Tuesday, April 14, 2026
35.2 C
Hyderabad

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు. కవులకు, కళాకారులకు కాణాచి కరీంనగర్ జిల్లా చెంజర్లలో 10.10.1940న రైతు కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పుడు తమ, చుట్టుపక్కల గ్రామాల్లో ప్రదర్శించే వీధి బాగోతాలు, హరికథల పట్ల అభిమానాన్ని, ఆదరాన్ని పెంచుకున్నారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా నియమితులై ఇటు విద్యావ్యాసంగాన్ని అటు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటూ, ఎం.ఏ., పిహెచ్.డి పూర్తి చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలుగు ఉపన్యాసకులుగా పదవీ విరమణ పొందారు. సంగని మల్లయ్య అనే తన పేరును “మలయశ్రీ”గా మార్చుకొని, 1968లో “కావ్య సుందరి” ఖండ కావ్య రచనతో సాహితీ సేద్యానికి శ్రీకారం చుట్టారు. అప్పటినుండి ఆయన నాటౌట్ బ్యాట్స్మెన్ గా తుది శ్వాస వరకు రచనా వ్యాసంగం చేస్తూనే ఉన్నారు.

ఇప్పటివరకు అచ్చయిన, కానివి కలుపుకుని 150 రచనలు చేశారు. అందులో ధర్మ శ్రీ, సురభి, తొలిసంధ్య, మలి సంజ లాంటి పద్య కావ్యాలు, నారాయణ రెడ్డి గారి కర్పూర వసంత రాయలు ప్రభావంతో రాసిన “రాగశిఖ”లాంటి గేయ కావ్యం, మల్లెలు మందారాలు, రాగవల్లరి వంటి లలిత గేయాలు, పేదల పాటలు, ఎన్నికల పాటలు, రైతు పాటలు, రంగుల పిట్టలు, బంగారు బొమ్మలు, చుక్కల లోకం, పాల మనసులు వంటి బాలసాహిత్య రచనలు, కాళిదాసు మేఘ సందేశానికి యక్ష సందేశం పేరుతో ఆయన చేసిన అనువాదం, ఐరేని కుండలు కథలు, కలవారి కష్టాలు, విచిత్ర ప్రేమ, వెన్నెల వాన, తిరుగుబాటు, నిర్ణయం వంటి నవలలు రాశారు. అలాగే పిల్లల కోసం అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, జయప్రకాష్ నారాయణ మొదలైన దేశభక్తుల జీవిత చరిత్రలను ప్రచురించారు. శాంతి పథం, ప్రజాకవి వేమన, గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు వంటి నాటకాలు రాశారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి అన్నట్లు మలయ శ్రీ క్రీ.శ 950-1995 నడుమ వచ్చిన కరీంనగర్ జిల్లా తెలుగు సాహిత్యం పై “కరీంనగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర” అన్న శీర్షికతో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ప్రముఖ పండితులు డాక్టర్ కే.రాజన్న శాస్త్రి గారి పర్యవేక్షణలో డాక్టరేట్ పట్టాన్ని పొందారు. ఈరోజు తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ సారస్వత పరిషత్తు పక్షాన వెలువడుతున్న రచనలకు ఇది మార్గదర్శకమైంది. మలయశ్రీ ఈ విషయమై చేసిన పరిశ్రమ, పరిశోధన స్ఫూర్తిదాయకమయ్యాయి. 1970 దశకంలో రాష్ట్రంలో నెలకొన్న విప్లవోద్యమాల మూలంగా సమాజ పరిస్థితులను గమనంలో పెట్టుకొని ప్రభుత్వం విద్యార్థులలో శాంతి అహింసలను ప్రబోధించడానికై పాఠ్యాంశ ఎంపిక కోసం నిర్వహించిన పోటీలో మలయ శ్రీ రాసిన బౌద్ధ సంబంధమైన “శాంతిపథం” అనే నాటకం ఎంపిక అయి ఇంటర్ విద్యార్థులకు ఉపవాచకంగా నిలిచింది.

ఆయనకు మొదటి నుండి లేఖ సాహిత్యం అంటే ప్రత్యేకమైన ఆసక్తి. ఆయన రాసిన “తెలుగులో లేఖా సాహిత్యం ” అనే గ్రంథాన్ని పాఠక జనాదరణ గ్రంథంగా భావించి తెలుగు అకాడమీ ప్రచురించింది. ఈ విషయమై తెలుగులో వెలువడిన మొదటి గ్రంథం ఇదే. 1989లో తెలుగు విశ్వవిద్యాలయం తరపున నిర్వహించిన చరిత్ర-సంస్కృతి విషయ పోటీలో మలయశ్రీ రాసిన “కాకతీయుల కాలంనాటి సామాజిక జీవితం” అనే గ్రంథం ప్రథమ బహుమతిని సాధించింది. అలాగే ఆయన రాసిన తిరుగుబాటు నవలకు విశాలాంధ్ర , నిర్ణయం నవలకు మండలి వెంకటకృష్ణారావు స్మారక పురస్కారం లభించాయి. రాష్ట్రస్థాయికి చెందిన రసమయి వారి సాహితీ అవార్డు, బి. ఎన్ .శాస్త్రి, పి. యశోదా రెడ్డి, డాక్టర్ ద్వానా శాస్త్రి సాహిత్య పురస్కారాలను, ముఖ్యంగా తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహిత్య పరిశోధన పేర ఏర్పరిచిన పురస్కారాన్ని అందుకున్నారు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతలైన వినోద్ కుమార్ శుక్ల రచించిన హిందీ రచనకు”ఆ గోడపై ఒక కిటికీ ఉండేది” అనే పేరుతో తెలుగులో రచించి కేంద్ర సాహిత్య అకాడమీ వారికి అందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని పొందారు. సత్యార్థి, భౌతికవాది అనే పత్రికలను నెలకొల్పి, కొనసాగించారు. 1996లో నవ్య సాహిత్య పరిషత్తును స్థాపించి తన రచనలతో పాటు ఇతరుల రచనలను కూడా వెలువరించారు. సంస్థ తరపున కవులకు, చరిత్రకారులకు, పరిశోధకులకు, గాయకులకు పురస్కారాలు అందించారు. మలయశ్రీ అవార్డును అందుకున్న వారిలో బోయ జంగయ్య, జి.వై.గిరి, వంగపండు ప్రసాదరావు, టి. రాజారాం సింగ్, సుప్రసిద్ధ కథకులు కాలువ మల్లయ్య, ఉద్యమ గాయకులు గూడ అంజయ్య, అందెశ్రీ, కవులు అని శెట్టి రజిత, అన్నవరం దేవేందర్ మొదలైన వారు ఉన్నారు.

ఉద్యోగరీత్యా నేను ఈ జిల్లాలో పని చేస్తున్న కాలంలో మలయశ్రీతో ఏర్పడిన పరిచయమే నన్ను పరిశోధనకు పురికొల్పింది. దానితో ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాచ్య భాషా అధ్యయనశాఖలో “మలయశ్రీ కావ్యాలు-పరిశీలన” అనే అంశంపై పరిశోధన చేసి 2006లో డాక్టరేట్ డిగ్రీ ని అందుకున్నాను. 20.6.2009న హైదరాబాదులోని త్యాగరాయ గాన సభలో జరిగిన పుస్తకావిష్కరణ సభలో జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి గ్రంధాన్ని ఆవిష్కరించారు. అలాగే ప్రముఖ విద్యావేత్త డాక్టర్ చుక్కా రామయ్య విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. గ్రంథ ప్రచురణకు ఆర్థిక సహకారాన్ని అందించిన కరీంనగర్ కు చెందిన డా. కె. శ్యాంసుందర్ కు గ్రంథాన్ని అంకితం ఇచ్చాను. ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధ్యక్షులుగా పనిచేసిన ప్రొఫెసర్ ననుమాస స్వామి అధ్యక్షతన జరిగిన ఈ సభలో నా పర్యవేక్షకులు డాక్టర్ అప్పం పాండయ్య, పుస్తక పరిచయ కర్తలుగా మిత్రులు పల్లెర్ల రామమోహన్ రావు ప్రభృతులు పాల్గొన్నారు.

మలయశ్రీని దగ్గరగా గమనించినప్పుడు ఆయన కేవలం కవి, రచయిత మాత్రమే కాదు ఆచరణశీలి. తన రచనలలో ఆయన ఏమి ప్రబోధించాడో వ్యక్తిగతంగా తన జీవితంలోనూ కుటుంబంలోనూ వాటిని పాటించాడు. నిరంతర రచన, అధ్యయనం, పరిశోధన, ప్రచురణ, పర్యటనలతోనే ఆయన జీవితం గడిచేది. ప్రాచీన ఆధునిక సాహిత్యాలను వాటి సిద్ధాంతాలను, వస్తున్న ధోరణులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అందుకు అనుగుణంగా కాలంతో పోటీ పడుతూ రచన వ్యాసంగాన్ని కొనసాగించేవాడు. మినీ కవితలు, నానీలు వస్తున్న రోజుల్లో ఆయన త్రిపదలు రాశాడు. హేతువాదిగా ఉంటూ మానవతావాదిగా జీవించారు. సాహిత్యం, చరిత్ర, పరిశోధన, బౌద్ధం, సైన్సు అన్నవి ఆయన అభిమానాంశాలు. వాటిని మూల బిందువుగా చేసుకునే ఆయన సాహిత్య వ్యాసంగం కొనసాగింది. సినారె అన్నట్లు “మలయశ్రీ సృజన శీలానికి అంచనావేయలేనన్ని అంచులు ఉన్నాయి.” ఇంతటి బహుముఖ ప్రతిభాశాలిని కారుణ్యంలేని కాలం 10.4.2026 న కాటేసింది. “నేను అచ్చంగా భౌతిక నైతిక వాదిని. బతుకు-బతుకనివ్వు సిద్ధాంతం నాది” అని ప్రకటించుకున్న మలయశ్రీ దివ్యస్మృతికి ఇదే నా అక్షర నివాళి.

-డాక్టర్ శంకరమంచి శ్యాంప్రసాద్
పాలకుర్తి. ఫోన్ నెం.: 9989148305

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్-2|HISTORY|ARTEMIS-2

సురక్షితంగా భూమికి చేరిన వ్యోమగాములు చంద్రుడి చుట్టూ చారిత్రాత్మక పది రోజుల యాత్రను ముగించుకుని నాసాకు చెందిన 'ఆర్టెమిస్-2' వ్యోమగాములు శనివారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి చేరుకున్నారు. కాలిఫోర్నియాలోని శాన్టియాగో తీర సమీపంలో పసిఫిక్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News