Friday, April 3, 2026
30.2 C
Hyderabad

తప్పటడుగులు… తప్పుడు మాటలు మానండి!

అబద్ధాలతో గెలవలేరు… నిబద్ధతతో నిలవండి!!

కనీసం ఓటర్ల జాబితాను కూడా వెల్లడించకుండా ఓటింగా!?

ఆర్యవైశ్యులను తెలివితక్కువగా చూడటం మీ మూర్ఖత్వం

అమరవాది ఆరోపణలకు… మిడిదొడ్డి శ్యాం వివ‘రణం’!

తెలంగాణ ఆర్యవైశ్యులు తెలివైన వారని, అమరవాది చేస్తున్న అసత్య ఆరోపణలను గమనిస్తున్నారని, తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్పి తీరుతారని ఆర్యవైశ్యమహాసభ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న మిడిదొడ్డి శ్యాం సుందర్ అన్నారు. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల నేపథ్యంలో పోటీలో నిలిచిన అభ్యర్థుల ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో అమరవాది లక్ష్మీనారాయణ చేసిన పలు ఆరోపణలకు ఆయన ప్రత్యర్థి మిడిదొడ్డి శ్యాంసుందర్ ఒక ప్రకటనలో సమాధానమిచ్చారు.

‘‘నేను 2011లో ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోబడి, ఒక భవనాన్ని కట్టించాను, ఆరు ఎకరాల 3 గుంటల స్థలం కొన్నాను. 25వేల రూపాయల చొప్పున విరాళాలుగా 9 లక్షలు సేకరించగా, ఆ సమయంలో అధ్యక్షుడిగా ఉన్న మాణిక్ ప్రభు సూచన మేరకు తక్కవపడిన 6 లక్షల రూపాయలను తను సొంతంగా 5 లక్షలు, లక్ష సాయి కిషోర్ వి పెట్టి ఆ స్థలం కొన్నాం. జిల్లా ఆర్యవైశ్య సంక్షేమ సంఘం ట్రస్టు పేరున రిజిస్ట్రేషన్ చేయించాం. ఈ రోజు ఆ స్థలం రూ.5 కోట్లు విలువ చేస్తుంది. అది ఇప్పటికీ కూడా సంఘానికే వుంది. ఎటువంటి అనుమానాలు లేవు. నా తరువాత ఉమ్మడి జిల్లాకు చంద్రకుమార్ అధ్యక్షులయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా అయిన తరువాత జిల్లా కేంద్రంలో బిల్డింగ్ ఉండాలనే ఉద్దేశ్యంతో ఆకారపు కుమారస్వామి కుమారులు వారి నాన్న స్మారకార్థం 500 గజాల స్థలాన్ని జిల్లా సంఘానికి బహుమతిగా ఇచ్చారు. కానీ ఆ స్థలానికి రోడ్డు లేకపోవడం, ఆది క్లియర్ కాకపోవడంతో ఇంకా సంఘం చేతికి అందలేదు. హ్యాండ్ ఓవర్ చేస్తే బిల్డింగ్ కట్టాల్సి ఉంటుంది. కానీ ఆ సమయంలో నేను జిల్లా అధ్యక్షుడిని కాదు. నాగర్ కర్నూల్ లో గత ఆరేళ్లుగా ఎన్నికలు జరగలేదంటున్నారు. నేను నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడిని కాదు. రాష్ట్ర అధ్యక్షుడిని కాదు. పట్టణ అధ్యక్షుడిని కాదు. హకీమ్ మురళి స్వయాన రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు. వారి గ్రామం అది. అక్కడ ఎన్నికలు నిర్వహించాల్సింది ఉపాధ్యక్షులా? రాష్ట్ర అధ్యక్షులా? పట్టణ అధ్యక్షులా? సామాన్య కార్యకర్త గా ఉన్న శ్యాం ఎన్నికలు నిర్వహించాలా? దీనికి అమరవాది వివరణ ఇవ్వాలి. తప్పుడు ఆరోపణలు చేయొద్దు. ఆ తరువాత శ్రీశైలంలో మల్లికార్జున సత్రం గురించి, సత్రం రూ.36 కోట్లు పెట్టి కట్టిండు శ్యాం. నాలుగు కోట్లు అప్పు చేసిండు అని ఒక మీటింగులో, సత్రంలో డబ్బులు తీసుకొని టూర్లు పోతున్నారని మరో మీటింగ్ లో, సత్రంలో ఫ్రీ భోజనం పెట్టట్లేదని ఇంకో మీటింగ్ లో… ఇన్ని తప్పుడు ఆరోపణలు చేయడం ఆయనకే చెల్లింది. రూ.36 కోట్లు పెట్టి సత్రం కట్టింది వాస్తవం. సరిపోకపోతే నాలుగు కోట్ల రూపాయలు నా మిత్రులతో కలిసి అప్పు చేసి నిర్మాణం పూర్తి చేసినం. అందులో రూ.3 కోట్లు అప్పు కూడా తీర్చినం ఇంకో కోటి రూపాయలు అప్పు వుంది. మేము టూర్ కు పోయినమంటే తలాకొంత డబ్బులు వేసుకొని, చీటిలు వేసుకొని పోయాం. ఇప్పుడు సత్రంలో బాకీ ఉందా? ఇంకేమైనా ఉందా? అమరవాదే చెప్పాలి. సత్రాల్లో భోజనాల గురించి మాట్లాడారు. ఆయన లెక్క మూర్ఖులు కాదు ఇప్పుడు. పూర్వకాలం నుండి ట్రస్టుల రూపంలో సత్రాలు ఒక లెక్క ప్రకారం, పద్ధతిగా నడుస్తున్నాయి. మేము కూడా సత్రంలో పొద్దున రెండు రకాల టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, టీ, కాఫీలు అన్ని ఉచితంగా అందచేస్తున్నాం. సత్రంలో కేవలం రూమ్ చార్జీలు తీసుకుంటున్నాం. మెయింటెనెన్స్ ఖర్చుల కోసం ఉపయోగపడుతుంది. నెలకు 25 లక్షల రూపాయలు చొప్పున ఖర్చు అవుతుంది. సుమారు వంద మంది సిబ్బంది పని చేస్తున్నారు వారికి ఆ ఖర్చుల నుండే జీతాలు ఇస్తున్నాం. అది మీరు నడిపే వ్యాపార సంస్థ కాదు అది ఒక సేవా సంస్థ. అయ్యా అమరవాదీ, మీరు తప్పుడు ప్రచారాలతో గెలవాలనుకుంటే మూర్ఖత్వం అవుతుంది. తెలంగాణ ఆర్యవైశ్యులు ఏమి తెలియని వారు కారు. తెలివిలేని వారు కారు. నేను కచ్చితంగా మీకు వివరణ ఇచ్చాను. మీరు గమనించండి. ఒకపూట శ్రీశైలం సత్రానికి పోయి భోజనం చేసి రండి. ఈ ఎన్నికలో మీ కోసం ప్రచారం చేస్తున్న వాళ్లనే ఎన్నికల అధికారిగా నియమించుకున్నారు. కనీసం ఓటర్ల లిస్టు కూడా మాకు ఇవ్వకుండా ఆ ఓటర్ల లిస్టు తీసుకుని మీరు ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికలు సక్రమంగా జరిగి, ప్రజాస్వామ్య పద్ధతిలో తప్పులు జరగకుండా గెలిస్తే బాగుంటుంది. మీరు పెద్దలు, విజ్ఞులు, ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. తప్పుడు పనులు చేయకండి మీరు మాతో చెప్పించుకోవడం పద్ధతి కాదు. మేము మీ తప్పులు చెప్పామే తప్ప తప్పుడు ఆరోపణలు చేయడం లేదు. అబద్ధాలతో ఎన్నికలు గెలవాలనుకోవడం అసంభవం. మీ అవివేకం. ఇప్పటికే మీ మిమ్మల్ని, మీ అవినీతిని సంఘ సభ్యులే ఛీత్కరిస్తున్నారు. తప్పుడు మాటలు కాదు.. మీరు చేసిన తప్పుడు పనులను గుర్తించుకోండి. సేవను చెప్పుకొని ఓట్లడగండి. అట్లయినా ఆర్యవైశ్యులు ఆదరిస్తారేమో చూడండి. లేదంటే ఆర్యవైశ్యుల ఆగ్రహానికి గురికాక తప్పదు.’’

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News