Trending News
Sunday, December 7, 2025
25.2 C
Hyderabad
Trending News

సంధ్య థియేటర్ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

సంధ్య థియేటర్ ఘటనపై అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…..థియేటర్ లోపలికి వెళ్లేందుకు, బయటకు రావడానికి ఒకే మార్గం ఉండటంతో, సెలెబ్రిటీ వస్తే అనవసర గందరగోళం తలెత్తుతుందని పోలీసులు ముందుగానే అనుమతి నిరాకరించినట్లు సీఎం తెలిపారు.

అయితే, అనుమతి లేకున్నా పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ థియేటర్‌కు వెళ్లడం వల్లనే ఈ సంఘటన జరిగిందన్నారు. హీరో కేవలం థియేటర్‌లోకి వెళ్లి సినిమా చూస్తూ వెళ్తే ఎలాంటి సమస్య ఉండేది కాదని, కానీ రోడ్డుపై కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో నిర్వహించడం వల్ల పరిస్థితి విషమించిందని సీఎం సభకు వివరించారు.

హీరో అల్లు అర్జున్ రోడ్ షో చేస్తూ థియేటర్‌కి వెళ్తుండగా, పక్కన ఉన్న అన్ని థియేటర్ల నుంచి ప్రేక్షకులు సంధ్య థియేటర్ వైపుకు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ గందరగోళంలో రేవతి అనే మహిళ ప్రాణాలు కొల్పోయారన్నారు. ఆ సమయంలో కూడా ఆమె తన కొడుకును గట్టిగా పట్టుకుని ఉండటం తల్లి ప్రేమను ఎలాంటిదో తెలుస్తుందని సీఎం అన్నారు. కానీ ఈ ఘటనలో ఆమె కొడుకు శ్రీ తేజ్ గాయపడి కోమాలోకి వెళ్లాడు.

ఈ పరిస్థితుల్లో కూడా హీరో అల్లు అర్జున్ బాధ్యతగా వ్యవహరించలేదని సీఎం మండిపడ్డారు. ఘటన జరిగిందని, శాంతి భద్రతలు క్రమం తప్పే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు ముందే హెచ్చరించినా, హీరో అల్లు అర్జున్ అటువంటి మాటలను పట్టించుకోలేదని పేర్కొన్నారు.

సహకరించకపోవడంతో డీసీపీ స్వయంగా అక్కడికి వెళ్లి, అరెస్టు చేస్తామని హెచ్చరించడంతో హీరో అల్లు అర్జున్ కారు ఎక్కినప్పటికీ తిరిగి రోడ్ షో చేస్తూ వెళ్లడం దురదృష్టకరమని సీఎం తెలిపారు. ఈ ఘటనపై హీరో, థియేటర్ యాజమాన్యం మీద పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

ఘటన అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన హీరో అల్లు అర్జున్ అని అన్నారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోయినా, ఆ కుటుంబాన్ని సినిమా ప్రముఖులు కూడా పరామర్శించకపోవడం విచారకరమని సీఎం అన్నారు.

ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించేవారు, చావుకు కారణమైన వారిని ప్రశ్నించకుండా ప్రభుత్వంపై మాటలతో దాడి చేయడాన్ని సీఎం తప్పుబట్టారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించడానికి అనుమతులు ఇస్తున్నా, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటానికి ప్రభుత్వం సహకరించదని సీఎం స్పష్టం చేశారు.

సినీ ఇండస్ట్రీ తన బాధ్యతను గుర్తించి వ్యవహరించాలన్నారు. వ్యాపారం చేసుకోవడం సమంజసమే కానీ, ప్రాణాలు బలిగొట్టే విధంగా వ్యవహరించడం సహించరాదని హెచ్చరించారు. “మా ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడే నడుచుకుంటుంది. ప్రజల ప్రాణాలతో ఆడే ఆటలను మేం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించము. బాధ్యులు ఎవరు అయినా సరే, వారిని ప్రశ్నించడంలో వెనుకాడము,” అని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

Latest News

సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని సర్పంచ్ రేసులో|PANCHAYATI TRENDS

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పంచాయతీలో అరుదైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా రైతులు, స్థానిక నాయకులు సర్పంచ్ పదవికి పోటీ చేసే గ్రామ రాజకీయాల్లో ఈసారి సాఫ్ట్‌వేర్ కంపెనీ...

తంగెడాకులతోటి ఇనుప ధాతువు తయారు?!|ADUGU TRENDS

ఆకే కదాని తీసిపారేయొద్దు! పువ్వే కదాని పీకి పారేయొద్దుల్లా!! ఏ పుట్టల ఏ పాముందో! అన్నట్లు... గా ఏ ఆకుల ఏం బలముందో ఎవరికి ఎరుక?! గిప్పటి దాకా మనకు ఆకులు, అలములల్ల ఔషధ...

కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం సాధ్యమేనా?!|EDITORIAL

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సఫలం కాలేకపోతోంది? ప్రజల నాడీ పట్టుకోవడంలో విఫలమవుతోందా? ప్రజా సమస్యలను గుర్తించలేకపోతోందా? గుర్తించినా వాటిని సరైన రీతిలో డీల్ చేయలేకపోతోందా? అధికార బీజేపీని ఎదుర్కోలేకపోతోందా? మోదీ,...

ఈ రోజు /వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

డిసెంబర్ 07--2025 నుండి డిసెంబర్ 13--2025 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీ శక్తి మరియు నిర్ణయాత్మకత మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వృత్తిపరమైన రంగంలో, మీరు ఎదుర్కొంటున్న ఎత్తు తక్కువలను...

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News