర్ణయాలు సరికాదని గుర్తించాలి. మున్ముందు మరింత పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వ ఆర్థిక స్థితిని బట్టి, ఆలోచించాలి. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని రేవంత్‌ పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూనే ఉన్నారు. ప్రజల ఫీడ్ బ్యాక్ ను తీసుకుంటూ ఉండాలి. కాళేశ్వరం లాంటి నిర్మాణాలు ప్రభుత్వానికి గుదిబండగా మారాయనేది సీఎం వ్యాఖ్యలను బట్టి తెలుస్తూనే ఉంది. ఆర్థిక పరిస్థితిపై మాట్లాడితే, తెలంగాణ పరువు తీస్తున్నారని కేటీఆర్‌, హరీష్‌ రావులు అంటున్నారు. అప్పులు చేసేటప్పుడు కూడా వారు పోతున్న పరువు గురించి ఆలోచించి ఉంటే ఇప్పుడు పోయిన పరువు గురించి బాధపడే పరిస్థితి ఉండకపోయేది కదా?

ఉచితానుచితాలపై పునస్సమీక్ష జరిగితే మంచిది. ప్రభుత్వానికి భారంగా మారిన పథకాలు, విధానాలను సవరించుకోవడంలో తప్పులేదు. ఓటు బ్యాంకుగా ఉన్న కొన్ని పథకాలను కొనసాగించడం తప్ప చేసేదేమీ లేదని భావించాల్సిన అక్కర లేదు. సరిగ్గా చెప్పగలిగితే ప్రజలు వింటారు. అర్థం చేసుకుంటారు. ప్రజలు కూడా ప్రభుత్వాలు తద్వారా తాము అప్పుల్లో కూరుకుపోవాని కోరుకోరు కదా? ఉదాహరణకు మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని పరిమితం చేయాలి. బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలు కూడా ఇదే కోరుకుంటున్నారు. కుటుంబం కంటే ప్రభుత్వం సామాజిక బాధ్యతతో కూడినది. అత్యంత జాగ్రత్తగా, క్రమశిక్షణతో నడిపినప్పుడే అటు ప్రభుత్వానికి, ఇటు పాలకులకు, పరిపాలనకు కూడా అర్థం పరమార్థం ఉంటుంది.

Latest News

నల్లా దానంతటదే బందైతది!|ADUGU TRENDS

నల్లా పెట్టుడే కాదుల్లా, బంజేసుడు కూడా పెద్ద పనే. నల్లా తిప్పితే నీళ్లొత్తయి. కనీ, నల్లా బంజేయాల్నంటే, గాడ కావలి కాయాలె. లేకపోతే, నా నీల్లన్నీ తొణికి, బయటకి కారిపోతయి. గట్ల కావొద్దని...

‘మమత’ల కోవెలలో వేరుకుంపట్ల కలతలు|EDITORIAL

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా కొనసాగిన వామపక్ష పాలనకు ముగింపు పలికి, 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేశారు. గత పదిహేనేళ్లుగా...

04-06-2026, గురువారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి...

ట్రాక్టర్ ట్రాలే స్విమ్మింగ్ పూల్!?|ADUGU TRENDS

ఎన్కటికి శేద బాయిలు, ఈత బాయిలుండేయి. శేద బాయిలు మంచినీల్లకు, ఈత బాయిలు ఎండాకాలం పిల్లలు, పెద్దలు ఈదడాన్కే ఉండేటియి. ఊరు ఊరంతా గా బాయిల్లనే ఉండేది. ఈత మీద మోజు తగ్గనోల్లు,...

ఇంధన రేషనింగ్ విధానమే మేలు!|EDITORIAL

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాల్ కేవలం పెట్రోల్ ధరల పెరుగుదల మాత్రమే కాదు. అది ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశం. ధరలను పెంచి భారాన్ని ప్రజలపై...

03-06-2026, బుధవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి కృష్ణ-పంచమి నక్షత్రము...

పెండ్లంటే, గిదే పొండ్లి!?|ADUGU TRENDS

ఇగో పెండ్లంటే గిదే.. గిట్లనే.. అబ్బో గట్లనా? అన్నట్లుగా శేసుకుంటాండ్లు. లచ్చలు, కోట్లు కర్సు పెడ్తాండ్లు. పెండ్లి పిల్ల, పిల్లగాండ్ల మీద కోట్లు కుమ్మరిస్తాండ్లు. కట్న కానుకలతోటి పని లేకుండ, పెండ్లి కర్సునే...

తెలంగాణ ఆవిర్భావం-ప్రజల ఆశలు, ఆశయాలు!|EDITORIAL

మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్పగా తెర్లైంది. ప్రస్తుతం రాష్ట్ర రుణభారం రూ.7 లక్షల కోట్లకు పైగా చేరింది. అప్పులు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ అప్పులు ఉత్పాదక ఆస్తులుగా...

03-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు https://www.instagram.com/reel/DZDc5uGy3Lk/?igsh=ZWtxaG1ka3BwOWd2 సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-తదియ శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-తదియ తిథి : కృష్ణ-తదియ...

ఐపీఎల్ లో 5 అవార్డులు గెలుచుకున్న వైభవ్|IPL|VAIBHAV SURYAVANSHI

అవార్డుల వర్షం కురిపించిన స్టార్ ఆటగాళ్లు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అభిమానులకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలను అందించింది. యువ ఆటగాళ్ల సత్తా, సీనియర్ క్రికెటర్ల అనుభవం, చివరి బంతి వరకు సాగిన...

ఈ సాలా కప్ నమ్దే రీలోడెడ్|RCB|IPL|CUP|FINAL

గుజరాత్‌ను మట్టి కరిపించిన RCB ఐపీఎల్ 2026 మకుటాన్ని ముద్దాడిన బెంగళూరు! ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్...

01-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-పాడ్యమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-పాడ్యమి తిథి : కృష్ణ-పాడ్యమి సాయంత్రం 4:39 వరకు, తదుపరి కృష్ణ-విదియ నక్షత్రము...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News