Saturday, September 19, 2026
27.3 C
Hyderabad

రచ్చేనా? చర్చేమైనా ఉందా?!|EDITORIAL

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి రెండు రాష్ట్రాలు ఏర్పడి పన్నెండు ఏళ్లు పూర్తయ్యాయి. పుష్కరం గడిచినా, ప్రజల జీవితాల్లో మాత్రం ప్రబలంగా జీవన ప్రమాణాలు పెరిగిన గణనీయమైన మార్పేమీ కనిపించలేదు. కొన్ని రాజకీయ పార్టీలకు, కొందరు నేతలకు మాత్రమే విభజన ప్రయోజనకరంగా మారిందన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. రాష్ట్రాలు బాగుపడాల్సిన వేళ, ఆ రాజకీయ నాయకులే రాజకీయ సవాళ్ళు–ప్రతిసవాళ్ళతో కాలం గడిపేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు–జగన్ మధ్య, తెలంగాణలో రేవంత్-కేసీఆర్ ల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు వాగ్వాదాలు, కేవలం వారి రాజకీయ ప్రయోజనాల కోసమే. రెండు రాష్ట్రాల్లో పాలించిన సీఎంలు తమ పాలనే గొప్పదని చెబుతూనే ఉన్నారు. కాదు మా పాలనలోనే అని ప్రతిపక్ష నేతలు ప్రగల్బాలుపలుకుతున్నారు. “దమ్ముంటే రండి, చర్చిద్దాం” అంటూ పరస్పరం సవాళ్ళు విసురుకుంటున్నారు. ఆ గందరగోళంలో ప్రజలు, వారి ప్రయోజనాలు కొట్టుకుపోతున్నాయి.
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు అంటూ, ఉచిత పథకాలతో ఊదరగొట్టి, ప్రజలను సోమరులను చేసి, తమ పబ్బం గడుపుకుంటున్నారు. రెండు రాష్ట్రాలకూ అప్పుల భారం దినదిన ప్రవర్ధమానమవుతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలు పోటాపోటీగా అప్పుల్లో కూరుకుపోతున్నాయి.

అసెంబ్లీకి రాని కేసీఆర్, ఆరునెలలకో, ఏడాదికో మీడియా ముందుకు వస్తున్నారు. తాజాగా ‘రెండేళ్ళు మౌనంగా ఉన్నా, వస్తున్నా, సర్వభ్రష్ట కాంగ్రెస్ తోలు తీస్తా..’ మళ్ళీ మరోసారి తెరమీదకు వచ్చారు. నదీజలాలపై కాంగ్రెస్, టీడీపీలను చెండాడారు. దీంతో తెలంగాణలో మరోసారి రాజకీయ రగడ మొదలైంది. ‘దమ్ముంటే అసెంబ్లీకి రా… తెలంగాణ నదీజలాల వాటాకు అన్యాయం, చేసిందెవరో? ప్రాజెక్టులతో ముంచిందెవరో? తేల్చుకుందామని సీఎం రేవంత్ ప్రతి సవాల్ చేశారు. కృష్ణా జలాల్లో ఏపీకి 511 (64%) టీఎంసీలు, తెలంగాణకు 299 (36%) టీఎంసీలు చాలని అంగీకరించిన ఒప్పందంపై కేసీఆర్ సంతకం పెట్టారని, ఆ నిర్ణయం మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు అన్యాయం చేసిందని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తోంది. కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. పట్టి సీమను పొగిడిందెవరు? ఉమ్మడిలోకన్నా, కేసీఆర్ హయాంలోనే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ నిరూపిస్తామంటున్నారు.

కాంగ్రెస్ హయాంలో మొదలైన భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ, సీతారామసాగర్, కొడంగల్–నారాయణపేట వంటి కృష్ణా నదిపై ఉన్న కీలక ప్రాజెక్టులలో ఒక్కటినైనా కేసీఆర్ పాలనలో పూర్తి చేయలేకపోయారని కూడా విమర్శిస్తున్నారు. కృష్ణా, గోదావరి జలాలపై జనవరి రెండో తేదీ నుంచి “రోడ్లపై కాదు, అసెంబ్లీలో నీళ్లపై, నిజాలపై చర్చిద్దామ”న్న సీఎం వ్యాఖ్యలు రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచాయి.

దీనికి ప్రతిగా కేసీఆర్ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టారు. తమ పాలనలో రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, శాంతిభద్రతలతో పురోగతి సాధించిందన్నారు. ఇప్పుడు మాత్రం పాలమూరుకు రెండేళ్లలో రూపాయి ఖర్చు చేయలేదని, దీని వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు.

అధికార, విపక్షాలు పరస్పరం ఆరోపించుకోవడమే కాక, నిరూపిస్తామని సవాళ్ళు విససురుకోవడమే గానీ, ఎవరూ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. ‘నేను కొట్టినట్లు చేస్తా, నువ్వు ఏడ్చినట్లు నటించు’ అన్నట్లుగా రెండు పార్టీల వ్యవహరిస్తున్నాయి. సంచలనాలతో వాళ్ళు చర్చనీయంగా ఉండే సంవాదాలు, సవాళ్లే తప్ప, ప్రజలు, వారి సంక్షేమంపై ఎవ్వరికీ చిత్తశుద్ధి ఉన్నట్లుగా కనిపించడం లేదు.

ఈ రాజకీయ యుద్ధంలో ప్రజలు, ప్రగతి అయోమయంగా కొట్టుకుపోతున్నాయి. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. దీనికి గతంలో పాలించినవారు, ప్రస్తుతం పాలిస్తున్నవారే బాధ్యులే. అప్పులు, నదీజలాల వాటాలు, అభివృద్ధి ప్రాధాన్యాలపై సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆ చర్చకు అసెంబ్లీ వేదికైతేనే అది రికార్డు కూడా అవుతుంది. బయట నిరూపించగలిగిన వాళ్ళెవరైనా, అసెంబ్లీలో చర్చకు భయపడాల్సిన అవసరంలేదు. చర్చకు రానంత వరకు, ఆరోపణలు నిరూపణ కానంతవరకు ఈ సవాళ్ళకు సత్తా లేనట్లే! ఆ సవాళ్ళు విసిరే నేతలకు విలువా లేనట్లే!! ప్రజలు వింటున్నారు కదా? అని అదే పనిలో ఉంటే, సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెబుతారు.

Latest News

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News